telugu states
-
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు
-
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు
-
కేసినో వేట.. జీవితాలతో ఆట..!
గోవా అనగానే బీచ్లతోపాటు కేసినోలు గుర్తుకొస్తాయి. ఆ కేసినోలపై తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఉన్న ఆకర్షణను అవకాశంగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని మరీ అమాయకులకు ఎర వేస్తున్నారు. గోవాతోపాటు శ్రీలంక, నేపాల్లలో కూడా దందా సాగుతోంది. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి వెళ్లేవారు.. ఆటలు ముగిశాక ఒట్టి చేతులతోనో, అప్పుల భారంతోనో, ఆస్తులు రాసేసో.. వెనక్కి రాక తప్పడం లేదు.ఇలా వెళ్లిన వందల మంది సర్వం పోగొట్టుకుని వస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : మధ్య తరగతి, సంపన్నవర్గాలకు కేసినో ఈవెంట్లు నిర్వహించే ముఠాలు గాలం వేస్తున్నాయి. గోవాలోని కేసినోలతో చీకోటి ప్రవీణ్ తెరపైకి రాగా.. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఈ దందాలో అడుగుపెట్టారు. గోవాలో 13 ముక్కలాటపై నిషేధం ఉన్నా, అద్దెకు తీసుకున్న కేసినోలలో వీటిని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది మంది సిండికేట్గా ఏర్పడ్డారు. శ్రీనివాసరెడ్డి, ధన, రఫీ, వీరన్నగౌడ్, ప్రశాంత్రెడ్డి, నాగరాజు, పరమేష్, తిరుపతిరెడ్డిలు తమ వాట్సప్ గ్రూపుల ద్వారా దందా నడుపుతున్నారు. ఏరియాలవారీగా సభ్యులను ఏర్పాటు చేసుకుని ఎరినైనా గోవా పంపితే కమీషన్ ఇస్తున్నారు. ప్రతి నెలలో ఇరవైకిపైగా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గోవాలోని బిగ్ బీ, క్యాడీలాక్ డైమండ్ తదితర కేసినోలను అద్దెకు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈవెంట్కు రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారంటే వారి రాబడి స్థాయి ఎంతో తెలుసుకోవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి ఆఫర్లు వెళ్లేవారు రూ.రెండు లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు వారికి కాయిన్లు అందిస్తారు. ఈ కాయిన్లతో కేసినోలో ఆడాల్సి ఉంటుంది. వీరికి రానుపోనూ ఉచితంగా విమాన టిక్కెట్లు, గోవాలో బస సదుపాయం, కట్టిన మొత్తాన్ని బట్టి ఫ్రీ మద్యం, వినోద కార్యక్రమాలు వంటి ఆఫర్లు ఉంటాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్ల నుంచి విమానాల్లో గోవా తీసుకెళ్తున్నారు. ఈవెంట్లు ఉన్న రోజుల్లో గోవా వెళ్లే విమానాలన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఒక్కో ఈవెంట్కు ఒక్కో ఆర్గనైజర్, అతడికి ఫోన్ నెంబర్ కేటాయిస్తున్నారు. అందర్–బాహర్, బక్కారత్, రౌలెట్టే, బ్లాక్జాక్, జండూ, తీన్పత్తీ, రమ్మీ/సిండికేట్తో పాటు 13 ముక్కల ఆట ఆడిస్తున్నారు. అప్పులిచ్చి.. ఆస్తులు కొట్టేసి.. గెలిచినా ఏదో విధంగా డబ్బులు గుంజి పంపుతున్నారు. డబ్బులు పోతే అక్కడే వీరికి అప్పులు ఇచ్చి మరీ లాగేస్తున్నారు. తర్వాత పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా రాయించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఈవెంట్లకు వెళ్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. గోవా కేసినోలో ఆడితే జీఎస్టీతో కలిపి అక్కడి నిర్వాహకులకు చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెంట్లు చేస్తున్న వారు అక్కడ తమ సొంత స్వైపింగ్ మిషన్లు పెడుతున్నారు. జీఎస్టీ కూడా చెల్లించకుండానే ఈవెంట్లు చేస్తున్నా ప్రభుత్వాలు, నిఘా వర్గాలు పట్టించుకోవడం లేదు. దీంతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ముఠాల చేతిలో చిక్కిన వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. -
క్రీడారంగంలో తెలుగు రాష్ట్రాలు ప్చ్..
శాస్త్ర, సాంకేతిక, ఐటీ లాంటి రంగాల్లో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు (Telugu States), మొత్తంగా భారత్... క్రీడారంగంలో మాత్రం వెలవెల బోతున్నాయి. అంతర్జాతీయ క్రీడల్లో భారత్, జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అట్టడుగుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకొన్న భారత్కు ఈ దుఃస్థితేమిటి?జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతి పెద్ద దేశాలలో ఒకటైన భారత్ (India) పరిస్థితి క్రీడారంగంలో ‘రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి’ అన్న చందంగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో 200కు పైగా దేశాలు పాల్గొంటే... పతకాల పట్టికలో భారత్ స్థానం 71 మాత్రమే. 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్.2024 ఒలింపిక్స్కు వచ్చేటప్పటికి 23 స్థానాలు దిగువకు పడిపోయింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. వందకు పైగా అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల్లో పాల్గొన్న భారత్ ఒకే ఒక్క రజత పతకం, ఐదు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ (Olympics) పతకాల పట్టికలో మన పొరుగు దేశం పాకిస్తాన్ది 62వ స్థానం కాగా మనకు దక్కింది 71వ స్థానం మాత్రమే. గత 128 సంవత్సరాలుగా ఒలింపిక్స్లో పాల్గొంటూ వచ్చిన భారత్ ఇప్పటి వరకూ సాధించినవి 41 పతకాలు మాత్రమే. వీటిలో పది మాత్రమే బంగారు పతకాలు. మొత్తం స్వర్ణాలలో హాకీజట్టు అందించి నవే ఎనిమిది ఉన్నాయి. ఆర్థికంగా, జనాభా పరంగా పాకిస్తాన్ కంటే ఎన్నోరెట్లు బలమైన భారత్ ఒలింపిక్స్ పతకాల సాధనలో వెనుకబడిపోతూనే ఉంది. పారిస్ ఒలింపిక్స్లో మాత్రమే కాదు... 1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో సైతం పాకిస్తాన్ను భారత్ అధిగ మించలేకపోయింది.ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత వార్షిక బడ్జెట్ (2025–26) 50.65 లక్షల కోట్లలో క్రీడారంగానికి 3 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే క్రీడలకు మనం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత బడ్జెట్ వరకూ క్రీడలకు కేటాయించిన మొత్తం రూ. 800 కోట్లు మాత్రమే. ప్రపంచ పటంలో అంతగా కనిపించని అతిచిన్న దేశాలు బంగారు పతకాలతో పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ ఉంటే భారత్ మాత్రం రజత, కాంస్య పతకాలకే పరిమితం కావడం మన వెనుకబాటుతనానికి నిదర్శనం కాక మరేమిటి?మిగిలిన రంగాలతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతిని సాధించిన దేశాలను మాత్రమే సమగ్ర అభివృద్ధి సాధించిన దేశాలుగా ఐక్యరాజ్యసమితి (United Nations) పరిగణిస్తోంది. ఈ కోణం నుంచి చూస్తే భారత్ అభివృద్ధి ఏపాటిదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో... జాతీయ క్రీడారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితీ అంతే దారుణంగా తయారయ్యింది. ఉత్తరాఖండ్ వేదికగా ఈమధ్యనే ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో 29 రాష్ట్రాల జట్లు పోటీపడితే... పతకాల పట్టికలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన స్థానాలు చూస్తే (18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 26వ స్థానంలో తెలంగాణ) ముక్కుమీద వేలువేసుకోవాల్సిందే! 2002 జాతీయ క్రీడలు నిర్వహించిన సమయంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 94 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అయితే... కేరళ వేదికగా ముగిసిన 2015 జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, తెలంగాణ 33 పతకాలతో 12వ స్థానం సాధించాయి. రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత మన రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది. జనాభా, వైశాల్యం, క్రీడామౌలిక సదుపాయాల పరంగా తమకంటే ఎంతో దిగువన ఉన్న పలు (ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా) రాష్ట్రాలు పతకాల పట్టికలో మెరుగైన స్థానాలలో నిలిస్తే 5 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 7 స్వర్ణ, ఒకే ఒక్క రజత, 6 కాంస్యాలతో సహా మొత్తం 14 పతకాలతో 18వ స్థానం సంపాదించింది.చదవండి: వాడుకున్నవాళ్లకు వాడుకున్నంత.. దేశంలోనే అత్యాధునిక క్రీడా మౌలిక, శిక్షణ సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా పేరుపొందిన తెలంగాణ పతకాల పట్టికలో 26వ స్థానానికి దిగ జారింది. 212 మంది క్రీడాకారుల బృందంతో 23 క్రీడాంశాలలో పోటీకి దిగిన తెలంగాణ చివరకు 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్యాలతో సహా మొత్తం 18 పతకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా పతకాల పట్టిక అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత జరిగిన జాతీయ (2022 గోవా, 2023 గుజరాత్) క్రీడల్లో 12, 15 స్థానాలు సాధించడం గమనార్హం.చదవండి: BSNLకి ఈ లాభం ఎలా వచ్చింది?దేశంగా భారత్, రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణలు క్రీడారంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడమే కాక ‘సమగ్ర అభివృద్ధి’ అనే భావనే కొండెక్కి కూర్చుంటుంది!- చొప్పరపు కృష్ణారావు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు -
MLC ఎన్నికల్లో ఓటుకు నోటు
-
తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్
-
పోలింగ్ టైం.. నేడే 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
-
ఇకనైనా ఈ నిషేధం ఎత్తివేయాలి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్సిటీలలో, కళాశాలల్లో స్టూడెంట్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1988లో ఉస్మానియా విశ్వ విద్యాలయ (Osmania University) అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో ఓ విద్యార్థి హత్య గావించబడ్డాడనే నెపంతో అప్పటి పాలకులు విద్యార్థి సంఘం ఎన్నికలపై (Student Polls) నిషేధం విధించారు.ఎనభయ్యో దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యా సంస్థల్లో ఈ ఎన్నికల నుండి ప్రేరణ, చైతన్యం పొంది ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపు తున్నారు. మరికొంత మంది విద్యా ర్థులు ప్రజల ఆకాంక్షలను సఫలం చేసేందుకు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు క్యాంపస్లలో స్టూడెంట్ బాడీ ఎన్ని కలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. విద్యార్థుల అకడమిక్ సమస్యలు, వసతి సమస్యలు పరిస్కారమయ్యేవి. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. నేడు విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి పరిష్కరించడం సవాలుగా మారింది.ఇటీవల కాలంలో విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందనీ, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఎన్నికలపై గత పాలకులు విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ... మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని అనడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి. అందుకు గతంలో జేఎమ్ లింగ్డో కమిటీ (JM Lyngdoh Committee) సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్డరుతో 2005 డిసెంబర్ 2వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎమ్ లింగ్డో అధ్యక్షతన ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీని... యూనివవర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించింది. 2006 మే 26న కమిటీ తన నివేదికను సమర్పించింది.ఈ నివేదిక ముఖ్య ప్రతిపాదనలుదేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రాతినిధ్యతో స్టూడెంట్ బాడీ/యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ కొరకు క్యాంపస్లలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాలి. నామి నేషన్ల స్వీకరణలో విద్యార్థుల అకడమిక్ ప్రతిభను పరిణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలను, ప్రెసిడెంట్ ఎన్నికలను నమూనా మోడల్గా తీసుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యార్థి సంఘం ఎన్నికలపై సమీక్ష జరగాలి. ఆఫీస్ బేరర్ల ఎన్నికలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ – ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ నమూనా పాటించాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు (student union elections) రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. యూనివర్సిటీ ఎన్నికలలో పాల్గొనే విద్యార్థుల తరగతిగది హాజరు 70% ఉండాలి.చదవండి: చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!ఈ నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. దాంతో, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) 2007లో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్నికల నిర్వహణకై ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా దేశంలో స్టూడెంట్ బాడీ ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ ఎన్నికలపై విధించిన నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థులు ఇందుకోసం ఉద్యమించాలి.– కోట ఆనంద్ విద్యార్థి నాయకుడు -
శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సాక్షి కార్టూన్ 16-02-2025
-
తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ఎస్ఎంఈ రుణాలపై మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ (సీఎస్బీ) తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) రుణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగం కోసం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆరు శాఖలను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎంఈ, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ శ్యామ్ మణి తెలి పారు. ఎస్ఎంఈలకు రుణాల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. టర్బో, శుభమంగళ్ వంటి ఉత్పత్తులతో చిన్న సంస్థలకు సత్వరం రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి బ్యాంకు మొత్తం రుణాల్లో ఎస్ఎంఈ పోర్ట్ఫోలియో సుమారు 13%గా, దాదాపు రూ. 3,400 కోట్ల స్థాయిలో ఉందని శ్యామ్ తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 12 శాతమని, ఇది సుమారు 28% వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎంఈ రుణాల విషయంలో హైదరాబాద్లో ఫార్మా బల్క్ డ్రగ్స్ విభాగంపై, ఆంధ్రప్రదేశ్లో తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలపైనా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు శ్యామ్ చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లు కాగా.. హైదరాబాద్ వాటా సుమారు రూ. 44,000 కోట్లుగా ఉందని చెప్పారు. ఇందులో ఎస్ఎంఈల వాటా దాదాపు రూ.15,000 కోట్లుగా అంచనా వేశారు. -
తెలుగురాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు
-
కృష్ణ జలాల ట్రిబ్యునల్ లో ఏపీకి ఎదురు దెబ్బ
-
ఊరూ వాడా భోగి సంబురం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభా
-
ఏపీ, తెలంగాణాలో ఐటీ సోదాలు
-
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
కోటి ఆశలతో.. కొత్త సంవత్సర సంబరాలు
-
రిలయన్స్ స్కాలర్షిప్లో మెరిసిన తెలుగు విద్యార్థులు
రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్లు (scholarship) 2024-25 బ్యాచ్కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్షిప్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states) విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్షిప్ సాధించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు (ఫొటోలు)
-
వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. చలిపులి పంజా (ఫొటోలు)
-
ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
-
భూకంపాలు ఎందుకు వస్తాయి?
-
కంపించిన భూమి.. పరుగులు తీసిన జనం
-
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
-
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలను వణికిస్తున్న చలి
-
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న టెంపరేచర్
-
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. !
-
భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 8 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి(హైదరాబాద్)-కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం-మౌలాలి, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం.. 20, 27 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్న దక్షిణమధ్య రైల్వే.. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.సికింద్రాబాద్–లక్నో మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్ (విజయవాడపశి్చమ): సికింద్రాబాద్–లక్నో మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్–లక్నో రైలు (07084) ఈ నెల 15, 22 తేదీల్లో శుక్రవారం రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, ఆదివారం సాయంత్రం లక్నో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07083) ఈ నెల 18, 25 తేదీల్లో సోమవారం ఉదయం 9.50 గంటలకు లక్నోలో బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
Syed Asifa: దీపస్తంభం
‘శక్తి’ అనే మాటకు ఎన్నో కోణాలలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ మాటల్లో ‘శక్తి’కి నిర్వచనం ‘లక్ష్యం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకపోవడం’. అలాంటి ‘శక్తి’ సయ్యద్ ఆసిఫాలో ఉంది. బాడీ బిల్డింగ్లో ‘రాణి’స్తున్న ఆసిఫా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు మాల్దీవులలో జరిగే వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్–2024లో 52 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ పోటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళ సయ్యద్ ఆసిఫా...‘పెళ్లికి ముందు ప్రపంచాన్ని జయించాలని కల కంటాం. పెళ్లయిన తరువాత ఇల్లే ప్రపంచం అవుతుంది’ అనేది చాలామంది గృహిణుల నోటినుంచి నిరాశ నిండిన చమత్కారంతో వినిపించే మాట. ఆ చమత్కారం మాట ఎలా ఉన్నా... ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు పెళ్లి తరువాత కలలకు తెర వేసి, ఇంటి నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం‘ఇలాగే జరగాలని లేదు. ఇలా కూడా జరుగుతుంది’ అని తమ విజయాలతో నిరూపిస్తారు. సయ్యద్ ఆసిఫా ఈ కోవకు చెందిన మహిళ.ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఆసిఫా పెళ్లయిన తరువాత ఇల్లే లోకం అనుకోలేదు. ఒక కల కన్నది. ఆ కలను నిజం చేసుకుంది. బీ ఫార్మసీ చేస్తున్నప్పుడు కంభం పట్టణానికి చెందిన మిలిటరీలో పనిచేసే మొఘల్ అన్వర్ బేగ్తో ఆసిఫా వివాహం జరిగింది. చదువుపై ఆమె ఇష్టం బీఫార్మసీ పూర్తి చేసేలా చేసింది. ఆ తరువాత ఎంబీఎ పూర్తి చేసింది. చదువుల విషయంలో భర్త ఏరోజూ అభ్యంతరం చెప్పలేదు. తానే చదువుతున్నంత సంతోషపడేవాడు.‘పెళ్లికిముందు తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా, పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహంతో ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అంటుంది ఆసిఫా. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ‘ఇక చాలు’ అనుకొని ఉంటే ఆసిఫా దేశదేశాలకు వెళ్లేది కాదు. విజేతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి ఉండేది కాదు.ఒకానొక రోజు ‘బాడీ బిల్డింగ్’పై తన ఆసక్తిని భర్తకు తెలియజేసింది ఆసిఫా. ‘ఇప్పుడు ఎందుకు ... ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు బాబును చూసుకోవాలి’ అని ఆయన నిరాశపరిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘నువ్వు కచ్చితంగా సాధించగలవు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసింది ఆసిఫా.ప్రముఖ అమెరికన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ కొరినా ఎవర్సన్ గ్రాడ్యుయేషన్ చేసింది. పెళ్లయిన తరువాత ‘బాడీ బిల్డింగ్’ వైపు వెళ్లింది. ‘ఇప్పుడు ఏమిటీ! బాడీ బిల్డింగ్ ఏమిటీ!!’ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది. వీలైనంతగా వెటకారాలు కూడా చేశారు. ‘రెస్పాన్స్ ఇలా వస్తుంది ఏమిటీ’ అని ఆమె వెనకడుగు వేయలేదు. జిమ్ వైపే అడుగులు వేసింది.‘నేను కూడా వస్తాను’ అంటూ భర్త ఆమెతోపాటు మాడిసన్లోని ‘ఎర్నీ’ జిమ్కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. ఆమె శ్రమ వృథా పోలేదు. 1980లో ‘మిస్ మిడ్ అమెరికా’గా మొదలైన ఆమె విజయ పరంపర రిటైరయ్యే వరకు అజేయంగా కొనసాగింది. కొరినా ఎవర్సన్లాంటి ఎంతోమంది విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లిన ఆసిఫా వెటకారాలను పట్టించుకోలేదు. ఆమె సాధన వృథా పోలేదు. బాడీబిల్డింగ్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.బాడీ బిల్డింగ్లోకి అడుగు పెట్టకముందు ఎంబీఏ చదివే రోజుల్లో జైపూర్లో జరిగిన ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది ఆసిఫా. ఆ సమయంలో ఎంతోమంది నోటినుంచి వినిపించిన ‘కంగ్రాచ్యులేషన్స్’ అనే మాట తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆనాటి ఆ ఉత్సాహమే శక్తిగా మారి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా ‘బాడీ బిల్డింగ్ ఛాంపియన్’ను చేసింది. ట్రాక్ రికార్డ్→ 2019లో ఆసిఫా బాడీ బిల్డింగ్లో శిక్షణ మొదలు పెట్టింది → 2023లో తెలంగాణలో జరిగిన రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచింది → 2023లో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో పతకాలు గెలుచుకుంది → 2024లో ‘సౌత్ ఇండియన్ చాంపియన్ షిప్’లో ప్రథమ స్థానంలో నిలిచింది. అర్జున కలఅర్జున అవార్డు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అర్జున అవార్డు సాధించాలంటే మూడు సార్లు వరల్డ్ చాంపియన్ షిప్ సాధించాల్సి ఉంటుంది. అందుకోసం కష్టపడి సాధన చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సహించాలి. నా భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. అందరూ ప్రోత్సహిస్తే ప్రతి ఇంటికి ఒక మెడల్ వచ్చే అవకాశం ఉంటుంది.– సయ్యద్ ఆసిఫా– ఖాదర్ బాష, సాక్షి, కంభం, ప్రకాశం జిల్లా -
తెలుగు రాష్ట్రాలపై ‘పిడుగు’ పంజా
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో పిడుగు పంజాతో పలువురు మరణించగా.. తీవ్రంగా గాయపడి పలువురు చికిత్స పొందుతున్నారు.మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనురా గ్రామం లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. గ్రామ చెరువు దగ్గర గొర్రెలను మేపుతుండగా.. ఇద్దరిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే వాళ్లు మృతి చెందారు. మరణించిన వాళ్లను బండారు బేతయ్య(48), డాకూరి భరత్ (14) బండారు బేతయ్య (48)గా గుర్తించారు.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్ నాయక్ తండాలో పిడుగు పాటుకు యువకుడు కొర్ర నాగరాజు(28) మృతి చెందాడు.హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.ఇక ఏపీ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యరావు పాలెం గ్రామంలో పిడుగు పంజా విసిరింది. బాణాసంచా తయారీ కేంద్రం పిడుగుపడడం.. షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో అక్కడ పని చేసే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు..తిరుమలలో కుండపోత వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం వసతి గృహాలకు వెళ్లే క్రమంలోనూ భక్తులు తడిచిముద్దైయ్యారు. అలాగే.. లోతట్టు ప్రాంతాలలో వర్షపు చేరింది. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహన దారులను జాగ్రత్తగా వెళ్లాలంటు సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కవగా ఉండటంతో భక్తులకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది.ఇక.. గుంటూరు, పల్నాడు జిల్లాలోనూ వర్షం కురిసింది. అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇరు రాష్ట్రాల్లోని మిగతా చోట్ల పిడుగు నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగానే నవంబర్ 1వ తేదీ దాకా.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. -
చరిత్రలో తొలిసారి గరిష్ట ధర పలికిన బంగారం
-
ధర వింటేనే దడ.. మళ్లీ పెరిగిన బంగారం
-
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో గృహ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కూడా గృహ రుణాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా వెల్లడించారు. ప్రస్తుతం తమ గ్రూప్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులున్న కొన్ని ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నట్లు చెప్పారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలు మొదలైన వాటికి రుణాలు ఇస్తున్నట్లు, ఈ పోర్ట్ఫోలియో సుమారు రూ. 500 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 6 శాఖలు ఉండగా వీటిని పదికి పెంచుకుంటున్నట్లు వివరించారు. -
దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే..?
-
మూడు రోజులు భారీ వర్షాలు..
-
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్డెస్్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగలా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేషుడి తొలిపూజలో సీఎం.. గవర్నర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేషుడికి సీఎం రేవంత్రెడ్డి తొలిపూజ నిర్వహించనున్నారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతి దర్శనమిస్తున్నారు.👉ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుడి తొలిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.👉ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్త ముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండువైపులా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద.. ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు.👉ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషికం ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. విగ్రహానికి కుడివైపున 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపు శివపార్వతుల కళ్యాణం విగ్రహ మూర్తులను ఏర్పాటు చేశారు. -
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
రండి.. వరద బాధితులను ఆదుకుందాం ..!
తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు లక్షల మంది జీవితాలను ముంచేశాయి. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు మానవత్వంతో స్పందించి ముందుకు రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పిలుపునిచ్చింది. విజయవాడ, ఖమ్మం, నల్గొండ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు అమెరికాలో ఉండే ప్రతి ఒక్క తెలుగు కుటుంబం స్పందించాలని కోరింది. సాటి తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాట్స్ పేర్కొంది. వరద బాధితుల కోసం నాట్స్ వెబ్సైట్ మరియు గో ఫండ్ ద్వారా నాట్స్ విరాళాల సేకరణకు నడుంబిగించింది. ప్రతి ఒక్కరూ తాము చేయగలిగిన సాయాన్ని విరాళంగా అందించాలని కోరింది.(చదవండి: యూఎస్ అధ్యక్ష ఎన్నికలు: ఇండో-అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకు..) -
మరింత ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ
Heavy Rains in Telugu States Updates:విజయవాడ: రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి9.17 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంరాత్రికి మరింత ఉదృతం కానున్న వరదసీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పుఈ రాత్రికి ఇంట్లో బస చేస్తే ప్రమాదం అంటున్న అధికారులుప్రత్యామ్నాయ బస ఏర్పాట్లు చేస్తే మంచిదంటున్న అధికారులుఈరోజు రాత్రికి కలెక్టరేట్ లో ఉంటే బావుంటుందని సూచిస్తున్న అధికారులుముంపు ముప్పు నుండి సీఎం చంద్రబాబు నివాసాన్ని తప్పించేందుకు అధికారుల చర్యలుచరిత్రలో రెండవ అతి పెద్ద వరదగా 9.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహంఆ రికార్డు ను కొద్దిగంటల్లో అధిగమించే అవకాశం24 గంటల్లో 6 లక్షలు క్యూసెక్కులు పెరిగిన వరద2009 లో అత్యధికంగా 11 లక్షలు క్యూసెక్కుల వరదగంట గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు, ప్రజల్లో ఆందోళన ఎన్టీఆర్ జిల్లా:జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పాలేరు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తం.బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన పోలీసులు.వరద ఉధృతికి కోసుకుపోతున్న జాతీయ రహదారి.రెండు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రవాణా సౌకర్యం. విజయవాడ :మరింత ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మనిమిష నిమిషానికీ పెరుగుతున్న వరదప్రస్తుతం 9 లక్షల 25 వేల క్యూసెక్కులకు చేరిన వరద నీరుమొత్తం 70 గేట్లనూ ఎత్తి వరదని కిందకు వదులుతున్న అధికారులుగుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని లోతట్టు గ్రామాలకు వరద హెచ్చరికఈ రాత్రికి 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశంప్రకాశం బ్యారేజీ దిగువున 455 గ్రామాలకు పొంచి ఉన్న వరద ముప్పువిజయవాడ: వాలంటీర్లు లేక వరద బాధితుల కష్టాలువాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వంతుపాన్, వరదల సమయంలో బాధితులకు తోడుగా వాలంటీర్లువిజయవాడ, గుంటూరులో ప్రజలు కష్టాలుమంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక అవస్థలుఅందుబాటులో ఉన్న వాలంటీర్లు వినియోగించని ప్రభుతంవాలంటీర్లు ఉన్నప్పుడు లేవని తలుచుకుంటున్న బాధితులువైఎస్ జగన్ హయాంలో విపత్తుల వేల విస్తృతంగా సేవలువాలంటీర్ వ్యవస్థపై కక్ష కట్టి వినియోగించని ప్రభుత్వంవాలంటీర్లపై కక్ష.. ప్రజలకు శిక్షగా మారిన వైనంవిజయవాడ: పాతరాజరాజేశ్వరి పేటను ముంచేసిన బుడమేరు వరదబిల్డింగ్ ల పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకుంటున్న వరద బాధితులుకనీసం తమ వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదంటూ ఆగ్రహంప్రభుత్వం ,అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం పై మండిపాటుఆకలితో అలమటిస్తున్న పాతరాజరాజేశ్వరి పేట ప్రజలుకనీసం తాగేందుకు ఒక్క వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వని ప్రభుత్వం భారీ వరదలతో ఖమ్మంలో భయానక వాతావరణం ఖమ్మం కాల్వొడ్డు మార్గంలో చిక్కుకున్న కుటుంబంవరద నీటిలో మునిగిన ఇల్లు.. రక్షించాలంటూ బాధితులు ఆర్తనాదాలు కృష్ణా జిల్లా: పెదపులిపాక, యనమలకుదురులో పెరిగిన వరద ఉద్రిక్తతఅవనిగడ్డ విజయవాడ కరకట్టకు వరద తాకిడినీట మునిగిన అరటి పంటఎమ్మెల్యే బోడె ప్రసాద్ మా వైపు కన్నెత్తి చూడలేదుఅధికారులు కనీస వసతులు కల్పించలేదుఎన్నిసార్లు అడిగినా స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేయలేదుగత ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కొంతవరకు కట్టారుఆ ప్రాంతవాసులు సంతోషంగా ఉన్నారుమా వరకు కట్టి ఉంటే మేము సంతోషంగా ఉండే వాళ్ళంచిన్నారులను భుజాన వేసుకుని వరద దాటే పరిస్థితి విజయవాడ:సింగినగర్ వరద ప్రభావిత ప్రాంతాన్ని సీఎం, మంత్రులు సందర్శించడంతో నిలిచిన సహాయక చర్యలుఉదయం నుండి వరద పెరుగుతుంటే 12 గంటల వరకు జరగని రెస్యూ ఆపరేషన్2గంటలకు రెస్యూ ఆపరేషన్ ప్రారంభం3.30 కి చంద్రబాబు రావడం రావడంతో నిలిపివేసిన సహాయక చర్యలుదాదాపు గంటన్నర పైనే నిలిచిన సహాయక చర్యలుఅవస్థలు పడుతున్న ప్రజలుఇళ్లల్లో ఉన్న వారికి బయటకి తీసుకురాకుండా అధికారులు తాత్సనం చేస్తున్నారని మండిపడుతున్న ప్రజలుఇళ్లల్లో చిన్నపిల్లలు , వృద్ధులు ఇళ్లల్లో ఉండిపోవడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు విజయవాడవిజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల ఇబ్వంధులుహైదరావాద్ వెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులువరద ఉధృతితో నందిగామ దగ్గర బస్సులని నిలిపివేస్తున్న అధికారులుుంటూరు మీదగా హైదరాబాద్కి వెళ్లేలా రూట్ డైవర్ట్ చేసిన అధికారులు విజయవాడ:రాజరాజేశ్వరి పేటలో వరద బాధితుల కష్టాలుపూర్తిగా నీట మునిగిన రాజరాజేశ్వరి పేటఇళ్లపైకి ఎక్కిన ప్రజలుఉదయం నుండి ఒక్క బోటు కూడా రాక వరద బాధితుల అవస్థలుచీకటిపడిపోతే పరిస్థితి ఏంటని ఆందోళనవిజయవాడ:జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో వరద బాధితుల ఆక్రందనబుడమేరు వరదతో మునిగిపోయిన ఇళ్లుఇళ్ల పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్న వైఎస్సార్ కాలనీ వాసులుఏ ఒక్కరూ తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదనతమను రక్షించాలంటూ వేడుకోలు విజయవాడ: సింగినగర్లో గంట గంటకు పెరుగుతున్న వరదఫ్లై ఓవర్ మీదకు వచ్చిన వరదసహాయక చర్యలు చేపట్టిన అధికారులుటాక్టర్లు ద్వారా ప్రజలను తరలిస్తున్న అధికారులు..స్పీడ్ బోట్స్ ద్వారా మహిళను, వృద్ధులను తరలిస్తున్న సహాయక సిబ్బందివిజయవాడ: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మకొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక జారీఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో 8,27,655 క్యూసెక్కులుమొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేత విజయవాడ: సింగ్నగర్లో వరద బీభత్సంహృదయ విదారకంగా ప్రజల కష్టాలువరద దాటే ప్రయత్నం చేస్తూ మహిళ మృతిగంగానమ్మ గుడి ఎదురుగా మసీదు రోడ్డు లో ఘటననీటిలోనుండి దాటుతుండగా గుండె పోటుతో మహిళ మృతిమృతదేహాన్ని తరలించలేక కారు పైన పెట్టి వదిలేసిన స్థానికులుమొత్తం జలమయం కావడంతో స్తంభించిన జనజీవనంహైదరాబాద్-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలుమున్నేరుకు పోటెత్తిన వరదకీసర-ఐతవరం మధ్య రహదారిపై ఉధృతంగా ప్రవాహంహైవేపై భారీగా నిలిచిపోయిన వాహనాలు ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. 24 గంటల్లో భారీ వర్షాలుఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీఈ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలుఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తీరం వెంబడి 45- 55 కిమీ వేగంతో గాలులుకొనసాగనున్న మత్స్యకారుల హెచ్చరికలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దుభారీ వర్షాలు కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దుతెలుగు రాష్ట్రాల మీదగా వెళ్లే 20 రైళ్లు రద్దు కొన్ని రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని తాత్కాలికంగా రద్దు తెలుగు రాష్ట్రాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.ఏపీలో పలు చోట్ల కుండపోత కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.విజయవాడ నగరవాసులను వర్ష భయం వీడలేదు. బిక్కుబిక్కుమంటున్న కొండ ప్రాంత ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొంది. కొండ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. మరోవైపు.. క్రీస్తురాజుపురం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. 15 అడుగులు దాటి మున్నేరు నది ప్రవహిస్తోంది. దీంతో, భయాందోళనలో మున్నేరు నది ప్రాంతం ప్రజలు. మరోవైపు.. నగరంలోని చెరువు బజార్, కవిరాజ్ నగర్, జెడ్పీ సెంటర్ ప్రగతి నగర్, ఖనాపురంలో భారీగా వరద నీరు చేరుకుంది. ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో 100కు శాఖల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో తమ శాఖల సంఖ్యను 100 పైచిలుకు స్థాయికి పెంచుకోనున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాలను పూర్తి స్థాయి జోన్గా మార్చే యోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సంఖ్య 78గా ఉందని చెప్పారు. హైదరాబాద్లో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో తమ లోన్బుక్ 10,500 కోట్ల స్థాయిలో ఉందని, రిటైల్ బ్యాంకింగ్పై మరింతగా దృష్టి పెడుతున్నామని శ్రీనివాసన్ వివరించారు. ప్రత్యేక ప్రాంతీయ క్రెడిట్ హబ్ ద్వారా గ్రామీణ, వ్యవసాయ రంగాల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నట్లు తెలిపారు. నలభై అయిదేళ్ల వ్యవధిలో సాధించిన వ్యాపారాన్ని గత అయిదేళ్లలో రెట్టింపు చేసుకున్నామని శ్రీనివాసన్ చెప్పారు. ఇక్కడి నుంచి మూడేళ్లలోనే రెట్టింపు వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. బ్యాంకుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1,600 శాఖలు ఉన్నాయి. -
బంగారం కొనడానికి ఇదే మంచి అవకాశం..
-
భారీ వర్షాలు.. భయం గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు
-
వణుకు పుట్టిస్తున్న వానలు...
-
వానలే.. వానలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన
-
తెలుగు రాష్ట్రాల్లోకి రివర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ రివర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. బుధవారం హైదరాబాద్లో తొలి స్టోర్ను ప్రారంభించగా మార్చి నాటికి వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి స్టోర్స్ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో అరవింద్ మణి తెలిపారు. ప్రస్తుతం ఇండీ పేరిట స్కూటర్లు విక్రయిస్తున్నామని, 2026 నాటికి ఏటా 1,00,000 వాహన విక్రయాల లక్ష్యం సాధించాక రెండో మోడల్ను కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. యమహా మోటర్ కార్పొరేషన్, టయోటా వెంచర్స్ తదితర దిగ్గజాల నుంచి ఇప్పటివరకు రూ. 550 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 500 యూనిట్లుగా ఉన్న అమ్మకాలను వచ్చే మార్చి నాటికి 3,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. హైదరాబాద్లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,45,000గా ఉంటుందని, ఒకసారి చార్జింగ్తో 120 కి.మీ. వరకు రేంజి ఉంటుందని మణి చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు.తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది !— Perni Nani (@perni_nani) July 6, 2024 కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
బలమైన గాలులతో భారీ వర్షాలు..
-
మూడు రోజులు భారీ వర్షాలు
-
వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఏపీలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న ఐదు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించిందిగురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. -
ఏపీ, తెలంగాణాలో తెలుగులోనే నీట్ ఎగ్జామ్
-
తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకి కస్టమర్లు భారీగా పెరిగారు. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న కూరగాయల ధరలు
-
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
-
గొత్తికోయల ‘అరణ్య’ రోదన
వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు. దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్ఓఎఫ్ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు. అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు. బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు. హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది. గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
Modi 3.0: ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరుగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. కిషన్రెడ్డి, రామ్మోహన్నాయుడుకి కేబినెట్లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్కు సహాయ మంత్రులుగా బెర్త్లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్! -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్లాల్ ఖట్టర్లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-
ముగియనున్న ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువుపై కొమ్మినేని విశ్లేషణ
-
అంచనాల కంటే ముందే.. రైతులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, సాక్షి: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. మరో చల్లని వార్త చెప్పింది. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపుర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే.. ఇదీ చదవండి: ఏపీలో పలుచోట్ల భారీ వర్షంఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికంటే ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పేర్కొంటారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కూడా జూన్ 5వ తేదీలోపే రుతుపవనాలు చేరతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈలోపు ప్రీ మాన్ సూన్ వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. అక్కడక్కడా వర్షాలు పడ్డప్పటికీ.. మరో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. -
ఫ్యాషన్ హబ్గా మారబోతోన్న హైదరాబాద్
-
తెలుగు రాష్ట్రాలపై తుపాన్ ఎఫెక్ట్..
-
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
-
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు
హైదరాబాద్/గుంటూరు, సాక్షి: వేసవి తాపం నుంచి ఊరట ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఇరు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. విదర్భ నుంచి తమిళనాడుకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వానలు, అలాగే ఏపీలో నాలుగు రోజులపాటు వానలు కురవనున్నాయి.తెలంగాణలో 19 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్, నగర శివారుతో పాటు మెదక్, సిద్ధిపేటలో వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండలో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది.SEVERE STORMS ALERT - MAY 7As marked in the map, East, Central TG to get massive storms, heavy winds, lightining next 24hrs. West TG to get scattered storms ⚠️Hyderabad already had some rains this morning, more scattered storms ahead today with nice respite from heat 😍 pic.twitter.com/fhzs79oYbN— Telangana Weatherman (@balaji25_t) May 7, 2024ఇక కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి వల్ల నేటి నుంచి మూడు రోజులు పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు కురుస్తాయని తెలిపింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.మరోవైపు.. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది. ఈ ఉదయం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు చోట్ల రహదారులు జలమయం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక శ్రీకాకుళంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. 6th May 5:25 pm : Heavy Thunderstorms forming in a line along YSR Kadapa, Annamayya, Anantapur and also along Palnadu districts close to Nallamala forest range. Next 2 hours, parts of these districts will see good spells of rain with Thunderstorms. Stay indoors !! pic.twitter.com/fChTo2MPSi— Andhra Pradesh Weatherman (@praneethweather) May 6, 2024 అయితే.. రాయలసీమ జిల్లాలలో ఇవాళ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాలులు కొనసాగినా.. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. బుధవారం నుంచి వాతావరణం చల్లబడొచ్చని చెబుతోంది. ఇంకోపక్క.. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీయొచ్చని వాతావరణశాఖ అంచనా. -
తెలంగాణలో భానుడి భగభగలు..!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎండలు ప్రచండ‘మే’ అనేంతగా బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. సూరీడి ఉష్ణతాపానికి శుక్రవారం ‘ఫ్రై’ డేను తలపించింది. శివార్లలోని కీసరలో 45.7, చిలుకూరులో 45.2, అల్లాపూర్ వివేకానందనగర్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత తొమ్మిదేళ్లలో ఇదే రికార్డు. 2015 మే 22న మాత్రం సికింద్రాబాద్లో 47.6, అబ్దుల్లాపూర్మెట్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆల్టైమ్ రికార్డు. మహానగర సగటు ఉష్ణోగ్రత సైతం రికార్డు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పగటి పూట అడుగు బయటపెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటుండడంతో ద్విచక్ర వాహనదారులు, ఇంట్లోని పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. వడదెబ్బ కారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాలకు బాధితులు భారీగా వస్తున్నారు. ఆల్కహాల్తోనూ డీ హైడ్రేషన్.. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలను తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. వేళకు సరిపడా నీరు తాగక పోవడం, ఉక్కపోతకు శరీరంలోని నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోతుండటంతో త్వరగా డీహైడ్రేషన్కు లోనవుతుండటంతో పాటు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. వడదెబ్బ లక్షణాలివీ.. వడదెబ్బకు గురైన వ్యక్తికి మూత్ర విసర్జనలో భరించలేని నొప్పి, కండరాల తిమ్మిరి, భారీగా చెమట పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక హృదయ స్పందన, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. వీరిని తక్షణమే రోగిని చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి, రోగి చుట్టూ గుంపులు గుంపుగా ఉండకూడదు. చన్నీటి బట్ట, స్పాంజ్తో నుదురు, మెడ, తల భాగాన్ని తుడవాలి. వదులుగా ఉండే, తేలిక పాటి, లేత రంగు దుస్తులను ధరించాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. ఏరోబిక్ వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు, ఈత ఉత్తమం. ఆరుబయట ఉంటే, నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. నెత్తిన టోపి, కళ్లకు కూలింగ్ గ్లాసులు ధరించడం ద్వారా సూర్య రశ్మి నుంచి శరీరాన్ని, కళ్లను కాపాడుకోవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన..ఫోటోలు
-
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 64 మండలాల్లో తీవ్ర వడ గాలులు, 222 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, విశాఖలో వడగాలుల ప్రభావం ఉంటుందని, అల్లూరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులు (ఫొటోలు)
-
Good Friday 2024 : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే (ఫొటోలు)
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హోలీ వేడుకలు
-
ఈసీ షెడ్యూల్.. వైఎస్సార్సీపీ కోరిందే జరిగింది
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి.. ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు మొగ్గు చూపింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ పలుమార్లు కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేసిన టైంలోనే కాకుండా.. ఈసీ సమీక్షకు వచ్చినప్పుడు కూడా వినతి పత్రాలను ఈసీకి సమర్పించింది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా.. దొంగ ఓట్లను అరికట్టవచ్చని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతోంది. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించడానికే తాము ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఆ వినతుల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాలుగో దశలో ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు జూన్ 4వ తేదీన ఇరు రాష్ట్రాల లోక్సభ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: 175 మందితో వైఎస్సార్సీపీ సిద్ధం -
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12న వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు నడపనున్నారు. గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్ నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు. విశాఖ- పూరి మధ్య ఈ నెల 12 నుంచి వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరి.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకోనున్న వందేభారత్ ( రైలు నంబర్- 20841).. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో స్టాపేజ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: ఇంగ్లిష్.. భవిత భేష్ -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా: శివనామ స్మరణతో కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రినీ పురస్కరించుకొని కోటిపల్లి ద్రాక్షారామం ఆలయాలలో క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. వేకువజామున నుంచి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కరీంనగర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. మరో వైపు పంచాక్షరీ నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది. 👉: (మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా భక్తజనం (ఫొటోలు) -
Maha Shivratri: శివయ్య అనుగ్రహం కలగాలంటే..
విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి. మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే... మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాలపై ఎంటీఆర్ మరింత ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల సంస్థ ఎంటీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో సునయ్ భాసిన్ తెలిపారు. ఓక్లా ఇండియాలో భాగమైన తమ సంస్థ గత మూడేళ్ల వ్యవధిలో గుంటూరులోని ప్లాంటు, ఇతరత్రా అప్గ్రేడేషన్ మొదలైన వాటిపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో లైన్పై రూ. 30 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.5 లక్షల అవుట్లెట్స్ ఉన్నాయని, గత అయిదేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపయ్యాయని భాసిన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ సంస్థకు రెండో అతి పెద్ద మార్కెట్ అని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. మూడు విభాగాలతో కలిపి ఓక్లా ఇండియా టర్నోవరు రూ. 2,300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. -
బంగారం కొనేవారికి మంచి ఛాన్స్..హైదరాబాద్ లో తులం ఎంతంటే?
-
షాక్ ఇస్తున్న బంగారం ధరలు..!
-
భారీగా పడిపోతున్న బంగారం ధర
-
తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్ల కేటాయింపు
ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
-
కృష్ణా బోర్డు నియంత్రణలోకి నాగార్జునసాగర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాత్కా లికంగా తన అధీనంలోకి తీసుకుంది. సోమవారం బోర్డు సభ్యుడు అజయ్కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్య కలిసి సాగర్లోని గేట్లు 5,7వ నంబర్ గేట్లను ఎత్తి.. ఏపీకి నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రంతా 1000 క్యూసెక్కులు, మంగళవారం ఉదయం నుంచి రోజుకు 4–5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3.03 టీఎంసీలను సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ తాగు నీటి అవసరాల కోసం విడుదల చేయనున్నారు. 3.03 టీఎంసీల నీళ్లు విడుదల పూర్తి కాగానే మళ్లీ గేట్లను కృష్ణా బోర్డు యంత్రాంగమే మూసి వేయనుంది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం డ్యాం నిర్వ హణ ఏపీ, సాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ చూసింది. గత నవంబర్ 29వ తేదీన భారీ బలగా లతో సాగర్ డ్యామ్లో ఏపీ వైపు ఉన్న గేట్లను, డ్యామ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసు కున్న విషయం విదితమే. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లాతో పాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పలు దఫాలుగా సమావేశమయ్యారు. నవంబర్ 29వ తేదీకి ముందున్న పరిస్థితిని నెలకొల్పాలని తెలంగాణ కోరుతూ వస్తోంది. అయితే ఏపీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఆర్పీఎఫ్కు అప్పగించారు. సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీకి విడుదల చేయడానికి అనుమతిస్తూ ఈనెల 5న కృష్ణాబోర్డు వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీ 1.07 టీఎంసీలను సొంతంగా తరలించుకుంది. మిగిలిన నీళ్లను సైతం ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ విడుదల చేసుకునేందుకు ప్రయత్నించగా, సాగర్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నట్టు సమాచారం. కృష్ణాబోర్డు చైర్మన్కు తెలంగాణ ఫిర్యాదు మరోవైపు ఏపీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్లిద్దరూ కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. పునర్విభజన చట్ట ప్రకారం నీటిని విడుదల చేసే అధికారం తమకే ఉందని, ఒకవేళ కుదరకపోతే కృష్ణాబోర్డు మాత్రమే నీటిని విడుదల చేయాలని మురళీధర్ స్పష్టం చేశారు. ఏపీ నీటిని విడుదల చేస్తే... ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. దాంతో హుటాహుటిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్..బోర్డు సభ్యుడు అజయ్కుమార్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘునాథ్, శివశంకరయ్యలను సాగర్కు పంపించారు. ఇండెంట్ ప్రకారం ఏపీకి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నేడు ప్రత్యేక సమావేశం నాగార్జునసాగర్ డ్యామ్ పరిస్థితిపై చర్చించడానికి వీలుగా ఈనెల 9వ (మంగళవారం) తేదీన కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. వివాదాల్లేకుండా బోర్డు చేతుల్లోకి సాగర్, శ్రీశైలం డ్యామ్లు అందించాలని బోర్డు కోరే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండా ఏ విధంగా ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ వాదించే వీలుంది. -
సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనునట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్, హైదరాబాద్- కాకినాడ, కాకినాడ-హైదరాబాద్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
#NewYear2024 : తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర సంబరాలు (ఫొటోలు)
-
భయపెడుతున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాలకూ అలర్ట్
ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీళ్లు జాగ్రత్త! ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభా
-
తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్కు అధికారులు పంపించారు. ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ
ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా, భారత్లోని పాఠశాలల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్ను మరింత అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!) -
కార్తీక మాసం చివరి సోమవారం..
-
ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామచేని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ...1991లో ఏర్పాటైన ఆటా సంస్థ గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్కి పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ప్రతి రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సును నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుకి తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ చైర్, C. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లక్ష్ చేపూరి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు ఈ ఆటా వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. అలాగే గవర్నర్ కూడా ఆటా ఆహ్వానాన్ని ఆమోదించారు. (చదవండి: అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్) -
రెండు రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు
-
Nagula Chavithi 2023 Photos: తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో నాగుల చవితి పూజలు (ఫొటోలు)
-
పురస్కార విజేతలు.. స్ఫూర్తి ప్రదాతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు గర్వించే విజయాలు సాధించిన వారికి తగిన గుర్తింపును అందించడంలో సాక్షి మీడియా గ్రూప్ కృషి ప్రశంసనీయమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విభిన్న రంగాల్లో విజయాలు సాధించిన వారిని గౌరవించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 9వ సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వ్యవసాయం, క్రీడలు, ఆరోగ్యం, పర్యావరణం లాంటి రంగాల్లో అవార్డు గ్రహీతలు సమాజంపై చెప్పుకోదగిన ప్రభావం చూపారని, వారి శ్రమకు ఈ పురస్కారాలు తగిన గుర్తింపు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీ గవర్నర్.. ‘మానవ సేవను మించిన అత్యుత్తమ మతం లేదు..’ అన్న ఉడ్రో విల్సన్(ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు) సూక్తిని ఉటంకించారు. సమాజ సేవ చేసే ఎన్జీవోలు, సంస్థలు, విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ పనితీరును ఆయన అభినందించారు. వ్యయ ప్రయాసలకోర్చి సాక్షి మీడియా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిందన్నారు. అవార్డు గ్రహీతలను.. పేరు పేరునా వారి విజయాలను ప్రస్తావిస్తూ జస్టిస్ నజీర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతీరెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. రైతుల కష్టాలను కళ్లకు గట్టిన సుమధుర ఆర్ట్స్ అకాడమీ నృత్య రూపకం, ఇతర సంగీత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఊబకాయ సమస్య!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం, అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పట్టణ/నగర ప్రాంతాల్లో మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జనాభాలోని పలు వర్గాల నుంచి సమాచారం సేకరించి జరిపిన ఈ అధ్యయనం వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియంట్స్’లో ప్రచురితమయ్యాయి. వేర్వేరు వయసుల వారిలో పోషకాల స్థాయి, ఆ స్థాయుల్లో ఉండేందుకు గల కారణాలను ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ శుక్రవారం తెలిపింది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల నుంచి మొత్తం 10,350 మంది వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో 8317 మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన వారు. మధుమేహం, రక్తపోటు సమస్యలూ... నగర ప్రాంతాల్లో దాదాపు 47.7 శాతం పెద్దలు ఊబకాయంతో బాధపడుతూండగా.. 14.8 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. పల్లెల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం సమస్య 46.7 శాతం ఉంది. అధికబరువు సమస్య తెలంగాణ నగర ప్రాంతాల్లో మాదిరిగానే 14.8 శాతం నమోదైంది. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వయసు తేడా తెలంగాణలో 50.6 శాతమైతే.. ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో 33.2 శాతం మంది ఉన్నారు. అంతేకాదు.. అధ్యయనంలో పాల్గొన్న హైదరాబాదీల్లో 11 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఆరు శాతం మాత్రమే. ఇరు ప్రాంతాల్లోనూ సమానంగా ఉన్న ఇంకో సమస్య మధుమేహం. హైదరాబాద్, చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో 5 శాతం చొప్పున మధుమేహులు ఉన్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో పాల్గొన్న 40 - 59 మధ్య వయస్కుల్లో అధికులు క్లరికల్ ఉద్యోగాల్లో లేదంటే కొద్దిపాటి నైపుణ్యం ఉన్న వృత్తుల్లో ఉన్నవారే. ఈ రకమైన వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇతరులతో పాలిస్తే ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. ‘‘అధ్యయనంలో పాల్గొన్న వారు కొంతమందిలో అవసరమైన దానికంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఆహారం, పర్యావరణం, శారీరక శ్రమ లేకపోవడం, వంటివి ఇందుకు కారణం కావచ్చు. చాలామందిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయమాల ప్రాధాన్యత కూడా తెలియదు’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ సమరసింహా రెడ్డి తెలిపారు. ‘‘నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయం. పైగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువ ఉన్న సూచనలు కనిపించాయి.’’ అని చెప్పారు. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత మాట్లాడుతూ...‘‘విచిత్రమైన విషయం ఏమిటంటే.. పెద్దవాళ్లలో ఊబకాయం, అధిక బరువు సమస్యలుంటే... చిన్నవాళ్లలో పోషకాహార లేమి కనిపించడం. అది కూడా జాతీయ స్థాయి సగటుకు దగ్గరగా ఉండటం విశేషం." అని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో భక్తుల రద్దీ
-
తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా దసరా వేడుకలు
-
పేదరికం తగ్గుతోంది!
దేశంలో గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టినా పేదరికం తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ, విద్యా, వైద్య పథకాల ఫలితమేనని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ నివేదిక –2023ను పరిశీలించినప్పుడు దేశంలో పేదరికం పరిస్థితి ఇటీవలి సంవత్సరాల్లో (2015–16, 2019–21) ఎలా ఉందో స్పష్టమవుతోంది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలు (ఎస్డీజీ)... సామాజిక–ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కొరకు ‘ఎవరినీ వదిలి పెట్టకూడదు’ అనే దృష్టితో నిర్దేశించబడ్డాయి. అంటే ఆదాయంతో ముడిపడిన పేదరికమే కాకుండా, మిగతా అన్ని వసతు లనూ పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేసి దాని నిర్మూలించడం కూడా ఒక లక్ష్యమన్నమాట. అనేక కోణాలను పరిగణన లోకి తీసుకుని పేదరికాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, అవసరమైన వసతులు... అంటే నీరు, పారిశుద్ధ్యం, పోష కాహారం, శిశు, ప్రసూతి మరణాలు, పాఠశాల హాజరు, ఇతర ప్రాథమిక గృహ సౌకర్యాలు పొందడం వంటి వాటినన్నిటినీ పేదరికాన్ని నిర్వచించడంలో పరిగణించాలి. ఇటువంటి పేదరిక అంచనా కోసం నిర్దేశించిన 12 సూచికలలో పదింటిని, ప్రపంచ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేయడానికి చేర్చినవి కాగా మిగిలిన రెండు సూచికలు: ప్రసూతి ఆరోగ్యం, బ్యాంక్ ఖాతాలు దేశంలో పేదరికాన్ని అంచనావేయడానికి అదనంగా చేర్చబడ్డాయి. ఇటువంటి అనేక కోణాల ఆధారంగా నిర్ధారించిన పేదరికం (ఎంపీఐ) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో ఎలా ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక తెలియజేస్తోంది. దేశ స్థాయిలో పేదరికం బాగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 2015–16లో మన జనాభాలో 25 శాతం పేదలు ఉండగా, 2019–21 నాటికి 15 శాతానికి పేదరికం తగ్గింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని సూచిస్తోంది. సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలు 2030 కంటే ముందుగానే, భారతదేశం సాధించవచ్చని ఇది చెబుతోంది. మొత్తం 12 సూచి కలు అభివృద్ధిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టింది. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 8.65 శాతం నుండి 5.27 శాతానికి పేదరికం తగ్గింది. 28 రాష్ట్రాలలో, పది రాష్ట్రాలు 2019–21లో దేశ సగటు 14.96 శాతం కంటే ఎక్కువ శాతం పేదరికాన్ని నమోదు చేశాయి. దేశంలో అత్యల్పంగా కేరళలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదలుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పేదల శాతం దేశ సగటు కంటే చాలా తక్కువగా ఉంది.2019–21లో దేశ సగటు పేదరిక స్థాయి కంటే, తెలుగు రాష్ట్రాల్లో, పైన చెప్పిన విధంగా అంచనా వేసిన పేదల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది 2015–16 లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 12 నుండి 13 శాతం ఉండగా, 2019–21 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 6 శాతానికి తగ్గింది. పేదరిక అంచనాలో ఉపయోగించిన సూచికలలో, పిల్లల–కౌమార మరణాలు, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల హాజరు, విద్యుత్ సౌకర్యం, ఆస్తులు కలిగి ఉండటం వంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో సమాన శాతంలో ఉన్నాయి. 2023 ఏడాదిలో విడుదల అయిన నీతి ఆయోగ్ నివేదిక, కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా అతలా కుతలం అయిన కాలాన్ని అనగా 2019–21ను ప్రతిబింబిస్తోంది. పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు బహుసూచికలతో పొందు పరచిన పేదరిక శాతాన్ని తగ్గించడంలో బాగా సహాయ పడ్డాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో ‘వైఎస్ఆర్ అమ్మ ఒడి’, ‘వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన’, ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, గృహనిర్మాణ పథకం; తెలంగాణలో ‘ఆరోగ్య లక్ష్మి’, గృహనిర్మాణ పథకం, ‘కేసీఆర్ కిట్’ ‘మిషన్ భగీరథ’ పథకాలు పేదరిక శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి. అదనంగా, రెండు రాష్ట్రాలలో, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయడం కూడా పాఠశాల హాజరు, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహద పడుతున్నాయి. ఈ పథకాల పూర్తి ప్రభావం తదుపరి నీతి ఆయోగ్ నివేదికలో ఎక్కువగా ప్రస్ఫుటం గావచ్చు. ఈ పథకాల ప్రభావంతో, తెలుగు రాష్ట్రాలలో, పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గవచ్చు. డా‘‘ పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త ఆర్థిక అంశాల నిపుణుడు ఈ–మెయిల్: prudhvikar@cess.ac.in -
భారీగా తగ్గిన బంగారం ధర
-
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
పెరిగిన బంగారం & వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు..
ఇటు వినాయక చవితి మరోవైపు వస్తున్న విజయదశమి సందర్భంగా బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజు (19 సెప్టెంబర్ 2023) ఒక గ్రామ్ 22, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5520 & రూ. 6022గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ రేట్ రూ. 15 & రూ. 14 ఎక్కువ అని తెలుస్తోంది. దీని ప్రకారం నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం విలువ రూ. 55200 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60220. 👉హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55200 & రూ. 60220గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. 👉వెండి విషయానికి వస్తే, హైదరాబాద్ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 78.30. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 100 పెరిగినట్లు తెలుస్తోంది. 👉చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5550 అండ్ రూ. 6055. 10 గ్రాముల బంగారం రూ. 55500 (22క్యారెట్స్) రూ. 60550 (24 క్యారెట్స్) 👉ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5535 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 6037గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 55350 (22 క్యారెట్) రూ. 60370 (24 క్యారెట్). 👉చెన్నైలో 1 గ్రామ్ వెండి రూ. 78.30. కావున కేజీ వెండి ధర రూ. 78300. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధరలు కేజీపై రూ. 300 పెరిగింది. 👉ఢిల్లీలో వెండి ఒక గ్రామ్ ధర రూ. 74.80. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 74800. నిన్న కంటే నేడు వెండి ధర రూ. 300 అధికం కావడం గమనార్హం. -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్
బంగారు నగల హాల్మార్కింగ్కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ హాల్మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్మార్కింగ్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్మార్కింగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే.. కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్మార్కింగ్ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్మార్కింగ్ తప్పనిసరి. హాల్మార్క్ అంటే ఏమిటి? బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్మార్క్ అంటారు. ఈ హాల్మార్కింగ్లో మొదట బిస్ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త HUID హాల్మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. -
ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
-
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాల ప్రకారం.. ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక, సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది కూడా చదవండి: తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యం -
శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి
Gold Price Today: పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణ మాసం తొలి రోజునే బంగారం కొనేవారికి శుభవార్త.. ఈ రోజు (ఆగస్ట్ 17) బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయిన నేపథ్యంలో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఊరట లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధర గురువారం 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.350 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం నమోదైన బంగారం ధరలను పరిశీస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100గా ఉంది. బుధవారంతో పోల్చితే 10 గ్రాములపై రూ. 350 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 59,020లుగా ఉంది. బుధవారంతో పోల్చితే రూ. 380 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వెండి ధర తగ్గుముఖం బంగారం తర్వాత అత్యంత ప్రీతికరమైన లోహం వెండి ధర కూడా గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.500 మేర తగ్గింది. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,700గా ఉంది. అంతకు ముందు రోజు రూ.76,200గా ఉండేది. ఇదీ చదవండి: దేశంలోని వివిధ నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు -
తెలుగు రాష్ట్రల్లో భారీగా పరుగుతున్న కళ్లకలక కేసులు
-
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
తెలంగాణకు కిషన్రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరి
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యూహంలో భాగంగా.. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణకు కొత్తగా జి. కిషన్రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది. అలాగే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని సైతం తీసుకుంది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్ పేరును ప్రకటించారు. కిందటి ఏడాది మేలో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ కొట్టారు. పంజాబ్లో జాతీయవాదం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకే తాను పార్టీ మారానంటూ ఆ టైంలో ప్రకటించుకున్నారాయన. ఇక.. జార్ఖండ్ బీజేపీ చీఫ్గా బాబూలాల్ మారాండి పేర్లను ప్రకటించారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారాయన. కిషన్ రెడ్డి గురించి.. జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం. (ఆనాటి అమెరికా పర్యటనలో కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ) కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక 2012 జనవరి 19న మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు హోంశాఖ సహాయ మంత్రిగా చేయడం వల్ల ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం పురంధేశ్వరి గురించి..రాజకీయ ప్రస్థానం దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్ 22, 1959లో జన్మించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. 14, 15వ లోక్సభకు రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె.. ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది. 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బీజేపీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. -
తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వేడుకలు
-
కోనసీమ వీధుల్లో.. కేరళ దరువు
సాక్షి, అమలాపురం/అయినవిల్లి: కేరళతో చాలా విషయాల్లో కోనసీమకు దగ్గర పోలికలుంటాయి. ప్రకృతి అందాలు.. కొబ్బరి చెట్లు.. పచ్చని చేలు.. విస్తారమైన సముద్ర తీరంతో రెండు ప్రాంతాలూ దాదాపు ఒకేలా అగుపిస్తాయి. కోనసీమను మినీ కేరళగా కూడా అభివర్ణిస్తారు. ఆ ప్రభావమో ఏమో కానీ అరుదైన వాయిద్య కళ కేరళ చెండా మేళానికి ఈ సీమలో ఘనమైన గుర్తింపు లభిస్తోంది. దేవాలయాల వద్ద జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో నిర్వహించే ఊరేగింపుల్లో కేరళ చెండా మేళం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ కళలో కేరళలో శిక్షణ పొందిన స్థానిక కళాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అని కితాబులందుకుంటున్నారు. కేరళ అనగానే కథాకళి, కొడియాట్టం, తెయ్యం వంటి కళారూపాలు గుర్తుకు వస్తాయి. అటువంటి వాటిలో చెండా మేళం ఒకటి. దీని ప్రదర్శనలో స్థూపాకార పెర్కషన్ వాయిద్యాన్ని వాయిస్తారు. దాని నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వీరు చేసే ప్రదర్శన ఆకట్టుకుంటోంది. బృందంలోని మహిళా కళాకారులు పెద్దపెద్ద చిడతలతో తాళం వేస్తారు. కేరళలో 300 సంవత్సరాలకు పైగా అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం చెండా మేళం. ఇందులో 30 నుంచి 100 మంది వరకూ సభ్యులుంటారు. కేరళలోని అన్ని పండగల్లో చెండా మేళం తప్పనిసరి. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో దీనికి విశేష ఆదరణ ఉంది. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన తరువాత దీనికి దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. కేరళ కళాకారులకు దీటుగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గడచిన ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ కళా ప్రదర్శన జరుగుతోంది. తొలి రోజుల్లో కేరళ నుంచి వచ్చిన కళాకారులు దీనిని ప్రదర్శించేవారు. అయితే ఇది వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. దీంతో అయినవిల్లి మండలం ముక్తేశ్వరానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఈ కళలో శిక్షణ పొంది, 30 మందితో బృందాన్ని తయారు చేశారు. స్థానికంగా ఉన్న ఎల్.గురునాథం తొలుత మంగళ వాయిద్యాలు వాయించేవారు. తరువాత తీన్మార్లోకి మారారు. వీటికన్నా కేరళ చెండాకు ఆదరణ ఉందని తెలుసుకుని ఈ బృందాన్ని తయారు చేశారు. తరువాత ముక్తేశ్వరంతోపాటు ఇదే మండలంలో అయినవిల్లి, విలస గ్రామాల్లో కూడా కేరళ చెండా బృందాలు తయారయ్యాయి. గురునాథం కేరళలోని త్రిశూర్లో ప్రముఖ గురువు రాజేష్ మాలా వద్ద శిక్షణ పొందారు. అనంతరం ఇక్కడకు వచ్చి, స్థానికులకు శిక్షణ ఇచ్చారు. అయితే మెరుగైన మేళంగా శిక్షణ ఇచ్చేందుకు ఏటా కొంతమందిని త్రిశూర్ పంపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కేరళ చెండా కళను ప్రదర్శించే కోనసీమ బృందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ బృందాలు కేరళ సంప్రదాయ వ్రస్తాలు ధరించి మరీ ప్రదర్శన ఇవ్వడం విశేషం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో వీరు ప్రదర్శనలు ఇచ్చారు. సింహాచలం, అన్నవరం, అంతర్వేదితో పాటు హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాల వద్ద వీరు ప్రదర్శన ఇచ్చారు. వీటితో పాటు పలు జిల్లాల్లో ఆలయాల ప్రారంభోత్సవం, రథోత్సవాలు, అమ్మవార్ల ఊరేగింపులు, తీర్థాలు, జాతర్లలో చెండా ప్రదర్శన తప్పనిసరిగా మారింది. ఇక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార హోరు, పెళ్లి ఊరేగింపుల్లో కేరళ చెండా ప్రదర్శన ఉండాల్సిందే. చివరకు చిన్న పిల్లల పుట్టిన రోజులకు సైతం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రదర్శనకు దూరం, సమయాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కేరళలో చెండా మేళం తరహాలోనే తంబోళా మేళానికి కూడా ఆదరణ పెరుగుతోంది. దీంతో స్థానిక కళాకారులు ఈ కళను సైతం నేర్చుకుని రాణిస్తున్నారు. మా ప్రదర్శన ప్రత్యేకం వివిధ రకాల ఊరేగింపుల్లో మా ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. వీక్షించేందుకు వచ్చే వారిలో ఎక్కువ మంది మా ప్రదర్శన తిలకిస్తారు. ఇటీవలి కాలంలో మా చెండా మేళానికి డిమాండ్ పెరుగుతోంది. – కోటి, చెండా మేళం కళాకారుడు త్వరలో కాంతారా ప్రదర్శన మొదట తారసాలు, తరువాత తీన్మార్ వాయించే వాళ్లం. ఇప్పుడు కేరళ చెండా, తంబోళం మేళాలు ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చాం. ఇటీవల విశాఖ జిల్లాలో కాంతారా కళను ప్రదర్శించాము. కాంతారాను త్వరలో పూర్తి స్థాయి ప్రదర్శనగా మారుస్తాం. – ఎల్.గురునాథం, ముక్తేశ్వరం, అయినవిల్లి మండలం -
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేన్సర్ ఉచిత స్క్రీనింగ్
బంజారాహిల్స్/రాయదుర్గం: రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ కార్మికులు, మెగా అభిమానుల కోసం కేన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు సినీనటుడు చిరంజీవి ప్రకటించారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లోని స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్లోని బ్లడ్ బ్యాంకులో, నానక్రాంగూడ స్టార్ ఆస్పత్రి కేన్సర్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రాణాంతకమైన కేన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని, అందుకే ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని చెప్పారు. జూలై 9న జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్బ్యాంక్లో స్క్రీనింగ్ ఉంటుందని, రోజూ వెయ్యి మందికి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రెండుమూడు రోజుల్లో సినీ కార్మి క సంఘాల నాయకులతో సమావేశమై, స్క్రీనింగ్ కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. 16న వైజాగ్లో, 23న కరీంనగర్లో.. మెగా అభిమానులకోసం జూలై 9న హైదరాబాద్లో, 16న వైజాగ్లో, 23న కరీంనగర్లో కేన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ నెలకు ఒకసారి చేపడతామని, క్రమక్రమంగా ఈ సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించామని వెల్లడించారు. స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించడానికి ముందుకొచ్చిన స్టార్ ఆస్పత్రి యాజమాన్యాన్ని చిరంజీవి అభినందించారు. స్టార్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మన్నెం గోపీచంద్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు నెలలపాటు ఈ స్క్రీనింగ్ చేపడతామన్నారు. పొగ తాగేవారు, పాన్ మసాలా నమిలేవాళ్లను ముందుగా గుర్తించి స్క్రీనింగ్ చేస్తామని, మహిళలు కూడా స్వయంగా తమకు తామే గుర్తుపట్టే విధంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత తొందరగా నియంత్రించవచ్చన్నారు. -
'ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ వెళ్తోంది. మంచి హైప్ తో విడుదలైన ఈ చిత్రం.. తొలి మూడురోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. రూ.340 కోట్ల వరకు సొంతం చేసుకుంది. నాలుగో రోజుకి మాత్రం అనుహ్యరీతిలో కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఐదోరోజు కూడా మరింతగా తగ్గిపోయాయి. ఇంతకీ 'ఆదిపురుష్' ఓవరాల్ కలెక్షన్స్ ఎంత? అసలేం జరుగుతుంది? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) కలెక్షన్స్ ఎంత? ఓ మాదిరి హైప్ తో రిలీజైన 'ఆదిపురుష్'.. తొలిరోజు రూ.140 కోట్ల వసూళ్లు సాధించింది. ఓ విధంగా చెప్పాలంటే మంచి ఆరంభం అని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా చెరో రూ.100 కోట్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లో రూ.340 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు మాత్రం కేవలం రూ.35 కోట్లు రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఐదోరోజు మన దేశంలో కేవలం రూ.10 కోట్ల మాత్రమే నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. గ్రాస్ తో కలిపి రూ.20 కోట్లు వచ్చాయి. దీన్నిబట్టి ఓవరాల్ గా ఐదు రోజుల్లో రూ.395 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి? 'ఆదిపురుష్' వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా సాగుతున్నాయి. మిగతా చిత్రాలకు ఇలా నిలకడగా ఉంటే పర్లేదు గానీ 'ఆదిపురుష్' విషయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రా-తెలంగాణలో కలిపి ఐదు రోజుల్లో రూ.75.70 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ షేర్ రూ.95 కోట్లు అని సమాచారం. మరింతగా పుంజుకోవాల్సిన రెండో వారంలో ఇలా డ్రాప్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతోంది. #Adipurush remains resilient at Global Box Office as it amassed ₹ 395 CR. on its day 5! The film keeps the momentum going on Tuesday.#BlockbusterAdipurush#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/qyz5GxH6P6 — People Media Factory (@peoplemediafcy) June 21, 2023 (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్గా మారుతున్న ఆ పేరు!?) -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు పునాది
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక ప్రాజెక్టుకు బీజం పడింది. రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ను కలిసి, లేఖలు సమర్పించారు. ఈ సూపర్ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వం.. అనుసంధాతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్గా ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్ ఎక్స్ప్రెస్లను కేంద్రం తెలుగు రాష్ట్రాలకు అందించింది. వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ & ఓవర్హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్న సంగతి తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో ఆమె నెట్వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్లో వెబ్స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్లను అందించింది. దీని పోర్ట్ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రావు, జస్టిస్ భట్టి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడాన సత్యరత్న శ్రీరామచంద్రరావు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన జస్టిస్ రావు 2021లో జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొంతకాలం పాటు తాత్కాలిక సీజేగా సేవలందించారు. జస్టిస్ భట్టి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్కుమార్ గంగాపూర్వాలా (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా (బాంబే హైకోర్టు), జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి (రాజస్తాన్) కూడా పదోన్నతి పొందారు. జస్టిస్ ధనూకా ఈనెల 30న రిటైరవుతున్నారు. -
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, తదితర సర్వీసుల పోస్టులకు సంబంధించి మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్ – 345, ఈడబ్ల్యూఎస్ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు. వీరితో పాటు కన్సాలిడేటెడ్ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38 మంది, ఐపీఎస్కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్లకు సంబంధించి గ్రూప్–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్–బి సర్వీసెస్లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు సివిల్స్ ఫలితాల్లో టాప్ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకును ఇషితా కిషోర్ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. జీవీఎస్ పవన్ దత్తా 22, తరుణ్ పట్నాయక్ 33, అజ్మీరా సంకేత్ 35, శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్ఎస్ భావన 55, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణకు 94వ ర్యాంకు దక్కాయి. వీరితోపాటు నిధిపాయ్ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్కుమార్ 157, కమతం మహేశ్కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బొల్లం మహేశ్వర్రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్రెడ్డి 292, సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చాయి. 11.35 లక్షల మంది దరఖాస్తు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు. కాగా సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు 3 ఎన్. ఉమా హారతి 22 జీవీఎస్ పవన్ దత్తా 33 తరుణ్ పట్నాయక్ మాదల 40 సాయి ఆశ్రిత్ శాఖమూరి 54 రిచా కులకర్ణి 60 మలియె శ్రీ ప్రణవ్ 78 ఉత్కర్‡్షకుమార్ 87 అయాన్ జైన్ 94 ఆవుల సాయి కృష్ణ 110 నిధి పాయ్ 132 అనుగు శివమూర్తిరెడ్డి 157 రాళ్లపల్లి వసంతకుమార్ 189 షేక్ హబీబుల్లా 217 రావ్ల జయసింహారెడ్డి 243 కాసిరాజు పవన సాయి సాహిత్య 270 బొల్లం ఉమామహేశ్వరరెడ్డి 285 చల్లా కల్యాణి 292 పలువాయి విష్ణువర్థన్రెడ్డి 293 గ్రంధి సాయికృష్ణ 297 షివిన్ చౌదరి 311 వీరగంధం లక్ష్మీ సునీత 313 కె.ఎన్.చందన్ జాహ్నవి 346 ఎన్.చేతన్రెడ్డి 384 తెప్పలపల్లి సుశ్మిత 409 ఇషాన్ అగర్వాల్ 410 డొంగ్రె రేవయ్య 414 చంద్రశేఖర్ శంకల 426 సీహెచ్. శ్రవణ్కుమార్రెడ్డి 459 చాణక్య ఉదయగిరి 464 సి.సమీరారాజా 469 బొడ్డు హేమంత్ 480 గోపీకృష్ణ. బి 510 భువన ప్రణీత్ పప్పుల 548 దామెర్ల హిమవంశీ 558 రుత్విక్ సాయి కొట్టే 559 డి.మనోజ్ 583 యర్రంశెట్టి ఉషారమణి 630 ఎస్.దీప్తి చౌహాన్ 640 తుమ్మల సాయికృష్ణారెడ్డి 742 రామ్దేని సాయినాధ్ 759 జి.అక్షయ్ దీపక్ 805 మన్నం సుజిత్ సంపత్ 817 సాహిల్ మీనా 846 బెండుకూరి మౌర్యతేజ్ 866 నాగుల కృపాకర్ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సివిల్స్ పరీక్షల్లో 200లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 933 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు అభ్యర్థులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కెరీర్లో ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ర్యాంకర్ల అభిప్రాయాలు దత్తా.. సత్తా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన డాక్టర్ పవన్ దత్తా సివిల్స్లో 22వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. దత్తా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఎంబీబీఎస్ చదివిన పవన్ దత్తా హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ దత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉన్నత ఆరోగ్య సేవలు, పేద విద్యార్థులకు సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపాడు. అంబికా జైన్కు 25వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లలిత్కుమార్ అంబికా జైన్ (25) సివిల్స్లో 69వ ర్యాంక్ సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్కుమార్, అనితల కుమార్తె అంబికా జైన్ అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. అంబిక.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ చేశారు. గతేడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో 128వ ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. అయినా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి 69వ ర్యాంక్తో లక్ష్యాన్ని చేరుకున్నారు. 33వ ర్యాంకుతో మెరిసిన తరుణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఐఐటీ గౌహతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్ సివిల్స్కు సొంతంగా సిద్ధమయ్యాడు. తరుణ్ తండ్రి రవికుమార్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచ్లో క్లరికల్ స్టాఫ్గా పనిచేస్తుండగా తల్లి శారదా రాజ్యలక్ష్మి గృహిణి. తరుణ్ గౌహతి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. సివిల్స్కు సొంతంగానే ప్రిపేరయ్యారు. గతేడాది 99వ ర్యాంకు సాధించిన అతడు ఈసారి 33వ ర్యాంకుతో మెరిశాడు. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ తెలిపాడు. వసంత్కు 157వ ర్యాంకు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకుతో మెరిశాడు. సివిల్స్ 2021 పరీక్షల్లో 170వ ర్యాంకు సాధించిన వసంతకుమార్ అప్పట్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ సాధించాలన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం చేయగా 157వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వసంత్ అన్న జగన్సాయి ప్రస్తుతం ఐఏఎస్కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. వసంతకుమార్ తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి అనసూయ గృహిణి. సిక్కోలు బిడ్డకు 285వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండల పరిధిలోని వప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పటికే గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించిన ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రెజరీ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. పల్నాడు యువకుడికి సివిల్స్లో 292వ ర్యాంక్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్రెడ్డి 292వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. గోవాలోని బిట్స్ పిలానీలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)– 2020లో 3వ ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో సివిల్స్కు సిద్ధమయ్యాడు. తన ఐదో ప్రయత్నంలో 292వ ర్యాంక్ సాధించి విజయకేతనం ఎగురవేశాడు. విష్ణువర్ధన్రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు అభినందించారు. విష్ణువర్ధన్రెడ్డి తండ్రి నరసింహారెడ్డి విజయవాడలో ఒక ప్రైవేటు కోచింగ్ అకాడమీ డైరెక్టర్గా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. లక్ష్మీ సుజితకు 311వ ర్యాంకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజిత 311వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి స్థానికంగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన సుజిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు సిద్ధమైంది. కాగా ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది మళ్లీ సివిల్స్ రాస్తానని సుజిత తెలిపింది. ఐదో ప్రయత్నంలో విజయకేతనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్న. ఆమె ఐదో ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించింది. వినూత్న తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వినూత్న కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, రెండో ప్రయత్నంలో మెయిన్స్, మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో విఫలమైంది. నాలుగో ప్రయత్నమూ నిరాశపరిచింది. అయితే పట్టు వదలకుండా ఐదోసారి విజయకేతనం ఎగురవేసింది. ఐఏఎస్ రాసే క్రమంలో గ్రూప్–1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యానని.. అయితే దానికి హాజరుకానని వినూత్న వెల్లడించింది. తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. స్టీల్ప్లాంట్ ఉద్యోగి కుమారుడికి 469 ర్యాంకు విశాఖ స్టీల్ప్లాంట్ ట్రాఫిక్ విభాగం ఉద్యోగి బొడ్డు సత్తిబాబు కుమారుడు హేమంత్ 469వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్కు సిద్ధమయ్యారు. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్ఎస్ వస్తుందని.. మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని హేమంత్ తెలిపారు. నవీన్ చక్రవర్తికి 550వ ర్యాంకు పల్నాడు జిల్లా తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్ చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ,లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన నవీన్ సివిల్స్పై ఆసక్తితో అటు మళ్లాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయిన ఆయన రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లలో ఏది వచ్చినా స్వీకరిస్తానని తెలిపాడు. కోనసీమ జిల్లా యువతికి 583వ ర్యాంక్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీరమణి 583వ ర్యాంకుతో సత్తా చాటింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదివిన ఆమె క్యాంపస్ సెలక్షన్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరికాయల వ్యాపారి. కాగా యానాం మున్సిపల్ కమిషనర్ ద్విజ్ గోయల్ 71వ ర్యాంకు సాధించారు. గోయల్ సొంత పట్టణం ఉత్తరప్రదేశ్లోని మీరట్. సంతోష్కు 607వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన భవిరి సంతోష్కుమార్ 607వ ర్యాంకు సాధించారు. ఈయన స్వగ్రామం ఖండ్యాం అయినప్పటికీ మండలంలోని అలుదు గ్రామంలో తాతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు గతేడాది సివిల్స్లోనూ 607వ ర్యాంకే ఈసారి కూడా అదే ర్యాంక్ వచ్చింది. సంతోష్ తండ్రి రాజారావు విశ్రాంతి ఉపాధ్యాయుడు, తల్లి ఉమాకుమారి గృహిణి. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్లోని రైల్వే కళాశాలలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని ప్రభుత్వ డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సివిల్స్ సాధించాలని ఇప్పటికే ఐదుసార్లు పరీక్ష రాయగా ఆరో ప్రయత్నంలో 607వ ర్యాంకు సాధించారు. రవికిరణ్కు 694వ ర్యాంకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన పుసులూరి రవికిరణ్ 694వ ర్యాంకు సాధించాడు. గతంలో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తానని రవికిరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా యువకుడికి 805వ ర్యాంక్ సివిల్స్ తుది ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మన్నం సుజిత్ సంపత్కు 805వ ర్యాంక్ లభించింది. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడుతూ ఐఏఎస్ అవ్వాలన్నదే తన కోరికన్నారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా మంచి ర్యాంక్ వచ్చిందని తెలిపారు. ఐఏఎస్ అయ్యేంతవరకు శ్రమిస్తూనే ఉంటానన్నారు. సుజిత్ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. కడప కుర్రాడికి 866వ ర్యాంకు కడప ప్రకాష్నగర్కు చెందిన నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ పూర్తి చేశాక సివిల్స్కు సిద్ధమయ్యాడు. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 866వ ర్యాంకు సాధించాడు. తనకు ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని కృపాకర్ తెలిపాడు. రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ కొనసాగిస్తానని తెలిపాడు. -
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సలసల
-
తెలుగు రాష్ట్రాలపై సూర్య ప్రతాపం: భరించలేని వేడి, ఉక్కపోత.. భయం భయంగా జనం (ఫొటోలు)
-
ఆస్తుల విభజనకు కమిటీని నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం అభిప్రాయం తెలుసుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. గత విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చి ఐదు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించగలదా అని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నటరాజన్ను ధర్మాసనం అడిగింది. కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని తెలంగాణ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆస్తుల విభజన రాష్ట్ర విభజన చట్టంలోని అంశమని, రూ.1.42 లక్షల కోట్ల ఆస్తులను విభజించకపోవడం సరికాదని ఏపీ న్యాయవాది సింఘ్వి చెప్పారు. ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నియమించినట్లు ఈ వ్యవహారంపైనా విశ్రాంత న్యాయమూర్తితో కమిటీని నియమించాలని కోరారు. ఆ విధంగా చేయొచ్చా అని నటరాజన్ను ధర్మాసనం ప్రశ్నించగా.. చేసే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు. వాదనల అనంతరం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జూలై చివరి వారానికి వాయిదా వేసింది. -
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న ఎండలు
-
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ద్రోణి ప్రభావంతో..
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి ఇరు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా. తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యింది. భారీ వానలు, వడగండ్ల వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్లోనూ భారీ వాన సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. యెల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్. నిజామాబాద్ కరీంనగర్తో పాటు పెద్దపల్లి సూర్యాపేట, మహబూబ్నగర్తో పాటు నాగర్కర్నూల్, నారాయణపేట రాబోయే రెండు మూడు రోజుల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అమరావతి: ఇక ఏపీలో నేడు(సోమవారం), రేపు(మంగళవారం) అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో.. సోమవారం ఉదయం నుంచి పలుచోట్ల వర్షం పడుతోంది. విజయవాడ, ఏలూరులో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. పలు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది వాతావరణ కేంద్రం. CONVERGENCE MOVING AWAY Finally the peak spell of unseasonal rains ending in Telangana. All the MASSIVE RAINS will shift to Andhra Pradesh during next 3days. Telangana too will definetely see rains, but only scattered ones, not widespread heavy Hyderabad - Scattered rains only pic.twitter.com/Up5NdMNMwK — Telangana Weatherman (@balaji25_t) May 1, 2023 My apartment cellar flooded after such huge downpour. Might be same situation in many other areas too. Hope people are safe. Rains to gradually reduce now. The worst is over. Only scattered rains to continue till morning. One of the record breaking spell of rain in recent yrs 🙏 pic.twitter.com/dUddwRKeLU — Telangana Weatherman (@balaji25_t) April 30, 2023 Panjagutta views in #HyderabadRains 🌧 pic.twitter.com/zEgs97sIqn — Mahendar Vanaparthi Ⓜ️ (@MahendarBRS) May 1, 2023 Many areas in #Tolichowki flooded due to heavy rains that lashed for an hour. Traffic snarls, power cuts reported.#HyderabadRains pic.twitter.com/s56lkccaJn — Toofan News (@ToofanNewsHyd) April 30, 2023 అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం వాటిల్లగా.. మరోవైపు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. శనివారం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో.. మళ్లీ నగరం నీట మునిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరగా.. చెట్లు నేలకూలాయి. పలు వాహనాలు నాశనం అయ్యాయి. గాలులకు, వానకి విద్యుత్, రవాణా వ్యవస్థలకు, మంచి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం.. వర్షపాత నమోదు ఇలా షేక్పేట లో 10.6 సెం.మీ ఖాజగూడ లో 9.6 సెం.మీ రామంతపూర్ లో 8.1 సెం.మీ మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ మాదాపూర్ 7.3 సెం.మీ తార్నాక లో 7.1 సెం.మీ జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ మైత్రివనం 6.9సెం.మీ బంజారాహిల్స్ 6.9 సెం.మీ ఇదీ చదవండి: చిన్నారి మౌనిక ఘటన మరువక ముందే.. కుండపోతకు మరో విషాదం -
అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు పగటిపూట రోకండ్లు పగిలే ఎండ.. మరోవైపు విపరీతమైన ఈదురు గాలులు, అకాల వర్షాలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాబోయే ఐదురోజుల్లో ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలిదుమారం వీస్తుందని, అలాగే క్రికెట్ బాల్ సైజ్లో వడగండ్ల వానకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. మరోవైపు పగటి పూట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. గాలి విచ్ఛిన్నం, ద్రోణుల ప్రభావంతో వాతావరణంలో ఈ తరహా మార్పులు సంభవిస్తుయని పేర్కొంది వాతావరణ కేంద్రం. -
తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్న బయ్యారం ఉక్కు కర్మాగారానికి బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించకుండా తన మిత్రుడు అదానీకి కట్టబెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదానీకి కట్టబెట్టిన ఆ మైనింగ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 150 కి.మీ దూరంలోని బయ్యారానికి, 600 కి.మీ దూరంలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం లాభసాటి కానప్పుడు..1,800 కి.మీ దూరంలోని గుజరాత్లోని ముంద్రాలో నిర్మించే ఉక్కు పరిశ్రమకు ఏ విధంగా లాభసాటి అవుతుందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, భానుప్రసాద్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కుట్రలు గమనించలేక పోయాం.. ‘బయ్యారం, విశాఖ రెండింటికీ ముఖ్యమైది బైలదిల్లా. 134 కోట్ల మెట్రిక్ టన్నుల గని. బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలు నిర్మిస్తామని ఏపీ పునరవ్వ్యస్థీకరణ చట్టంలోనే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బయ్యారం కోసం 2014 నుంచి అడుగుతోంది. పరిశ్రమల మంత్రిగా నేను ప్రధానమంత్రిని 2018 జూన్లో కలిసి విజ్ఞప్తి చేశా. సీఎం కేసీఆర్ కూడా లేఖలు రాశారు. అయితే బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత తక్కువ అంటూ తప్పుదోవ పట్టించారు. వారు చెప్పిందే నిజం అనుకున్నా. ‘‘బయ్యారానికి కేవలం 150 కి.మీ దూరంలోపి బైలదిల్లాలో నాణ్యత గల ఇనుప ఖనిజం ఉంది. అక్కడ నుంచి స్లర్రీ పైపు లైను వేయవచ్చు. అందుకయ్యే వ్యయంలో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం కేటాయించి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే 15 వేల నుంచి 20 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది..’’అని ప్రధానికి చెప్పా. కానీ వారి కుట్రలు గమనించలేకపోయాం. మేము అడిగి వచ్చామో లేదో 2018 సెప్టెంబర్లో అదాని బైలదిల్లా ఐరన్ ఓర్ కంపెనీని పెట్టారు. బైలదిల్లా అదాని చేతుల్లోకి వెళ్లింది..’అని కేటీఆర్ వివరించారు. ‘విశాఖ’ను అమ్మడానికి కేంద్రం కుట్ర.. ‘విశాఖ ప్లాంట్కు క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వకుండా నష్టాల్లోకి వెళ్లేలా చేసి, దానిని అడ్డికి పావుశేరు లెక్కన అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తోంది. అదానీకి రూ.6 లక్షల కోట్ల విలువైన బైలదిల్లాను కట్టబెట్టడమే కాకుండా.. రూ. 1.5 లక్షల కోట్ల విలువైన విశాఖ కర్మాగారాన్ని కూడా కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ.. పాస్కో విశాఖ కర్మాగారాన్ని చూసిందని, అక్కడ పరిశ్రమ పెట్టే యోచన చేస్తోందని చెప్పింది. కానీ దానిని గుజరాత్కు మళ్లించారు. ఇలా రెండు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు..’అని మంత్రి ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఓ అజ్ఞాని.. ‘బయ్యారం ఉక్కు పరిశ్రమను పట్టించుకోకుండా విశాఖ ఉక్కుపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయనకు విషయ పరిజ్ఞానం లేదు. ఓ అజ్ఞాని. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఫీజబులిటీ లేదు అంటాదు. అక్కడ నాణ్యత లేదంటాడు. ప్రధాని, ఆదాని, అజ్ఞాని.. ఓ డెడ్లీ కాంబినేషన్. ప్రధానులు ఎవరైనా ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కానీ ఈ ప్రధాని జాతి సంపదను తన జాతి రత్నాలకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు, పోర్టులను కట్టబెట్టారు..’అని కేటీఆర్ ఆరోపించారు. బిడ్డింగ్ సాధ్యాసాధ్యాల పరిశీలనకే విశాఖకు.. ‘విశాఖపై అధ్యయనం మాత్రమే చేస్తున్నాం. క్యాప్టివ్ మైనింగ్ లేకుండా సాధ్యం అవుతుందా లేదా..? బిడ్డింగ్లో పాల్గొనడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికే అధికారులు అక్కడికి వెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చిన తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ తెలిపారు. రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపిస్తామంటే నిజాం షుగర్స్ను తెరిపించడానికి, అందుకోసం రూ.250 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఇప్పటికీ సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. సిర్పూర్ పేపర్ మిల్ను తెరిపించామని, బిల్ట్ను తెరిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి: తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడపాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుంచి ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారమిచ్చింది. ఈ రైలు రూట్, ప్రయాణ సమయాలు, ఆగాల్సిన రైల్వేస్టేషన్లు, చార్జీలపై నివేదికను సమర్పించమని ఆదేశించింది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్–తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లోనే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత ఈ రైలును ప్రవేశపెట్టడం గురించి ప్రకటన చేయాలని వారు భావిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. అందులో మొదటగా సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ఇటీవల ప్రవేశపెట్టారు. ఆ రైలుకు ప్రయాణికుల నుంచి అత్యంత ఆదరణ లభిస్తోంది. రోజూ వందశాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వందేభారత్ రైలును సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిపేందుకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల సందడి
-
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్
-
కొత్త ఫ్లూ.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా హైఅలర్ట్ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్ఫెక్షన్లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్. అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్. ఇదిలా ఉంటే.. కోవిడ్ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం. ఇదీ చదవండి: H3N2 వైరస్ తీవ్రంగా ఎందుకు ఉందంటే.. లక్షణాలు గనుక కనిపిస్తే.. చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి ఇవి చేయకుండా ఉండడం బెటర్ ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం గుంపుగా కలిసి తినకుండా ఉండడం సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. -
రూ. 2,500 కోట్లతో శ్యామ్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్ స్టీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమ రిటైల్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
Maha Shivratri 2023 : శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు (ఫొటోలు)
-
Union Budget: తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు కేటాయింపులు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే, విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. ►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు ►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు ►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు ►విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు ►సింగరేణికి రూ.1650 కోట్లు ►ఐఐటీ హైదరాబాద్కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు ►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు ►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు ►కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు ►కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు చదవండి: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు ఆదాయ పన్ను విషయానికొస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. పన్ను పరిమితిని రూ.5 లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. -
పండుగ ప్రయాణం.. నరకయాతన
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు జనం ఉత్సుకత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లె బాట పట్టి ఖర్చుకు సైతం వెనకాడకుండా.. నరకయాతన అనుభవిస్తున్నారు. నగరం నుంచి ఇప్పుడు సొంతూళ్లకు ప్రయాణమంటే నరకమనే అర్థం!!. సంక్రాంతికి ప్రయాణాల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు సుఖవంతమైన ప్రయాణం లేకున్న పర్వాలేదనుకుని.. తోపులాటలో నిల్చుని మరీ ఊళ్లకు పయనమయ్యారు. ఇంకోవైపు నగరాలు, పట్టణాల్లోని రోడ్లు, జాతీయ రహదారులు.. విపరీతమైన వాహన రద్దీతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్తో పడిగాపులు పడాల్సి వస్తోంది. రైళ్లు, బస్సు ప్రయాణాలకు మూడు, నాలుగు నెలల ముందే బుకింగ్లు అయిపోయాయి. దీంతో ప్రయాణాల కోసం బ్లాక్ దందాలను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఆ దందాలను కట్టడి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నా.. ప్రయాణం ఎలాగైనా సాగాలని అవేం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు కొందరు. ఇక విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. సొంతూళ్లకు ప్రయాణికులు క్యూ కడుతుండడంతో కిటకిలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. బస్సుల్లో సీట్లు దొరక్క చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. అయితే అందులోనూ కుక్కి కుక్కి మరీ ప్రయాణాలు చేయిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి 140 ప్రత్యేక రైళ్ళను ప్రకటించించింది దక్షిణ మధ్య రైల్వే. కానీ, ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో.. ఆ రైళ్లు ఎటూ సరిపోలేదు!. దీంతో స్టేషన్ బయటే ప్రయాణికులు ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కనెక్టవిటీ ఎంఎంటీఎస్ రైళ్లు మరమ్మత్తుల పనులతో రద్దు కావడంతో.. భారమైన సరే ఖర్చు పెట్టుకుని బస్టాండ్లకు, స్టేషన్లకు చేరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంక్రాంతి పండుగకు వాహనాలు రహదారి ఎక్కడంతో.. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పండుగకు మామూలు రోజులకంటే అధికంగా వాహనాల తాకిడి నెలకొంటుందనేది తెలిసిందే. అయితే ఈసారి ఆ తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువ వస్తోంది. ఫాస్టాగ్ ఉన్నా కూడా అర కిలోమీటర్ పైనే వాహనాలు జారీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో 30-35 వేల వాహనాల రాకపోకలు సాగించేవని, కానీ, గత మూడు రోజుల నుంచి యాభై వేల వాహనాల రాకపోకలు కొనసాగించాయని జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు వాహనాల రద్దీని తట్టుకునేందుకు అదనపు టోల్ బూతులను తెరచినట్లు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చలో సంక్రాంతి.. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
-
ఏపీ, తెలంగాణలో పెరిగిన చలి
-
Telangana: వందే భారత్ ఎప్పుడొచ్చేనో!.. రైలు ప్రత్యేకతలివీ..
సాక్షి, హైదరాబాద్: ఇదిగో వచ్చేస్తుందన్నారు. త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా పట్టాలెక్కుతుందన్నారు. కానీ ఏడాది గడిచింది. తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని మరింత దగ్గర చేసే వందేభారత్ రైలుపై ఇప్పటి వరకు ఎలాంటి కదలికా లేదు. ఈ నెలలోనే పట్టాలెక్కుతుందని భావించినా.. ఈ రైలు కొత్త సంవత్సరం జనవరి నెలలోనైనా పట్టాలెక్కుతుందా? లేదా? అనే అంశంపై సందేహం నెలకొంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు రాకపోకలు సాగించనున్న ఈ స్పీడ్ రైలుకు తగ్గట్లుగా ఇప్పటి వరకు ట్రాక్ సామర్థ్యం పెంచకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల 30న పశ్చిమ బెంగాల్లో మరో రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్పై జాప్యం నెలకొనవడం ప్రయాణికులను నిరాశకు గురి చేస్తోంది. ట్రాక్ సామర్థ్యం పెంపు.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు కాజీపేట మీదుగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తాయి. ఈ మేరకు ఈ మార్గంలో ట్రాక్ సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తిచేయకపోవడం వల్లనే వందేభారత్ రైలు రాక ఆలస్యమైనట్లు ఒక అధికారి వివరించారు. ట్రాక్ సామర్థ్యం పెంచిన వెంటనే వందేభారత్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. మరోవైపు జనవరితో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి ఫిబ్రవరిలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది అందుబాటులోకి వస్తుందా లేక మరో సంవత్సరం ఎదురు చూడాల్సి వస్తుందా? అనే అంశంపై సందేహం నెలకొంది. తగ్గనున్న దూరం... ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఇంటర్సిటీ రైళ్లతో పాటు విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20కిపైగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే వందేభారత్ రైళ్లను సైతం ఈ రూట్లోనే ప్రవేశపెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం దశలవారీగా విశాఖ, తిరుపతి, తదితర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. వందేభారత్ రైలు ప్రత్యేకతలివీ.. ►గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగం ►సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రత వ్యవస్థ ►మెట్రో రైలు తరహాలో ఆటోమేటెడ్ డోర్ సిస్టమ్ ►వీల్చైర్లు, రీడింగ్ లైట్లు అందుబాటులో ►ఇండియన్, వెస్టర్న్ మోడల్లో బయో వాక్యూమ్ టాయ్లెట్లు -
Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం ప్రయాణాలు చేసే వాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తారీఖు నడుమ.. వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని ప్రసిద్ధ గమ్యస్థానాల నడుమ ఇవి నడుస్తున్నాయని తెలిపింది. -
క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు