తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు | Centre Appoints New IPS Officers To Telugu States Jan 2024 | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17 2024 1:03 PM | Updated on Jan 17 2024 1:03 PM

Centre Appoints New IPS Officers To Telugu States Jan 2024 - Sakshi

తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చే.. 

ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు. 

తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్‌, సాయి కిరణ్‌, మనన్‌ భట్‌, రాహుల్‌ కాంత్‌, రుత్విక్‌ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement