ప్రధాన వార్తలు

మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

వివాదంలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. వసుంధరకు నిరసన సెగ!
సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాదంలో బాలకృష్ణ..మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్లేయర్స్ను గంభీర్ నమ్మడం లేదు.. ఇలా అయితే చాలా కష్టం: మనోజ్ తివారీ
టీమిండియా హెడ్ కోచ్గా వైట్బాల్ క్రికెట్లో విజయవంతమైన గౌతమ్ గంభీర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు తన మార్క్ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి.. ఇప్పుడు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో భారత్ వెనుకబడి ఉండటంతో గంభీర్పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్లపై ఆధారపడుతున్నాడని, స్పెషలిస్టులను నమ్మడం లేదని తివారీ అన్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడించకపోవడంతో మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లోమనోజ్ తివారీ, గంభీర్ కలిసి కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించాడు."ఒక టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు జట్టులో కచ్చితంగా స్పెషలిస్ట్లు ఉండాలి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నేను చెప్పాను. కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం స్పెషలిస్టు స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లను పక్కన పెట్టి ఆల్రౌండర్లపై ఎక్కువగా నమ్ముతున్నారు. గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి ఓ కొత్త అనవాయితీని తీసుకొచ్చాడు.ఏ ప్లేయర్ అయినా ఒకట్రెండు మ్యాచ్లు విఫలమైతే అతడి స్దానంలో వేరే ఆటగాడిని భర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో అశ్విన్పై వేటు వేసి వాషింగ్టన్ సుందర్కు గంభీర్ అవకాశమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణాలు భారత జట్టు తరపున ఆడారు. కానీ ఇప్పుడు వారిద్దరూ జట్టులో లేరు. ఇప్పుడు కొత్తగా అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చాడు.అంటే గంభీర్ రాడార్లో ఇక హర్షిత్ రాణా లేనట్లే. గంభీర్కు స్థిరత్వం లేదు. అతడు తన ఆటగాళ్లను ఎక్కువ కాలం నమ్మలేకపోతున్నాడు. పార్ట్ టైమ్ ఆల్ రౌండర్లను ఆడించి టెస్టు మ్యాచ్ను గెలవాలనుకుంటున్నాడు. అది ఎప్పటికి సాధ్యం కాదు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: ఏయ్.. అక్కడేమి చేస్తున్నావ్? యువ ఆటగాడిపై జడేజా ఫైర్! వీడియో వైరల్

ఇక చాలు.. గాజాలో పని ముగించండి
గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి’’ అంటూ ఇజ్రాయెల్ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్ అన్నారు.ట్రంప్ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్.. ఇజ్రాయెల్- హమాస్ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్ వెళ్తునట్లు తెలిపారాయన.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది.

'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్క్ పేర్కొంది.చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్ మేకర్స్ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది. బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్ఎస్ కేడర్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్ ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో జాగృతి తరఫన లీడర్ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్లు పార్టీ కేడర్లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు.

తిరగవోయి భారతీయుడా...పాడవోయి విజయగీతికా!
నిన్న మొన్నటివరకు పర్యాటకం అంటే ఊటీ కొడైకెనాల్.. కాశ్మిర్.. కులూమనాలి వెళ్ళేవాళ్ళు.. మరికొందరు చారిత్రక ప్రాంతాలకు వెళ్లి రాచరిక నిర్మాణాలు అయిన కోటలు ... సరస్సులు చూసేందుకు రాజస్థాన్.. హంపి వంటి ప్రాంతాలకు వెళ్తారు.. మరికొందరు ఐతే నేచర్.. ప్రకృతిలో సేదదీరుతాం అంటూ వాగులు వంకలు జలపాతాలు చూసేందుకు వెళ్తుంటాయారు.. ఇంకొందరు మరింత కిక్కు కావాలబ్బా అంటూ సముద్రతీర ప్రాంతాలైన విశాఖ.. గోవా ..కేరళ వంటి చోట్లకు వెళ్తారు .. మరికొందరు సాహసకృత్యాలు చేసేందుకు పారా గ్లైడింగ్ .. స్పీడ్ బోట్ వంటివి చేస్తుంటారు.. ఇక టెంపుల్ టూరిజం ఎప్పట్నుంచో ఉన్నదే.. దేశంలోని ప్రఖ్యాత ఆలయాలు అన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కో రాష్ట్రం తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. తమిళనాడు టెంపుల్ టూరిజం అంటూ జనాన్ని ఆకర్షిస్తుండగా కేరళ ప్రకృతిని చూద్దాం రండి అంటోంది,. కాశ్మిర్ అయితే మంచుకొండలు చూపిస్తాం అని రారమ్మంటోంది.గనుల్లో దిగుదాం... పర్యాటకం లోతులు చూద్దాంమరి అలాంటి అవకాశం ... ప్రకృతి అందాలు లేని జార్ఖండ్ (Jharkhand) ఏం చేస్తుంది.. జనాలను .. పర్యాటకులను ఎలా ఆకర్షిస్తుంది.. అనుకుంటున్నారా వాళ్లకూ ఒక ఐడియా వచ్చింది.. జార్ఖండ్ అంటేనే గనులు.. పరిశ్రమలకు ఆలవాలం. ఇనుము.. మాంగనీస్ వంటి గనులన్నీ అక్కడే ఉన్నాయి. నేలను తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్లిపోయే టెక్నాలజీ... నైపుణ్యం అక్కడి ప్రజల సొంతం. అందుకే సరిగ్గా ఆ పాయింట్ మీదనే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనీ జార్ఖండ్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలోని కేంద్రప్రభుత్వ రంగసంస్థ అయినా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ సంస్థతో జార్ఖండ్ టూరిజం శాఖ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న పర్యాటకులను బొగ్గు.. ఇనప గనుల్లోకి..(mining tourism) తీసుకెళ్తుంది. మైనింగ్ కార్యకలాపాలను దగ్గరుండి చూపిస్తుంది. ఆనందపు లోతులను మనకు అనుభవేకం చేస్తుంది. మామూలుగా అయితే గనుల్లోకి మనలను పంపరు కానీ టూరిజం శాఖ అన్ని భద్రతా చర్యలు తీసుకుని ఇనుము.. బొగ్గుగనుల్లోకి తీసుకెళ్లి మనకు ఆ మొత్తం ప్రక్రియ చూపిస్తుంది .. ఆసక్తి ఉన్న పర్యాటకులు జార్ఖండ్ వెళ్లి గనుల్లో అలా తిరిగిరావచ్చు.మరింత ఎత్తులో సిక్కిం టూరిజం ... యుద్ధభూమిపై రణనినాదంఅందరూ వెళ్ళేదారిలో వెళ్ళితే సక్సెస్ రాదన్న సూత్రాన్ని గుర్తెరిగిన సిక్కిం ఇప్పుడు ఏకంగా వార్ జోన్ లోకి తీసుకెళ్తోంది. గతంలో చైనా సైనికులతో మన భారత సైనికులు తలపడి వీరత్వాన్ని చూపిన డోక్లామ్ వద్దకు తీసుకెళ్తాం.. మన వీరుల సింహనాదాన్ని వినిపిస్తాం రండి అని సిక్కిం పిలుస్తోంది. హిమాలయాలను తాకే కొండ శిఖరాలవద్ద భారత చైనా సైనికులమధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చైనీయులను మనవాళ్ళు తుక్కుతుక్కుకింద కొట్టి సరిహద్దుల ఆవలకు తరిమేసిన ప్రదేశమే ఈ డోక్లామ్ .. అక్కడికి తీసుకెళ్తాం అని సిక్కిం పిలుస్తోంది.'రణ భూమి దర్శన్' అంటూ దీనికి ప్రత్యేక ప్యాకేజి సైతం సిద్ధం చేసింది.. ఆ మధ్య కాశ్మిర్లోని పెహల్గామ్ వద్ద పాకిస్తాన్ దాడి చేసిన ప్రదేశము కూడా ఇప్పుడు పెద్ద పర్యాటక ప్రాంతం అయింది. మరింకెందుకు ఆలస్యం ఆనాడు మన వీర సైనికులు పరాక్రమం చూపిన ప్రాంతాలు చూసేయండి.. విజయగర్వంతో తిరిగిరండి..-సిమ్మాదిరప్పన్న

ఐటీకి ముందుంది మంచి కాలం
కొన్ని నెలలుగా ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన లాభాలు ఉండడంలేదు. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలు పోస్ట్ చేస్తోన్న ఫలితాల్లో చాలాభాగం లేఆఫ్స్, డిస్క్రీషనరీ వ్యయాన్ని తగ్గించుకోవడం వల్ల ఒనగూరిందే. అయితే సమీప భవిష్యత్తులో వీటిలో మార్పు రాబోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా ఆధునీకరణ, మెరుగైన డిజిటల్ అనుభవాల కోసం ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, రిటైల్ రంగాల్లో విచక్షణాత్మక ఐటీ వ్యయం తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి.వ్యయాలు పెంపుస్థూల ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య మొత్తం టెక్ బడ్జెట్లు స్తంభించాయి. సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలను కంపెనీలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈమేరకు ఐటీ కస్టమర్ కంపెనీలు తమ వ్యయాన్ని పెంచుతున్నాయి. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం. వినియోగదారులు ఏఐ వాడకంవైపు మొగ్గు చూపడం కూడా ఐటీకి ఊతం ఇస్తుంది. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన యూఎస్ బ్యాంకులు ఏఐకి సంబంధించి ప్రయోగాత్మక దశలను దాటి పూర్తి స్థాయి, ఉత్పత్తి గ్రేడ్ ఏఐను వాడుతున్నాయి. ఈ పరివర్తన వ్యాపార ఫలితాలకు నేరుగా దోహదం చేస్తుంది.ఏఐతో మేలు..మల్టీ బిలియన్ డాలర్ల టెక్ బడ్జెట్ ఉన్న సంస్థలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయమైన వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు ఫారెస్టర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ బిశ్వజీత్ మహాపాత్ర అన్నారు. స్పష్టమైన ఉత్పాదకత లాభాల కోసం ఏఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. హైపర్-పర్సనలైజేషన్తో మెరుగైన కస్టమర్ అనుభవం చేకూరుతుందని చెప్పారు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఐటీ కంపెనీలకు లాభాలు తెస్తుందని చెప్పారు. ప్రముఖ సంస్థల ఐటీ వ్యయంలో 50% కంటే ఎక్కువ కృత్రిమ మేధ, డేటా ఆధునీకరణ, కస్టమర్-ఫేసింగ్ ఇన్నోవేషన్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..పూర్తి స్థాయిలో కేటాయింపులు పెండింగ్..ఐటీ కంపెనీల కస్టమర్ సంస్థల విచక్షణ వ్యయంలో రికవరీ ఇంకా విస్తృతంగా లేదని నిపుణులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఐటీ స్పెండింగ్ కోసం ఇంకా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపడంలేదు. దాంతో మొత్తం టెక్ బడ్జెట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్గా లేదా స్వల్ప లాభాల్లో మాత్రమే పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఏఐ పుణ్యామా అని ఐటీ వ్యయంలో కొంత పురోగతి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది.

వివాదాస్పదంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహార శైలి.. భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘రెండు నెలలు క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయికి ఫ్యాక్చర్ అయ్యింది. చేయి గాయం కారణంగా గన్ మెన్ కాలేశా ఔదార్యపూరితమైన పెద్దిరెడ్డికి సహాయం చేశాడు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించరు. అందుకే పెద్దిరెడ్డితో పాటుగా గన్మెన్.. మిథున్ రెడ్డి ఉన్న జైలుకు వెళ్లారు. మిథున్రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును పెద్దిరెడ్డి మోయలేకపోవడంతో.. దాన్ని గన్మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ మణికంఠ.. కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇలా చేయడం సరికాదు.ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో పనిచేయిస్తున్నారు. ఎస్పీ వెంటనే వారిని తొలగించి ఆదర్శంగా ఉండాలి. ఆత్మ న్యూనత భావంతో పనిచేయకండి. కాలేశా సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు.. మిగతా వారిని కూడా సస్పెండ్ చేస్తారా?.ఇదిలా ఉండగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహారశైలి మరోమారు వివాదస్పదమయ్యింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ రూట్ మ్యాప్ అప్పటికప్పుడు మారుస్తూ, ఆంక్షలు విధించిన ఎస్పీ.. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి గన్మేన్ కాలేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండగా, రెండు రోజుల క్రితం ఆయనను పరామర్శించడానికి రామచంద్రారెడ్డి వెళ్లారు.ఇటీవల పెద్దిరెడ్డి చేయి విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును ఆయన మోయలేకపోవడంతో.. దాన్ని గన్మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ, కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మానవతాదృక్పథంతో బ్యాగు తీసుకున్నందుకు తనను సస్పెండ్ చేయడం తగదని కాలేషా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇక గతేడాది జూలైలో ఎంపీ మిథున్రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంలో అక్కడ టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడి, కార్లకు నిప్పంటించారు. మిథున్రెడ్డిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటడంతో మిథున్రెడ్డి గన్మేన్ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ నాడు మిథున్రెడ్డి గన్మేన్ను సైతం సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా ఎస్పీ మణికంఠ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
తిరుమలలో ఒకప్పటి హీరోయిన్.. గుర్తుపట్టారా?
యువతి అనుమానాస్పద మృతి
కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
తిరగవోయి భారతీయుడా...పాడవోయి విజయగీతికా!
టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్ను చిత్తు చేసిన ఆసీస్
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
తిరుమలలో ఒకప్పటి హీరోయిన్.. గుర్తుపట్టారా?
యువతి అనుమానాస్పద మృతి
కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
తిరగవోయి భారతీయుడా...పాడవోయి విజయగీతికా!
టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్ను చిత్తు చేసిన ఆసీస్
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’
సినిమా

'వార్2' అతిథి పాత్రలో 'ఆల్ఫా' లేడీ.. సర్ప్రైజ్ చేస్తున్న పోస్ట్
హృతిక్రోషన్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం 'వార్ 2'... యశ్రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్లో భాగంగా నిర్మించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలరను కూడా మేకర్స్ పంచుకున్నారు. అయితే, వార్ 2 ట్రైలర్ను షేర్ చేస్తూ అలియా భట్ షాకిచ్చింది. థియేటర్లో కలుద్ధాం అంటూ సడెన్గా సర్ప్రైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తున్నట్లు ఎక్కడే కాని వార్తలు రాలేదు. తొలిసారి ఆమె ఇలా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.అలియా భట్ తాజాగా చేసిన పోస్ట్ను గమనిస్తుంటే వార్ 2లో ఆమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా రహస్యంగా ఆమె పాత్రను చిత్రీకరణ చేసినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ, ఇదంతా ఆమె తర్వాతి చిత్రం 'ఆల్ఫా'తో వార్2 లింక్ ఉంటుందని టాక్.. యశ్రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో (Alpha) అలియా గురువు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు కూడా గతంలో తెలిపాయి. వార్2లో అలియా నటిస్తున్నట్లు అధికారికంగా ఏమీ ధృవీకరించబడనప్పటికీ ఆమె చేసిన పోస్ట్తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆల్ఫా చిత్రాన్ని శివ్ రావేల్ దర్శకత్వంలో రానుంది. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్లను బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుంది.

ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది.

హీరోను వదిలేసి నన్ను మాత్రమే 'ఐరన్ లెగ్' అన్నారు: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్కు తొలి విజయం దక్కింది టాలీవుడ్లోనే. తెలుగులో తన మూడో చిత్రంగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమాకు ముందు అమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఛాన్సులు రావేమో అనుకుంటున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి పిలుపు రావడం ఆపై భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వారందరూ ఆ సమయంలో ఒక విషయాన్ని గుర్తించలేదని శ్రుతిహాసన్ చెప్పారు.'తెలుగు పరిశ్రమలో నేను నటించిన మొదటి రెండు చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో నాపై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ, ఆ రెండు చిత్రాల్లో నేను నటించింది ఒకే హీరోతోనే అనే విషయాన్ని అప్పుడు ప్రజలు గుర్తించలేదు. నన్ను మాత్రం ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటప్పుడు ఐరన్ లెగ్ అని హెళన చేయడం ఎందుకు..? నావి ఐరన్ లెగ్స్, గోల్డెన్ లెగ్స్ కాదు... నా కాళ్లు నాకు వదిలేయండి. అలా ఎవరినీ హెళన చేస్తూ విమర్శలు చేయకండి' అంటూ శ్రుతిహాసన్ పేర్కొంది.శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా 'సిద్ధార్థ్'తో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు. అయితే, అవి భారీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఆ తర్వాతి ఏడాదిలోనే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ సినిమా 'కూలీ'లో శ్రుతిహాసన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.

'సోలో లైఫే సో బెటర్'.. పెళ్లిపై నిత్యా మీనన్ కామెంట్
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్(Nithya Menen) ఒకరు. రీసెంట్గా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు.. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్ చేస్తారన్నమాట. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం (తిరు) చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా విజయ్సేతుపతికి జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా.. జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

టీమిండియాకు డేంజర్ బెల్స్.. పేస్ గుర్రానికి ఏమైంది?
మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. స్టోక్స్ సేన ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కాంబోజ్ చెరో వికెట్ సాధించారు.బుమ్రాకు ఏమైంది?ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. అతడు తన తొలి వికెట్ అందుకోవడానికి 23 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమి స్మిత్ను ఔట్ చేసి మొదటి వికెట్ను సాధించాడు. అస్సలు ఈ మ్యాచ్లో మనం చూస్తుంది బుమ్రానేనా అన్నట్లు అతడి బౌలింగ్ సాగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు సునాయసంగా అతడి బౌలింగ్ను ఎదుర్కొన్నారు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఇటువంటి బౌలింగ్ను బుమ్రా నుంచి చూడలేదు.ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే తనను తాను సరిదిద్దుకోవడానికి ఒకటి లేదా రెండు ఓవర్లు కంటే ఎక్కువ సమయం పట్టదు. ఏమైందో కానీ మాంచెస్టర్లో మాత్రం తన మార్క్ను ఈ స్పీడ్ చూపించలేకపోతున్నాడు. ఎక్కువగా డౌన్ ది లెగ్ బంతులు వేసి పరుగులు ఇవ్వడం, సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోవడం వంటి తప్పులు చేశాడు.ఒకే ఒక్కసారి..ముఖ్యంగా మాంచెస్టర్లో బుమ్రా పేస్ జనరేట్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. ఈ గుజరాత్ స్పీడ్ స్టార్ సాధరణంగా టెస్టుల్లో గంటకు 138- 140 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ మ్యాచ్లో మాత్రం కేవలం ఒక్కసారి మాత్రమే 140 ప్లస్ వేగంతో బౌలింగ్ చేశాడు.ఇప్పటివరకు నో బాల్స్తో కలిపి 173 బంతులు బౌలింగ్ చేసిన బుమ్రా.. ఒకే ఒక్కసారి 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల్గాడు. అంతకుముందు లీడ్స్ టెస్టులో 266 బంతులు వేసిన బుమ్రా.. 39.84 శాతంతో 106 బాల్స్ను 140 కి.మీ పైగా వేగంతో సంధించాడు.ఆ తర్వాత లార్డ్స్లో కూడా 257 బంతుల్లో 69 బంతులను 140 కి.మీ పైగా వేగంతో వేశాడు. కానీ నాలుగో టెస్టులో మాత్రం సరైన పేస్తో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దీంతో అతడి గాయం ఏమైనా తిరిగబెట్టిందా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే టీమిండియా మెనెజ్మెంట్ ఈ సిరీస్లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్లో అతడికి ఇది మూడో మ్యాచ్. తొలి టెస్టులో ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి వచ్చిన బుమ్రా మూడో టెస్టులో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు ఈ స్పీడ్ స్టార్ విశ్రాంతి ఇస్తారని అంతా భావించారు. కానీ కీలకమైన మ్యాచ్ కావడంతో మాంచెస్టర్లో అతడిని ఆడించారు. ఈ నిర్ణయం టీమిండియాకు ఏ మాత్రం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 28 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 95 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. రెండో ఇన్నింగ్స్లోనైనా బుమ్రా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.చదవండి: టెస్టు చేజారిపోతోంది!

ఫుట్బాల్లో డీలా... క్రికెట్లో ఇటలీల...
ఫుట్బాల్కు పెట్టింది పేరైన ఇటలీలో ఇప్పుడు మరో క్రీడ ప్రేక్షకాదరణ పొందుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్లో నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) చాంపియన్గా... మరో రెండుసార్లు (1970, 1994) రన్నరప్గా నిలిచిన ఇటలీ... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2018, 2022లో జరిగిన ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీకి అర్హత పొందలేకపోయిన ఆ జట్టు... వచ్చే ఏడాది జరగనున్న ఫుట్బాల్ విశ్వ సమరంలో బరిలోకి దిగడం కూడా అనుమానంగా మారింది. ఘన చరిత్ర... అంతకుమించిన వారసత్వం... అపార నైపుణ్యం... దేశవ్యాప్తంగా ఫుట్బాల్కు మెరుగైన మౌలిక వసతులు ఉన్నా ఈ క్రీడలో తిరోగమనం దిశలో పయనిస్తున్న ఇటలీ... కనీస సౌకర్యాలు లేని క్రికెట్లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రాక్టీస్ చేసేందుకు కనీసం పచ్చిక పిచ్లు కూడా లేకున్నా... ప్రపంచకప్నకు తొలిసారి అర్హత సాధించి భళా అనిపించింది. యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్కప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఇటలీ క్రికెట్పై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే దేశంలో క్రికెట్కు క్రేజ్ దక్కుతుందా అనే స్థాయి నుంచి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించే స్థాయికి ఇటలీ చేరుకుంది. క్లబ్లు, ఏజ్ గ్రూప్ మ్యాచ్లు, ప్రత్యేక టోర్నీలు, సన్నాహక మ్యాచ్లు ఇలా అన్నీ ఉన్న ఫుట్బాల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్న ఇటలీ... ప్రాక్టీస్ చేసేందుకు సరైన మైదానాలు, మెరుగయ్యేందుకు అవసరమైన కనీస వసతులు లేని క్రికెట్లో మాత్రం రాణిస్తోంది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలస వచ్చిన ప్లేయర్లతో నిండిన జట్టు... వారం మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతాల్లో వీలు చిక్కినప్పుడు మాత్రమే సాధన చేసే ప్లేయర్లతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందడం అంటే మామూలు విషయం కాదు. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్లో పటిష్ట టీమిండియాతో ఆడాలనుకుంటున్నట్లు ఆ జట్టు సారథి జో బర్న్స్ వెల్లడించాడు. ఆరస్టేలియా నుంచి ఇటలీకి... ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ కొన్నేళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్న్స్ పూర్వీకులుఆ్రస్టేలియాకు వెళ్లగా... ఇప్పుడు మెరుగైన కెరీర్ కోసం అతడు తిరిగి ఇటలీకి చేరుకున్నాడు. అప్పటికే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... వారికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోగా... బర్న్స్ రాకతో ఆ ఇబ్బంది తీరింది.అతడితో పాటు ఆ్రస్టేలియాలో దేశవాళీ క్రికెట్ ఆడిన హ్యారీ మనెంటి, బెన్ మనెంటి... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడిన గే, స్టివర్ట్ వంటి ప్లేయర్లు... జాతీయ జట్ల తరఫున అవకాశం దక్కని ఉపఖండ ఆటగాళ్లతో ఇటలీ జట్టులో ప్రతిభకు కొదవ లేకుండా ఎదిగింది. బర్న్స్ సారథ్యంలో ఎప్పటికప్పుడు మెరుగవుతున్న ఇటలీ జట్టు... నెదర్లాండ్స్ తర్వాత ఐసీసీ టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించిన యూరప్ జట్టుగా నిలిచింది. కెవిన్ ఒబ్రియాన్ కోచింగ్లో... ఐర్లాండ్కు చెందిన ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రియాన్ ఓసారి ఇటలీలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి యువ ఆటగాళ్ల నైపుణ్యం చూసి ముచ్చట పడ్డాడు. మెరుగైన వసతులు లేకపోయినా... ప్లేయర్లలో ఏదో సాధించాలనే తపనను గమనించాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని ప్రపంచకప్ స్థాయిలో మెరుపులు మెరిపించిన ఒబ్రియాన్.. అనంతరం కాలంలో ఇటలీ క్రికెట్ జట్టు సహాయక కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు దశ తిరిగింది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్పై ఐర్లాండ్ రికార్డు లక్ష్యఛేదనతో ఒక్కసారిగా స్టార్గా మారిన ఒబ్రియాన్... ఇటలీ ప్లేయర్లకు గొప్పగా శిక్షణనిచ్చాడు. ఇటలీ జట్టు టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడంతో తను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అయిందని ఒబ్రియాన్ అన్నాడు. ‘కోచ్గా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. అసలు కోచింగ్ వైపు అడుగులు వేసినప్పుడు ఇదంతా ఊహించలేదు. కానీ ప్లేయర్లు నిబద్దతతో కృషి చేసి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో 2007 వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై ఐర్లాండ్ జట్టు విజయాలు సాధించడంలో ప్లేయర్గా ఒబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు. సహాయక కోచ్గా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే ‘ఏజ్ గ్రూప్ క్రికెట్’కు ప్రాధాన్యత ఇచ్చి వాటి ఫలితాలు బోర్డుకు అందించాడు. ప్రపంచకప్తో ఆదరణ దక్కేనా! యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభానికి రెండు వారాల ముందు... ఇటలీ జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒలింపిక్స్లో క్రికెట్ను క్రీడాంశంగా ప్రవేశపెట్టడంతో... ఇకపై మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. ఇటలీలో పచ్చిక పిచ్లు అందుబాటులో లేకపోవడంతో... కృత్రిమ పిచ్లపై సాధన చేసేలా జట్టును సిద్ధం చేసింది. ఇతర జట్లతో మ్యాచ్లసంఖ్యను సైతం పెంచింది. ‘టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడం ఒక కీలక మలుపు. మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సౌకర్యాలు మెరుగైనప్పుడే యువత ఇటువైపు అడుగులు వేస్తుంది.ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో పాల్గొంటే... ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తద్వారా దేశంలో ఆటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్పాన్సర్లు, ఎండార్స్మెంట్ల రూపంలో ఆదాయం పెరుగుతుంది’ అని ఇటలీ క్రికెట్ జట్టు మేనేజర్ పీటర్ డి వెనుటో అన్నాడు.కలుగమగె కథే వేరు...శ్రీలంకకు చెందిన క్రిషన్ కలుగమగె 15 ఏళ్ల వయసులో ఇటలీకి వలస వెళ్లాడు. మొదట అథ్లెట్ కావాలనుకున్న క్రిషన్ ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో... ఒక రెస్టారెంట్లో పిజ్జా మేకర్గా పనికి కుదిరాడు. జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు ఒకవైపు పని కొనసాగిస్తూనే... వ్యక్తిగత ఆసక్తిని చంపుకోలేక క్రికెట్ను కొనసాగించాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ 2022లో ఇటలీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటలీలో క్రికెట్కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో... ఆ తర్వాత కూడా అతడు రెస్టారెంట్ ఉద్యోగం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం చేసే పనిని పక్కన పెట్టిన క్రిషన్... ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించిన తర్వాత వచ్చిన స్పందనతో ఆశ్చర్యపోయాడు. ‘క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ వందలాది మంది పూలు, స్వీట్లతో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఏమాత్రం ఊహించనిది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా’ అని కలుగమగె అన్నాడు. స్టీరింగ్ పక్కన పెట్టి... 2006లో కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్ సింగ్... అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ మాదిరిగా అక్కడ క్రికెట్కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ పొట్ట కూటి కోసం క్యాబ్ డ్రైవర్గా కొనసాగుతున్నాడు. 2024 టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సమయంలోనే ఇటలీ జట్టు త్రుటిలో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో... ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో... స్టీరింగ్ను పక్కన పెట్టిన జస్ప్రీత్ పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గ ఫలితం దక్కడం ఆనందంగా ఉందని అతడు వెల్లడించాడు. ‘వరల్డ్కప్కు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ జట్టులో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్లమయ్యాక ముందు తరాలకు చెప్పుకునేందుకు ఇంతకు మించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.

నగాల్ పునరాగమనం
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి నిధులు పొందుతూ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు విముఖత చూపితే... వారికి నిధులు నిలిపివేస్తామని ఇటీవల కేంద్ర క్రీడా శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్... డబుల్స్ స్పెషలిస్ట్ యూకీ బాంబ్రీ మళ్లీ ముందుకొచ్చారు. ఈ ఏడాది సెపె్టంబర్ 12 నుంచి 14 వరకు స్విట్జర్లాండ్తో బీల్ నగరంలో జరిగే డేవిస్కప్ వరల్డ్ గ్రూప్–1 మ్యాచ్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.సింగిల్స్లో సుమిత్ నగాల్, కరణ్ సింగ్, ఆర్యన్ షా... డబుల్స్లో యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ ఎంపికయ్యారు. హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ, శశికుమార్ ముకుంద్, దక్షిణేశ్వర్ సురేశ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్లో 306వ స్థానంలో ఉన్న సుమిత్ నగాల్ చివరిసారి 2023లో డేవిస్కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత పాకిస్తాన్, స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్లకు సుమిత్ దూరంగా ఉన్నాడు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్లో 35వ స్థానంలో ఉన్న యూకీ బాంబ్రీ గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్తో ఆడిన తర్వాత స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్ల్లో పాల్గొనలేదు.

ప్రపంచ బాక్సింగ్ పోటీలకు నిఖత్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఇంగ్లండ్లో జరిగే ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో వారం రోజులపాటు నిర్వహించిన శిబిరం తర్వాత భారత జట్లను ఎంపిక చేశారు. కొత్తగా ఏర్పడ్డ వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో సెపె్టంబర్ 4 నుంచి 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. పురుషుల, మహిళల విభాగాల్లో 10 వెయిట్ కేటగిరీల్లో బౌట్లు ఉంటాయి. భారత మహిళల బాక్సింగ్ జట్టు: మీనాక్షి హుడా (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), సాక్షి (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు, సంజూ ఖత్రి (60 కేజీలు), నీరజ్ ఫొగాట్ (65 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు). భారత పురుషుల బాక్సింగ్ జట్టు: జాదుమణి సింగ్ (50 కేజీలు), పవన్ బర్త్వాల్ (55 కేజీలు), సచిన్ సివాచ్ జూనియర్ (60 కేజీలు), అభినాశ్ జమ్వాల్ (65 కేజీలు), హితేశ్ గులియా (70 కేజీలు), సుమిత్ కుందు (75 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), జుగ్నూ అహ్లావత్ (85 కేజీలు), హర్ష్ చౌధరీ (90 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు).
బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లోకి మహీంద్రా 3ఎక్స్వో రెవ్ఎక్స్
వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో పోర్ట్ఫోలియోలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రెవ్ఎక్స్ సిరీస్ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ఆవిష్కరించింది. బుకింగ్స్తో పాటు డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సంస్థ సేల్స్ విభాగం జోనల్ హెడ్ (సౌత్) అరుణాంగ్షు రాయ్ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇదీ చదవండి: వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డుఇందులో రెవ్ఎక్స్ ఎం, ఎం(ఓ), ఏ అని మూడు వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ను బట్టి ధర రూ.8.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రీమియం లెదరెట్ సీట్లు, సన్రూఫ్, బిల్ట్ఇన్ అలెక్సా, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, తదితర ఫీచర్లు ఉంటాయని రాయ్ చెప్పారు. గతేడాది ఆవిష్కరించిన 3ఎక్స్వో కేవలం 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 పైచిలుకు యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నారు.

ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ(Unified Payment Interface) యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది.యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. ఇక నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కు NPCI వీలు కల్పించనుంది. అలాగే.. ఫోన్ నెంబర్ లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూసేలా నిబంధన తీసుకురానుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్తో ఏర్పడే ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకే ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది.ఇక.. ఆటోపే ట్రాన్జాక్షన్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది. UPI AutoPay లావాదేవీలకు నిర్దిష్ట సమయ పరిమితులు (ఫిక్స్డ్ టైం స్లాట్) ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే.. సబ్స్క్రిప్షన్లు, విద్యుత్/నీటి బిల్లులు, ఈఎంఐలాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజులో మొత్తం ఎప్పుడైనా జరగకుండా.. ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి.అయితే ట్రాన్జాక్షన్(లావాదేవీల) లిమిట్ విషయంలో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.

జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్రూ్కటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ నోటీసులు వస్తుండటంతో, కర్ణాటకలోని చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్ష పన్నుల విధానం వల్ల జవాబుదారీతనం, ఆదాయం మరింతగా పెరిగినప్పటికీ, చిన్న ట్రేడర్లపై జరిమానాలు వేయకుండా, వారికి సాధికారత కల్పించినప్పుడే దీర్ఘకాలంలో ఇది విజయవంతం అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. యూపీఐలాంటి డిజిటల్ లావాదేవీల ఆధారంగా బెంగళూరులోని పలువురు చిన్న ట్రేడర్లు, దుకాణదారులకు అసంబద్ధ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు రావడాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశంపై కర్ణాటకలోని చిన్న వ్యాపారులు జూలై 23 నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను తలపెట్టారు. టాప్ 5 రాష్ట్రాల వాటా 50 శాతం.. జీఎస్టీ అమలు, మొత్తం చెల్లింపుదారుల్లో టాప్ 5 రాష్ట్రాల వాటా సుమారు 50 శాతంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. చెల్లింపుదారుల్లో మహిళల వాటా (ప్రతి అయిదుగురిలో ఒకరు) పెరుగుతోందని వివరించింది. ప్రస్తుతం 1.52 కోట్ల పైగా గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పెద్దవి, సంపన్నమైనవి అయినప్పటికీ, మొత్తం జీఎస్డీపీలో ఆయా రాష్ట్రాల వాటాతో పోలిస్తే క్రియాశీలక జీఎస్టీ ట్యాక్స్పేయర్ల వాటా తక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మొత్తం జీఎస్డీపీలో ఉత్తర్ప్రదేశ్, బీహార్, గుజరాత్ల వాటా తక్కువే అయినప్పటికీ మొత్తం జీఎస్టీ ట్యాక్స్పేయర్లలో ఆయా రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటోంది.

ఏఐకి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్జెన్ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది. డిఫెన్స్లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ఎల్రక్టానిక్ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్జెన్ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.
ఫ్యామిలీ

పూల సాగు.. ఆదాయం బాగు
సంప్రదాయ పంటలతో నిత్యం నష్టపోతున్న రైతులు ఇప్పుడు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. కొత్తరకం పూలసాగులో అధిక లాభాలు వస్తుండడంతో వీటిపై రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఆడి నెలల్లో మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పూల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చెరుముందరకండ్రిగ గ్రామంలో విరివిగా పూలు సాగు చేస్తున్నారు. –పాలసముద్రంచెరుముందరకండ్రిగ గ్రామంలో 200 పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలు కష్టపడి పంటలు సాగు చేసి ముందుకు ఎదుగుతున్నారు. రైతులు వరి, చెరకు పంటలు సాగు చేసి అప్పుల పాలైపోయారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడి భూముల్లో వివిధ రకాల పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బంతి, నాటు చామంతి, మల్లిపూలు, కనకాబరం సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది హైబ్రీడ్ వెల్వెట్, హైబ్రీడ్ చామంతి, కొత్తగా పసుపు, తెలుపు రంగుల గులాబీ పూలను సాగు చేస్తున్నారు. ఉదయం తోటలోని పూలను కూలీలతో కోసుకుని తమిళనాడులోని తిర్తుతణి, వేలూరు, చైన్నై మార్కెట్లకు తీసుకెళ్లుతున్నారు. ఇలా చేయడంతో పూలకు మంచి గిరాకీ ఉన్నప్పుడు వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. ఇలా మండల పరిధిలో శుభ కార్యాలయాలకు కూడా ఇక్కడకు వచ్చి పూలను తీసుకెళ్తున్నారు. పూల సాగుతోనే చెరుముందరకండ్రిగ గ్రామ రైతులు లాభాల బాటలో నడుస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఇక్కడ సాగు చేసిన పూలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పండుగ సీజన్లో బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులే ఇక్కడికి వస్తున్నారు. తోటల వద్దనే కొనుగోలు చేసి తీసుకెళ్లుతారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో మరిన్ని కొత్తరకం పూలు సాగు చేయడానికి గ్రామంలో రైతులు ఆసక్తి చూపుతున్నారు.మార్కెట్లో మంచి గిరాకీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పూలనే ఎంచుకుని సాగు చేస్తున్నారు. హెబ్రీడ్ చామంతి, వెల్వెట్ సాగుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. మ్యారీగోల్డ్, మ్యారీ పింక్ సాగుకు ఎకరానికి రూ.90 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎకరా భూమికి 10 నుంచి 12 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేలు నుంచి రూ.29 వేలు, బాడుగతో సహా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఎరువులు, దుక్కులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు కలుపుకుంటే గరిష్టంగా రూ.50 వేల నుంచి రూ.90 వేలు వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల పూలు కాస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రీడ్ చామంతి, గులాబీ పూల ధరలు కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మల్లెలు, కాకడ పూలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది, కనకాంబరం కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీపావళి, ఆడి నెల, కార్తీక మాసాల్లో పూల ధరలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లో కిలో పూలు రూ.150 వరకు పలుకుతాయి. మల్లెల సాగుతో లాభాలు చెరుముందర కండ్రిగలో ఎకరా మల్లెపూల తోట సాగు చేశాను. ఖర్చు రూ.50 వేలు అవుతుంది. ఆదాయం లక్షన్నర వస్తుంది. ప్రతి రోజు పూల తోటలో పూలు కోసుకుకెళ్లి తిరుత్తణి, చెన్నై మార్కెట్కు ఎగుమతి చేస్తున్నాను. కిలో మల్లెమొగ్గలు రూ.65 నుంచి రూ.75 ధర పలుకుతాయి. రోజుకి సుమారు 25 కిలోల పూలు తీసుకెళ్లుతాను. రోజు కూలీకి పోను రూ. వెయ్యి వస్తుంది.–వడివేలురెడ్డి, చెరువుముందర కండ్రిగ మ్యారీగోల్డ్, గులాబీ సాగు చేస్తున్నాం మాకున్న భూముల్లో మ్యారీగోల్డ్, గులాబీ పూల తోట సాగు చేస్తున్నాను. రెండు బోర్లు వేశాను. నీరు రాకపోవడంతో వరి, చెరకు సాగు చేయకుండా ఉన్న తక్కువ నీటిలోనే ఎకరాకు పైగా పూలు సాగు చేస్తున్నా. ఆదాయం బాగానే వస్తుంది. కొత్తరకం పూలు సాగు చేస్తే తోట వద్దకే వ్యాపారులు వచ్చి పూలను తీసుకెళ్లుతారు. మాగ్రామంలో ప్రతి ఒక్కరు పూల సాగుపైగా ఆధారపడి ఉన్నాం. –మత్యాలురెడ్డి, చెరువుముందరకండ్రిగపూల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో పూల తోటల సాగుపై హారి్టకల్చర్, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. అయితే చెరుముందరకండ్రిగ గ్రామంలోని రైతులు పూలతోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా వివిధ రకాల పూలతోటలు సాగు చేసి, ఆదాయం పొందుతున్నారు. –ఢిల్లీప్రసాద్, మండల వ్యవసాయాధికారి

ఇదో నిజాయితీ పెట్టె కథ!
పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్బుక్స్ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి. నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.టీచర్ విన్నూత్న ఆలోచనతో సాకారం ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది మా స్కూల్లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది. – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థినిమొక్కై వంగనిది మానై వంగునా.. చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా.. – తులసీనాథం నాయుడు, టీచర్

900 రకాల మొక్కలు, పక్షులతో ఆ ఇల్లు సస్యరాశుల పొదరిల్లు
సాక్షి,బళ్లారి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటి చెట్లు పెంచాలని పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే నేటికీ ఇంటింటా చెట్ల పెంపకం మాట నోటి మాటలకే పరిమితం అవుతోండగా దావణగెరె నగరంలో ఓ వ్యక్తి ఏకంగా 900 వరకు వివిధ రకాల మొక్కలు, చెట్లు, పూలు, పండ్ల చెట్లు పెంచుతూ ఆ ఇంటిని నందనవనంగా, పచ్చదనం వెల్లివెరిసే స్వర్గసీమగా తీర్చిదిద్దాడు. ఆ ఇల్లు పూలు, పండ్ల మొక్కలుతో అలరాలుతున్న అద్భుతమైన పచ్చదనం, ఆహ్లాదం, వినోదం కలిగించే ఇల్లుగా కీర్తి పొందింది. రాష్ట్రంలోనే కాకుండా బహుశా దేశంలో ఓ ఇంట్లో ఇంత పెద్ద స్థాయిలో చెట్లు, మొక్కలు, పూలు, పక్షులు పెరుగుతున్న ఇల్లు ఇదే అన్నా ఆశ్చర్యపోనక్కర లేదేమో. ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టిన వెంటనే ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇంటి ఆవరణ ఒకటే అనుకుంటే పొరపాటే. ఇంటి ఆవరణ నుంచి మొదలుకొని హాలులోకి అడుగుపెట్టిన తర్వాత తలుపు చుట్టూ పచ్చదనమే. ఎక్కడ చూసినా పచ్చదనమే హాలులో ఎక్కడ చూసినా పూలమొక్కలు, వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి. హాలే కాదు వంట గదిలో కూడా పచ్చదనమే, వంటగదే కాదు, పడక గది, పై అంతస్తులోకి వెళ్లే మెట్లు ప్రతి అడుగు తీసి అడుగు వేసినప్పుడు ఒక్కో మెట్టు వద్ద వివిధ రకాలైన పూలకుండీలు, సువాసన వెదజల్లే పూలను తాకుకుంటూ పైగదికి వెళ్లాల్సిందే. అలాగే చివరకు వాష్రూం కూడా పచ్చదనంతో కనిపిస్తుందంటే ఆయన ఆ ఇంటిని ఎలా పచ్చదనంతో కాపాడుకుని వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దావణగెరె నగరంలోని ఎస్ఎస్ లేఅవుట్ ఏ బ్లాక్లో ప్రొఫెసర్ శిశుపాల్ ఇల్లు అంటే ఆ వీధిలోనే కాదు దావణగెరెలోనే పేరుగాంచింది. దావణగెరె బెణ్ణెదోసెకు కర్ణాటక వ్యాప్తంగా ఏవిధంగా పేరుగాంచిందో అదే తరహాలో కర్ణాటకలో ప్రొఫెసర్ శిశుపాల్ ఇల్లు కూడా పచ్చదనంతో వెల్లివిరుస్తోందనే చర్చ సాగుతోంది. ఇంటి బయట పెద్ద పెద్ద చెట్లను పెంచుతుండగా, ఇంటి ఆవరణ, లోపల వివిధ గదుల్లో ఆయా గదులకు అనుగుణంగా మొక్కలు, పూల చెట్లు పెంచుతున్నారు. పూల చెట్లు, వివిధ రకాల మొక్కలతో పాటు పక్షులు కూడా ఆ ఇంట్లో పెరుగుతున్నాయి. వివిధ రకాల పక్షులకూ ఆవాసం వివిధ రకాలైన 20కి పైగా జాతుల పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేశాయి. పక్షులకు కావాల్సిన పండ్లు, పూలు, ఆహారం ఇంటి ఆవరణ, లోపల దొరుకుతుండటంతో పక్షులు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుండం విశేషం. సువాసలు వెదజల్లే లిల్లి, మల్లెపూలు, గులాబీ, సంపంగి, పారిజాత, చామంతి, చెండుపూలు తదితర 120కి పైగా పూల మొక్కలను పెంచుతున్నారు. పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు అక్కడే పూల తోట కూడా పెరుగుతుండటంతో వాటితోనే పూజలు చేస్తున్నారు. ఆ ఇంట్లో చెట్లు, మొక్కలను కాపాడుకునేందుకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు వృథాగా పోకుండా పెద్ద ట్యాంకు ఏర్పాటు చేసి వాటిని నిల్వ చేసి మొక్కలకు సరఫరా చేస్తుండటం ద్వారా పచ్చదనాన్ని సంరక్షిస్తున్నారు. పనివేళలు ముగిసిన తర్వాత ఆయన ఆ ఇంటి పచ్చదనాన్ని కాపాడు కోవడానికి పూర్తి సమయం కేటాయిస్తారు. ప్రొఫెసర్ శిశుపాల్తో పాటు ఆయన సతీమణి పద్మలత కూడా పూర్తి సహకారం అందించడంతో ఆ ఇంటిని స్వర్గధామంగా మలిచారు. చదవండి : Sravana Masam 2025 రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే పర్యాటక కేంద్రంగా మారిన వైనం ఆ ఇంట్లో వారికే కాకుండా విద్యార్థులకు, సందర్శకులకు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున వచ్చి వీక్షించి వెళుతుంటారు. జనంతోపాటు విద్యార్థులకు అదొక మంచి సందర్శన, పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సెలవు రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు అక్కడికి వచ్చి గంటల తరబడి ఆ చెట్లు, మొక్కలు, పూలతోటలను వీక్షించి వాటి పేర్లు రాసుకుని, ఎక్కడ నుంచి తెప్పించుకుని ఇలా పెంచారన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికుడుగా గుర్తింపు పొందిన శిశుపాల్ ఎంతో శ్రమించి తీర్చిదిద్దిన ఇల్లు దావణగెరెకే వన్నె తెస్తోంది. ఈసందర్భంగా స్థానికులు, విద్యార్థులు మాట్లాడుతూ శిశుపాల్ ఇంటిని చూసిన తర్వాత తాము కూడా తమ ఇంటి వద్ద కనీసం అందులో ఒక శాతమైన పచ్చదనం పెంపొందించు కోవాలని భావిస్తున్నామన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తే ఇంటింటా చెట్లు కాదు, ఊరంతా నందనవనంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..
కట్టెలు లేవు, కిరోసిన్ లేదు, ఎల్పీజీ లేదు కేవలం సూర్యుడి శక్తి తప్ప. ఒక్క చుక్క గ్యాస్ లేదా విద్యుత్తును ఉపయోగించకుండా ఆ కిచెన్ ఏకంగా 50 వేల మందికి వంట చేస్తోంది. అసాధ్యం అనిపిస్తుందా? అదేదో విదేశాల్లోనో, అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలలోనో కాదు. మన ఇండియాలోనే జరుగుతోంది. మన దేశంలోని ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఇది ప్రతిరోజూ కనిపించే దృశ్యం. అక్కడ ఏర్పాటు చేసిన సౌరశక్తి ఆధారిత వంటగది ప్రపంచ స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచానికి క్లీన్ ఎనర్జీ సత్తాను చాటుతోంది. .బ్రహ్మ కుమారీల శాంతివన్ కాంప్లెక్స్లోని ఆరావళి కొండలలో ఎత్తయిన చోట ఏర్పాటు చేసిన ఈ భారీ సెటప్ వేల సంఖ్యలో వేడి, పోషకమైన, శాఖాహార భోజనాలను వండడానికి సూర్యుని శక్తిని ఉపయోగిస్తుంది. ఈ వంటగది సౌర ఫలకాలతో కాకుండా సౌర ఉష్ణ శక్తిపై నడుస్తుంది. అంటే సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి బదులుగా, ఇది సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి వేడిని ఉత్పత్తి చేయడానికి అద్దాలను ఉపయోగిస్తుంది. చాలా వరకు రిఫ్లెక్టర్లు రోజంతా సూర్యుడిని అనుసరించే తిరిగే ఫ్రేమ్లపై అమర్చబడి ఉంటాయి. ఈ కదలిక వారికి పొద్దుతిరుగుడు పువ్వుల మాదిరిగానే గరిష్ట సౌర శక్తిని సంగ్రహించడానికి సహాయపడుతుంది!ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది..సూర్యకాంతి రిఫ్లెక్టర్ కేంద్ర బిందువును తాకినప్పుడు, ఉష్ణోగ్రతలు 800డిగ్రీల వరకు పెరగవచ్చు – అది సీసం కరిగించేంత వేడిగా ఉంటుంది!. ఈ తీవ్రమైన వేడిని ఆవిరిగా మార్చి ఉపయోగిస్తారు. అదే వంటగదికి శక్తినిస్తుంది. ప్రతి రిఫ్లెక్టర్ సాంద్రీకృత కాంతి ప్రత్యేకంగా రూపొందించిన 42 స్టీల్ రిసీవర్లపైకి మళ్ళించబడుతుంది. ఇవి వేడిని గ్రహించి నీటిని ఆవిరిగా మారుస్తాయి. దాంతో ప్రతిరోజూ 3,500 కిలోగ్రాములకు పైగా ఆవిరి ఉత్పన్నమవుతుంది.ఆహారం ఎలా వండుతారంటే...ఆవిరిని ఆరు ఇన్సులేట్ చేసిన హెడర్ పైపుల ద్వారా సేకరించి సెంట్రల్ స్టీమ్ డ్రమ్లోకి పంపుతారు. ఇక్కడి నుంచి, ఇది వంటగది లోపల ఉన్న భారీ వంట పాత్రలలోకి పంపిణీ అవుతుంది అలా బియ్యం, పప్పులు, కూరలు వండేందుకు ఇక్కడ ఇది ఉపకరిస్తుంది. ఎటువంటి నిప్పు ఉద్గారాలు లేకుండా పాత్రలను కడగడం క్రిమిరహితం చేయడం ఇలా ప్రతిదీ శుభ్రంగా సమర్ధవంతంగా జరుగుతుంది. ఇది కేవలం అద్దాల ప్యాచ్వర్క్ కాదు. మొత్తం వ్యవస్థ సెమీ–ఆటోమేటెడ్. ప్రతి సాయంత్రం ఫోటోవోల్టాయిక్–శక్తితో పనిచేసే మోటారు టైమర్ సిస్టమ్ రిఫ్లెక్టర్లను రీసెట్ చేస్తుంది. కాబట్టి అవి మరుసటి రోజు మళ్ళీ సూర్యుడిని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. డీజిల్ బ్యాకప్ వ్యవస్థ (వర్షాకాలంలో మాత్రమే ) వల్ల మేఘావృతమైన రోజులు వర్షంలో కూడా, వంటగది ఆగదు. ఈ వ్యవస్థ 1998లో మొదటిసారి పూర్తిగా ప్రారంభించబడినప్పుడు, రోజుకు 20,000 భోజనాలను వండడానికి అనేది ఉద్ధేశ్యం కాగా మౌలిక సదుపాయాలను విస్తరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరిన్ని మాడ్యూల్లను జోడించడం ద్వారా ఇది త్వరగా అంచనాలను అధిగమించింది. నివాసితులు, స్వచ్ఛంద సేవకులు, అతిథులు విద్యార్థులు ఇలా విభిన్న వర్గాలకు కలిపి ఈ వంటగది ఇప్పుడు ప్రతిరోజూ 50,000 మందికి సేవలు అందిస్తుంది. అది ప్రతిరోజూ సూర్యకాంతితో మొత్తం స్టేడియంకు ఆహారం ఇవ్వడంతో సమానం అందుకే దీనిని బిబిసి వరల్డ్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వంటగదిగా పేర్కొంది.(చదవండి: 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు..! ఎలాంటి శిక్షణ లేదు కేవలం..)
ఫొటోలు
అంతర్జాతీయం

పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే
వాషింగ్టన్: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది. గ్రీన్కార్డ్ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది.

భగ్గుమన్న సరిహద్దు వివాదం
బ్యాంకాక్: థాయ్లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది. ఏం జరిగిందంటే..ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.పేలిన మందుపాతరబుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది. ప్రతిగా కాంబోడియా సైతం థాయ్తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగాభారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్కోర్ను థాయ్లాండ్లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్తో వివాదంథాయ్లాండ్లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్ను రూపొందించింది. ఈ మ్యాప్లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్మ్యాప్పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్ను ఎఫ్టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.

బ్రిటన్ కింగ్ ఛార్లెస్ను కలిసిన మోదీ
లండన్: బ్రిటన్లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్ రాజు ఛార్లెస్ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్ ప్రాంతంలోని సాండ్రింగ్హామ్ హౌస్కు విచ్చేసిన మోదీని ఛార్లెస్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు. ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్కర్చీఫ్ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది.
జాతీయం

డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది. అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం జమ్మూ–కశ్మీర్లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్కు జారీ చేసిన నోటిఫికేషన్ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.

విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే: సుప్రీం
న్యూఢిల్లీ: యువత, ముఖ్యంగా విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇది వ్యవస్థాగత లోపానికి నిదర్శనం. ఈ జాఢ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం’’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ 17 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్ను శుక్రవారం విచారించింది. ఈ అంశంపై 15 మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘విద్యా సంస్థల్లో విద్యార్థి–కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్లైన్ నంబర్లు, టెలీ–మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఏటా కనీసం రెండుసార్లు తప్పనిసరి మానసిక శిక్షణ తీసుకోవాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి’’అని పేర్కొంది. ‘‘2022లో భారత్లో 1.7 లక్షల పైచిలుకు ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 7 శాతానికి పైగా, అంటే 13,044 విద్యార్థుల ఆత్మహత్యలే. వీటిలోనూ 2,248 ఆత్మహత్యలు నేరుగా పరీక్షల ఫలితాలతో సంబంధమున్నవే కావడం మరింత బాధాకరం’’అంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది. ‘‘స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, శిక్షణ కేంద్రాల వంటివాటిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక రకంగా మానసిక ఆరోగ్య సంక్షోభం. ఇదే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసిక ఆరోగ్యం రాజ్యాంగం కల్పించే జీవించే హక్కులో భాగం’’అని గుర్తు చేసింది. దీనిపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.

ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్సభలో నినాదాల హోరు లోక్సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది.

బ్రాండ్ పురుష్
మలయాళ సినీ హీరో మోహన్లాల్ నటించిన కొత్త పాత్ర ఒకటి ఇంటర్నెట్లో ఇప్పుడు ఆలోచన రేకెత్తిస్తోంది. అది సినిమా పాత్ర కాదు. ‘విన్స్మెరా’ బ్రాండ్ జ్యూయల్స్ యాడ్. ముచ్చటైన ఒక నెక్లెస్ను చూసి ఆగలేక, దాన్ని తన మెడలో వేసుకుని, అద్దంలో చూసుకుని మురిసిపోతున్న పురుషుడిగా మోహన్లాల్ అందులో నటించారు. ఊరికే మురిసిపోలేదు. స్త్రీ హృదయంతో పరవశించి నాట్య మయూరం అయ్యారు. ఆభరణాలను ధరించి మోహన్లాల్ మైమరిచిపోతే, ఆయన్ని చూసి నెటిజన్లు ముగ్ధులైపోయారు. అంతపెద్ద హీరో స్త్రీ మనోభావాలతో నటించటం విశేషమే అయినా, అలాంటి యాడ్ను ఒక బ్రాండ్ వాణిజ్య ప్రకటనగా విడుదల చేయటం సాహసమే.మగవాళ్లలో ధీరత్వం ఉండాలి. స్త్రీలలో లాలిత్యం ఉండాలి. ఇదీ శతాబ్దాలుగా మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్న భావన. ఇదే వ్యాపార ప్రకటనల్లోనూ ప్రతిఫలిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్లే స్త్రీ, పురుషులు వేర్వేరు ఉత్పత్తులకు ప్రచారం ఇస్తూ కనిపిస్తుంటారు. ఇప్పుడీ ధోరణిలో మార్పు వస్తోంది. మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లు తమ వ్యాపార ప్రకటనల్లో పురుష ధీరత్వాల తెరల్ని మెల్లగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ మార్కెటింగ్ డేటా విశ్లేషణ సంస్థ ‘కాంతార్’.. ఈ మార్పు వేగంగా జరగటం లేదని, గతేడాది 450 కంటే ఎక్కువ ప్రకటనల్లో దాదాపు 94 శాతం సంప్రదాయ పురుష మూస పాత్రలే ఉన్నాయని తన తాజా నివేదికలో వెల్లడించింది.ఒక శాతం గానే ప్రగతిశీలత..: గత ఏడాది యాడ్స్లో కనిపించిన పురుషాధిక్య మూసపాత్రల డేటాను విశ్లేషిస్తూ ‘ది ఇండియన్ మాస్క్యులినిటీ మేజ్’ పేరిట కాంతార్ ఈ నివేదికను విడుదల చేసింది. భారతీయ పురుషుల్లో స్వచ్ఛంగా ఇంటి బాధ్యతలను స్వీకరిస్తున్న ధోరణి కనిపిస్తున్నప్పటికీ వ్యాపార ప్రకటనలు 1 శాతం మాత్రమే ఆ ధోరణిని ప్రతిఫలిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ప్రకటనదారులు కొంత ప్రగతిశీలంగా మారిన మాటను కాదనలేమని, అందుకు నిదర్శనంగా రేమండ్, ఏరియల్, తనిష్క్, గుడ్నైట్, విమ్ వంటి బ్రాండ్లు గతంలో తయారు చేసిన వ్యాపార ప్రకటనల్ని చూడవచ్చని పరిశ్రమలోని వారు అంటున్నారు.‘పవర్’ వైపే బ్రాండ్ల మొగ్గు..: మార్కెట్లో ముఖ్యమైన బ్రాండ్లు తమ అమ్మకాలు పెంచుకోడానికి వ్యాపార ప్రకటనల్లో నేటికీ ‘స్టార్’ పవర్ పైనే ఆధారపడుతున్నాయి. ప్రేక్షకులు రణ్వీర్ సింగ్ లేదా విరాట్ కోహ్లీ వంటి ఇమేజ్ ఉన్న వారి పైనే మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు భిన్నంగా లక్స్ తన ప్రకటన కోసం షారుఖ్ ఖా¯Œ ను గులాబీ రేకులు ఉన్న బాత్ టబ్లో ఉంచటం చూస్తే.. ప్రకటనలు ఇప్పుడు పురుషత్వపు అతిశయోక్తి భావనల నుంచి దూరంగా జరిగే సాహసం చేస్తున్నాయని స్పష్టమౌతోంది. మోహన్లాల్తో విన్స్మెరా ప్రకటన ఇందుకు తాజా ఉదాహరణ.సంస్కరణలకు పిలుపు దేశంలోని ఎనిమిది నగరాల్లో 880 మంది పట్టణ భారతీయ పురుషులపై (18–45 సంవత్సరాల వయస్సు) కాంతార్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. 12 భాషల్లో 150కి పైగా చానళ్లలో ప్రసారమైన 450కి పైగా టీవీ ప్రకటనల్ని నిశితంగా పరిశీలించింది. ప్రపంచంలోనే అది పెద్ద మార్కెట్ అయిన భారత్లోని బ్రాండ్లు తాము రూపొందించే ప్రకటనల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని కనబరచవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారతీయ పురుషుల్లో ధీరత్వమే కాదు.. మహిళల్లా సుతిమెత్తనితనమూ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి పురుషుడిలోనూ స్త్రీత్వమూ ఉంది. ఎంతోమంది మగాళ్లు ఇంటి బాధ్యతలనూ పంచుకుంటున్నారు. కానీ ప్రకటనల ప్రపంచం ఈ మార్పులకు అనుగుణంగా లేదు.⇒ యువకులు (ముఖ్యంగా జెన్ జెడ్) భావోద్వేగాల పరంగా మునుపటి తరం కన్నా భిన్నంగా ఉన్నారు. మార్పునకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకాలం స్త్రీల బాధ్యతలు అనుకంటూ వస్తున్న పనులను తమకై తామే స్వీకరిస్తున్నారు. అయితే వ్యాపార ప్రకటనలు ఇంకా ఒకప్పటి మగధీరత్వాన్నే కీర్తిస్తూ ఉన్నాయి.⇒ మిలీనియల్స్లో 41 శాతం, జెన్ జడ్ పురుషుల్లో 31 శాతం మంది వ్యాపార ప్రకటనలలోని పురుష పాత్రలు తమ మనస్తత్వానికి పూర్తి భిన్నంగా, ప్రతికూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.⇒ అదే సమయంలో, ‘నిజమైన పురుషులు ఏడవరు’ అనే మాటను 71 శాతం మంది పురుషులు అంగీకరిస్తున్నారు.సర్వే హైలైట్స్⇒ ప్రకటనల్లో కేవలం 6% పురుష పాత్రలు మాత్రమే స్త్రీల పట్ల గౌరవాన్ని, భావోద్వేగ సహానుభూతిని చూపించాయి.⇒ 94% ప్రకటనల్లో సంప్రదాయ పురుష పాత్రలే ఉన్నాయి.⇒ ప్రకటనల్లో 43 % వాయిస్ ఓవర్లు పురుషులవే. స్త్రీలవి 31% మాత్రమే. మిశ్రమ కథనాల వాయిస్ ఓవర్లలో కూడా పురుషుల ఆధిక్యమే కనిపిస్తోంది.⇒ కేవలం 1% పురుషులు మాత్రమే ప్రకటనల్లో పిల్లల సంరక్షణ, ఇంటి పనుల్లో కనిపించారు.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..
కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi)

HYD: ప్రేమ జంటకు ఆశ్రయమిస్తే కటకటాల్లోకే!
ఫిలింనగర్: ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువతీ, యువకులను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో సదరు బాలిక ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె మైనర్ కావడంతో ఆమె ప్రియుడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో భాగంగా బాధితురాలు తమకు ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో నివసించే కోనె అఖిల్ అనే యువకుడు తన గదిలో ఆశ్రయం ఇచి్చనట్లు చెప్పింది. దీంతో బాలికతో పాటు ఆమె ప్రియుడికి చట్టవిరుద్ధంగా గదిని ఇచ్చినందుకుగాను పోలీసులు కోనె అఖిల్, అతడికి సహాయపడిన నిఖిత అనే యువతిని గురువారం అరెస్టు చేశారు. బీజేఆర్నగర్ బస్తీకి చెందిన యువకుడు, మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తరచూ కలుసుకునేందుకు అఖిల్ పలుమార్లు తన గదిని ఇచ్చాడు. అంతేగాక ఇదే బస్తీలో నివసించే నిఖిత అనే యువతి కూడా వీరికి పలుమార్లు ఆశ్రయం కల్పించింది. ఇలా గదులు ఇవ్వడం చట్టవిరుద్ధం కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గదులు ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. బస్తీల్లో, కాలనీల్లో, అపార్ట్మెంట్లలో ఎవరైనా స్నేహితులకు తమ గదులను ఇస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ సంతోషం హెచ్చరించారు. ముఖ్యంగా ఫిలింనగర్ 18 బస్తీల్లో కొందరు ప్రేమ జంటలకు తమ గదులను వాడుకునేందుకు ఇస్తున్నట్లుగా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇళ్ల యజమానులు తమ ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి ఇంటికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలుసుకుని అనుమానాస్పదంగా ఉంటే బయటకు పంపించాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.