
30 కోట్ల మొక్కలతో హరితహారం
ఈ నేపథ్యంలో మూడో విడత హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటడానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కనీసం 50 మొక్కలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటే వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించేలా కార్య చరణను రూపొందిం చారు. పెద్దఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. హరితహారంలో ఈసారి కొత్తగా సీడ్ బాల్ పద్ధతిని అమలు చేయనున్నారు.
గుండ్రటి మట్టి ముద్దల్లో ముందుగానే ఎరువులు, విత్తనాలను కలిపి ఉంచుతారు. వాటిని ఏటవాలుగా ఉండే ప్రదేశాలు, కొండలు, గుట్ట ప్రాంతాల్లో చల్లితే సరిపోతుంది. వాటిని ప్రత్యేకంగా నాటాల్సిన పనిలేదు. హరితహారం పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1,645 కోట్లు వెచ్చించింది. అయితే గత రెండు విడతల్లో నాటిన మొక్కల సంరక్షణ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ సర్కార్... మూడో విడతలో మొక్కల రక్షణ బాధ్యతను ప్రభుత్వ పరంగా, ప్రజా చైతన్యంతో చేపట్ట బోయేందుకు సిద్ధమవుతోంది.