home ministry
-
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్కు అదనపు బలగాలు
న్యూఢిల్లీ:మణిపూర్లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
సీఐఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా బెటాలియన్.. కేంద్రం గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్ఎఫ్కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.సీఐఎస్ఎఫ్కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుమొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి. -
కోల్కతా డాక్టర్ కేసు: ‘ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి’
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది. -
ఉగ్ర దుర్బేధ్యంగా భారత్ను నిర్మిస్తా
న్యూఢిల్లీ: భారత దేశాన్ని అజేయ శక్తిగా మలుస్తానని నూతన హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో హోం శాఖ కార్యాలయంలో అమిత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ దేశం, దేశ ప్రజల భద్రతే నాకు అత్యున్నతం. మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని భద్రత విషయంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సల్ ప్రభావం బారిన పడకుండా దుర్బేధ్యంగా మారుస్తా’ అని అన్నారు. మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023, భారతీయ సాక్ష్యా అధినియం–2023ల సమర్థ అమలును అమిత్షా పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు మంత్రులుగా ప్రమాణంచేసిన నేతలు మంగళవారం ఢిల్లీలో తమతమ శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి కర్తవ్య నిర్వహణ మొదలెట్టారు. కొందరు నేతలు పూజాకార్యక్రమాలు చేసి మంత్రి కుర్చిల్లో కూర్చుంటే కొందరు కమలదళ నినాదాలు చేస్తూ కుర్చిల్లో ఆసీనులయ్యారు. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, అశ్వనీ వైష్ణవ్ రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రిగా ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కుటుంబసభ్యుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.మహిళా మంత్రులూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అన్నపూర్ణాదేవి చెప్పారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా శోభా కరంద్లాజె, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నిమూబెన్ బంభానియా బాధ్యతలు స్వీకరించారు. -
‘భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధివిధాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఏఏ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడితున్నాయి. మరోవైపు.. ఈ చట్టం అమలుతో ముస్లింలు ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడతారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా సీఏఏ చట్టంపై ముస్లింల ఆందోళనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ముస్లింలు సీఏఏతో ఆందోళ చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది ‘భారతీయ ముస్లింలు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సీఏఏ చట్టంలో 18 కోట్లమంది ముస్లింలను ఇబ్బంది పెట్టే ఎటువంటి నిబంధన లేదు. ముస్లింలు తమ పౌరసత్వ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలోని హిందూవులతో సమానమైన హక్కులు ఉంటాయి. సీఏఏ కింద ముస్లింలు పౌరసత్వాన్ని రుజువు చేయటానికి ఎటువంటి పత్రాలు సమర్పించాలిన అవసరం లేదు. ఇస్లాం మతం శాంతియుతమైంది. మతప్రాతిపదికగా ద్వేషం, హింసను బోధించదు. ఈ చట్టం కరుణ చూపే.. ఇస్లాం మతాన్ని హింస పేరుతో మసకబారనివ్వకుండా కాపాడుతుంది’ అని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొన్ని ఇస్లాం దేశాలలో మైనారిటీల వేధింపుల కారణంగా.. ఇస్లాం పేరు మసకబారిందని తెలిపింది. ఇక.. సీఏఏ చట్టం ముస్లింకు వ్యతిరేకమని కొంతమంది ఆందోళన చెందటం అన్యాయమని పేర్కొంది. ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన సీఏఏ చట్టంలో లేదని హామీ ఇస్తున్నట్లు చెప్పింది. మరోవైపు.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖార్గే, ఎంపీ రాహుల్ గాంధీ.. సీఏఏ చట్టం వల్ల ముస్లిం మైనార్టీలు తమ పౌరసత్వాన్ని కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్లో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మండిపడ్డారు. చదవండి: ‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత -
కేరళ గవర్నర్కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే?
తిరువనంతపురం: సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్కు సీఆర్పీఎఫ్ బలగాలతో Z+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ రాజ్భవన్కు తెలియజేసింది. ఈ విషయాన్ని కేరళ రాజ్భవన్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొంది. సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ అయిన స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(SFI) శనివారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనకు దిగారు. గవర్నర్ ఆరిఫ్ కొట్టారక్కర జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరుకావటానికి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో విసిగిపోయిన గవర్నర్ ఆరిఫ్.. అనూహ్యంగా రోడ్డు పక్కన్న ఉన్న ఓ షాప్ ముందు బైఠాయించారు. తనపై నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొని.. అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన కొల్లాం జిల్లాలో జరిగింది. గవర్నర్ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులకు తెలియజేశారు. నిరసన ఘటనపై గవర్నర్ ఆరిఫ్ .. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్పై విమర్శలు చేశారు. పినరయ్ విజయన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో అధర్మం, అశాంతిని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా పలువురి నాయకులపై కోర్టుల్లో క్రిమినల్ కేసులు ఉన్నా సీఎం పినరయ్ విజయన్ వారిని కాపాడటానికి పోలీసులకు దిశానిర్ధేశం చేస్తున్నారని విమర్శించారు. ఇక కొంత కాలంగా కేరళ సీఎం, గవర్నర్ మధ్యలు విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సైతం గవర్నర్ ఆరిఫ్పై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. చదవండి: తలొగ్గిన సర్కార్.. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్స్టాప్ -
తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్ల కేటాయింపు
ఢిల్లీ, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. -
రెండు రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు
-
ప్రజల మనసు గెలిచి.. పురస్కారం పొంది.. హనుమంతునిపాడు పీఎస్ కు పట్టం
హనుమంతునిపాడు / ఒంగోలు టౌన్: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్స్టేషన్గా గుర్తింపు తెచ్చుకుంది జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్స్టేషన్. 9 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల అభిప్రాయాలను సేకరించి 2022 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డీజీపీ చేతుల మీదుగా ఎస్పీ మల్లికా గర్గ్, ఎస్ఐ కృష్ణ పావని, సిబ్బంది పురస్కారాన్ని అందుకున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్నా.. 1927వ సంవత్సరం బ్రిటీషు పాలనలో కొండ శివారు గ్రామమైన నందనవనంలో పోలీస్సేష్టన్ను ఏర్పాటు చేశారు. 1984లో మండలాలు ఏర్పాటైన తర్వాత దీనిని హనుమంతునిపాడు మండల కేంద్రానికి మార్చారు. అయితే పురాతన భవనంలో తుపాకులు, ఇతర సామగ్రికి, సిబ్బందికి నక్సల్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2004లో కనిగిరి పాత పోలీస్స్టేషన్లోకి మార్చారు. దాదాపు పదేళ్లకుపైగా మండల కేంద్రానికి దూరంగా నియోజకవర్గ కేంద్రంలో హెచ్ఎంపాడు పీఎస్ కొనసాగుతోంది. స్టేషన్ పరిధిలో 23 గ్రామ పంచాయతీల్లో 14 సచివాలయాల కింద 62 హ్యాబిటేషన్ గ్రామాలున్నాయి. కనిగిరిలోని పోలీస్స్టేషన్ భవనం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిబ్బంది మండలానికి దూరంగా ఉన్నా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరించారు. ఉన్నతాధికారుల సూచనలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తిమేర సేవలందించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సెభాష్ అనిపించుకున్నారు. గతేడాది ఆగస్టు 28వ తేదీన కేంద్ర బృందం సర్వే చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కేంద్ర బృందం ద్వారా ప్రశంసలందుకుని పురస్కారానికి అర్హత సాధించారు. శ్రమకు గుర్తింపు లభించింది హనుమంతునిపాడు పోలీసు స్టేషన్కు ఉత్తమ పోలీసు స్టేషన్గా కేంద్ర హోం శాఖ నుంచి అవార్డు రావడం ప్రకాశం జిల్లా పోలీసుల శ్రమకు తగిన గుర్తింపు లభించినట్లు భావిస్తున్నాను. ముఖ్యంగా హనుమంతునిపాడులో ఎస్ఐగా విధులు నిర్వహించిన కృష్ణ పావని నిబద్ధత కలిగిన అధికారి. ఆమె పనితీరు చాలా బాగుంది. ఆమెతో పాటుగా అక్కడ పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే ప్రజల, ప్రభుత్వ ప్రశంసలు పొందారు. – ఎస్పీ మలికా గర్గ్ మరింత స్ఫూర్తినినిచ్చింది ఈ అవార్డు నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఎస్పీ మలికా గర్గ్ ఇచ్చిన మద్దతు, సూచనలు, సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించడం, ప్రజలతో సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా బాధితులకు న్యాయం చేయడానికి శక్తిమేర ప్రయత్నించడం మా పోలీసు స్టేషన్కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ విషయాన్ని మండల ప్రజలు కేంద్ర హోం శాఖ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అవార్డు రావడానికి సహచర పోలీసు సిబ్బంది, మండల ప్రజల తోడ్పాటును ఎప్పటికీ మరచిపోలేను. – కృష్ణ పావని, ఎస్ఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకున్న అంశాలు: ● నేరాల నియంత్రణ ● లా అండ్ ఆర్డర్ నిర్వహణ ● చట్టాల అమలు ● కేసుల దర్యాప్తు, విశ్లేషణ ● కోర్టు సమన్లు, కోర్టు మానిటరింగ్ ● ప్రోయాక్టివ్ పోలీసింగ్ ● కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ● పెట్రోలింగ్ నిర్వహణ ● పచ్చదనం, పరిశుభ్రత -
మణిపూర్లో శాంతి స్థాపనకు కేంద్రం కమిటీ
న్యూఢిల్లీ: మణిపూర్లో జాతుల మధ్య వైరాన్ని రూపుమాపి శాంతిని స్థాపించేందుకు, వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నర్ సారథ్యంలోని ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పౌరసంఘాలకు ప్రాతినిథ్యం ఉంటుందని శనివారం హోం శాఖ తెలిపింది. ఇటీవల మణిపూర్లో పర్యటన సమయంలో హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్లో నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది గాయపడ్డారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
స్నూపింగ్ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్ తలిగింది. స్నూపింగ్ కేసులో ఆయనపై న్యాయపమరైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా.. ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ అనుమతి కోసం పంపారు. ఈ విజ్ఞప్తికి హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా.. ఇప్పుడు స్నూపింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చాక ఫీడ్బ్యాక్ యూనిట్(ఎఫ్బీయూ)ను ఏర్పాటు చేసింది. 2016లో రూ.కోటి కేటాయించడంతో ఎఫ్బీయూ సీక్రెట్ సర్వీస్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలపై రహస్య నిఘా పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే దీన్ని ఏర్పాటు చేశారంటోంది. ఢిల్లీ విజిలెన్స్ శాఖకు నేతృత్వం వహిస్తున్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతి కావాలని కోరింది. 2015లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎఫ్బీయూ ఏర్పాటును సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారని, కానీ దాని ఎజెండాకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఎఫ్బీయూ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కూడా లేదని పేర్కొంది. సీబీఐ అభ్యర్థను ఆమోదిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎటువంటి శాసన, న్యాయ, కార్యనిర్వాహక పర్యవేక్షణ లేకుండా అధికారాన్ని ఉపయోగించి రహస్య ఏజెన్సీని స్థాపించేందుకు ఆప్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. చదవండి: దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత? -
వీరప్పన్ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్కు భద్రతా సలహాదారుగా విజయ్కుమార్ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్ఫోర్స్ చీఫ్గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్గానూ, జమ్ముకశ్మీర్లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్కే ముచ్చెమటలు పట్టించి.. -
ఏపీ విభజనా చట్టం అమలుపై నేడు కేంద్ర హోంశాఖ సమావేశం
-
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ?
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ వారంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఆగస్టు 15లోగా కేబినెట్ విస్తరణకు సీఎం షిండే సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణం చేశారు. అప్పట్నుంచి వారిద్దరితోనే కేబినెట్ నడుస్తూ ఉండడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శల్ని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ వారి ప్రభు త్వంలో మొదటి 32 రోజులు కేవలం అయిదుగురే ఉన్న విషయాన్ని అజిత్ దాదా మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా మహారాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరగనుంది. చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్ -
హోం, ఆర్థిక శాఖ మాకే కావాలి.. పట్టుబడుతున్న షిండే వర్గం
సాక్షి, ముంబై: ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పదవుల పంపకంపై పాకులాట మొదలైనట్లు తెలుస్తోంది. ఒకపక్క హోం, ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖలు తనవద్దే ఉండాలని షిండే పట్టుబడుతుండగా, మరోపక్క షిండే వర్గం వద్ద ముఖ్యమంత్రి ఉండటంతో హోం శాఖ, నగరాభివృద్ధి, రెవెన్యూ, జలవనరులు లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక శాఖలపై ఇరువర్గాలు చేస్తున్న డిమాండ్లను ఎలా పరిష్కరిస్తారనే దానిపై ఇటు తిరుగుబాటు, అటు బీజేపీ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది. ఆది, సోమవారాలు రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నార్వేకర్ను ఎన్నుకోవడంలో షిందే, ఫడ్నవీస్ వర్గానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ మంత్రివర్గంలో ఎవరికి స్ధానం కల్పిస్తారు..? ఆ తరువాత పదవులు ఎలా పంపకం చేస్తారు.? ఏ ఎమ్మెల్యేకు, ఏ పదవి కట్టబెడతారనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్, ఎన్సీపీ వద్ద ఉన్న పదవుల్లో అధిక శాతం పదవులు తమకే కావాలని బీజేపీ భావిస్తోంది. ఏక్నాథ్ షిండే వద్ద ముఖ్యమంత్రి పదవి ఉండటంతో హోం, విద్యుత్, నగరాభివృద్ధి, జలవనరుల లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి? కాని షిండే వర్గం హోం, నగరాభివృద్ధి, ఆర్ధిక, జలవనరులు, విద్య లాంటి కీలక శాఖలు కావాలని కోరుకుంటుంది. అందులో హోం, ఆర్ధిక లాంటి అత్యంత కీలకమైన శాఖలు స్వయంగా తన వద్ద ఉంచుకోవాలని షిండే పట్టుబడగా, ఫడ్నవీస్ కూడా ఆ రెండు శాఖలు తనవద్దే ఉంచుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఫడ్నవీస్ వద్ద హోం, నగరాభివృద్ధి లాంటి కీలక శాఖలుండేవి. కానీ ఇప్పుడు శాఖల పంపిణీపై ఇరువర్గాల మధ్య విభేదాలు పొడచూపకుండా చాలా జాగ్రత్తగా సమస్యను పరిష్కరించేందుకు షిండే, ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: మహారాష్ట్ర: బల పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం -
ఉదయ్పూర్ ఘటనలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు
Udaipur Tailor Murder: రాజస్థాన్ ఉదయ్పూర్ టైలర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్పూర్కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్పూర్ ఘటనపై ఎన్ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Shri Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు -
Cyclone Asani: సర్కారు హై అలర్ట్
సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించారు. మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు. టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్ను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద అలల ఉధృతి గ్రామాల వారీగా కమిటీలు తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు. -
'ఏ ల్యాండ్మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
-
కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్కుమార్కు కేటాయించారు. పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి. -
బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. బెంగాల్లో హింసకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే! -
Delhi Lieutenant Governor: ఢిల్లీకి ఎల్జీనే బాస్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి లెఫ్టినెంట్ గవర్నర్ను ఇన్చార్జ్గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. జీఎన్సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఆప్ సహా పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధమని విమర్శించాయి. తాజా నోటిఫికేషన్తో చట్టంలోని నిబంధనలు ఈనెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఎల్జీని కేంద్రం నియమిస్తునందున, ఇకపై దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం వైఫల్యం చెందిన వేళ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా విజృంభణపై మంగళవారం ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ ప్రభుత్వం నామమాత్రమే.. జీఎన్సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నామమాత్రంగా మిగలనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తాజా ఆదేశాలతో ఇకపై ఎల్జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్ ప్రభుత్వం ఎల్జీ అనుమతితోనే అడుగులు వేయాల్సిఉంటుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎల్జీ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ ఎల్జీ అధికారాలు భిన్నమైనవని అధికారులు వివరించారు. ఇప్పటివరకు అధికార పరిధిపై ఎల్జీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న సందిగ్ధాలను తాజా చట్టం నివారిస్తుందని చెప్పారు. -
గణతంత్ర వేళ: తెలుగు రాష్ట్రాలకు పోలీస్ పతకాల పంట
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా పోలీస్ పతకాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీస్ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పోలీస్ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ పతకాలను త్వరలోనే స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్: 18 పోలీస్ మెడల్స్, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి. తెలంగాణ 14 పోలీస్ మెడల్స్, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఆయా అధికారులు తమ విధుల్లో కనబర్చిన ప్రతిభకు ఈ పతకాలు దక్కాయి. పతకాలు పొందిన వారిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే వీరు పతకాలు స్వీకరించనున్నారు. -
ఎన్నికల ప్రచారాలు షురూ
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. -
అన్లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్లాక్-3 ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఇంకా నిషేధం కొనసాగించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగడంతో పాటుగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఆంక్షలు విధిస్తే దీనిని ఉల్లంఘన చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. (అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల) ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. నిబంధనలు ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ- పర్మిట్ల పేరిట సరుకు రవాణాకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఒకవేళ ఇలాంటి ఆంక్షల గురించి మరోసారి తమ దృష్టికి వస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన చర్యగా పరగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. (అన్లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!) ఈ క్రమంలో పలు దఫాలుగా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం మే రెండోవారంలో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే అన్లాక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అన్లాక్-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో ఇన్నాళ్లుగా మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం అనుమతించినున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ బాధితుల సంఖ్య 29,75,702 కు చేరుకుంది. మొత్తంగా 55,794 కరోనాతో మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. -
ఫేస్బుక్కు పిలుపు
న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. థరూర్ను తొలగించాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్గా నియమించాలని కోరారు. శశిథరూర్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రతినిధులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్బుక్ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్ ఆరోపించారు. -
సీఏఏ రూపకల్పనకు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లోని నిబంధనల రూపకల్పనకు కేంద్ర హోం శాఖ అదనంగా మరో మూడు నెలల సమయం కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సబార్డినేట్ లెజిస్లేషన్కు సంబంధించిన హోం శాఖ పార్లమెంటరీ కమిటీకి నివేదన పంపినట్లు వెల్లడించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురయ్యే ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకువచ్చిన విషయం విదితమే. ఉభయసభల ఆమోదం పొందిన అనంతరం గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి ఆమోదముద్ర వేశారు. (పౌరసత్వ సవరణ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా నిబంధనల ప్రకారం.. ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన 6 నెలల్లోగా నిబంధనల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే గరిష్టంగా 3 నెలల పొడిగింపునకు అనుమతి పొందవచ్చు. సీఏఏ నిబంధనల రూపకల్పన పూర్తికాక పోవడంతో మరో మూడు నెలల గడువు కోరుతూ పార్లమెంటరీ కమిటీకి విజ్ఞాపన పంపారు. ఈ వినతిని సంబంధిత కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఇక ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సీఏఏ రూపొందించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
ఆ 40 వెబ్సైట్లపై వేటు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)కు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్ అనుకూల ఉగ్ర సంస్థ. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం పనిచేసే వారిని నిషేధిత ఎస్ఎఫ్జే ప్రోత్సహిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఎలక్ర్టానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎస్ఎఫ్జేకు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత ఏడాది ఎస్ఎఫ్జేను హోంమంత్రిత్వ శాఖ నిషేధించింది. ఎస్ఎఫ్జే బాహాటంగా ఖలిస్తాన్కు మద్దతు ఇస్తోందని, ఫలితంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భౌగోళిక స్వరూపాలకు సవాళ్లు ఎదురవుతాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. వేర్పాటువాద అజెండాతో ముందుకొచ్చిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్పై సిక్కుల రిఫరెండంకు పిలుపుఇచ్చింది. చదవండి : పంజాబ్లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్.. -
దశలవారీగా అంతర్జాతీయ విమాన సర్వీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అన్లాక్ 2.0లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభమవుతాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్త లాక్డౌన్తో మార్చి చివరివారం నుంచి దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం పరిమిత రూట్లలో దేశీయ విమాన సేవలను అనుమతించినా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. కాగా లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడిపింది. వందే భారత్ మిషన్లో భాగంగా 50కి పైగా దేశాల పెద్దసంఖ్యలో భారతీయులను స్వదేశానికి రప్పించామని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. చదవండి: తమిళనాడు మంత్రికి కరోనా -
వలస కూలీలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల తరలింపుపై కేంద్రం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను తరలించాలన్న పాత నిబంధనను తొలగించింది. అలాగే లాక్డౌక్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. (కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు) కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది కాలినడనక స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీనిపై కూడా కేంద్ర హోంశాఖ స్పందించింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతునన రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు రైల్వేలతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో ఓ అంచనాకు వచ్చి ఆ వివరాలను రైల్వేశాఖతో పంచుకోవాలని తెలిపింది. కేంద్రహోంశాఖ తాజా నిర్ణయంతో శ్రామిక్ రైళ్ల సంఖ్య పెరగనుంది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు) -
జూమ్ యాప్ వాడొద్దు: హోం మంత్రిత్వ శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన జూమ్ యాప్ పై ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వెలువరించింది. వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా వాడుతున్న యాప్ అంత సురక్షితమైన వేదిక కాదని హోం మంత్రిత్వ శాఖ తాజాగా హెచ్చరించింది. జూమ్ను ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని నొక్కి చెప్పింది. సెక్యూరిటీ లోపాలకారణంగా, మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా అందులో ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుందనీ, దీంతో ఆయా సమావేశంలో సంభాషణ వివరాలు, సున్నితమైన సమాచారాన్ని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించే ప్రమాదం వుందని హెచ్చరించింది. కాన్ఫరెన్స్ నిర్వహించేటప్పుడు వెబ్సైట్లోని యూజర్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా లేదా పీసీ / ల్యాప్టాప్ / ఫోన్లో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ లో చాలా సెట్టింగులు చేయవచ్చని తెలిపింది. వ్యక్తుల వినియోగానికి కూడా జూమ్ సురక్షితమైన వేదిక కాదంటూ హోం మంత్రిత్వ శాఖ సూచించింది. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సూచనల మేరకు మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ సమావేశాల్లో థర్డ్ పార్టీ అక్రమంగా చొరబడే "జూంబాంబింగ్" నిరోధానికి కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. భారత్ భద్రతా ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా(సీఆర్ టీ-ఇండియా) ఇప్పటికే దీనిపై హెచ్చరికలను కూడా చేసింది. (కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!) భద్రతాపరంగా ఈ యాప్ వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. "ప్రైవేట్ ప్రయోజనాల కోసం జూమ్ను ఉపయోగించాలనుకునే ప్రైవేట్ వినియోగదారుల భద్రత కోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూమ్ యాప్లో గోప్యతకు, భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు గూగుల్ , స్టాండర్డ్ చార్టర్డ్ సహా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జూమ్ నుండి దూరంగా ఉండమని హెచ్చరించడం గమనార్హం. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. వర్చువల్ సమావేశాల సమయంలో అశ్లీల కంటెంట్ తెరపెకి వచ్చిన ఘటనలు కూడా నమోదయ్యాయి. కాలిఫోర్నియాకు చెందిన శాన్ జోస్ సంస్థ ఈ నెల ప్రారంభంలో జూమ్ యాప్ లో కొన్ని గోప్యతా సమస్యలను గుర్తించింది. దీంతో యాప్ వినియోగాన్ని సింగపూర్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. అటు అమెరికాకు చెందిన ఎఫ్బిఐ కూడా దీని భద్రతా లోపాలను పరిశీలిస్తోంది. జూమ్ వాడొద్దంటూ యుఎస్ సెనేట్ ఇటీవల తన సభ్యులకు సూచించింది. ఈ నేపథ్యంలో జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిర్వహించారు. అయితే తాజా పరిణామంపై ఇంకా స్పందించాల్సి వుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (ఇంటినుంచే) సేవలను అందిస్తున్నారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సులకోసం జూమ్ యాప్ వైపు చాలా సంస్థలు మొగ్గు చూపాయి. కంపెనీలు, ఉద్యోగులు జూమ్ యాప్ ను విరివిగా వినియోగిస్తుండటంతో డిమాండ్ భారీగా పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 మిలియన్ల వినియోగదారుల మార్కును దాటేసింది. -
వామ్మో.. ఏటిఎం?
ఒకపక్క ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను కూడా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏటీఎంలలో విండోస్ 7 సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్ కార్డ్ రీడర్లు ఇన్స్టాల్ చేయడం, నగదు సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల దాకా వివిధ అంశాలపై ఏప్రిల్ 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యలో ఆర్బీఐ, హోంశాఖ పలు సర్క్యులర్లు జారీ చేశాయి. నగదు భర్తీ చేసే సంస్థలు పాటించాల్సిన నిబంధనలు కూడా వీటిల్లో ఉన్నాయి. విండోస్ 7 సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకునేందుకు ఆర్బీఐ విధించిన జనవరి 2020 డెడ్లైన్ దగ్గరపడుతోంది. అయినప్పటికీ.. మిగతా నిబంధనల్లాగే దీన్ని కూడా పూర్తి స్థాయిలో అందుకునే పరిస్థితి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తీవ్రంగా పరిగణిస్తున్న ఆర్బీఐ... భారత్లో బ్యాంకింగ్ తీరుతెన్నులు, పురోగతిపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. ఏటీఎం, డెబిట్ కార్డు లావాదేవీలపై బ్యాంకింగ్ అంబుడ్స్మన్కి 2017–18లో 24,672 ఫిర్యాదులు రాగా, 2018–19లో 36,539కి పెరిగాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోతుండాన్ని రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా పరిగణిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏటీఎంలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి 2017 మార్చి, నవంబర్లలో చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ 2018 జూన్ 21న ఆర్బీఐ ఒక సర్క్యులర్ పంపించింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఏటీఎంలను కచ్చితంగా గోడలు లేదా పిల్లర్లలోకి అమర్చడం, నగదు భర్తీ కోసం వన్ టైమ్ కాంబినేషన్ (ఓటీసీ) తాళాలను ఉపయోగించడం తదితర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ ఆదేశాల అమలు పురోగతి నత్తనడకన సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 2,06,589 ఏటీఎంలు నిర్వహణలో ఉన్నాయి. అయితే, ఇప్పటికీ సగం ఏటీఎంలలో ఓటీసీ వినియోగంలోకి రాలేదు. ఆపరేటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసుకోకపోవడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల.. బ్యాంకు ఖాతాదారులు నష్టపోవడంతో పాటు బ్యాంకు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వ్యయాల భయంతో వెనుకంజ.. ఏటీఎంలలో నగదు భర్తీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానానికి బదులుగా మరింత సురక్షితమైన లాకబుల్ క్యాసెట్స్ (పెట్టె) విధానాన్ని అమల్లోకి తేవాలని సూచిస్తూ 2018 ఏప్రిల్ 12న.. ఆర్బీఐ మరో సర్క్యులర్ కూడా ఇచ్చింది. 2020–21 నాటికి మొత్తం ఏటీఎంలలో కనీసం 60% ఏటీఎంలలో దీన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించింది. అయితే, దీనిపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయని, పరిశ్రమపై సుమారు రూ. 6,000 కోట్ల భారం పడుతుందంటున్నాయి. భారీ ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నందున ఈ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. మరోవైపు, నగదు రవాణా చేసే సంస్థలకు (సీఎల్సీ) సంబంధించి కూడా ఆర్బీఐ 2018 ఏప్రిల్ 6న మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. సీఎల్సీల వద్ద పటిష్టమైన, తేలికపాటి వాణిజ్య వాహనాలు కనీసం 300 అయినా ఉండాలని నిర్దేశించింది. దీన్నే పునరుద్ఘాటిస్తూ 2018 ఆగస్టు 8న కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు నిర్దేశించిన గడువు దాటిపోయి ఏడాది గడిచిపోయినా.. ఇంతవరకూ పూర్తిగా అమలు కావడం లేదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దేశంలో మొత్తం ఏటీఎంల సంఖ్య: 2,06,589 వీటిలో ఎస్బీఐ వాటా : 58,567 ఏటీఎం/డెబిట్ కార్డులు: 83,55,93,848 క్రెడిట్ కార్డులు: 5,25,89,719 ♦ గణాంకాలు 2019 సెప్టెంబర్ నాటికి -
పౌర ప్రకపంనలు : డ్రోన్లతో నిఘా
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో హింసాత్మక నిరసనలపై హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పౌర ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని సీలంపూర్, జఫ్రాబాద్, గోండా, నంద్నగరి ప్రాంతాల్లో మళ్లీ నిరసనలు తలెత్తవచ్చనే అంచనాతో హింస చోటుచేసుకోకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించింది. నిరసనకారలను నిశితంగా గమనించి తదునుగుణంగా చర్యలు తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులకు సూచించింది. నిరసనలను రికార్డు చేసేందుకు డ్రోన్లు, కెమెరాలను ఉపయోగించి హింసకు పాల్పడిన ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అవసరమైతే నిరసనకారుల ముసుగులో హింసకు పాల్పడే దుండగులను ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నేరచరిత కలిగిన వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు సైతం పరిశీలిస్తున్నాయి. దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఐబీ చీఫ్లతో భేటీ అయ్యారు. -
2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ షట్డౌన్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం న్యూఢిల్లీ/వాషింగ్టన్: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ► 2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ► 2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. ఏ ఏడాది ఎన్నిసార్లు 2017 79 2018 134 2019 90 2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. హోంశాఖకి అధికారాలు ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు భారత్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చారు.. ‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 15.06.2009న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? ‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి. ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... రమేశ్బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేశ్బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది. రమేశ్బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్ రమేశ్బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేటా.. చెల్లుబాటా? రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ సేవలన్నీ పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పుకార్లు ప్రచారం చేస్తున్న 8 నకిలీ ఖాతాలను తొలగించాలని ట్విటర్కు స్పష్టం చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. హోంశాఖ వెల్లడించిన జాబితాలో కశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీకే హురియత్’ నాయకుడు సయ్యద్ అలీ గిలానీ పేరుతో కూడా అకౌంట్ ఉండటం గమనార్హం. కేంద్రం తొలగించమన్న ఖాతాలు ఇవే.. 1. @kashmir787 -- వాయిస్ ఆఫ్ కశ్మీర్ 2. @Red4Kashmir -- మదిహాషకిల్ ఖాన్ 3. @arsched -- అర్షద్ షరీఫ్ 4. @mscully94 -- మేరీ స్కల్లీ 5. @sageelaniii -- సయ్యద్ అలీ గిలానీ 6. @sadaf2k19 7. @RiazKha61370907 8. RiazKha723 -
‘ఆ చట్టానికి నూకలు చెల్లలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటిష్ హయాం నాటి దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం తెలిపింది. దేశద్రోహ నేరానికి సంబంధించి ఐపీసీలో పొందుపరిచిన నిబంధనను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విద్వేషపూరితంగా వ్యవహరించే వారిపై ప్రయోగించే పురాతన దేశ ద్రోహ చట్టాన్ని తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించడం లేదని మంత్రి పెద్దల సభలో పేర్కొన్నారు. కాగా, దేశద్రోహ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోందని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే వారిని వేధించేందుకు వాడుతుందని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
నాలుగు నెలల్లో 61 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు నెలల్లో జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో మొత్తం 61 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు భారత హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారితో పాటు 11 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్కు చెందిన రోహిత్ చౌదరీ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ సులేఖ ఈ వివరాలను బహిర్గతం చేశారు. గత నాలుగు నెలల్లో జరిగన అనేక దాడుల్లో 142 మంది గాయపడగా.. వీరిలో 73 మంది భద్రతా సిబ్బంది, 63 మంది పౌరులు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆరంభం నుంచి 177 ఉగ్రవాద ఘటనలు జరిగాయని ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 86 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ తెలిపారు. అందులో 20 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాక్ సరిహద్దుల్లో 16 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోందని.. వాటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని వెల్లడించారు. -
పౌరసత్వం అంశం.. రాహుల్కి కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ పౌరసత్వంపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం రాహుల్కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వాస్తవాలేంటో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్ను ఆదేశించింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటీసులపై రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసని.. ఆయన ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగిరాని ప్రియాంక స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి నోటీసులు పంపుతున్నారని ప్రియాంక మండిపడ్డారు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన 2015లోనే స్పీకర్ సుమిత్రామహాజన్కు అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగడంతో తాను భారతీయుడినేనని రాహుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. -
కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది. కొత్త ట్రిబ్యునల్ లేదు.. జాతీయ హోదా రాలేదు... కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. -
బోర్డర్ పరిస్థితిపై హోంశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమీక్షించింది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించారు. పాకిస్తాన్ యుద్ధవిమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకురాగా, భారత దళాలు నౌషెరాలో పాక్ ఎఫ్ 16 జెట్ను కూల్చివేశాయి. భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధవిమానాలను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. భారత్ ప్రతిఘటనతో పాక్ యుద్ధవిమానాలు వెనుతిరిగాయి. మరోవైపు పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్లోని పలు ఎయిర్బేస్ల నుంచి భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. -
‘వర్మా.. ఈ ఒక్కరోజు పనిచేయండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ తీరుతో పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్కరోజు పనిచేయాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. కాగా,సీబీఐ చీఫ్గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్ధానాను వేరే శాఖకు బదలాయించింది. -
అలోక్ వర్మ ఇంటిపై ఇంటెలిజెన్స్ నిఘా
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు. ‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు. భయాందోళనలో ప్రధాని: రాహుల్ ఫ్రాన్స్తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్మన్గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీబీఐ జగడంపై విచారణ నేడే సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. రాజకీయంగా కూడా కీలకం.. సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది. అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్ అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు. -
ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సాధ్యమేనా?
న్యూఢిల్లీ: ప్రజలు పోలీస్స్టేషన్కు రాకుండా తమ ఇళ్ల నుంచే కంప్యూటర్ల ద్వారా ఈ–ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చా? అని లా కమిషన్ను కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. తమకు అందిన సమాచారం కేసు పెట్టదగినదే అయితే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ–ఎఫ్ఐఆర్పై అభిప్రాయాన్ని చెప్పాలని లా కమిషన్ను హోంశాఖ కోరింది. ప్రజలు పోలీస్స్టేషన్కు రాకుండా ఇంటి నుంచి ఫిర్యాదు చేయాలంటే సీఆర్పీసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని కమిషన్ సూచించింది. ఈ విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు పోలీస్స్టేషన్కు వెళ్లాల్సిన బాధ తప్పుతుందని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు తప్పుడు అభియోగాలు చేసేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు దుర్వినియోగం చేసే అవకాశముందని హెచ్చరించింది. -
‘ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు’పై సానుకూలత
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదుకు సంబంధించి కీలక ముందడుగు పడనుంది. ఘటనపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అంశంపై కేంద్ర హోం శాఖ.. లా కమిషన్ సలహా కోరింది. దీనిపై స్పందించిన లా కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని తెలిపింది. అయితే, ఆన్లైన్ విధానంలో ఫిర్యాదు స్వీకరణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా ఇతరుల పరువుకు భంగం కలిగించేందుకు ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేసే వీలుందని పేర్కొంది. ఆన్లైన్లో ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామని తెలిపింది. ఒకవేళ ఈ-ఎఫ్ఐఆర్కు అనుమతిస్తే దాని అమలుకు సంబంధించి ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ జరగాలని న్యాయశాఖ మాజీ సెక్రటరీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, 2013లో లలితా కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీం కోర్టు.. సీఆర్పీసీలోని సెక్షన్ 154 ప్రకారం తీవ్రమైన, ప్రాథమిక విచారణ అవసరంలేని నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని పేర్కొంది. సీఆర్పీసీలోని సెక్షన్ 154 కు సవరణలు చేస్తే ఈ-ఎఫ్ఐఆర్కు మార్గం సుగమం అవుతుందని గత జనవరిలో జరిగిన సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఈ సమావేశ సూచనల ప్రాతిపదికగా హోంశాఖ.. లా కమిషన్ సలహా కోరింది. ‘బాధితులు నేరుగా వెళ్లి పోలీసులని ఆశ్రయించి ఘటన గురించి వివరించడం కష్టమైన పనే. ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం చాలా సులభం. కానీ, పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తులు లేదా బాధితులు మాతో అబద్ధం చెప్పడానికి సంశయిస్తారు. నేరుగా ఫిర్యాదు స్వీకరించడం వల్ల ఫిర్యాదుదారుడి వైఖరి తెలుసుకునే వీలుంటుంద’ని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఉపయోగకరమే.. కానీ..! హోంశాఖ అభిప్రాయాలను మానవ హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ స్వాగతించారు. ఎంతోమందికి ‘ఆన్లైన్లో ఫిర్యాదు’ విధానం మేలు చేకూరుస్తుందని అన్నారు. అయితే, బాధితుల దగ్గరనుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకున్న అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు కావాలని ఆలస్యం చేయొచ్చని వ్యాఖ్యానించారు. పేదప్రజలకు ఆన్లైన్ సేవలు పొందడం ఇబ్బందిగా మారొచ్చని అన్నారు. -
ఆ టైమ్ దాటితే ఏటీఎంల్లో నగదు నింపరు..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో నగదు కోసం జనం పాట్లు మరువకముందే ఏటీఎంల్లో క్యాష్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కోవడం రొటీన్గా మారింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఆరు దాటితే ఏటీఎంల్లో నగదు నింపరని, పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత ఏటీఎంలో నగదును నింపరని హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటీఎంల్లో నగదును నింపే ప్రైవేట్ ఏజెన్సీలు ఆయా బ్యాంక్ల నుంచి ఉదయాన్నే నగదును సేకరించి సాయుధ వాహనాల్లో వాటిని తరలించి సాయంత్రం ఆరు లోగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల్లో నింపాలని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల్లోపే ఈ తతంగం పూర్తిచేయాలని హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. నగదు వ్యాన్లపై దాడులు, ఏటీఎంల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న క్రమంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 8 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రతి క్యాష్ వ్యాన్కు డ్రైవర్తో పాటు ఇద్దరు సాయుధ సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఏటీఏం అధికారులు లేదా కస్టోడియన్స్ నగదు నింపే ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏటీఎం అధికారులను నేపథ్య పరిశీలన అనంతరమే నియమించుకోవాలని హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. నగదు రవాణాకు భద్రతాధికారిగా మాజీ సైనికోద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. క్యాష్ వ్యాన్లో ఐదు రోజుల రికార్డింగ్ సదుపాయంతో కూడిన చిన్న సీసీటీవీ వ్యవస్థను నెలకొల్పాలని పేర్కొంది. క్యాబిన్ లోపల, బయట మూడు కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. -
ఇక అన్ని రాష్ట్రాలకూ ఆ జాబితా..
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో చేపట్టిన జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) పెను వివాదం రేపగా తాజాగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్సీ నిర్వహించేందుకు హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపడతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం మాధుర్ పేర్కొనడం గమనార్హం. అందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు దేశం ధర్మశాల కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఎన్ఆర్సీని కేవలం అసోంకు పరిమితం చేయరాదని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తోంది. కాగా, అసోం ఎన్ఆర్సీ ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజలకు చోటు దక్కకపోవడంతో ఈ జాబితాపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. మరోవైపు అక్రమ విదేశీయులుగా ప్రకటించిన వారికి బయోమెట్రిక్ వర్క్ పర్మిట్ జారీ చేయాలని హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. అక్రమ విదేశీయులకు ఎలా చెక్ పెడతారని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండటంతో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను హోమంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. వీరిని ఆయా రాష్ట్రాల్లో స్ధిరాస్తులు కొనుగోలు చేకుండా నిలువరించే చర్యలు చేపట్టవచ్చని సమాచారం. -
చనిపోయిన వాళ్లను తేలేం కదా!
లక్నో : ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ఉత్తర ప్రదేశ్లో 50 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం నుంచి హడావుడిగా సొంత రాష్ట్రానికి వచ్చారు. అయితే బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘తుఫాను ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. మీకు సానుభూతిని తెలియజేయడానికి వచ్చాను. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించాల్సిందిగా అధికారులు, మంత్రులను ఆదేశించాను. కానీ, చనిపోయిన వాళ్లను మాత్రం తిరిగి తీసుకురాలేం కదా!’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధిత కుటుంబాలకు యోగి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రజల సంక్షేమం పట్ల తన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని యోగి చెబుతున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపింది. 8 వేల మందిని కాపాడాం.. తుఫాను బారి నుంచి 8 వేల మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా స్తంభించి పోయిందని.. త్వరలోనే లైన్లను పునరుద్ధరిస్తామని వారు చెప్పారు. కాగా ఉత్తర భారతదేశంలో ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సానికి 124 మంది మరణించగా సుమారు 300 మంది గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. తుఫాను కారణంగా ఐదు రాష్ట్రాల్లో నష్టం వాటిల్లిందని కేంద్రం పేర్కొంది. -
డజను ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు శుక్రవారం హ్యాకింగ్కు గురయ్యాయి. సైబర్దాడికి గురైన ఈ వెబ్సైట్లలో చైనీస్ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్సైట్లపై కూడా సైబర్దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రక్షణ శాఖ వెబ్సైట్ను పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లపై ఎలాంటి సైబర్దాడి జరగలేదని జాతీయ సైబర్ భద్రత (ఎన్సీఎస్) సమన్వయకర్త గుల్షన్ రాయ్ అన్నారు. నెట్వర్కింగ్ వ్యవస్థలో హార్డ్వేర్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. -
వారంతా ఐసీస్లో శిక్షణ పొందుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రకార్యకలపాలను ప్రోత్సహించేందుకు సిక్కు యువత పాకిస్తాన్లో ఐసీస్ సౌకర్యాలతో శిక్షణ పొందుతున్నట్టు కేంద్రహోం మంత్రిత్వశాఖ సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషితో కూడిన పార్లమెంటరీ కమిటీకి ఓ నివేదికను సమర్పించింది. కెనడా, ఇతర దేశాల్లో నివసిస్తున్న సిక్కు మతానికి చెందిన యువతకు భారత్ పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, హానికర సంఘటనలకు ప్రేరణపొందేలా చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా దుర్వినియోగంతో యవత అత్యధికంగా త్రీవవాద గ్రూపులకు దగ్గరవుతుందన్నారు. సిక్కు మిలిటెంట్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఐసీస్ కనుసన్నల్లో శిక్షణ పొందుతున్న కమాండర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత్లో ఉగ్ర కార్యకలపాలకు ప్రయత్నిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. నిరుద్యోగులు, స్మగ్లర్లు, జైల్లో ఉన్న సిక్కు నేరస్తులను చేరదీసి పాకిస్తాన్లో ఐసిస్ సౌకర్యాలతో శిక్షణ ఇస్తున్నట్టు హోం మంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. దేశంలో గత కొద్ది రోజులుగా వామపక్ష తీవ్రవాదం పెరిగిపోతుందని, దీనివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పుందని తెలిపంది. 2004లో ఏర్పడిన సీపీఐ మావోయిస్ట్ అత్యంత శక్తి వంతమైన వామపక్ష తీవ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మాద్, ఇండియన్ ముజాహిద్దీన్, సిమీ లాంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై భద్రతాధళాలు దృష్టిసారించాయి. -
సైబర్ నేరాలపై రాష్ట్రాలకు హోంశాఖ దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరాలని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు రోజురోజుకి తమ పరిధిని పెంచుకుంటుడడంతో సైబర్ నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ వైబ్సైట్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించడం వల్ల దేశ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర హోంశాఖ నివారణ చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించింది. నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేసింది. వీటికి అనుగుణంగా రాష్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయో హోంశాఖకు తెలియజేయాలని పేర్కొంది. హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు: 1. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైబర్ నేర నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి సీనియర్ ఐజీ ర్యాంకు అధికారిని కో ఆర్డినేటర్గా నియమించాలి. జిల్లా పోలీస్ స్టేషన్ల స్థాయిలో సైబర్ నేరాలను విచారించడానికి తగిన సౌకర్యాలను కల్పించేలా ఈ విభాగం బాధ్యత తీసుకోవాలి. కేసు తీవ్రతను బట్టి సమాచారమార్పిడి జరిగేట్టు చూడాలి. వివిధ క్యాటగిరీ కలిగిన పోలీసు అధికారులతోపాటు, సైబర్ సెక్యూరిటీ నిపుణులను కూడా నియమించుకోవాలి. జిల్లాలో డీఎస్పీని గానీ, అడిషనల్ ఎస్పీని గానీ కో ఆర్డినేటర్గా నియమించాలి. జిల్లా సైబర్ సెల్ ఆ జిల్లా ఎస్పీతో పాటు, రాష్ట్ర సైబర్ సెల్కి రిపోర్ట్ చేయాలి. 2. ప్రపంచంలో ఎక్కడినుంచైనా సైబర్దాడులు జరిగే అవకాశం ఉన్నందున్న అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలి. పక్క రాష్ట్రాల్లో జరిగే నేరాలను పరిష్కరించేందుకు ఉమ్మడి బృందాలు ఏర్పాటు చేయడం, విదేశాలతో సంబంధం ఉండే నేరాల కోసం సీబీఐతో సంప్రదింపులు జరపాలి. 3. హోంశాఖ విడుదల చేసిన 82.8 కోట్ల రూపాయలతో రాష్ట్ర సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలి. సైబర్ సెల్లో పనిచేసే అధికారులకు తగిన శిక్షణ ఇవ్వాలి. వీటి ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరాలు జరిగితే త్వరితగతిన పరిష్కరించేందుకు సాధ్యపడుతుంది. అవసమైతే జిల్లా స్థాయిలో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. 4. సైబర్ సెల్లో పనిచేసే పోలీసులతో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి, జడ్జీలకు సైబర్ నేరాల జరిగే తీరుపై అవగాహన పెంపొందించాలి. బాధితులకు కూడా భరోసా కల్పించడం. కేసులను విచారించడానికి తగినంత సిబ్బందిని నియమించుకోవడం. అధికారుల కూడా నేరాలను పరిష్కరించడానికి గల సులువైన మార్గాల కోసం అన్లైన్లో ఉన్న వివిధ కోర్సులు నేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. 5. ఇప్పటికే వివిధ నేర నియంత్రణ విభాగాలు సైబర్ నేర నియంత్రణకై కృషి చేస్తున్నాయి. సైబర్ సెల్స్ ద్వారా మరింత లోతుగా దృష్టి సారించాలి. సోషల్ మీడియా, ఫెక్ అకౌంట్లపై నిరంతర నిఘా ఉంచాలి. అనుమనాస్పదంగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ, బ్లాక్మెలింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ను ఆరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. 6. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరాలు నమోదు చేయడానికి cyberpolice.gov.in పేరుతో వెబ్సైట్ని సిద్ధం చేయనుంది. బాధితులు ఎవరైనా ఈ సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా పోలీసు అధికారులు వెబ్సైట్లో లాగిన్ అవ్వొచ్చు. 7. అవగాహన లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నందు వల్ల కింది స్థాయి వరకు సైబర్ నేరాలపై కనీస పరిజ్ఞానాన్ని కల్పించాలి. యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఎటీఎం, కెడ్రిట్ కార్డుల పిన్, వన్ టైం పాస్వర్డ్ వివరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తరచూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారం చేయాలి. -
ఎన్జీవోలకు హోం శాఖ షోకాజ్
ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 5,922 ఎన్జీవోలకు కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు, విరాళాలు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదు చేయించుకోవాలి. అనంతరం రిటర్నులను ప్రతి ఏడాదీ సమర్పించాలి. 18,523 స్వచ్ఛంద సంస్థలు 2010–11 నుంచి 2014–15 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదు. ప్రభుత్వం ఆయా సంస్థలకు జూలై 8న షోకాజ్ నోటీసులిస్తూ, రిజిస్ట్రేషన్ను ఎందు కు రద్దు చేయకూడదో జూలై 23లోపు చెప్పాలంది. లేకపోతే రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో నెహ్రూ స్మారక మ్యూజియం–గ్రంథాలయం, ఇందిరా గాంధీ కళాక్షేత్రం, ఇగ్నో, ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీరామకృష్ణ సేవాశ్రమం వంటివి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణ భారత్ ట్రస్టు, సుజనా చారిటబుల్ ట్రస్టు, శ్రీ సత్యసాయి మెడికల్ ట్రస్టు వంటి పేరున్న స్వచ్ఛంద సంస్థలకూ నోటీసులు వెళ్లాయి. -
సర్వీస్ రూల్స్ అమలును వేగవంతం చేయండి
కేంద్ర హోం శాఖను కోరిన ఎస్టీయూ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ వెంటనే సర్వీసు రూల్స్ అమలుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఇరు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు కోరారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు షణ్ముర్తి, భుజంగరావు, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్ సుధీర్బాబు, సదానందగౌడ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్కుమార్తో సమావేశమై వినతిపత్రాన్ని సమర్పించారు. సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే హోం శాఖ నుంచి ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపేదుకు చర్యలు తీసుకుంటామని దిలీప్ కుమార్ హామీ ఇచ్చినట్టు కత్తి నరసింహారెడ్డి తెలిపారు. సీఐడీ ఐజీగా షికా గోయల్ కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవల రిలీవై రాష్ట్ర పోలీసుశాఖలో రిపోర్టు చేసిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి షికా గోయల్ను సీఐడీ ఐజీగా అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్శర్మ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలోని జనరల్ అఫెన్స్ వింగ్, ఎకానామిక్ అఫెన్స్ వింగ్ బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు విభాగాల్లో పదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులపై ఆమె సోమవారం సమీక్షించారు. -
అన్ని విషయాల్లో ‘ఏకీకృత’ స్ఫూర్తిని చాటండి
తెలుగు రాష్ట్రాలకు కేంద్రమంత్రి వెంకయ్య పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధ నల అమలు విషయంలో తెలుగు రాష్ట్రాలు చూపిన చొరవ అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారంలోనూ చూపాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపి కేంద్ర హోంశాఖకు పంపగా..రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు బుధవారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిం చిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు గురువారం పైవిధంగా స్పందించారు. ‘‘రాష్ట్ర విభజన చారిత్రక సత్యం. గతం గురించి ఆలోచించి బాధపడకూడదు. కలిసుండి కలహించుకోవడం కంటే.. విడిపోయి సహకరిం చుకోవడం మిన్న. రెండు రాష్ట్రాలమధ్య ఆస్తులు, ఉద్యోగుల పంపిణీలో మూడే ళ్లుగా జాప్యం జరుగుతోంది. వివిధ అంశాలపై ఇరు రాష్ట్రాలమధ్య భిన్నాభి ప్రాయాలుండడమే ఇందుకు కారణం. కలసి కూర్చొని చర్చించుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. 9, 10వ షెడ్యూల్లోని ఆస్తుల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమస్యలను చర్చించుకుంటే పరిష్కారమవు తాయి’’ అని పేర్కొన్నారు. కాగా, సర్వీస్ రూల్స్ అమలు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంపై వెంకయ్యనాయుడుకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
కేజ్రీవాల్కు మరో షాక్.. విదేశీ విరాళాలపై ఆరా
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కష్టాలు వీడటం లేదు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కుమార్ విశ్వాస్ ఎన్నాళ్లు పార్టీలో ఉంటారో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఆ పార్టీకి వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ విరాళాల విషయమై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఆ పార్టీ ఉల్లంఘించిందన్న అనుమానంతోనే ఈ ప్రశ్నలు తలెత్తినట్లు తెలిసింది. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు వెళ్లాయి. అయితే... ఈ నోటీసులు సర్వసాధారణంగా వెళ్లేవేనని, అన్ని పార్టీలనూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలనూ వాళ్లకు వస్తున్న విరాళాల గురించిన వివరాలు అడుగుతుంటామని, అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వెళ్లాయని తెలిపారు. అయితే.. తమ వద్ద దాచడానికి ఏమీ లేదని, అధికారులకు తాము అన్నివిధాలా సహకరిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. పార్టీ స్థాపించే సమయంలో తమవద్ద డబ్బులు లేనందున విరాళాలు ఇవ్వాలని ఆప్ విజ్ఞప్తి చేయడంతో.. చాలామంది దాతలు ముఖ్యంగా విదేశాల నుంచి కూడా భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. 2013 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆప్ విరాళాలపై విచారణ జరిపింది గానీ అప్పట్లో అక్రమాలు ఏవీ బయటపడలేదు. -
ఆయుధాలు డిపాజిట్ చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హోంశాఖ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈనెల 9వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లైసెన్స్ ఉన్న ఆయుధాలు కలెక్టర్, ఎస్పీ కార్యాలయం . లేదంటే సంబంధిత పోలీస్స్టేషన్, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డులు సైతం తుపాకులు సరెండర్ చేయాలని ఉత్తర్వుల్లో రాజీవ్త్రివేదీ స్పష్టంచేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు వెంట ఉండకూడదని పేర్కొన్నారు. -
పోలీస్ అకాడమీ డైరెక్టర్గా డోలే బర్మన్
⇒ మళ్లీ మహిళా అధికారినే నియమించిన కేంద్రం ⇒ నేడు బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ కొత్త డైరెక్టర్గా మళ్లీ మహిళా అధికారినే నియమిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అరుణాబహుగుణ మంగళవారం పదవీ విరమణ పొందటంతో.. ఆ స్థానంలో 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి డీఆర్ డోలేబర్మన్ను నియమించింది. ప్రస్తుతం మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీసు అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్న బర్మన్.. బుధవారం ఎన్పీఏ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నో అవార్డులు... రివార్డులు... షిల్లాంగ్లో పుట్టిన డోలే బర్మన్ ఢిల్లీ యూనివర్సిటీలో లేడీ శ్రీరామ్ కాలేజ్లో ఇంగ్లిష్ ఆనర్స్ చేశారు. అదే కాలేజీ నుంచి పీజీ పూర్తిచేసిన బర్మన్ 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్గా ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్లో ఎస్డీపీవోగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత కశ్మీర్లో ట్రాఫిక్ ఎస్పీగా, అస్సాంలో ట్రైనింగ్ అండ్ ఆర్మ్డ్ పోలీసు ఏఐజీగా, ఎస్పీ (సెక్యూరిటీ)గా, జమ్మూకశ్మీర్లో ట్రాఫిక్ డీఐజీగా, ఢిల్లీ సీబీఐలో అవినీతి నిరోధక విభాగానికి డీఐజీగా, గౌహతి ఎస్ఎస్బీ ఐజీగా, జమ్మూకశ్మీర్ సీఐడీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా పనిచేశారు. ఆమె సేవలకు జమ్మూకశ్మీర్ డీజీపీ అవార్డులు, 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారం ముందుగానే గుర్తించినందుకు ఎస్ఎస్బీ డీజీపీ అవార్డు, షేర్–ఈ–కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్ను అందుకున్నారు. -
ఏకే–47తో ఎస్పీ భార్య కాల్పులా?
ఎస్పీ రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా భార్యకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిపించిన కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది. రవికృష్ణపై ఆలిండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి పంపిన లేఖ ఆధారంగా అతనిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా రవికృష్ణపై చర్యల నిమిత్తం న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి ఇచ్చిన వినతిపత్రంపై కూడా ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు(అర్బన్) ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో రవికృష్ణ, ఆయన భార్య పార్వతీదేవితో కలసి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్కు వెళ్లి ఆమెకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి, కాల్పులు జరిపించారని, ఇది ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రవికృష్ణపై ఆయుధాల చట్టం కింద తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. -
జవాన్ల నాసిరకం తిండిపై స్పందించండి
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: దేశ సరిహద్దులోని సైనికులకు నాసిరకం ఆహారం వడ్డించడంపై స్పందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను చీఫ్ జస్టిస్ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్లతో కూడి ధర్మాసనం విచారించింది. సైనికులకు నాసిరకం వడ్డిస్తున్నట్లుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్ తేజ్బహదూర్ యాదవ్ ఈ నెల 9న ఫేస్బుక్లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా బీఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు(ఐటీబీపీ), సశాస్త్రసీమ బల్(ఎస్ఎస్బీ), అస్సాం రైఫిల్స్కు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, పరిశోధన నివేదకను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అధికారుల్లో అవినీతి పేరుకుపోయిందని, అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయని వీడియో అప్లోడ్ చేసిన యాదవ్పై చర్యలు తీసుకునే అంశంలో తాము జోక్యం చేసుకోబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఈ అంశంపై, అభిషేక్ కుమార్ ఛౌదరి అనే న్యాయవాది కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నాసిరకం ఆహారం అంశం సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేయకుండా చూడాలని, సైనికులకు అందిస్తున్న ఆహారం, ఆహారం తయారీ, వివిధ స్థాయిల్లోని అధికారులకు అందిస్తున్న ఆహారంపై స్పష్టతనివ్వాలని పిల్లో కోరారు. -
అభివృద్ధిపై దృష్టి పెట్టండి
► మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోంశాఖ! ►నాయకులకు భద్రత పెంచాలని ఆదేశం ►మావోయిస్టు పార్టీ మార్చిన నగదుపై చర్చ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాల డీజీపీలకు సూచించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక భేటీ జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల నుంచి డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ఏటా ఎంఓపీఎఫ్(మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)ఎల్డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజమ్)కు సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేవారు. కానీ గతేడాది ప్రణాళిక బడ్జెట్లో నిధుల కోత విధించారు. దీంతో మావోయిస్టు ప్రాబల్య ప్రాంత రాష్ట్రాలు తమకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల ని కేంద్ర హోంశాఖను కోరాయి. ఈ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్లో నాన్ ప్లాన్ (ప్రణాళికేతర)బడ్జెట్ కింద నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం మార్పిడి చేసుకోవాలి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ప్రస్తుతం మావోయిస్టుల పరిస్థితి, ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లపై బుధవారం సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. మల్కన్ గిరిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండడంతో ఆ దిశలో కేంద్ర కమిటీ వ్యూహాలపై అన్ని రాష్ట్రాలు నిఘావర్గాల సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని హోంశాఖ సూచించినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి వ్యవహారంపై కూడా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. బీడీ కాంట్రాక్టర్ల ద్వారా మావోయిస్టు పార్టీ నగదు మార్పిడి చేసిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పర్య టించే రాజకీయ నాయకులకు బందోబస్తు పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. -
అభివృద్ధిలో అగ్రగామి: రాజీవ్శర్మ
- సీఎం మార్గదర్శనంతో రాష్ట్రం దూసుకుపోతోంది - విద్య, వైద్య, సాగు రంగాలపై దృష్టి సారిస్తే మనమే నంబర్ వన్ - కేంద్రం సహకారం బాగానే ఉంది.. - విభజన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి - నేడు పదవీ విరమణ చేయనున్న సీఎస్ సాక్షి, హైదరాబాద్: సవాళ్లను అధిగమిస్తూ నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై పూర్తి స్థారుులో దృష్టి సారిస్తే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం బాగానే ఉందని.. ఏపీతో ఉన్న విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మ మీడియాతో తన మనోగతాన్ని పంచుకున్నారు. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదవిలో ఉన్న ఆయన.. ఆర్నెళ్ల పదవీ కాల పొడిగింపుతో ఇప్పటిదాకా సీఎస్గా కొనసాగారు. ఈ నేపథ్యంలో విభజన అంశాలు మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి వరకు పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా.. కేంద్ర హోంశాఖలో నోడల్ అధికారిగా.. శ్రీకృష్ణ కమిటీకి, విభజన బిల్లు తయారీ సమయంలో మంత్రుల బృందానికి తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను వివరించానని సీఎస్ చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి అంశంపై విసృ్తత చర్చ జరిగిందని, హెచ్ఎండీఏ పరిధిని ఖరారు చేస్తే 42 శాతం రాష్ట్రం రాజధాని అవుతుందని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తనకు అత్యంత సంతృప్తి ఇచ్చిన అంశమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్ సంక్షోభం, ఉద్యోగులు, అధికారుల విభజన, విభజన చట్టానికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకెళ్లామని వివరించారు. సమగ్ర కుటుంబ సర్వేను అతి పెద్ద సవాల్గా తీసుకొని విజయవంతం చేశామన్నారు. జిల్లాల ఏర్పాట్లు గొప్ప పాలనా సంస్కరణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు గొప్ప పరిపాలనా సంస్కరణ అని, ఇది అధికార వికేంద్రీకరణకు పూర్తి స్థారుులో దోహదపడుతుందని రాజీవ్ శర్మ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి ఆసరా ఫించన్ల మొత్తాన్ని పెంచామన్నారు. రైతు రుణమాఫీ వచ్చే ఏడాదితో పూర్తవుతుందని తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో 13వ స్థానం నుంచి రాష్ట్రం మొదటి స్థానానికి రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సాగునీరు, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారిస్తే నాలుగైదేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్లో మరింత ముందుకు.. భవిష్యత్లో రాష్ట్రం మరింతగా ముందుకెళ్తుందని సీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. సుపరిపాలన, మౌలిక వసతులు, పారదర్శక పాలన వల్ల అత్యుత్తమ రాష్ట్రంగా నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉందని, అందుకే నగదు రహిత లావాదేవీల కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
కేంద్ర హోంశాఖ అత్యున్నతస్ధాయి సమావేశం
-
‘పదో షెడ్యూల్’పై మీరే చర్యలు తీసుకోండి!
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి నగదు పంపిణీతో పాటు పదో షెడ్యూల్ సంస్థల్లోని ఆస్తులు, అప్పులు పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి ఒప్పందానికి రాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం తీర్పు మేరకు రెండు నెలల్లో ఇరు రాష్ట్రాలు సమావేశమై ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది. అయితే గత నెల 18న ఏపీ, తెలంగాణ అధికారులు సమావేశమైనప్పటికీ ఒప్పందం కుదరలేదని, ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకుని పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇలా ఉండగా సుప్రీం తీర్పు ఉన్నత విద్యా మండలికి చెందిన నిధుల పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని, మిగతా సంస్థలకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే పదో షెడ్యూల్ సంస్థల పంచాయతీ తిరిగి మళ్లీ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లింది. -
ఉగ్రదాడా..? ఉలికిపాటా?
బారాముల్లా కాల్పుల ఘటనపై గందరగోళం * ఇద్దరు ఉగ్రవాదుల మరణం నిర్ధారణ కాలేదన్న హోం శాఖ * జవాన్ ఎలా చనిపోయాడన్న దానిపై సందిగ్ధం * ఎల్వోసీ వెంట ఉద్రిక్తతల తగ్గింపుపై ఎన్ఎస్ఏల చర్చలు శ్రీనగర్: ఆదివారం రాత్రి 10.30 గంటలు... కశ్మీర్లోని బారాముల్లా పట్టణం బీఎస్ఎఫ్ ఆర్మీ శిబిరంపై తెగబడ్డ ఉగ్రవాదులు.. జవాన్ల ఎదురు కాల్పులు.. ఉగ్రవాదుల హతం.. ఒక బీఎస్ఎఫ్ జవాను అమరుడయ్యాడంటూ కథనాలు...తెల్లారేసరికి సీన్ రివర్స్... ఉగ్రవాదులెవరూ మరణించలేద ని ప్రకటనలు..! హోం శాఖ మాత్రం ఉగ్రవాదులు హతమయ్యారంటూ ఒకసారి, ఇంకా నిర్ధారణ కాలేదంటూ మరోసారి ప్రకటించి గందరగోళాన్ని మరింత పెంచింది. ఇక ఆర్మీ, బీఎస్ఎఫ్లు మాత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకుపారిపోయారంటూ పేర్కొన్నాయి. జన్బాజ్పురా వద్ద 40వ బెటాలియన్ సెంట్రీ... వంట ప్రాంతంలో అనుమానాస్పద కదలికల్ని గుర్తించి కాల్పులు జరిపాడు. ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్లోకి ప్రవేశించారా? లేదా బయటి నుంచి కాల్పులు జరుపుతున్నారా? అన్నది తెలియక జవాన్లు నలువైపుల నుంచి కాల్పులు కొనసాగించారు. 90 నిమిషాల తర్వాత భారీ వెలుతురులో వెదికితే ఉగ్రవాదుల ఆనవాళ్లు కనిపించలేదు. ఉగ్రవాదుల కాల్పులు నిజం: ఆర్మీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకు పారిపోయారన్నది ఆర్మీ అధికారుల వాదన. కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ నితిన్, పుల్విందర్లు గాయపడగా వారిని శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నితిన్ చికిత్స పొందుతూ మరణించాడు. బీఎస్ఎఫ్ జవాను ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడా? లేదా... సైన్యం కాల్పుల్లో పొరపాటున గాయపడి మరణించాడా?(ఫ్రెండ్లీ ఫైరింగ్) అన్నది ఇంకా తేలలేదు. ఆదివారం అర్ధరాత్రి ఉధమ్పూర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కమాండ్ పరిధిలోని బారాముల్లాలో కాల్పులు జరిగాయని ఆర్మీ ట్వీట్ చేసింది. దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని సోమవారం ఉదయం పేర్కొన్న హోంశాఖ అనంతరం ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పింది. జీపీఎస్ పరికరం, మందుగుండు స్వాధీనం బీఎస్ఎఫ్ ఐజీ (కశ్మీర్ ) వికాస్ చంద్ర మాట్లాడుతూ... దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నారని, జీపీఎస్ పరికరం, కంపాస్, వైర్ కట్టర్తో పాటు మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. సోమవారం ఉదయం జీలం నది పరీవాహక ప్రాంతంలో గాలింపు నిర్వహించామన్నారు. నితిన్పైకి ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడన్నారు. ఉగ్రవాద గ్రూపుల ప్రయత్నాల్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం లేహ్లో అన్నారు. పాక్ కవ్వింపు కాల్పులు పాక్ దళాలు సోమవారం నాలుగుసార్లు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దు వెంట ఉన్న భారత సైనిక శిబిరాలు, జనావాసాలపై కాల్పులకు తెగబడ్డాయి.ఐదుగురు పౌరులు గాయపడగా, అనేక దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పాక్ దాడుల్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పూంచ్ జిల్లాలోని షాహ్పూర్, కృష్ణగాటి, మండీ, సబ్జీయన్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. జాతీయ భద్రతా సలహాదారుల చర్చలు ఉద్రిక్తత తగ్గించాలని భారత్, పాక్ అంగీకారానికి వచ్చాయని, ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఫోన్లో మాట్లాడుకున్నారని పాక్ దౌత్యవేత్త సర్తాజ్ అజీజ్ చెప్పారు. భారత భద్రతా సలహాదారు దోవల్, పాక్ సలహాదారు జన్జువాలు చర్చించారన్నారు. ఎల్వోసీలో ఉద్రిక్తత తగ్గాలనేది పాక్ కోరికని, కశ్మీర్పై దృష్టి పెట్టడమే తమ లక్ష్యమన్నారు. -
నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపండి
- అకాల వర్షాలతో తెలంగాణ తీవ్రంగా దెబ్బతింది - కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ను కోరిన దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న తెలంగాణను అందుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాజ్నాథ్ సింగ్తో సమావేశమై తెలంగాణలో వర్షాల వల్ల కలిగిన నష్టంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం రూ. 1,189 కోట్ల నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందాలను పంపి వర్షాల వల్ల కలిగిన నష్టాలపై అంచనా వేయాలన్నారు. ఈ బృందాన్ని వెంటనే పంపి హైదరాబాద్తోపాటు, తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని దత్తాత్రేయ కోరారు. అనంతరం సమావేశ వివరాలను దత్తాత్రేయ మీడియాకు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలతో పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాల వినియోగంపై చర్చించడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి త్వరలో హైదరాబాద్ వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపనున్నట్టు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్, భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు. -
కశ్మీర్లో అంగుళం జాగాను కూడా వదులుకోం
కేంద్ర మంత్రి గంగారాం అహిర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కశ్మీర్లో అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో జరిగిన తిరంగాయాత్రసభలో ఆయన ప్రసంగించారు. హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు కశ్మీర్లో అశాంతికి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో నిజాం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని అన్నా రు. మహబూబ్నగర్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలసి అహిర్ పాల్గొన్నారు. -
భారత పటం బిల్లు సమీక్షకు సిద్ధం: కేంద్రం
న్యూఢిల్లీ: భౌగోళిక ప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు-2016 నిబంధనలను సమీక్షించేందుకు సిద్ధమని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. బిల్లులో భారత పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి 7 ఏళ్ల జైలుశిక్ష, రూ. 100 కోట్ల జరిమానా ప్రతిపాదించారు. ముసాయిదాపై అభిప్రాయాల కోసం బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచారు. నెల రోజుల్లో వచ్చే సలహాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హోం శాఖ తెలిపింది. బిల్లు నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
పాకిస్తానీలకు భారత ఆధార్కార్డు
న్యూఢిల్లీ: భారత్లో నివసిస్తున్న పాకిస్తానీ హిందువులకు ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, పాన్కార్డుల జారీకి భారత ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. భారత్లో ఉండటానికి దీర్ఘకాల వీసా కలిగి, ఇక్కడే ఉంటున్న పాకిస్తానీ మైనారిటీలకు ఈ సదుపాయం వర్తిస్తుందని హోం శాఖ తెలిపింది. -
రాజీవ్ హంతకుల శిక్ష తగ్గింపు?
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులకు ఊరట కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కేంద్రం స్పందన తెలపాలంటూ.. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషికి లేఖ రాసింది. ఈ కేసులో వారు 20 ఏళ్లకుపైగా శిక్ష అనుభవిస్తున్నందున క్షమాభిక్ష పెట్టాలని ఆ లేఖలో కోరారు. -
అగ్నిమాపకశాఖలో 139 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అగ్నిమాపకశాఖలో 139 మంది హోంగార్డుల నియామకానికి హోంశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఫైర్ అవుట్ పోస్టుల్లో ఖాళీగా ఉన్న హోంగార్డుల పోస్టులను భర్తీ చేయాల్సిందిగా అగ్నిమాపకశాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ)కి సూచించారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న 117 మందిని హోంగార్డులుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కశ్మీర్లో గవర్నర్ పాలన
-
కశ్మీర్లో గవర్నర్ పాలన
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శనివారం రాత్రి గవర్నర్ పాలన విధించారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ ప్రతినిధి ఢిల్లీలో ప్రకటించారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కింద తనకు సంక్రమించిన అధికారం ప్రకారం గవర్నర్ .. రాష్ట్రపతి ఆమోదంతో గవర్నర్ పాలన విధించి ఉత్తర్వులు జారీ చేశారని, ఇది ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చిందని రాజ్భవన్ ప్రతినిధి తెలిపారు. సీఎం సయీద్ అనారోగ్యంతో కన్నుమూయడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సమయం పట్టనుండటంతో రాజ్యాంగ శూన్యతను నివారించేందుకు గవర్నర్ పాలన అనివార్యమైంది. తండ్రి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు పూర్తికాకుండానే కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విముఖత వ్యక్తం చేయడంతో గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు 28 మంది పీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలసి ఇప్పటికే మద్దతు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సయీద్ గురువారం మరణించడం తెలిసిందే. మరోవైపు ఆదివారంతో సంతాపం దినాలు ముగియనుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని పీడీపీ సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీ తెలిపింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు, షరతులు లేవని పీడీపీ, బీజేపీలు అంతకుముందు పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రంలో గవర్నర్ పాలన ఇంకా విధించనప్పుడు జమ్మూకశ్మీర్ను ఎవరు పాలిస్తున్నారో అర్థం కావట్లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. -
పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం
హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది తాండూరు: పోలీసు శాఖలో ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం, నియామకాలు పెద్దఎత్తున చేపట్టనున్నట్లు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. ఆదివారం ఆయన ఇద్దకు కుమారులతో కలసి సైకిల్పై హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా తాండూరుకు వచ్చారు. ఆయన 120కి.మీ. సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా తాండూరులో విలేకరులతో మాట్లాడారు. త్వరలో విడుదల కానున్న నోటికేషన్లో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ పోస్టుల వరకు నియామకాల్లో మూడేళ్లు వయోపరిమితికి మినహాయింపు ఉంటుం దన్నారు. పోలీసులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక బాధ్యతలు నిర్వర్తించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ట్రామాకేర్ సెంటర్ పనుల పరిశీలించారు. వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడి ఇక్కడి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
మిడ్డే మీల్స్పై తప్పుడు లెక్కలు
పథకం అమల్లోనూ అక్రమాలున్నాయి: కాగ్ ♦ రైల్వే శాఖ తీరుతో లక్షకోట్ల నష్టం.. ఆర్మీ హెలికాప్టర్లలో రక్షణ కరువు ♦ పార్లమెంటు ముందు 2014 వరకు ప్రభుత్వ తీరుపై కాగ్ నివేదిక న్యూఢిల్లీ: పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకం లెక్కలన్నీ తప్పుడు తడకగానే ఉన్నాయని.. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మండిపడింది. చాలామంది పిల్లలు మంచి చదువుకోసం ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నందున.. మధ్యాహ్న భోజన పథకంలో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ పథకం అమల్లోనూ పెద్ద సంఖ్యలో అక్రమాలున్నాయని 2014 మార్చి వరకు.. వివిధ ప్రభుత్వ శాఖల తీరుపై సమర్పించిన నివేదికలో తెలిపింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సమస్యలనూ ఇందులో పేర్కొంది. ఆర్మీకి ‘రక్షణ’ కరువు.. భారత రక్షణ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఆర్మీ వాడుతున్న ఛీతా/చేతక్ హెలికాప్టర్లలో 40 ఏళ్ల పైబడినవి 51, 78 హెలికాప్టర్లు 30-40 ఏళ్లవని కాగ్ నివేదించింది. ఎక్కువ కాలం వీటి ద్వారా సేవలు పొందటం కష్టమని తెలిపింది. జవాన్లకు నివాసాలపై.. సరిపడినన్ని క్వార్టర్లు లేని కారణంగా కేంద్రీయ సాయుధ దళాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లలో తీవ్రమైన అసంతృప్తి ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖనుంచి ఆదేశాలు వచ్చినా ఈ సాయుధ దళాల అధికారులు భూ సేకరణ, దీనికి పై అధికారుల ఆమోదం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించకపోవటం ఇందుకు కారణంగా తెలిపింది. రైల్వేల్లో భారీ నష్టం.. 400కు పైగా ప్రాజెక్టుల అమలులో ఆలస్యం కారణంగా రైల్వే శాఖలో రూ. 1.07 లక్షల కోట్లు అనవసరంగా ఖర్చవుతున్నాయని కాగ్ మండిపడింది. అంచనాల రూపకల్పన, నిధుల విడుదలలో జాప్యం, ప్రాముఖ్యాలను గుర్తించటంలో వైఫల్యం కారణంగానే ఇంత భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపింది. 2009-14 మధ్యలోనే 202 ప్రాజెక్టులు ఈ జాబితాలో చేరాయని స్పష్టం చేసింది. కోట్లు సముద్రం పాలు.. ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో 1993లో బిడ్లకు ఆహ్వానించిన రత్న, ఆర్-సిరీస్ ఆయిల్, గ్యాస్ క్షేత్రాలను ఎస్సార్ కంపెనీకి అప్పగించే విషయంలో ఎన్టీఎస్ (నెగోషియేటింగ్ టీమ్ ఆఫ్ సెక్రటరీస్) నిర్లక్ష్యం వల్ల 26 వేల కోట్ల రూపాయల విలువైన హైడ్రోకార్బన్ల ఉత్పత్తికి నష్టంతో రూ. 1,086 కోట్లతో ఏర్పాటు చేసిన వసతులు వినియోగం లేక పాడైపోయినట్లు తెలిపింది. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్కు పోలీసుశాఖ బహుమతి
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల సామాజిక సేవలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫోటోలు, షార్ట్ఫిల్మ్లలో ఉత్తమమైన వాటికి పోలీసుశాఖ బహుమతులను ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్ బజరంగ్ ప్రసాద్కు మూడో బహుమతి (రూ.25వేలు), కన్సోలేషన్ బహుమతులను ప్రకటించారు. ఈ పోటీకి రాష్ట్రవ్యాప్తంగా 563 ఫోటోలు, 103 షార్ట్ఫిల్మ్లు వచ్చాయి. జాతీయ పోలీస్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ ఉమేష్ ష్రాఫ్ అధ్యక్షతన 8 మంది సభ్యుల కమిటీ ఉత్తమ ఫొటోల్ని ఎంపిక చేసింది. ఇందులో మొదటి బహుమతి (రూ.లక్ష నగదు)ని వరంగల్ జిల్లాకు చెందిన వెంకన్న (నమస్తే తెలంగాణ)కు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన ఎస్.రవికుమార్కు రెండో బహుమతి (రూ.50 వేలు), మరో నలుగురికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. వీరికి ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బహుమతులను అందజేస్తారు. షార్ట్ఫిల్మ్ ఎంట్రీలను హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. వీటి ఎంపిక పూర్తికానందున పేర్లు వెల్లడి కాలేదు. -
సమాజ శాంతి కోసం ‘ర్యాపిడ్ యాక్షన్’
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి శామీర్పేట్: సమాజ శాంతి కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సేవలు అందించడం ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పి. చౌదరి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శామీర్పేట్ మండలం హఢకీంపేట్లోని ఆర్ఏఎఫ్ 99వ బెటాలియన్లో జరిగిన 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఆర్ఏఎఫ్ బెటాలియన్ శ్రమిస్తోందని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖలో పుష్కలంగా నిధులున్నాయని, దేశరక్షణకు ఎలాంటి లోటు లేదన్నారు. సాయుధ దళంలో పనిచేస్తున్న చిన్నస్థాయి జవాన్ల నుంచి ఉన్నతాధికారుల వరకు నేరుగా సంప్రదిస్తే సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. దేశసేవకు కృషిచేస్తున్న జవాన్లకు 25ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు దక్కలేదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించిందన్నారు. సుమారు 25 వేల మంది జవాన్లకు రిక్రూట్ చేశామని, త్వరలో మరో 5 బెటాలియన్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు కేంద్రం రాష్ట్ర ముఖ్య అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డీజీ ప్రకాశ్మిశ్రా, సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీ దుర్గాప్రసాద్, ఆర్ఏఎఫ్ ఐజీ బండారి, ఎస్ఎస్ ఐజీ విష్ణువర్ధన్రావు, 99 ఆర్ఏఎఫ్ కమాండెంట్ రిజ్వాన్, మీడియా కో-ఆర్డినేటర్ పాపారావ్ ఉన్నారు. -
మేమేం చేయలేం!
ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, కవిత, బి.వినోద్కుమార్, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, ఆ శాఖ అదనపు కార్యదర్శి అనంత్కుమార్సింగ్లతో భేటీ అయ్యా రు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాజ్నాథ్.. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను స్థానికత ప్రాతిపదికన విభజించాలంటోంది. కానీ ఏపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన, ఆప్షన్ల ప్రాతిపదికన విభజించాలంటోంది. చట్టంలో మాత్రం ఆప్షన్ల ప్రకారం విభజించాలని ఉంది. అందువల్ల 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఒక పరిష్కార మార్గం చూపితే మాకేమీ అభ్యంతరం లేదు. అది కాకుండా మేం ఏ మార్గదర్శకాలు ఇచ్చినా చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మీరు స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగులను పంపించేశారు. ఒకవేళ వాళ్లు ఆప్షన్ల ఆధారంగా విభజించుకుంటే సంబంధిత ఉద్యోగులకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల మధ్యే మార్గం ఉండాలి. లేదంటే కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలను పాటించాలి. చట్టంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఆ సెక్షన్లపై మేము వివరణ మాత్రమే ఇవ్వగలం..’’ అని తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రతినిధి బృం దం... ఏపీలో ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ తెలంగాణలో ఆప్షన్ కోరుకుంటే ఇక్కడి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అలాంటప్పుడు పరిస్థితి ఇంకా జటిలం అవుతుందని వివరించింది. దీంతో రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన అంశం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిని కలవడం మంచిదని రాజ్నాథ్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతినిధి బృందం డీవోపీటీ మంత్రి వద్దకు వెళ్లి... సమస్య మొత్తాన్ని వివరించింది. అయితే తమ శాఖ కార్యదర్శి అర్చనావర్మ హైదరాబాద్లో ఉన్నారని, శుక్రవారం రాగానే సమావేశమవ్వాలని ప్రతినిధి బృందానికి మంత్రి సూచించారు. వెంటనే పరిష్కరించాలని కోరాం..: కవిత ఉద్యోగుల విభజనపై సత్వరమే కచ్చితమైన పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్ను కోరామని ఎంపీ కవిత చెప్పారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగుల భద్రత, పదోన్నతులు, విభజన తర్వాత వచ్చే కొత్త ఉద్యోగాలు చాలా ముఖ్యమైనవని, వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అలాగే తెలంగాణలో పనిచేస్తున్న 10వేల మంది ఏపీ ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపడానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. తమ డిమాండ్లపై రాజ్నాథ్, జితేంద్రసింగ్ సానుకూలంగా స్పందించారని, శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనలో లోపభూయిష్ట అంశాలు, స్థానికతను పక్కనపెడుతున్న తీరును రాజ్నాథ్, జితేంద్రసింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉద్యోగుల విభజనకు ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. టీజీవోల నేత శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. జోనల్, జిల్లా, మల్టీజోనల్లో జరిగిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్థానికతను గుర్తించడానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన కోసం మరో ఉద్యమం తప్పదన్నారు. ఉద్యోగుల ప్రతినిధి బృందంలో రవీందర్రెడ్డి, చంద్రశేఖర్గౌడ్, మధుసూదన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇస్లామిక్ స్టేట్లోకి 13 మంది భారతీయులు!
గడిచిన ఏడాదిన్నర కాలంలో 13 మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారు. వాళ్లలో ఇప్పటికి ఆరుగురు మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బతికున్నవాళ్లలో ఒక్కరు మాత్రమే పోరాటంలో ఉన్నారని, మిగలినవాళ్లు వంటవాళ్లు గాను, డ్రైవర్లు గాను, హెల్పర్లు గాను పనిచేస్తున్నారని హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల బృందంలోని ఇద్దరు గత మే నెలలో దేశాన్ని వదిలి వెళ్లి ఇస్లామిక్ స్టేట్లో చేరారు. మరో ముగ్గురు ఆస్ట్రేలియా, ఒమన్, సింగపూర్ దేశాల నుంచి అక్కడకు వెళ్లారు. వీళ్లంతా ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముప్పుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాల అధికారులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహించనుంది. -
నేడు కేంద్ర హోంశాఖ అత్యున్నత సమావేశం
-
వారికి ద్వంద్వ పౌరసత్వం కుదరదు
న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వమున్న తన కుమార్తెలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు భారత మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే చేసిన అభ్యర్థనను ఆ శాఖ తిరస్కరించింది. ద్వంద్వ పౌరస్వత్వం తీసుకునేవారికి ఉండాల్సిన నిర్ణీత వయసు వారికి లేదని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2013లో అమెరికాలో భారత ఉప దౌత్యాధికారిగా పనిచేసిన కాలంలో వీసా మోసం ఆరోపణలపై అమెరికా పోలీసులు ఆమెపై నేరాభియోగం మోపిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జన్మించిన భారతీయసంతతి వారికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వం ఇస్తారని, ఆమె పిల్లలు ముంబైలో జన్మించినందున భారత చట్టాలప్రకారం వారికి ద్వంద్వపౌరసత్వం ఇవ్వడంకుదరదని అధికారి చెప్పారు.