K Chandrashekar Rao (KCR)
-
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది ‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ ‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్రావు, కవిత ఇతర ముఖ్య నేతలు 7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం ‘ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్ కమిటీ బాధ్యతలు హరీశ్రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్ తెలిపారు. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి ‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్ఎస్ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. అభిప్రాయాలు వెల్లడించిన నేతలు సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, రాకేశ్రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీశ్రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు. -
కేసీఆర్కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
అసెంబ్లీకి వెళ్లనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తుంటి ఎముక సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొనేందుకు గత రెండు విడతల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదురుగా ఉన్న గన్పార్కులో నివాళులు అర్పించనున్నారు. మరోవైపు పార్టీ మారిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే జాబ్ కేలండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో గళం వినిపించనుంది. చేనేత కార్మీకుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షల వల్ల రైతులకు జరుగుతున్న నష్టం తదితరాలను కూడా ప్రస్తావించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీకి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారు. నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ... అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళవారం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మేడిగడ్డ బరాజ్ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కమిషన్ నుంచి తప్పుకోండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు.. విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణిజస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్లలో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, అంబేడ్కర్ ఓవర్సీస్, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలి.. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే. మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్ తెలంగాణకు కేసీఆర్ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్నిజామాబాద్ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి నిజామాబాద్లో అందజేశారు. నగరంలో రోడ్ షో ముగిసిన అనంతరం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్కు రాకేశ్ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నాయకులు మహేశ్ బిగాల, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్గల్ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు. -
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
12 లోక్సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్షోలలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. పంటలు ఎండటం ఇదే మొదటిసారి బీఆర్ఎస్ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులకు అన్యాయం జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. ధాన్యం ఎందుకు కొనడం లేదు? తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్ డ్యామ్పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్ టెయిల్ పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. తులం బంగారం ఏమైంది? మా హయాంలో రూ.200 పెన్షన్ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ కాన్వాయ్లో వాహనాలు ఢీ మిర్యాలగూడ టౌన్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొన్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కేసీఆర్ భయపడతడా? ‘‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. లోక్సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు.మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రైతులతో కేసీఆర్ మాటా మంతీ నల్లగొండ రూరల్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. అన్నెపర్తి వద్ద.. రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్.. కేసీఆర్: ఎందుకు.. ఏమైంది? రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. కేసీఆర్: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్ అరవింద్రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు) మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్. ఐకేపీ సెంటర్లో బాధలు చూడాలి సార్. కేసీఆర్: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆర్జాలబావి వద్ద.. రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్. కేసీఆర్: ధాన్యం కొంటలేరా? రైతు: కొంటలేరు సార్. ఎండకు చస్తున్నాం. కేసీఆర్: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్పై మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేసీఆర్
ఇది పాలకుల అసమర్థత కాదా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు? కేసీఆర్ గడప దాటగానే కట్టేసినట్టుగా బంద్ అవుతదా? ఇది పాలకుల అసమర్థత కాదా? ఆలోచించాలి. మేం టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ శాఖను నడిపాం. ఎలా బాగా నడపవచ్చో వారికి తెలుసు కాబట్టే సమర్థంగా నడిచింది. ఇప్పుడు ఐఏఎస్ను నియమించారు. వారికి విషయం పట్టుబడదు.. మంత్రులు పట్టించుకోరు. తీరిక లేదు. ఈ పాలకులకు రాజకీయాల కోసం తీరిక ఉందిగానీ.. ప్రజల కోసం తీరిక లేదు. సీఎం ఎక్కడ పడుకున్నరు? గత డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమన్నరు. డిసెంబర్ 9 పోయి ఎన్నాళ్లయింది? నాలుగు నెలలు అవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడున్నరు? ఎక్కడ పడుకున్నరు? మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు. మేం వెంటపడి తరుముతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా విడిచిపెట్టేది లేదు. కేవలం 1.8 శాతం ఓట్లతో గెలిచావు. మిమ్మల్ని తరిమికొడతాం. నిద్రపోనియ్యం. వెంటనే రుణమాఫీ చేసి తీరాల్సిందే. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసమర్థ, తెలివిలేని, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆరోపించారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడుతామన్నారు. ధర్నాలు చేస్తామని.. అవసరమైతే ఎక్కడికక్కడ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏప్రిల్ 2, 6 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించా. చాలాచోట్ల రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పరిహారం ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే నమ్మి పంటలు వేశామని.. మొదటే ఇవ్వబోమని చెప్పి ఉంటే వేసుకునే వాళ్లం కాదని వాపోయారు. ప్రభుత్వం మొదట ఇచ్చి తర్వాత బంద్ చేసి నష్టం చేకూర్చిందని బాధపడ్డారు. మేం ఏడెనిమిదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణతో, స్పష్టమైన విధానాలతో రైతులు బాగుపడేలా చేశాం. ఇన్నాళ్లూ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో వంద రోజుల్లోనే దుర్భరమైన పరిస్థితిని చూస్తామనుకోలేదు. రైతులు ఇంతగా ఏడ్చే పరిస్థితి వస్తుందనుకోలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం.. మేం రూ.35వేల కోట్లు వెచ్చించి అగ్రగామిగా నిలిపిన విద్యుత్ రంగం.. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఉన్న వ్యవస్థను ఉన్నట్టు నడిపించలేని ఈ అసమర్థత ఏందీ? ఉన్న దాన్ని ఉన్నట్టు నడిపించే తెలివిలేకపోతే ఎలా? ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యమే. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మేం పవర్గ్రిడ్కు అనుసంధానించి.. కరెంట్ సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ తీసుకునే విధంగా చేశాం. 7వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 18 వేల మెగావాట్లకు పెంచాం. అదనంగా 1,600 రామగుండంలో, 4 వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో కలిపి 5,600 మెగావాట్లు అదనంగా వచ్చే పరిస్థితి కల్పించాం. ఈ ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ను పట్టించుకోవడం లేదు. పట్టించుకుని ఉంటే రెండు యూనిట్ల ద్వారా సొంతంగా మరో 1,500 మెగావాట్లు వచ్చేది. ఇంత ఉజ్వలమైన పవర్ సిస్టం ఉన్నా ఎందుకు ఇబ్బంది అవుతోంది? అవసరమైనప్పుడు కరెంటు కొనాలె.. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైతే ప్రభుత్వం అప్పులు చేయాలె. పీక్ అవర్స్లో ఎంత షార్టేజ్ ఉంటే అంత కరెంటు కొనాలి. రైతులకు ఇవ్వాలి. మేం అదే చేశాం. అందుకే ఆనాడు రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మేం ఉన్నప్పటికంటే ఇప్పుడు లోడ్ ఐదారు వందల మెగావాట్లు డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అవసరమైనంత కొంటలేదు. అందుకే కరెంటు వస్తలేదు. ఎనిమిదేళ్లుగా కాలిపోని మోటార్లు ఇప్పుడు కాలిపోతున్నాయని చాలా మంది రైతులు చెప్పారు. రోజుకు ఆరేడుసార్లు వస్తోంది, పోతోంది. అయినా సర్కారుకు చీమ కుట్టినట్టు లేదు. మేం రైతుల గురించి రూ.20, 30 వేల కోట్లు అయినా పెట్టాం. గట్టిగా పంటలు పండితే అవి నాలుగేళ్లలో తీరిపోయాయి. పంటలు ఎందుకు ఎండుతున్నాయి రాష్ట్రంలో పంటలు ఎండిపోని జిల్లానే లేదు. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 3.5 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. ప్రతి ఊళ్లో 200 నుంచి 400 ఎకరాల దాకా ఎండిపోతోంది. సాగర్ ఆయకట్టు ఎందుకు ఎండుతోంది? ఈ రోజు కూడా సాగర్లో మినిమమ్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్) కంటే పైన 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కింద మరో ఏడెనిమిది టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 14, 15 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. కానీ తెలివి హీనంగా సాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డుకు అప్పగించి, సాగర్ కట్టమీదకు వెళ్లలేని దుస్థితిని తీసుకొచ్చారు. ప్రభుత్వం మెడలు వంచుతాం ఖమ్మం, మహబూబ్నగర్, ఇతర జిల్లాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. రూ.500 కోట్లను రైతులకు అందించాం. అప్పుడు అది సరిపోదని, రూ.20 వేల చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే వడగళ్ల వాన పడి నష్టపోతే అడిగే దిక్కులేదు. అకాల వర్షాలతో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్నా.. మాట్లాడేవాళ్లు లేరు. మంత్రి పోడు, ఎమ్మెల్యే పోడు.. ఎంపీలు పోరు, అధికారుల బృందాలు పోవు.. దొంగల్లా ముఖం చాటేస్తారు. ముఖ్యమంత్రికి పట్టింపే లేదు. ఆయనకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఏయే జిల్లాల్లో, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతెంత పంట ఎండిపోయిందనే లెక్కలు తీయాలి. ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తాం. ఎక్కడికక్కడ మంత్రులు, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి. కచ్చితంగా లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజారుకీడుస్తాం. హామీ ఇచ్చినట్టుగా వరికి రూ.500 బోనస్ కూడా ఇవ్వాలి. ఇందుకోసం కోసం ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తాం. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యేలు, మేము ఇస్తాం. 6వ తేదీన నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేస్తాం. కళ్లాల వద్ద నిలదీస్తాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం బీఆర్ఎస్ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు. మీ తరపున పోరాడుతాం. నేను మీ వెంటే ఉంటా. హక్కులను సాధించుకుందాం..’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చిల్లర రాజకీయాలతో కాళేశ్వరంలోని నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీల్లో నీటిని వదిలిపెట్టి, సీపేజీలో పోయే నీటిని ఫొటోలు తీసి, వీడియోలు తీసి, ప్రాజెక్టు ఖతం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు. నిన్న యూపీలోనో, బిహార్లోనో బ్రిడ్జి కూలిపోయింది. ప్రపంచం మునిగిపోయిందా? మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి మాట్లాడుతున్నరు. నాగార్జునసాగర్ కుడివైపు కుంగలేదా? పునరుద్ధరించలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలో ఓ డ్యాం నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వారు విడిచిపెట్టారా? కొందరు ఇంజనీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన సమస్యతోనో, జియాలజీ సమస్యతోనో ఓ పిల్లర్ కింద ఇసుక కొట్టుకపోతే.. ప్రపంచం బద్ధలైనట్టు, ప్రళయం వచ్చినట్టు చిల్లర కథలు చెప్పి నీళ్లివ్వడం లేదు. మరి సమ్మక్క బ్యారేజీకి ఏమైంది. దేవాదుల నుంచి ఎందుకు పంప్ చేయట్లేదు. ఒక్కసారిగా నీళ్ల కొరత ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలు కొనియాడిన మిషన్ భగీరథ ఉండగా ఎందుకు మంచి నీళ్ల కొరత వచ్చింది? ఐదేళ్లు బ్రహా్మండంగా నడిచిన పథకంలో ఎందుకు లోపం వస్తుంది? ఎందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీటి సమస్య వస్తోంది. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది? ఇందుకు కారణం సీఎం, మంత్రులే. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే సమీక్ష చేయడం లేదు. వారికి పట్టింపు లేదు. పథకాన్ని వాడుకునే తెలివి లేదు. ఏదైనా పాడైతే ఇప్పుడు 15 రోజులైనా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావాలంటే నాణ్యమైన విద్యుత్ 24 గంటల సరఫరా ఉండాలి. దానిపై దృష్టి లేదు. జూన్ దాకా అంటే మరో మూడు నెలల వరకు వానలు పడే అవకాశం లేదు. ఇంకా నీటి సమస్య తీవ్రం కాకుండా మిషన్ భగీరథను పునరుద్ధరించాలి. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
నేటి నుంచి భేటీలతో దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్టీ అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నుంచి లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేసి క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని అభ్యర్థులను ఆదేశించారు. మరోవైపు మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, కరువు పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ప్రచార షెడ్యూల్పై కొనసాగుతున్న భేటీలు ఏప్రిల్ రెండో వారం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కో లోక్సభ సెగ్మెంట్ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పరేడ్ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు లక్ష్యంగా ఎజెండా.. ఎన్నికల ప్రచార షెడ్యూల్, ప్రచార ఎజెండా తదితరాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్రావు, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలిసింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు, ప్రచారం చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల ఉల్లంఘన, అప్రజాస్వామిక విధానాలు, బెదిరింపులు, వేధింపులు వంటి అంశాలను ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ నియంతృత్వం, అణచివేత విధానాలు, లౌకికత్వానికి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలనూ ఎత్తి చూపాలని భావిస్తున్నట్టు సమాచారం. జెండా మోసిన వారికే పెద్దపీట పార్టీ జెండా మోసిన వారికి పెద్దపీట వేస్తూ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కేసీఆర్ పూర్తి చేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును సోమవారం ఖరారు చేశారు. మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను ఇంతకుముందే నాలుగు విడతల్లో 16 మంది పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది. అందులో 13 మంది పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారుకాగా.. ముగ్గురు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరినవారు. నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక్కరే ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత దక్కింది. రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన సీట్లలో సగం బీసీలకే కేటాయించింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్సీలకు మూడు (రెండు మాదిగ, ఒక మాల), ఎస్టీలకు రెండు (బంజారా, గోండులకు చెరొకటి), బీసీలకు ఆరు (మున్నూరు కాపు రెండు, ముదిరాజ్, గౌడ, యాదవ, కురుమలకు ఒక్కోటి), ఓసీలకు ఆరు (నాలుగు రెడ్డి, వెలమ, కమ్మకు చెరో స్థానం) సీట్లు కేటాయించింది. కొత్త అభ్యర్థులు తెరమీదకు..! బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు ఇతర పార్టీల్లో చేరగా.. కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడారు. ఈ క్రమంలో ముగ్గురు సిట్టింగులతోపాటు కరీంనగర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పొందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్కుమార్లకు పోటీ అవకాశం దక్కింది. ఇక నేతలు పార్టీని వీడిన చోట కొత్తవారికి ఇన్చార్జులుగా బా«ధ్యతలు అప్పగిస్తున్నారు. సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఖైరతాబాద్లో మన్నె గోవర్ధన్రెడ్డిలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. -
చర్చకు సిద్ధం.. కేసీఆర్కు కిషన్రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: బీరు, బ్రాందీ వ్యాపారాలు చేసి.. ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నిలదీశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు సంస్థల నోటీసులకు ఆన్సర్ ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకొని తిరిగారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ దీని మీద డొంక తిరుగులు తిరుగుతూ.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు కాదు.. సాక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధం లేదని కేసీఆర్ చెప్తారా?. ఆప్ నేతలకు ఢిల్లీ స్కాంకి ఆప్ నేతలకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? అంటూ కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్లు చేతులు మారాయని నేను నిరుపిస్తా?. ఇది తప్పని కేసీఆర్ నిరుపిస్తారా?. దీనిపై చర్చకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్ట్కు, తెలంగాణకు సంబంధం పెడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ను కాంగ్రెస్ కూడా తప్పు బడుతుంది. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు చేసే పార్టీ. కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కోల్డ్ స్టోరేజ్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది’’ అని ధ్వజమెత్తారు. ‘‘గతంలో కేసీఆర్ అవినీతిపై రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ దర్యాప్తు ఏమైంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయలేమని వారు రీప్లే ఇచ్చారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా?. మీకు దమ్ముంటే సీబీఐ దర్యాఫ్తు కు లేఖ రాయండి. మీరు లేఖ రాసిన రెండు గంటల్లో అనుమతి ఇప్పించే బాధ్యత నాది’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ సీఎం రమేష్పై ఫోర్జరీ కేసు -
కేజ్రీవాల్, కవిత అరెస్ట్పై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్య క్షుడు, మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రజల స్పందన, ప్రభుత్వ వ్యతిరేకత, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పనితీరు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పలువురు నేతలు పార్టీని వీడటం ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తుండగా, పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత భరోసా ఇస్తున్నారు. జిల్లాల వారీగా భేటీలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలతో పాటు జిల్లాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కేసీఆర్ను కలుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మిగతా ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మెదక్, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు. నాగర్కర్నూలు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేరు ఖరారు కాగా హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థి బరిలోకి దిగుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పైళ్ల శేఖర్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరమీదకు రాగా, దాసోజు శ్రవణ్ పేరు కూడా వినిపిస్తోంది. సోమవారం హోలీ పండుగ తర్వాత బీఆర్ఎస్ తుది జాబితా వెలువడే అవకాశముంది. మంచి ఫలితాలు ఖాయం! మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టి కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూరులో ఎమ్మెల్సీ దండె విఠల్, ముధోల్లో వేణుగోపాలచారి, హుజూర్నగర్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తదితరులు ఎన్నికల సన్నాహాలను సమన్వయం చేస్తున్నారు. కింది స్థాయిలో స్థానికంగా చురుగ్గా ఉన్న కేడర్కు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు జిల్లాల వారీగా ఫోన్ల ద్వారా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ సర్వే ఏజెన్సీల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు ఆయనను కలిసిన నేతలు చెప్తున్నారు. మెదక్లో హరీశ్ పోటీ చేస్తారనే ప్రచారం మాజీ మంత్రి హరీశ్రావు మెదక్ లోకక్భ బరిలో ఉంటారని సామాజిక మాధ్యమాల్లో గురువారం విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని, అలాంటి చర్చ పార్టీలో జరగడం లేదని హరీశ్ స్పష్టత ఇచ్చారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తారంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్తో సుదీర్ఘ భేటీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో ఈ నెల 16న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకున్న హరీశ్ గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కవిత విచారణ సహా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ శనివారం హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశముంది. -
మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం లభించింది. దీంతో మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. నాగర్కర్నూల్ లోక్సభ స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉండటంతో, మరో ఐదు స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థు లను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్ ఉన్నాయి. కాంగ్రెస్ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు, ప్రచార షెడ్యూల్పై స్థానికంగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో గురువారం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు పార్టీ అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అయితే ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంద్రకరణ్రెడ్డి గైర్హాజరుపై కేసీఆర్ ప్రశ్నించగా, వ్యక్తిగత పనులతో రాలేకపోయినట్లు నిర్మల్ జిల్లా నేతలు వెల్లడించారు. అయితే ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి గైర్హాజరు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని.. ఈ నెల 12న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారన్న కేసీఆర్.. బీఆర్ఎస్తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ పట్టించుకోవద్దని.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే యాదికొస్తాం.. ఎల్ఆర్ఎస్ గతంలో మనం ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామంటూ కామెంట్ చేసినోళ్లు.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి టైం సరిపోతుంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తాం. బీఆర్ఎస్కు గెలుపు, ఓటములు కొత్త కాదు. కుంగి పోయేది...పొంగి పోయేది ఏమీ లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం.. మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
22న ఢిల్లీకి కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 22న ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. పొత్తు లేదని ఇరు పార్టీలూ చెబుతున్నా.. లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు అవకాశం లేదని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీల నేతలు తెగేసి చెప్తున్నా.. ఆ వాదనలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలతో పాటు కొందరు కీలక నేతలు కూడా ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాకుండా లోక్సభ షెడ్యూలు విడుదల తర్వాతే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో కీలక నేతలతో భేటీ.. విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూలు మరో వారం పది రోజుల్లో వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమీక్ష, సన్నద్ధత సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎన్నికలకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్లో ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్ఎస్ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కేఆర్ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి -
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. -
రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగే ఎన్నికకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలతో చర్చించి వద్దిరాజు అభ్యర్థిత్వంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వద్దిరాజు గురువారం నామినేషన్ దాఖలు చేస్తారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్కు రెండు.. బీఆర్ఎస్కు ఒకటి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వద్దిరాజు రవిచంద్ర తన రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున లభించనుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్కుమార్ యాదవ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు పేరు ఖరారు కావడంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. వరుసగా రెండోసారి.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వద్దిరాజు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2022 మేలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ రాజీనామా చేయడంతో అదే నెల 23న వద్దిరాజును బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో వద్దిరాజుకు రెండోమారు బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. -
కట్టె కాలేవరకు పులిలా కొట్లాడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తనకు చేతనైనా కాకపోయినా.. తన కట్టె కాలే వరకు, చివరి శ్వాస వరకు ప్రజలకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతానని.. లేచి కొట్లాడతా తప్ప పిల్లిలా ఉండనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఆరునూరైనా ప్రజలకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు ‘‘చలో నల్లగొండ’ రాజకీయ సభ కాదు.. కొందరికి రాజకీయం. మనకు మాత్రం ఉద్యమ, పోరాట సభ. కృష్ణా నీళ్లపై ఆధారపడిన మన బతుకులకు సంబంధించిన సమస్య. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య. చావో రేవో తేల్చే సమస్య. అందుకే నా కాలు విరిగిపోయినా కుంటి నడకతో కట్టె పట్టుకొని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చింది. కొంతమంది మంది సన్నాసులు తెలివి లేక, వాళ్లకు వ్యతిరేకంగా ఈ సభ పెట్టామని అనుకుంటున్నారు. వారిలా ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నీటి పారుదల మంత్రికి, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు ఈ సభ ఒక హెచ్చరిక..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లు కోసమే తాత్కాలిక సర్దుబాటుకు ఒప్పుకున్నాం ‘ఆనాడు అధికారంలో ఉన్న, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తరువాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదొక ఆటంకం కాకూడదు. తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో సరే కానివ్వండి అని చెప్పినం. ఆ తరువాత వాళ్లు పోయి మోదీ ప్రభుత్వం వచ్చింది. మేం మునిగిందే నీళ్లల్లో.. నీళ్లు లేక మా బతుకులు ఆగమైపోయాయి.. వెంటనే నీళ్లు పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్ వేయమన్నా వేయలే. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లి తగాదా పెట్టాం. ఆ తరువాత మీటింగ్లో మేము గట్టిగా నిలదీస్తే మీరు కేసు ఉపసంహరించుకోండి.. నీటి పంపకాలకు మేము ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం అని చెబితే ఉపసంహరించుకున్నాం. అయినా తొందరగా వేయలేదు. మళ్లీ ఉత్తరాలు రాశా. లోక్సభ వారం రోజులపాటు స్తంభింపజేశాం. ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు..’ అని తెలిపారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు ‘ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందుకుపోయి గట్టిగా వాదించాలి. అది మొగోడు చేయాల్సిన పని. జనంపై ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరు. ఈ ప్రభుత్వం మన జీవితాలను దెబ్బకొట్టేలా కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించింది. జలాల్లో వాటా తేల్చమని అడుగాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రాజెక్టులను అప్పగిస్తూ సంతకం పెట్టింది. దాని మెమోరాండం దొరికింది. దానివల్ల జరిగే నష్టం నీళ్ల మంత్రిగా పనిచేసిన హరీశ్రావుకు తెలుసు కాబట్టి గర్జించారు. దాంతో నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుంటాం..అని చలో నల్లగొండకు పిలుపు ఇచ్చా. ఇజ్జత్ మానం పోతోందని అతి ముఖ్యమైన బడ్జెట్ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది కూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. ‘ప్రజలు అధికారం ఇచ్చారు. ఐదేళ్లు ఉండండి. మాకు అభ్యంతరం లేదు. నేను నాలుగు రోజులు ఆరాంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏం చేశారు. నల్లముఖం పిల్లిపోయి సచ్చిన ఎలుకను పట్టినట్లు.. ప్రభుత్వం వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పగించింది. కట్టమీద మొత్తం రిజర్వు పోలీసోళ్లు ఉన్నరు. మంచినీళ్లను చిప్పపట్టి అడుక్కోవాలి. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే అడుక్కోవాలి. మనకున్న అధికారులను వారికి అప్పగించారు. నన్ను బెదిరించినా అప్పగించలే. గవర్నమెంట్ను పడగొడతామన్నారు. రాష్ట్రపతి పాలన పెడతమన్నారు. అయినా ఒప్పుకోలేదు. నా తలకాయ పోయినా ప్రాజెక్టులను అప్పగించనని చెప్పా. కానీ ఈ ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీలు వెళ్లి అడిగితే మీ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మాని వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగించి కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. ప్రధానిని నిలదీయాలి. ఆరు నెలల్లో వాటాలు తేల్చండి అంటూ ప్రధాని ఆదేశించేలా పోరాటాలు నిర్వహించాలి..’ అని సూచించారు. దద్దమ్మల రాజ్యం ఇలాగే ఉంటుంది ‘మంత్రి ఉత్తమ్కుమార్ ఉమ్మడి రాష్ట్రమే బాగుందని అసెంబ్లీలోనే అన్నారు. అదే మంచిగుంటే మరి అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది.. కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు.. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయారనే సోయి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు కావాలి.. పైరవీలు కావాలి.. డబ్బు కావాలి తప్ప ప్రజల హక్కుల గురించి పట్టించుకోరు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే 24 గంటల ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం పోగానే ఆ కరెంట్ పోతదా? తొ‘మ్మిదిన్నరేళ్లు ఇచ్చిన కరెంటు ఈరోజు ఏమైంది. ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది. చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది. కరెంటు ఎందుకు ఇస్తలేరు. ఎందుకు తిప్పలు పెడుతున్నారు? ఏమైందిరా బిడ్డా కరెంట్ అని మీరు అడగాలి. బిడ్డా.. ఈ సభతో ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజారుకీడుస్తాం. కరెంటు, సాగునీరు, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం. అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన చరిత్ర వీరిదే. అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్ పోతదా?’ అని కేసీఆర్ నిలదీశారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా.. ‘రైతుబంధు అడిగితే ఇవ్వడానికి చేతకావడం లేదా? ఇంత దద్దమ్మలా.. ఇవ్వకపోతే ఇవ్వలేదు.. రైతు బందు అడిగితే చెప్పుతో కొడతానని రైతులను అంటావా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటయ్. అవి గట్టిగా ఉంటాయ్. ఒక్కసారికి మూడు పళ్లు రాలిపోతాయి. మీకు ఇవ్వడం చేతగాకపోతే తరువాత ఇస్తామని చెప్పు. లేదంటే డబ్బులు లేవని చెప్పాలి. చలో నల్లగొండ పెడితే కేసీఆర్ను తిరగనీయం అంటారా? ఇంత మొగోళ్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయరా? ఏం చేస్తరు చంపుతారా? దా చంపుదువు రా.. కేసీఆర్ను చంపి మీరుంటరా? మీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు పూర్తిచెయ్. మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డ పోతాం అని వెళ్తున్నావు. బిడ్డా మేము కూడా ఈ స్టేజీ మీద ఉన్నోళ్లమంతా పోతాం. మీ బండారం బయట పెడతం. మేడిగడ్డకు పోయి ఏం పీకుతావు. దమ్ముంటే ప్రాణహిత నీటిని ఎత్తిపోయి. డోర్నకల్కు నీరు వస్తలేవు. సూర్యాపేటకు, తుంగతుర్తికి మునుపు వచ్చిన నీరు ఎందుకు తగ్గిపోయాయి..’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఆట»ొమ్మ అనుకుంటున్నవా? ‘కాళేళ్వరం అంటే ఒక ఆట బొమ్మ కాదు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 200 కి.మీ సొరంగాలు, 1,500 కి.మీ కాలువ, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. మేడిగడ్డలో 250 పిల్లర్లు ఉంటాయి. రెండు కుంగిపోయాయి. గతంలో ఎన్నిసార్లు కుంగిపోలే. నాగార్జునసాగర్లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టకపోలేదా? మూసీ గేట్లు కొట్టుకు పోలేదా. ఏదన్న పోతే బాగుచేయాలి. తొందరగా పనిచేసి రైతులకు నీళ్లియ్యాలి. అది చేయకుండా అంత చిల్లర రాజకీయం ఎందుకు? ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మేం మళ్లీ డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తం. అప్పుడు నేను గిట్టనే మాట్లాడాలా? ఇకనైనా ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. ఈరోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు. పార్లమెంటు ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం ఉంది. నేను మీ బిడ్డను. 15 ఏళ్లు పోరాడి, చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు ఆరాటం ఉంటది. రాష్ట్రం నాశనం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకోండి..’ అని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట ‘కొత్త ప్రభుత్వం వచ్చినపుడు గతంలో కంటే బాగా పనిచేయాలి. వాళ్లు వచ్చినప్పటి నుంచి ఒక్కటైన మంచి మాట అన్నరా. పొద్దున లేస్తే కేసీఆర్ను ఎట్లా తిట్టాలనే ఆలోచనే. కేసీఆర్ను తిడితే, బురద జల్లితే పెద్దోల్లవుతారా? అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మాట మార్చుతున్నారు. ధాన్యానికి మద్దతు ధర వస్తే రూ.500 బోనస్ ఇవ్వరట. దొంగ మాటలతో, నంగనాచి మాటలతో తప్పించుకుంటామంటే నడవదు బిడ్డా జాగ్రత్త. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం..’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్పై విచారణకు ఆదేశిస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. శాండ్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం రేషన్ కార్టుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు. కాళేశ్వరం టూర్కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలి. ఒకరోజు ముందు వెనుక అయినా మేం రెడీగా ఉన్నామని రేవంత్రెడ్డి అన్నారు. గత బడ్జెట్ కంటే ఈ సారి 23 శాతం తగ్గిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు. మొదటి రోజే నిజం చెప్పాలనుకున్నాం. ఇరిగేషన్లో గతంలో రూ.16 వేల కోట్లు అప్పులు కట్టారు. ఇరిగేషన్పై శ్వేతపత్రం ఇస్తాం. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను సైతం పిలుస్తాం. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులు తేలుతారు. మాట్లాడదాం అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
టచ్ చేసి చూడు: కేసీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏనాడూ వెనక్కిపోడు. ఉడుత బెదిరింపులకు భయపడడు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. కొత్త సీఎం బీఆర్ఎస్ పార్టీని, వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. తొలిసారిగా మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు వచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి వాటిల్లే నష్టాలు, ఇతర పర్యవసానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన వైఖరి వారికి వివరించారు. ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేం ‘రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన జుట్టును కేంద్రం చేతికి అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ఏనాడూ తలొగ్గలేదు. ప్రాజెక్టులు తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నన్ను బెదిరించారు. కానీ నేను.. కావాలంటే తెలంగాణలో నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. రాష్ట్రపతి పాలన పెట్టుకో. తెలంగాణకు అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది., పదేళ్ల పాటు కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ ప్రాజెక్టులను కాపాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించింది..’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం ‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రజా మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర, మూర్ఖపు వైఖరిని తిప్పికొడుతూ, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన వాటాలను, ఉన్న హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకానైనా పోరాడాల్సిందే. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది. తెలంగాణ ఉద్యమకారులది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సాగు, తాగునీటి హక్కుల కోసం పోరాడాం. ‘మా నీళ్లు మాకే ’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండగడదాం..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలన చేతకాక రేవంత్ కారుకూతలు ‘అసెంబ్లీలో మనం తక్కువేంలేం..39 మందిమి ఉన్నాం. ప్రతి అంశాన్ని అక్కడ ఎండగడతాం. ఈ సీఎం ఎక్కువ మాట్లాడుతున్నాడు. సీఎం అనేటోడు ఈరోజు ఉంటాడు. రేపు పోతాడు. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. మీరు ఎవరూ గాబరా పడొద్దు. రేవంత్వి పిల్ల చేష్టలు. పాలన చేతకాక నా మీద కారు కూతలు కూస్తున్నడట. నల్లగొండలో సభ పెట్టనివ్వరట. మన సభను అడ్డుకునేది ఎవ్వడు? కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎవ్వడు అడ్డుకోవడానికి. నల్లగొండ ఆయన జాగీరా? ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దాం. ఇలాంటి వాళ్లను చాలామందిని చూసినం. ఈ ప్రభుత్వాన్ని మనం కూల్చాల్సిన అవసరం లేదు ప్రాజెక్టుల విషయంలో మన ఎమ్మేల్యేలు సభలో కొట్లాడతరు. మనం అందరం వెళ్లి నల్లగొండలో కొట్లాడుదాం. మనం ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రకటించిన పథకాలు అమలు చేయలేక వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తది. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వెయ్యి శాతం మనమే అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండ సభను విజయవంతం చేయాలి తెలంగాణ భవన్లో సమావేశానంతరం నందినగర్ నివాసంలో కేసీఆర్ మరోసారి నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్లగొండలో బహిరంగసభ నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం , మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయ కర్తలతో చర్చించారు. ప్రాజెక్టుల అప్పగింతతో ఎదురయ్యే దుష్పరిణామాలు తెలంగాణ సమాజానికి తెలిసేలా ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని, ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రలో సమర్థంగా పని చేద్దామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీసే ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ప్రభుత్వమే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజాలేంటో పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సూచించారు. 2014 జూన్2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ఎలా పని చేసిందీ, కృష్ణా జలాల్లో హక్కుల రక్షణకు ఎంతగా శ్రమించిందీ సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేద్దామని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెండు, మూడురోజుల్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుదామని తెలిపారు. శనివారం కేసీఆర్ నందినగర్నివాసంలో మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి మాజీ చీఫ్విప్వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య ఆయనతో సమావేశమయ్యారు. ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు విశ్వసనీయం సమాచారం మేరకు.. బీఆర్ఎస్అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఒప్పుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. బలవంతంగా గెజిట్అమలు చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణాలో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని తెలిపారు. రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో నీటి పంపకాల విషయం అపెక్స్కౌన్సిల్తేల్చాలని కేఆర్ఎంబీ 17వ సమావేశంలో నిర్ణయించినా, ఆ తర్వాత అపెక్స్కౌన్సిల్సమావేశమే జరగలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్సర్కార్.. శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టుల్లోని పది ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని, అదే జరిగితే రాష్ట్ర హక్కులను కోల్పోతామని చెప్పారు. జల విద్యుత్ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఏటా శ్రీశైలంలోకి ఇన్ఫ్లో మొదలవగానే టీఎస్జెన్ కో విద్యుదుత్పత్తిమొదలు పెట్టేదని, తద్వారా రాష్ట్రంలోని ఎత్తిపోతలప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో కరెంట్ఉత్పత్తి చేసుకునే వారమని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఏపీ.. కృష్ణా బోర్డు మొదలు పార్లమెంట్వరకు అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిందని, సుప్రీం కోర్టులోనూ కేసు దాఖలు చేసిందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసీఆర్ను కలిసిన ప్రముఖులు కేసీఆర్ను శనివారం సినీ నిర్మాత దిల్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. తన తమ్ముడు శిరీ‹Ùరెడ్డి కుమారుడు ఆశి‹Ùరెడ్డి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా సీనియర్జర్నలిస్ట్దేవులపల్లి అమర్ ఏపీ రాజకీయాలపై తాను రాసిన ‘ది డెక్కన్పవర్ప్లే’పుస్తకాన్ని కేసీఆర్కు అందజేశారు. మరో సీనియర్జర్నలిస్ట్వనం జ్వాలా నర్సింహారావు.. ‘ఆంధ్రా వాలీ్మకి రామాయణంలో చంద్ర ప్రయోగం’పుస్తకాన్ని బహూకరించారు. -
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. కాగా, కేసీఆర్కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్మార్టం చేసిన బీఆర్ఎస్.. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. -
లండన్ పర్యటనలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లండన్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నిల్లోనూ రిపీట్ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ అన్నారు. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్రెడ్డి.. లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పరువు తీశారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పింది ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు. కారు పార్టీని బొంద పెడతామంటూ రేవంత్ చౌక బారు మాటలు మాట్లాడారు. కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించాడంటూ నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
నేడు కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి హైదరాబాద్కు చేరుకుంటారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావును బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆయన నివాసంలో కలిసి జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్క డి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
కేసీఆర్ను పరామర్శించిన చిరంజీవి..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయనకు తుంటి ఆపరేషన్ జరగ్గా ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి వెళ్లాడు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సర్జరీ చేసిన డాక్టర్లకు అభినందనలు తెలిపాడు. కేసీఆర్ సినిమా ఇండస్ట్రీ గురించి అడిగారని, సినిమాలు ఎలా ఆడుతున్నాయని అడిగారన్నాడు. సినీ పరిశ్రమలో అంతా బాగానే జరుగుతోందని చెప్పానన్నాడు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటే? ఇటీవల కేసీఆర్ తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ను పరీక్షించిన వైద్యులు ఆయనకు ఎడమకాలు తుంటిలో ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. దీంతో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశారు. దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. సాధారణంగా తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టు తెలుస్తోంది. చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం 156వ సినిమా చేస్తున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చదవండి: గుడ్న్యూస్ చెప్పిన గీతా మాధురి.. మరోసారి తండ్రి కాబోతున్న నందు.. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్, ఆయనకు తోడుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు, పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను బలపరిచారు. పార్టీ తరపున ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రతిపాదనను బలపరుస్తూ చప్పట్లు కొట్టడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ నియామకం ఎంపిక బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశాన్ని హరీశ్రావు సమన్వయం చేశారు. సమావేశం ముగిశాక ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులో తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. -
కేసీఆర్ ఆరోగ్యంపై ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కేటీఆర్కు ఫోన్ చేసి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ సమీపంలోని ఫామ్హౌస్లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్లో కాలుజారి పడిపోయారు. ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం.. యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్ -
ప్రజాస్వామ్యానికి దూరమైతే మిగిలేది ఇదే!
తెలంగాణ ఏర్పడిన తరువాత శాసనసభకు జరిగిన మూడో ఎన్ని కలు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రత్యేకమైనవి. ఈ ఎన్ని కలలో ప్రజలు ఆయన ధోరణిని ఓడించారనడం సబబు. రంగం నుంచి బీజేపీ తప్పుకొన్న విషయం ఎన్నికల సంరంభానికి ముందే వెల్లడైంది. మునుగోడు ఉప ఎన్నిక వరకూ అసెంబ్లీ ఎన్నికలలో విజయం బీజేపీదే అన్నంత ధీమా ఉందన్నది నిజం. ఈ ఎన్నికలు ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ను తొలిసారి అధికారంలో నిలబెట్టాయి. బీజేపీ కూడా స్వయంకృత అప రాధాలకు అతీతం కాదన్న విషయాన్ని రుజువు చేశాయి. కానీ కేసీఆర్కు మాత్రం ఈ ఎన్నికలు గొప్ప గుణపాఠాలు. నిజానికి ప్రజాస్వామ్యానికి దూరంగా జరిగే నేతలకు మిగిలే అంతిమ అనుభవం ఇదేనని చాలా గొప్పగా చెప్పాయి. ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ అన్న నినాదం ఉద్య మానికి ఊపిరి ఇచ్చినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముమ్మాటికీ ఆత్మగౌరవం అనే నినాదం మీద నిర్మితమైందని మరచిపోలేం. అయితే కేసీఆర్ ఈ రకమైన సెంటిమెంట్ను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గౌరవించిన తీరు ముందు నుంచి ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఆయన మొదటి మంత్రిమండలి మహిళా ప్రాధాన్యం లేకుండానే చిరకాలం నడిచింది. కేసీఆర్ ఉద్యమ నేత స్థాయి నుంచి సీఎం పదవికి వెళ్లిన వ్యక్తేనా అనిపించేలా చేయడానికి ఇది చాలు. అప్పటి నుంచి 2023 ఎన్నికలలో ఆయన పార్టీ ఓటమి వరకూ జరిగిన కొన్ని పరిణామాలు కేసీఆర్ వ్యక్తిత్వం గురించి ప్రశ్నించుకునేటట్టు చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ ఈ ఎన్నికలలో ఎమ్మె ల్యేగా గెలిచిన తరువాత చేసిన వ్యాఖ్యలలో ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఉంది. తాను తొమ్మిదేళ్లలో అసలు కేసీఆర్ ఇంటర్వ్యూ కూడా సంపాదించలేక పోయానని బయటపెట్టారు. అలా అని సొంత పార్టీ నాయకులనూ, ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ప్రగతి భవన్లోకి నేరుగా అనుమతించారని అనుకుంటే పొరపాటు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ను వీడుతూ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉద్యమ నేత స్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠానికి వెళ్లిన కేసీఆర్ ఈ విషయాన్ని అసలు గుర్తించారా? ముమ్మా టికీ లేదు. అంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ తాత్వికతనే విస్మరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి హైదరాబాద్తో సహా తెలంగాణ ఇతర ప్రాంతాలలోనూ నివాసం ఏర్పరుచు కున్నారు. కానీ తెలంగాణ సమాజం ఆత్మగౌరవం గురించి ఆలోచింపచేసినవారు కొందరు ఆంధ్ర ప్రాంతీయులేనన్న వాదన ఉంది. అలాంటి అవమానాలను తెలంగాణ సమాజం భరించలేదు. నిజానికి ఏ సమాజమూ భరించదు. ఏదో ఒకరోజు ప్రశ్నిస్తుంది. మద్రాసు ప్రెసిడెన్సీలో తమి ళుల నుంచి అవమానాలను ఎదుర్కొన్న తెలుగ భాషా ప్రాంతాల వారు, నిజాం రాజ్యంలో తెలుగు ప్రాంతాల వారి పట్ల కూడా అదే ధోరణి ప్రదర్శించారంటే సత్యదూరం కాబోదు. అంతకంటే పెద్ద వాస్తవం కేసీఆర్ కూడా సీఎం హెూదాలో అవమానకరమైన ధోరణిలోనే వ్యవహరించడం! విలేకరుల సమావేశాలలో ఆయన వ్యవహరించిన తీరు అసలు ప్రజాస్వామ్యానికి శోభను కూర్చేదని ఎవరైనా అన గలరా? పత్రికా స్వేచ్ఛ గురించి ఆయన ఏనాడూ గౌరవంగా లేరు. ప్రశ్న ఎంత లోతైనదైనా ఆయన దానికి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దేశ ప్రజలకు అనుభవమే. దీనికి మించినది ఎన్నికల ప్రచార సభలలో ఆయన ప్రదర్శించిన ధోరణి. ‘నేను చెప్పేది నేను చెప్పాను. నాకు ఓటేయకపోతే మీ ఖర్మ’ అనే దాకా ఆయన వెళ్లారు. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్న ఏ నాయకుడూ చేయడు, చేయకూడదు! తనకు ఓటు వేయమని అడగ డానికి వెళ్లి, సభలో చప్పట్లు చరిచిన వారిపై కూడా విరుచు కుపడే స్వభావం ఆయన స్థాయిని నిజంగానే దిగజార్చించింది. ‘వాడిని ఇలా గుంజుకు రండి’, ‘కిరికిరిగాళ్లు’ వంటి మాటలు తరచు వాడడం సభా మర్యాద కూడా కాదన్న సంగతి ఆయన పూర్తిగా విస్మరించారు. గుజరాత్ వాళ్లకీ, ఢిల్లీ వాళ్లకీ ఇక్కడేం పని అంటూ ఆయన అత్యంత హేయంగా మాట్లాడారు. టీఆర్ఎస్ రూపు మార్చి బీఆర్ఎస్ అయిన తరువాత మహారాష్ట్రకు ఈయన ఎన్నిసార్లు పోయి రాలేదు! మహారాష్ట్ర వాసుల నుంచి ఆయనకు ఇలాంటి ప్రశ్నే వస్తే దానికి ఎలా స్పందించి ఉండేవారు? అవతలి పక్షం, అంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రయోగించిన భాష దారుణం. దానికి ఆ పార్టీల నాయకుల నుంచి కూడా అలాంటి స్పందనే వచ్చింది. ఈ ధోరణి ఎక్కడో ఒకచోట ఆగి ఉండవలసింది. ఈ రకమైన చొరవ విపక్షాల నుంచి మొదలై ఉంటే కేసీఆర్కు మంచి గుణపాఠం అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇది అహంకార ధోరణి అని నిస్సంశయంగా చెప్ప డానికి ప్రజాస్వామ్య వాదులు వెనుకాడరు. దానికి తెలంగాణ సమాజం పెద్ద మూల్యమే చెల్లించింది. తెలంగాణ సాధనకు ఉపయోగపడిన నినాదంలోని నీళ్ల కోసం వృథాగా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం, మేడిగడ్డల దగ్గర ఎదురైన అనుభవాలు ఇవే. అక్కడ కేసీఆర్ ఇంజనీర్ అవతారం కూడా ఎత్తారని ఇప్పుడు జనం చెబుతున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంలో కూడా ఆయన మాటే అంతిమంగా ఉండేదన్న విమర్శ కూడా కొద్దికాలం వినిపించింది. కేసీఆర్ నియంతృత్వ ధోరణి ఈ ఎన్నికలలో ఓటమి తరువాత కూడా కొనసాగడం ప్రజలను నిశ్చేష్టులను చేసింది. పార్టీ ఓడిపోతే ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు స్వయంగా వెళ్లి గవర్నర్కు రాజీనామా సమర్పించడం మర్యాద. ఇది రాజకీయ సంప్రదాయం కూడా. తెలంగాణతో పాటే ఎన్నికలు జరుపుకొన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ మర్యాదను పాటించిన ఉదాహరణ ఎదురుగానే ఉంది. కానీ కేసీఆర్ తన ఓఎస్డీ ద్వారా గవ ర్నర్కు రాజీనామా లేఖను పంపించి గజ్వేల్లోని ఫామ్ హౌస్కు వెళ్లిపోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పక తప్పదు. గెలిస్తే సరే, ఓడినా కూడా రెండు దఫాలు ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సొంత పార్టీ కార్యకర్తల పట్ల చూపవలసిన కనీస బాధ్యతను కూడా కేసీఆర్ ఎందుకు చూపలేకపోయారు? ఆయన కాకుండా పార్టీ నేతగా ఆయన కుమారుడు కేటీఆర్ ధన్యవాదాలు తెలియచేసే బాధ్యతను స్వీకరించడం కూడా సరైనది కాదు. ఇది అహంకారం కాదు అని ఆ పార్టీ నాయకులు ఎవరైనా చెబితే అది కూడా చాలదు. ఎందుకంటే అహంకారమేనన్న వాస్తవాన్ని అప్పుడు కేసీఆరే రూఢి చేసినట్టు అవుతుంది. కేసీఆర్కూ గవ ర్నర్కూ విభేదాలు ఉండవచ్చు. అయినా ఒక ప్రజా నాయ కునిగా కేసీఆర్ తన బాధ్యతను తాను నిర్వర్తించి ఉండవల సింది కాదా! రాజస్థాన్లో కూడా సొంత పార్టీ నియమించిన గవర్నర్ లేరు. అధికారం నుంచి దిగిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ కేంద్రంలో బీజేపీ నియమించినవారే. మరి ఆయన ఆ మర్యాద ఎందుకు చూపించారు? ఆత్మ గౌరవం అంటే అహంకార ప్రదర్శన కాదు. ఈ సంగతి కేసీఆర్కు ఎవరైనా ఇంకా ముందే గుర్తు చేసి ఉండ వలసింది. ఈ ఎన్నికలలో కేసీఆర్–బీఆర్ఎస్ ఓటమి రాష్ట్రాన్ని ‘అభివృద్ధి చేయనందుకు’ అని ఒక్కమాటలో చెప్పలేం. అందుకు ఆ పార్టీ అంతో ఇంతో చేసింది. మన్ను తిన్న పాములా పడి ఉన్న కాంగ్రెస్ ఆరేడు మాసాలలోనే ఇంత ఫలితం సాధించడానికీ, బీఆర్ఎస్ ఓడిపోవడానికీ కారణం కేసీఆర్ అహంకార ధోరణి! అది బీఆర్ఎస్ గుర్తించ వలసి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయ కుడు అంటే, ప్రజానీకాన్ని గుర్తించని నాయకుడనే. ఇక్కడ ఓడిపోయినది అలాంటి నాయకుడే! ప్రజలకు దూరమైన నాయకుడే!! పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ–మెయిల్: pvg@ekalavya.net -
ప్రజాతీర్పును గౌరవిద్దాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జనవరి 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పును గౌరవిస్తూ హుందాగా తప్పుకున్నాం. ప్రజల తీర్పును గౌరవిస్తూ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. రాష్ట్ర రాజకీయాలు, పాలనలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’అంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కేసీఆర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందాం. ఎన్నికల క్షేత్రంలో గెలుపోటములు అత్యంత సహజం. నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. అందువల్ల నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. త్వరలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని కూడా ఎన్నుకునేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుందాం..’అని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లకుపైగా సుస్థిర పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంతో చెరగని ముద్ర వేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టడమేగాకుండా ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించి గొప్ప పరివర్తన తీసుకురాగలిగామన్నారు. బీఆర్ఎస్ అంటే ఒక భరోసా అనే విశ్వాసాన్ని కలిగించామని చెప్పారు. మెజారిటీ ఎంత వచ్చింది? ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఏ తరహా పోటీని ఎదుర్కొన్నారు? లాంటి కొన్ని సాధారణ అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారని ఆయనను కలిసిన నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఆయన కుశల ప్రశ్నలు సైతం వేసినట్లు చెప్పారు. హరీశ్, తదితరుల భేటీ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ ఫామ్హౌస్ భేటీకి వెళ్లలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు కూడా కేసీఆర్ను కలిశారు. గజ్వేల్ ఎన్నికలో కేసీఆర్ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించిన అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ‘ఎన్నిక ధ్రువీకరణ సర్టిఫికెట్’ను అందజేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై కోలుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య స్థితిపై కేసీఆర్ వాకబు చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతిభవన్ నుంచి ఫామ్హౌస్కు.. కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఒకటి రెండు రోజుల్లో బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి మారనున్నారు. వ్యక్తిగత సామానును తరలించే పని జరుగుతున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ జనవాడలోని ఫామ్హౌస్ నుంచి రాకపోకలు సాగించే అవకాశమున్నట్లు తెలిసింది. -
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు. -
కేసీఆర్ ప్రకటనలోని మర్మం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులపై చేసిన ఒక ప్రకటన అందరిని ఆకర్షించింది. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి తనను గెలిపించితే, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరతానని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్కు తన పార్టీ వారు ఎవరో చెప్పారట.దానిని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రస్తావించి ఆ కాంగ్రెస్ అభ్యర్ధి మాటలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయవద్దని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోనని అన్నారు. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న దివాకరరావునే ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ✍️ఎన్నికలలో గెలవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రం రివర్స్ వ్యూహంలోకి వెళ్లినట్లు అనుకోవాలి. కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ఖండించి ఉండవచ్చు. కాని కేసీఆర్ ప్రకటనలోని మర్మం గురించి ఆలోచించాలి. ఒకవేళ హంగ్ వస్తే పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక పార్టీకి వేవ్ వస్తే గొడవ లేదు. తాజా సర్వేలలో ఎక్కువ భాగం కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావచ్చని చెబుతున్నాయి. అయినా హంగ్ వస్తుందని నమ్మేవారు కూడా లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన గెలిచిన అభ్యర్దులను బెంగుళూరు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ✍️బొటాబొటి మెజార్టీతో కాని, ఎవరికి మెజార్టీ రాని పక్షంలో కాని ఫలితాలు వస్తే మాత్రం పార్టీ మార్పిడులు పెద్ద ఎత్తునే ఉండవచ్చు. కాంగ్రెస్ బొటాబొటిగా అధికారంలోకి వచ్చినా అదే పద్దతి అవలంభించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోతే మాత్రం ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్లోకి జంప్ చేసే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని వీలైతే అంతమందిని ఆకర్షించడానికి ప్లాన్ చేయవచ్చు. ✍️ఎందుకంటే గత రెండు టరమ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే వ్యూహం అవలంభించి కాంగ్రెస్ను బాగా బలహీనపరచడానికి యత్నించారు. మొదట 2014లో కేసీఆర్ ఈ ఆలోచన చేయకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రేవంత్రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించడం, తదుపరి ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ✍️ఆ తర్వాత కేసీఆర్ మొత్తం వ్యూహం మార్చి అప్పట్లో టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని, కాంగ్రెస్లో ఉన్న 21 మందిలో పది మంది వరకు బీఆర్ఎస్లోకి లాగేశారు. ఆ వ్యూహం ఫలించి 2018 ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రజలు కేసీఆర్కు 88 సీట్లతో భారీ ఎత్తున పట్టం కట్టారు. అయినా కేసీఆర్ ఈసారీ వదలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందికి గాను పన్నెండు మందిని బీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు. ఈ రెండు పార్టీలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ✍️దాంతో క్యాబినెట్ హోదాలో ఉన్న సీఎల్పి నేత మల్లు భట్టి కి ప్రతిపక్ష నేతగా కూడా ఉండలేకపోయారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం. నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఆ హోదా దక్కింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దపడుతుంది. బీఆర్ఎస్ను ఎంత వీలైతే అంత బలహీన పర్చడానికి యత్నిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ ఫిరాయిస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. బీజేపీ నేతలు అదే విషయాన్ని పదే, పదే ప్రచారం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ తాను ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచినవారిని చేర్చుకోనని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ✍️ఆయన నిజంగా అలా చేస్తారా?. లేక కాకతాళీయంగా మంచిర్యాలలో రాజకీయంగా నష్టం జరగకుండా ఉండడానికి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారం చేస్తుంటే దానిని తిప్పి కొట్టడానికి ఇలా మాట్లాడారా అన్నది తెలియదు. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు కాని, ఫిరాయింపులు ఉండవంటే మాత్రం ఆశ్చర్యమే కలిగిస్తుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులు అంత అడ్డగోలుగా జరుగుతుంటే చర్య తీసుకోవలసిన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ సైతం ఇదే తరహాలో ఉంటోంది.గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పద్దతి అవలంభించి, ఆ తర్వాత కాలంలో బాగా నష్టపోయింది. ✍️ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అది పెద్ద వివాదం అయింది. అయినా వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడా భయపడకుండా ముందుకు వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన టీడీపీని ఖతం చేయాలనే లక్ష్యంతో పనిచేయలేదు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్కు అసెంబ్లీలో నామమాత్రపు బలాన్ని మిగిల్చినా, ఇప్పుడు ప్రధాన పోటీని ఎదుర్కోక తప్పలేదు. అందువల్ల ఫిరాయింపులు జరిగినంత మాత్రాన అన్నిసార్లు అనుకూల ఫలితం వస్తుందని అనుకోలేం. గతంలో కూడా ఇలాంటివి జరగక పోలేదు. ✍️1978 శాసనసభ ఎన్నికలలో 180 సీట్లతో కాంగ్రెస్ ఐ అధికారంలోకి రాగా, జనతా పార్టీకి 60, కాంగ్రెస్ ఆర్ కు 30 సీట్లు వచ్చాయి. కాని 1983 వచ్చేసరికి జనతా, కాంగ్రెస్ ఆర్ పార్టీలకు చెందిన తొంభై మందిలో ఐదారుగురు తప్ప అందరూ అధికార కాంగ్రెస్ ఐ లో చేరిపోయారు. అయినా 1983లో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పట్లో కొత్తగా వచ్చిన టిడిపి అధికారాన్ని కైవసం చేసుకుంది. 1984లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు టీడీపీలో చీలిక తీసుకు వచ్చినా అది నిలబడలేదు. నెల రోజుల వ్యవధిలో ప్రజాందోళన, మెజార్టీ టిడిపి ఎమ్మెల్యేలు ఎన్.టి.ఆర్.వెంట ఉండడంతో తిరిగి ఆయన ప్రభుత్వం ఏర్పడింది. ✍️1991లో పివి నరసింహారావు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికిగాన టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. అయినా 1994లో తిరిగి ఎన్.టి.రామారావు భారీ మెజార్టీతో ఎపిలో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కాని 1995లో ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఎన్.టి.ఆర్. వెంట సుమారు ముప్పైఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ఆకస్మిక మరణంతో టీడీపీని పూర్తి స్థాయిలో చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ✍️1999లో వివిధ పరిణామాలతో తిరిగి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. 2004 లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇరవై ఆరుగురిలో పది మంది పార్టీపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు కూడా గురయ్యారు. దీనివల్ల పార్టీకి పెద్ద సానుభూతి రాలేదు. 2009లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పది సీట్లకే పరిమితం అయింది. టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల కూటమిని ఓడించి కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి రాగలిగింది. ✍️2014లో పవర్ లోకి వచ్చిన చంద్రబాబు వైసీపీని దెబ్బతీయాలని ఫిరాయింపులను ప్రోత్సహించినా 2019 ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు. కేవలం ఫిరాయింపుల వల్లే పార్టీలు బలపడతాయనో, బలహీనపడతాయనో అనుకోవడానికి లేదని ఈ అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితులు, నాయకత్వం తదితర అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫిరాయింపుల పర్వాలు ఎలా ఉంటాయో తెరపై చూడాల్సిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలిప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్/ సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలిప్పుడు? అప్పుడు ఏం సక్కదనం వెలగబెట్టారని పదేపదే ఆ పేరు ఉచ్చరిస్తున్నారు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ.. కాలిన కడుపులు, కాల్చి వేతలు, కూల్చివేతలేగా. ఆ కష్టాలు మనకు అవసరమా? ఎన్కౌంటర్లు, రక్తపాతం, తెలంగాణ ఉద్యమ సమయంలో 1969లో 400 మంది కాల్చి వేత.. ఇవన్నీ మరిచిపోలేదు. కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ పాత చరిత్ర తెస్తామంటున్నారు. కానీ మనం ఏంటనేది 30వ తేదీన నిరూపించాలి..’ అని సీఎం, బీఆర్ఎస్ అధినేత, పార్టీ గజ్వేల్ అభ్యర్థి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు మంగళవారం గజ్వేల్లో, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన భారీ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదు: ‘ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో వందలాది మంది పిల్లలను, ఉద్యమకారులను పొట్టన బెట్టుకున్న ఘన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. 1956లో తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ తర్వాత నా ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడం, 33 రాష్ట్రాలు మద్దతు లేఖలు ఇవ్వడంతో దిగొచి్చన కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు, హక్కులను పరిరక్షించుకునేందుకు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2కే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? అప్పటివరకు రాష్ట్రం ఆకలి కడుపుతో ఉన్నందుకేగా? కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు. ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయను ఇవ్వని బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయని కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలి?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మీరు సీఎం చేస్తేనే నేను కష్టపడ్డా.. ‘గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తేనే నేను కష్టపడ్డా. తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరించే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. ఆకాశం అంత కీర్తి వచ్చింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 30–40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, రాష్ట్రం ఏర్పడ్డాక సాగు నీరు, ఉచిత విద్యుత్ అందించడం వలన 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ధరణి పోర్టల్ రాకముందు రైతు భూమిపై వీఆర్ఓ నుంచి సీసీఎల్ఏ అధికారుల వరకు 10 మందికి అధికారం ఉండేది. ఇప్పుడు రైతు బొటన వేలికి వారి భూమికి సంబంధించిన హక్కులు ఇచ్చాం. ధరణి ఉంది కాబట్టే ఎవరి భూమి వారికి ఉంది. లేకపోతే ఇబ్బంది ఉండేది. గత పాలకుల పరిపాలనను తలదన్నే విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల చేత భేష్ అనిపించుకుంటున్నాం. కాంగ్రెస్ రాజ్యంలో రూ.200 పింఛన్ ఇస్తే, ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేలు ఇవ్వబోతున్నాం. నెహ్రూ, ఇందిరమ్మ కాలంలో దళిత వర్గానికి మేలు చేస్తే ఇంత దరిద్రంలో ఉండేవారు కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దళితబంధును ఏర్పాటు చేశాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 80 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించాం. అమ్మఒడి వాహనాలు, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మితో పేదింట్లో ఆర్థిక భారం తగ్గించాం. అన్ని వర్గాలకు పెద్దన్నగా నిలిచాం. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కరోజు కూడా కర్ఫ్యూ, మతకల్లోలాలు, గొడవలు లేని వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో వరంగల్లో అజాంజాహీ మిల్లును మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు అమ్ముకుంటే వేలాది మంది కార్మీకులు రోడ్డున పడ్డారు. వారికి తిరిగి ఉపాధి కల్పించేందుకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. సరికొత్త చరిత్ర సృష్టిద్దాం ‘నా వయసు ఫిబ్రవరిలో 70 ఏళ్లకు చేరుతుంది. పదవుల కాంక్ష లేదు.. తెలంగాణను సక్కదిద్దాలనే ఉంది. మనసు పెట్టి సంక్షేమం అందిస్తున్న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి మూడవసారి పాలన తెచ్చుకుందాం. సరికొత్త చరిత్రను సృష్టిద్దాం. సమైక్యవాదులతో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు వచ్చి ఓటు వేయాలని అడుగుతారు. అభ్యర్థుల గుణగణాలు, గతంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. 50 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో ఓటునూ ఒడిసిపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంతోపాటు పోలింగ్ ముగిసేదాకా పార్టీ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆదేశించారు. పార్టీ కేడర్ ప్రతీ గడపకూ వెళ్లాలని, బీఆర్ఎస్కే ఓటేసేలా ప్రయత్నం చేయా లని సూచించారు. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులపై కేసీఆర్ శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురితో ఫోన్లలో మాట్లాడారు. సభ రద్దవడంతో.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దయిన నేపథ్యంలో.. కేసీఆర్ రోజంతా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమీక్షలు నిర్వహించారు. సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు, వివిధ మార్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించారు. నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల పనితీరు, ఇతర పార్టీల స్థితిగతులపై పార్టీ నేతలతో చర్చించారు. గెలుపు అవకాశాల ఆధారంగా నియోజకవర్గాలను కేటగిరీలుగా వర్గీకరించి, మెరుగుపడాల్సిన నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్చార్జులకు దిశానిర్దేశం చేశారు. తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జులకు ప్రత్యేక సూచనలు చేశారు. పార్టీ గెలుపోటములపై మౌఖిక ప్రచారాలతో గందరగోళానికి గురికావద్దని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. తాజా సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. మూడోసారీ అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితిపై పోస్ట్మార్టం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత గత నెల 15వ తేదీ నుంచి ఇప్పటివరకు కేసీఆర్ 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. పరేడ్ మైదానంలో సభ రద్దయిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఎల్బీనగర్, కూకట్పల్లి, మేడ్చల్ లేక మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించాలని శనివారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్షాల పోల్ మేనేజ్మెంట్ ప్రణాళికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులు చేస్తున్న విమర్శలు, వాటిని తిప్పికొట్టాల్సిన తీరుపైనా సూచనలిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావుల రోడ్షోలకు వస్తున్న స్పందన, మేనిఫెస్టోలోని అంశాలు ఎంతమేర ప్రజల్లోకి వెళ్లాయన్న దానిపై ఆరా తీశారు. ప్రధాని మోదీ వరుసగా మూడో రోజులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఆయా నియోజకవర్గాలపై ఎంతమేర ప్రభావం ఉంటుందనే కోణంలో సర్వే, కన్సల్టెన్సీ సంస్థల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. -
నమ్మితే ఆగమే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వికారాబాద్: ఎన్నికలు వచ్చాయంటే రకరకాలుగా ఆగం చేసే పనులు జరుగుతాయని.. ఒక్కసారి కాంగ్రెస్ను నమ్మి మోసపోతే ఐదేళ్లపాటు బాధపడాల్సి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, నడవడికను చూసి ఓటు వేయాలని సూచించారు. రాయి ఏదో, రత్నమేదో గుర్తించాలన్నారు. నాడు ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 58 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే గోసపడతామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి, మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్లు అరిగోసపడ్డాం. అదే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. హోరాహోరీ పోరాటం చేసి, కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనబడుతోంది. మేం పేదల గురించి ఆలోచించినం. పింఛన్లను రూ.2వేలకు పెంచుకున్నం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు ఇస్తున్నం. రైతుల పంట మొత్తాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఎవరైనా రైతు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు వస్తున్నాయి. కంటి వెలుగుతో రాష్ట్రంలో మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించినం. గర్భిణులు, బాలింతల కోసం అమ్మ ఒడి వాహనాలు పెట్టాం. వారివి బాధ్యతలేని మాటలు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వేస్ట్, దుబారా అంటున్నారు. రైతుబంధు దుబారానా? పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు 24 గంటలు కరెంటు వృధా, 3 గంటల కరెంట్ చాలంటున్నారు. వారివి బాధ్యతలేని మాటలు. 3 గంటల కరెంటు కావాలా? 24 గంటలు కావాలా? రైతులు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తివేస్తామంటున్నారు. ధరణి లేకుంటే రైతుబంధు పంపిణీ ఎట్లా? ధరణి స్థానంలో భూమాత తెస్తరంట.. అది భూమాత కాదు.. భూమేత. ధరణిని తీసేయడం రైతులకు జీవన్మరణ సమస్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యం వస్తది. గొడవల్లేకుండా పాలన సాగించాం గత కాంగ్రెస్ హయాంలో అన్ని ఘర్షణలే. ఎన్నో అల్లర్లు, కర్ఫ్యూలు చూసినం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎక్కడా ఒక్క లొల్లి కూడా లేకుండా ప్రశాంతంగా పాలన సాగింది. హైదరాబాద్లో ఒక్క గొడవ జరిగిందా? కర్ఫ్యూ అనే మాటే రాలేదు. ముస్లింలు, హిందువులు నాకు రెండు కళ్లలాంటి వారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణలో సెక్యూలరిజం ఉంటుంది. కాంగ్రెస్కు దిక్కూదివాణం లేదు కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. ఆ పార్టీకి దిక్కుదివాణం లేదు. 20 సీట్లు కూడా రావు. అందులోనూ 15 మంది సీఎం అభ్యర్థులే. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అది నియోజకవర్గంతోపాటు రాష్ట్ర భవిష్యత్, తలరాతను మార్చుతుంది. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ఆగమైతది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ సభ సందర్భంగా కేసీఆర్ కాసేపు ఉర్దూలో ప్రసంగించారు. ఉమ్మడి పాలమూరు సభల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కేశవరావు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు 20 సీట్లే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వాళ్లు కొత్త డ్రామా మొదలుపెట్టారని.. ఆ పారీ్టకి గతంలోలా 20 సీట్లకన్నా ఎక్కువ రావని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్కు గత ఎన్నికల కంటే ఈసారి మరో నాలుగు సీట్లు ఎక్కువే వస్తాయని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వందశాతం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆగమాగం, గత్తర గత్తర చేస్తుందని.. వాళ్ల మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను ఆగం చేసిన దరిద్రపు కాంగ్రెస్ను గంగలో పడేసి.. బీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర, వైరా, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. ఇక్కడి ప్రజల కోసం. నాడు ఉన్న తెలంగాణను ప్రజలు వద్దని మొత్తుకున్నా ఆంధ్రాలో కలిపారు. 58 ఏళ్లు గోసపడ్డాం. 1969లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టల్లా కాల్చి చంపేశారు. మళ్లీ ఉద్యమం మొదలుపెడితే.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని పొత్తుపెట్టుకుని ధోకా చేసింది. కేసీఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని మొండిగా ముందుకు పోయిన. సకల జనుల సమ్మెతో రోడ్లపై పడి ఆందోళనలు చేసి, ఎన్నో బాధలు పడినం. దిక్కులేక కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ది మొత్తం మోసాల చరిత్రనే. అలాంటి కాంగ్రెస్ కావాలా? రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా కేసీఆర్దే.. తెలంగాణ రాకముందు పేదలు, దళితుల బతుకులు ఎట్లా ఉండె, రైతుల బాధలు ఎట్లా ఉండె ఆలోచించాలె. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నయంటే.. ఎండిపోయిన వరి పట్టుకుని వచ్చేవారు. గత పదేళ్లలో 24 గంటలు కరెంటు వస్తోంది. ఎక్కడా ఒక ఎకరం పొలం ఎండుతలేదు. ఇంతకుముందు రెండుసార్లు మధిరలో మీరు మమ్మల్ని గెలిపించలేదు. అయినా నేను మీ మీద అలగలేదు. మధిర నాది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతీ ఇంచు బాగుపడాల్సిందే. మోదీ రాష్ట్రంలో దళితులపై దాడులు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో దళితుల పరిస్థితి దారుణంగానే ఉంది. ఇది దేశానికి క్షేమం కాదు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దాడులు, తీవ్ర వివక్ష కొనసాగుతున్నాయి. ఇది పోవాలి. తెలంగాణ దళితబంధు దేశ దళితజాతికి మార్గదర్శకం చేయాలి. దళితుల బాగు కోసం రూ.10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. బార్లు, వైన్షాపులు, ప్రభుత్వ పనుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టాం. బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజ్ను గెలిపిస్తే మధిర నియోజకవర్గమంతా దళితబంధు అమలు చేస్తాం. భట్టి విక్రమార్కతో వచ్చేదేమీ లేదు. మిమ్మల్ని మాయామశీ్చంద్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. ఆ పార్టీ గెలుస్తదా? ఇంకెక్కడి సీఎం? కాంగ్రెస్ది భూమాత కాదు.. భూమేత! కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇప్పటిదాకా అమ్మను చూడు, బొమ్మను చూడు అంటూ మస్తుగ ఓట్లు గుద్దుకున్నరు. కానీ ఏం జరిగింది? కరెంట్ వచ్చిందా.. నీళ్లు వచ్చాయా? తెలంగాణకు అయితే మరీ అన్యాయం. ఉత్త కథలు, సొల్లు పురాణాలు చెప్పి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యక్రమాల్లో మానవీయ కోణం ఉంటే కాంగ్రెస్ రాజ్యంలో రాక్షసకోణం ఉంది. కాంగ్రెస్ మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటోంది. రైతుబంధు ఇవ్వొద్దంటోంది. వాళ్లకు వాళ్లు పంచుకుతినాలనే ఈ మాట అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూమాత పెడతామని అంటున్నారు. అది భూమాతనా.. భూమేతనా? రైతుబంధు కొనసాగాలన్నా, బీమా అందాలన్నా, భూములకు రక్షణ కావాలన్నా ధరణి ఉండాలి. ఇది జీవన్మరణ సమస్య. బీఆర్ఎస్ సర్కారు మళ్లీ రావాలి. గిరిజనబంధు అమలు చేస్తాం మేం మళ్లీ గెలవగానే రాష్ట్రంలో గిరిజన బంధు అమలు చేస్తాం. ఆటోరిక్షాల పర్మిట్, ఫిట్నెస్ ఫీజులు రద్దుచేస్తాం. ప్రభుత్వం వచ్చిన తెల్లారే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తాం. పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ మన నోట్లో మట్టి కొట్టింది బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ అంటే.. నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లు ఇవ్వలేదు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన నోట్లో మట్టి కొట్టామని సిగ్గులేకుండా చెప్పారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టినా మనకు ఒక్కటీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఓట్లు వేస్తే మోరీలో పడేసినట్లే. ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్ అభ్యర్థులకు వేస్తే మెజారిటీ అయినా పెరుగుతుంది. నోట్ల కట్టల ఆసాములకు ఓటుతో బుద్ధి చెప్పాలి ఇక్కడ (ఖమ్మం జిల్లాలో) అహంకారంగా మాట్లాడే కొందరి నోట్ల కట్టలు హైదరాబాద్లో దొరికాయి. బీఆర్ఎస్ను అసెంబ్లీ గడప తొక్కనీయమని కొందరు అన్నారు. అసెంబ్లీకి ఎవర్ని పంపాలో నిర్ణయించేది ప్రజలు. నోట్ల కట్టల ఆసాములకు ఓటుతో బుద్ధి చెప్పాలి. మాజీ మంత్రి ఒకాయన (తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి) మాటలు నరుకుతుండు కదా? ఈ నరికినోళ్లు గోదావరి నది నీళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదో నిలదీయండి.. -
నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి.. రేవంత్రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని, పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని, అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. నిజాం నిరంకుశ పాలన.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి.. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ‘‘నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిచేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించాం. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్ను ప్రజల ముందుంచాం. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలి. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్ను గద్దె దించాలి. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు... తెలంగాణ ఆత్మగౌరవం కోసం.. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. గతంలో కాంగ్రెస్లో ఎవరు సీఎంగా ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తాం.. కేసీఆర్ కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదు... ఆయన రాచరికం అనుకుంటున్నారు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయి. 2 వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే పెంషాన్ కంటే కర్ణాటకలో పెన్షన్తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోంది. కేసీఆర్ సవాల్లో పస లేదు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1 లక్షా 80 వేలు బాకీ ఉన్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమే. బలహీనవర్గాలు కేసీఆర్ను ఓడించాలన్న కసితో ఉన్నారు.. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్కు సహకరించడమే బీజేపీ వ్యూహం. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు.. ఇప్పటికీ అతీగతి లేదు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు?’’ అని రేవంత్ మండిపడ్డారు. ‘‘దళితుల ఓట్లు కాంగ్రెస్కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన. మంద కృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఢిల్లీ వెళదాం.. మోదీని కలిసి ఆర్డినెన్స్కు మద్దతు ఇస్తామని నేను చెబుతా.. అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కోరదాం. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తాం. 24 గంటల కరెంటుపై ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం’ అని రేవంత్ తెలిపారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయి. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుంది. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు’’ అంటూ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా? -
వివరణ.. ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మరో పది రోజులు మాత్రమే ఉండటంతో భారత్ రాష్ట్ర సమితి ప్రచార తీరుతెన్నులను లోతుగా సమీక్షిస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గత నెల 15 మొదలుకుని 33 రోజుల వ్యవధిలో 60 నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట జరుగుతున్న ప్రచారంలో కేసీఆర్ ప్రసంగ అంశాలు, వాటిపై వస్తున్న ప్రజా స్పందన తదితరాలను పార్టీ అంచనా వేస్తోంది. తద్వారా రాబోయే పది రోజుల పాటు జరిగే మరో 30కి పైగా సభల్లో ఏ తరహా అంశాలను ఎంచుకోవాలనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది. విపక్ష నేతలు వివిధ సందర్భాల్లో చేస్తున్న విమర్శలు, ప్రకటనలు, ప్రసంగాలను క్రోడీకరిస్తూ, వాటిపై వివరణలు, ఖండనలతో పాటు ఎదురుదాడి చేసేలా వ్యూహరచన జరుగుతోంది. పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వ పనితీరును చెప్తూ వస్తున్న కేసీఆర్ రాబోయే పది రోజుల్లో ఎదురుదాడి వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారం ముమ్మరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్షోలను ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత, వినోద్ కుమార్ లాంటి నేతలు నిజామాబాద్, కరీంనగర్ తదితర చోట్ల మకాం వేసి క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూనే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా రోడ్ షో షెడ్యూలుకు అనుగుణంగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో స్థానిక కేడర్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక పారీ్టలో చేరికల కార్యక్రమాలు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిని దాటుకుని ప్రస్తుతం వార్డులు, గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. మేనిఫెస్టోలు, ‘నిఘా’ నివేదికల మదింపు విపక్ష పారీ్టలతో పాటు అక్కడక్కడా ఆ పారీ్టల ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికంగా ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలు, ఓటరుపై వాటి ప్రభావం లాంటి అంశాలను బీఆర్ఎస్ మదింపు చేస్తోంది. మేనిఫెస్టోలోని లోపాలు, ఇతర అంశాల ఆధారంగా ఓటరు వద్దకు వెళ్లే వ్యూహంపైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు నిఘా సంస్థల నివేదికలతో పాటు సర్వే సంస్థల రిపోర్టులు, వివిధ మార్గాల్లో అందుతున్న సమాచార క్రోడీకరణ జరుగుతోంది. తద్వారా ప్రచార లోపాలను సరిదిద్దుకోవడం, పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న చోట దానిని తటస్థ స్థితి (న్యూట్రలైజేషన్)కి తీసుకురావడం, ఇతర దిద్దుబాటు చర్యలపై వార్ రూమ్లు పనిచేస్తున్నాయి. మరోవైపు ప్రధాన మీడియా, సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారానికి అవసరమైన కంటెంట్పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని, ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ‘‘కొద్ది రోజులుగా కేసీఆర్కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎప్పుడూ ఫామ్ హౌస్లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు. జనాలు బై బై కేసీఆర్ టాటా కేసీఆర్ అంటారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు ప్రతి దాంట్లోనూ అవినీతి. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిరోజే వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
‘చేతి’కి చిక్కొద్దు!
సాక్షి, ఆదిలాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు అతీతంగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని ఒక దరికి తెస్తున్నామని.. ఈ సమయంలో కాంగ్రెస్ దుర్మార్గుల చేతికి చిక్కొద్దని, వాళ్లు వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని నాశ నం చేయొద్దనేదే తన బాధ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చూడాలన్నారు. అభ్య ర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ తీరు ఏమిటో పరిశీలించి ఓటేయాలని కోరారు.కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగమై ఓటేస్తే.. మన పరిస్థితి కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు మళ్లీ మొదటికి వస్తుందన్నారు. గురువారం ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 58 ఏళ్ల పాటు గోసపడ్డాం.. ‘‘1956లో భయంకరమైన తప్పు చేసి కళ్లు మూసుకుని తెలంగాణను ఏపీలో కలిపారు. 58 ఏళ్ల పాటు గోసపడ్డాం. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగితే 400 మందిని పిట్టల్లా కాల్చిచంపారు. 2004లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని లబ్ధి పొంది మళ్లీ మోసం చేశారు. తిక్కపుట్టి కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగిన. 36 పార్టీలు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్కు గత్యంతరం లేక తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఒక పంథాలో అభివృద్ధి.. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. రైతుల ఆకలిచావులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పంథాలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. వందల రూపాయల్లో ఉన్న పింఛన్ను వేల రూపాయలకు తీసుకెళ్లాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీఎస్ ఐపాస్, ఐటీ పాలసీలతో దూసుకెళ్లడంతో రాష్ట్ర ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. గతంలో రాష్ట్రంలో కేవలం మూడే డయాలసిస్ కేంద్రాలుంటే.. ప్రస్తుతం వాటిని 103కు పెంచాం. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలోనూ లేని అద్భుత పాలసీని తీసుకున్నాం. నీటి తీరువాను రద్దు చేశాం. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతుబంధుతో పెట్టుబడి సమకూర్చుతున్నాం. పంటలనూ కొనుగోలు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబం ఆగం కావద్దని రూ.5లక్షలు రైతుబీమా అందేలా చేశాం. ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా? కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా దళారులు, పైరవీకారుల రాజ్యం కోసం ధరణిని తీసేస్తామంటున్నారు. ధరణితోనే మీ భూములు భద్రంగా ఉన్నాయి. ఇల్లు గడప దాటకుండా, ఏ ఆఫీసుకు పోకుండా మీ దగ్గరికి రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. ధరణి తీసేస్తే లంచాలు, కబ్జాలు, దళారీ వ్యవస్థ, కోర్టుల వివాదాలు పెరుగుతాయి. ధరణి లేకపోతే ఎన్ని హత్యలు జరిగేవో ఆలోచించాలి. పీసీసీ అధ్యక్షుడేమో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వేస్ట్.. మూడు గంటల కరెంటు చాలు అంటున్నారు. కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా.. రైతుబంధు కావాల్నా, రాబందులు కావాల్నా.. ప్రజలు చర్చచేసి నిర్ణయించుకోవాలి. బీజేపీని చెత్తకుప్పలో పడేయాలి ప్రధాని మోదీకి వంద ఉత్తరాలు రాసినా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీగానీ, ఒక్క నవోదయ స్కూల్గానీ ఇవ్వలేదు. తెలంగాణకు ధోకా చేసిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయద్దు. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే. మత పిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్పలో వేయాలి. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో వారికోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్గానే ఉంటుంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. యుద్ధం చేసేవారి చేతిలో కత్తి పెట్టాలి మనపరంగా ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలో కత్తి పెడితేనే మనం గెలుస్తాం. కత్తి ఒకరికి ఇచ్చి వేరొకరిని యుద్ధం చేయాలంటే సాధ్యం కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తేనే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటు వేరే వాళ్లకు వేసి పనిచేయాలంటే ఎట్లా చేస్తాం. ఎన్నికల సమయంలో ఆగమవకుండా మంచి ఏమిటో, చెడు ఏమిటో గుర్తించే వివేచన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అసైన్డ్ భూములపై హక్కులిస్తాం పచ్చి అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలు మొనగాళ్లు. ఎస్సీ, ఎస్టీల పరంపోగు భూములను ప్రభుత్వం గుంజుకుంటుందన్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రాష్ట్రం నుంచి గల్ఫ్ వలస వెళ్లిన కార్మీకులకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తాం. బూతులు కావాలా? భవిష్యత్ కావాలా?: హరీశ్రావు తెలంగాణలో ఎజెండా లేని ప్రతిపక్ష పార్టీలు బూతులు మాట్లాడుతున్నాయని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ప్రతిపక్షాల బూతులు కావాలా? తెలంగాణకు బీఆర్ఎస్ సర్కారు అందించే ఉజ్వల భవిష్యత్తు కావాలా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడటం విడ్డూరమని, ప్రజలు ఉద్యమం చేస్తే, కేసీఆర్ నిరాహారదీక్ష చేస్తే రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. సోనియాను బలిదేవత అన్న రేవంత్రెడ్డి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. -
నర్సాపూర్: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
సాక్షి, నర్సాపూర్: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి దగ్గర నుంచి 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అస్లాంను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న అస్లాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అస్లాంను విచారిస్తున్నారు. చదవండి: దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్ -
ఆ ఓటే కాటేస్తది!
కాంగ్రెస్ నాయకులు రాహుల్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారు. అలా చేస్తే రైతులు అరేబియా సముద్రానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది. ధరణి తొలగిస్తే దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుంది. రైతులను నంజుకుతింటారు.అది మనకు అవసరమా? 3 గంటల కరెంటు అని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. పది హెచ్పీ మోటార్లు పెట్టాలంటడు. పది హెచ్పీ మోటార్లంటే.. 30 లక్షల బోర్లకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలె. వాళ్లకు ఏమన్న తెలుస్తుందా? కాంగ్రెస్ నాయకులు మన వేళ్లతో మన కళ్లనే పొడుచుకునేలా చేస్తున్నారు. – కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి 55 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తోందని, నమ్మి మోసపోతే గోసపడతామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షో కాదని, ఎవరో చెప్పారని కాంగ్రెస్కు ఓటేస్తే ఆ ఓటే కాటేస్తుందని హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళారులు రాజ్యమేలుతారన్నారు. ఓటు వేసే ముందు ఎవరు ఏం చేశారో ఆలోచన చేయాలని, తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉన్నదీ గమనించాలని కోరారు. అభ్యర్థులు, వాళ్ల వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూసి నిర్ణయం తీసుకోవాలని, దుర్మార్గపు కాంగ్రెస్ను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. చరిత్ర మీ కళ్ల ముందే ఉంది. పార్టీ మీముందే పుట్టింది. మీ ముందే పెరిగింది. అదే కాంగ్రెస్ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 55 ఏళ్లు గోస పెట్టింది. సాగునీరు, తాగునీరు, కరెంట్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతుల ఆత్మహత్యలతో గందరగోళ పరిస్థితులు ఉండేవి. అలాంటి కాంగ్రెస్ పార్టీ కొత్త రూపంతో వస్తోంది. సంపద పెంచకుండా సర్వనాశనం చేసి మళ్లీ వస్తోంది. దానికి ఓటేసి మోసపోతే గోసపడతాం. దుర్మార్గపు కాంగ్రెస్ను మట్టి కరిపించాలి. రాజకీయం అంటే సినిమా మ్యాట్నీ షోకాదు.. ఎవరో చెప్పారని ఓటేస్తే ఆ ఓటే కాటేస్తది. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే! వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నీ గెలిస్తే ఢిల్లీలో తడాఖా చూపించొచ్చు. పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నవోదయ విద్యాలయాల కోసం ప్రధాని మోదీకి అనేకసార్లు లేఖలు రాశాం. కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 157 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. వివిధ పథకాల ద్వారా తెలంగాణకు రూ.25వేల కోట్లు రావాల్సి ఉన్నా ఇవ్వకుండా అడ్డుపుల్లలు వేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పోరాటాలతోనే రాష్ట్రం వచ్చింది యాభై ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పాలనలో ఎంతో గోసపడ్డాం. మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి బాధపెట్టారు. తెలంగాణ రాకముందు రైతుల ఆకలి చావులు, నేతన్న ఆత్మహత్యలు, బతుకుదెరువు కోసం వలసలతో పల్లెల పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ (టీఆర్ఎస్)ను చీల్చేందుకూ కాంగ్రెస్ ప్రయత్నించింది. అయినా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది. గత పదేళ్లుగా రా ష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి మతకలహాలు లేవు. నిజాం హయాంలో కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో ఏవిధంగా తయారైందో ప్రజలకు తెలుసు. మా ప్రభుత్వం వచ్చాక నిజాంసాగర్ను పునరుద్ధరించాం. దీనికి కాళేశ్వరం నీటిని అందించేందుకు లింక్ ఏర్పాటు చేశాం. బీడీ కార్మీకులందరికీ పింఛన్ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చుకున్నం. చెరువులను బాగు చేసుకున్నం. తలసరి ఆదాయంలో నంబర్ వన్గా నిలిచినం. రైతుబంధును రూ.10 వేల నుంచి ఏడాదికి కొంత పెంచుకుంటూ రూ.16 వేలు చేసుకుందాం. బీడీ టేకేదార్లకు, బీడీ కార్మీకులకు ఉన్న 2014 ఏడాది కటాఫ్ను తొలగించి పీఎఫ్ ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తాం. వారితోపాటు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితుల పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుకుందాం..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
రాయేదో.. రత్నమేదో తేల్చుకోండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, మహబూబాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ఎలాంటోడని ఆలోచించడమే గాకుండా.. వారి వెనుక ఉన్న పార్టీ గత చరిత్ర ఏంటి? వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రు? అన్నది ఆలోచించి ఓటు వెయ్యాలె. కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది, బీఆర్ఎస్ కూడా పదేళ్లు పాలించింది. ఎవరి కాలంలో ఏం జరిగిందో, బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందో బేరీజు వేసుకోవాలి. నా మాటను మన్నించి ఊళ్లలో ఒక్కసారి చర్చ పెట్టండి. ఏది రాయో, ఏది రత్నమో తెలుసుకుని ఓటేయండి..’ అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు ఓటు. ఇది ఓ వజ్రాయుధం లాంటిది. ఆట కోకిల విషయం కాదు (చిన్నపిల్లల వ్యవహారం కాదు). దానిని ఆషామాషీగా వేయొద్దు. అది మన తలరాతను మార్చుతుంది. భవిష్యత్తును నిర్ణయించేది. కాబట్టి వచ్చే ఐదేళ్లు ఎవరు పాలించాలి? ఎవరి చేతిలో ఉంటే రాష్ట్రం బాగుంటదన్న విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటే ప్రజలు గెలుస్తారు. హైదరాబాద్లో ఏర్పడే ప్రభుత్వం మంచిగుంటే మీకు మంచి జరుగుతది. లేకపోతే చెడు జరుగుతుంది..’ అని చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధి తొర్రూరు పట్టణంలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ‘పదేళ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ఎక్కడ చూసినా కరువు కాటకాలు. రైతుల ఆత్మహత్యలు. కడివెడు నీళ్ల కోసం కూడా ప్రజల కష్టాలు పడటం చూసినం. పంటలు పండక హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు. ఈ పరిస్థితి నుంచి మొదలైన బీఆర్ఎస్ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో మీరు చూడండి. సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. కాళేశ్వరం కట్టుకున్నాం. కాల్వల ద్వారా రైతులకు నీటితీరువా లేకుండా నీళ్లు పారించి కరువును పారదోలాం. మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ నాపై ఒత్తిడి తెచ్చాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్ రావాల్సి ఉండగా, రూ.5 వేల కోట్లు కట్ చేస్తామని బెదిరించాడు. అయినా బెదరలేదు. మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశా. మరోవైపు గిరిజన తండాలను గ్రామ పంచాయితీలుగా చేసుకున్నాం. ఇప్పుడు వారే పాలకులుగా మారారు. వలసలు ఆగిపోయాయి. పెన్షన్ను మొదట వెయ్యి చేసి, ఇవ్వాల రెండు వేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దాని రూ.5 వేలకు పెంచుకోబోతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు, దళితబంధు తీసుకొచ్చాం. తలసరి విద్యుత్ వినియోగంలోనే కాదు.. ఆదాయంలోనూ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం. ఇవన్నీ చూస్తే ఎట్లున్న తెలంగాణ ఎట్ల మారింది అన్నది కన్పిస్తుంది. పేదలకు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన బియ్యం ఎంత? ఈనాడు ఇస్తున్న బియ్యం ఎంత? ఆలోచించాలి. వచ్చే మార్చి నుంచి రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే గిరిజనబంధు అమలు చేస్తాం. ..’ అని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెసోళ్ల చేతిలో పడితే పెద్ద పాము మింగినట్లే.. ‘కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్ననాడు ఏ పేదలనూ చూడలేదు. ఈసారి పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ పోవుడు ఖాయం. రైతుబంధుకు రాంరాం.. దళిత బంధుకు జై భీమ్. రాష్ట్రం కాంగ్రెసోళ్ల చేతిలో పడితే వైకుంఠ ఆటలో పెద్ద పాము మింగినట్లే. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాం«దీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ధరణి తీసేసేవాళ్లు, 24 గంటల కరెంటు వద్దని.. 3 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు, 10 హెచ్పీ మోటార్ పెట్టుకోమనేవాళ్లు రాజ్యానికి వస్తే రైతుల గతి ఏమవుతుందో ఆలోచన చేయండి. రైతులు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటార్లు వాడుతుంటే పీసీసీ అధ్యక్షుడు 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోమంటున్నారు. మరి ఆ మోటార్లు ఎవరు కొనివ్వాలి? 24 గంటల కరెంటు ఇస్తున్న మన రాష్ట్రానికి వచ్చి.. మా కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటున్నారు. రైతుబంధుతో డబ్బులు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపిస్తున్నారు. 3 గంటల ఉచిత విద్యుత్ చాలని ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. రాహుల్, సీఎల్పీ నేత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? ఎవరి పాలనలో ఏం చేశారు అనేది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. అంతేకానీ ఓటు వేసేటప్పుడు గాయ్ గాయ్ అయి అమూల్యమైన ఓటును గంగపాలు చేయొద్దు..’ అని సీఎం సూచించారు. నేను మాట నిలుపుకున్నా.. జానారెడ్డి తప్పారు ‘2014లో మేము అధికారంలోకి రాగానే ఆర్థిక నిపుణులతో చర్చించి కరెంట్ విషయంలో స్థిర నిర్ణయం తీసుకున్నాం. రెండేళ్లలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పా. ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకుడు జానారెడ్డి.. ‘నాలుగేళ్లలో 24 గంటల కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువాను వదిలి, గులాబీ కండువా కప్పుకుంటా..’ అని అన్నారు. నేను ఏడాదిన్నరలోనే కరెంట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నా. కానీ జానారెడ్డి మాత్రం మాట మీద నిలబడలేదు.గులాబీ కండువా కప్పుకోలేదు.ఎన్నిసార్లు గెలిపించినా పెద్ద నాయకుడిని చేసినా ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రినవుతా అని పంచరంగుల కల కంటున్నారు..’ అని విమర్శించారు. ‘పోరాటం, దైవభక్తితో విరాజిల్లిన నేల తెలంగాణ ప్రాంతం. పోతన, చాకలి అయిలమ్మ, షేక్ బందగి, దొడ్డి కొమురయ్యలు పుట్టిన పురిటి గడ్డ. వారిని స్ఫూర్తిగా తీసుకొని పాలకులను ఎన్నుకోవాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, మధుసూదనాచారి, పార్టీ నేతలు ఆనంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదని, దీని పై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పా డాలన్నారు. ‘మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే, రూ. 25 కోట్లు అడిగారని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన అమ్ముడుపోయారు’అని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో జరిగిన మాదిగల బహిరంగసభ నిమిత్తం మందకృష్ణకు రూ.72 కోట్లు ముట్టాయని, ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. మాదిగలకు మోదీ ఇన్నిరోజుల్లో చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా అని కేఏ పాల్ నిలదీశారు. చదవండి: కేసీఆర్కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
కేసీఆర్కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
అవినీతి డబ్బుతో కేసీఆర్ గెలవాలనుకుంటున్నారు: సిద్ధరామయ్య
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో ప్రజలను కొనేందుకు చూస్తున్నారు. కేసీఆర్ను రేవంత్రెడ్డి ఓడించడం ఖాయం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను సాగనంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ కామారెడ్డి సభలో సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేరుస్తామని, జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతి కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం. స్థానిక సంస్థల్లో 23 శాతం, రిజర్వేషన్ను 42 శాతం పెంచుతాం. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్ అందిస్తాం’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. చదవండి: బీజేపీలో ‘బీఫామ్’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత కేసీఆర్కు రేవంత్ సవాల్ ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలుపై ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ రేవంత్రెడ్డి..కేసీఆర్కు సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి ప్రజలు సిద్ధం అయ్యారు. సచివాలయం ముందు లింబయ్య అనే కామారెడ్డి రైతు ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకొని చనిపోయారు. కేసీఆర్ కొనాపూర్ బిడ్డ అంటున్నారు.. మరి ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు ఆదుకొలేదు. కామారెడ్డి బంగారు తునక అంటున్నారు.. గజ్వేల్ నుంచి ఎందుకు వస్తున్నారు.అమ్మకు అన్నం పెట్టని వారు చిన్నమ్మకు బంగారు గాజులు అంటే నమ్మడానికి కామారెడ్డి ప్రజలు అమాయకులు కాదు’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కుట్రతో కామారెడ్డి భూముల కోసం ఇక్కడికి వస్తున్నారు కేసీఆర్. మాస్టర్ ప్లాన్ రద్దు అంటున్నారు.. మీ ప్రభుత్వమే రద్దు అయ్యింది. మీ కుటుంబం కోసమేనా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది. కేసీఆర్ను ఓడించేందుకే, పార్టీ ఆదేశం మేరకే కామారెడ్డికి వచ్చాను. బూచోడు వస్తున్నాడు. మీ భూములు లాక్కుంటారు.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కనిపించడు వినిపించడు.. కామారెడ్డి నియోజక వర్గంలో 3 లక్షల 60 వేల ఎకరాలకు వైఎస్సార్ తీసుకొచ్చిన ప్రాణహిత, చేవెళ్ల ద్వారా గోదావరి జలాలు అందాలంటే కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
చురక పెట్టాలె..!
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 50 ఏళ్లు గోసపడేలా చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు.. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా గోసపెడుతున్న బీజేపీ వాళ్లు మరోవైపు ఓట్ల కోసం వస్తున్నారని.. వారికి ఓటుతో చురక (వాత) పెట్టాలని పేర్కొన్నారు. ఏ అభ్యర్థి ఏమిటో, వారి గుణగణాలు, మంచీచెడ్డతోపాటు వారి వెనుక ఉన్న పార్టీని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షలతో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ మహాత్ముడు తనపై పోటీకి వస్తున్నారని, ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గజ్వేల్, కామారెడ్డిలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. తమాషాకు వేయొద్దు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటేయాలి. ప్రతీ విషయం మీద చర్చ జరగాలన్నదే నా అభిమతం. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు. ప్రజలే గెలవాలి. ఎన్నికలు రాగానే అబద్ధాలు, అభాండాలు, గోల్మాల్ తిప్పుడు, గోలగాళ్లు తయారవుతున్నరు. అట్లా కాకుండా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలి. బీడీ కార్మికులందరికీ జీవన భృతి యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలి. 1956కు ముందు మనం మనంగానే ఉంటే, మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. మనోళ్లు అప్పుడు నెత్తీనోరు కొట్టుకున్నరు. సిటీ కాలేజీ విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తే.. ఏడుగురు పిల్లల్ని కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ది. తెలంగాణ సాధించుకున్న సమయంలో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండె.. ఇప్పుడు ఎట్లా ఉన్నయో ఆలోచించాలి. నేను కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. అందులో బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. కటాఫ్ డేట్ తొలగించి అందరికీ జీవనభృతి ఇస్తాం. అందరికీ పింఛన్ సొమ్మును రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతాం. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలి రాష్ట్రం వచ్చాక ఎన్నో విజయాలు సాధించినం. 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టినం. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి అండగా నిలిచినం. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నం. రాబోయే రోజుల్లో రూ.16 వేలకు పెంచుకుంటం. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడా రైతుబంధు లేదు. ఏదైనా పరిస్థితుల్లో రైతు చనిపోతే రైతుబీమాతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. కరెంటు మీద, రైతుబంధు మీద కాంగ్రెస్ లీడర్లు ఏమేమో మాట్లాడుతున్నరు. ఎద్దు ఎవుసం తెలువని రాహుల్గాంధీ ధరణిని తీసేస్తనంటడు. ధరణి పోతే మళ్ల వీఆర్వో, గిర్దావర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో.. ఇట్లా అందరి చేతుల్లోకి భూమి పోయి, రికార్డులన్నీ తారుమారై జనం ఆగం కావలన్నదే వాళ్ల ఉద్దేశం. ధరణి వచ్చినంక రైతుఖాతాలోనే భూమి ఉంటోంది, తను వేలిముద్ర వేస్తేగానీ వేరే వారికి మారే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలను నిలదీయాలి.. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తే మేం పెట్టబోమని స్పష్టం చేసిన. అందుకు రూ.25వేల కోట్లు లాస్ చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేంద్రం తరఫున 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాల్సి ఉన్నా ఒక్కటీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటూ వెయ్యకుండా చురుకు (వాత) పెట్టాలి. బీజేపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలి...’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే సింధే, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత గజ్వేల్లో.. తర్వాత కామారెడ్డిలో.. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి హెలికాప్టర్లో గజ్వేల్కు చేరుకున్నారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ పత్రాలను పరిశీలించి, స్వీకరించిన అధికారులు కేసీఆర్తో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్ హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. -
పొదరిల్లు చేసుకున్నం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పొదరిల్లుగా మార్చుకున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆం్ర«ధాలో కలపడం వల్ల 50ఏళ్లకుపైగా గోసపడ్డామన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ గోస మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అందరూ ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని, లేకపోతే మోసపోయి గోస పడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుము రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్, ఆసిఫాబాద్తోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రం వచ్చినప్పుడు ఏమీ లేకుండే. సాగు, తాగునీరు లేదు. రైతులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు జరిగేవి. అన్నింటా దళారీ వ్యవస్థ ఉండేది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పోతున్నాం. రాష్ట్రం ఓ పొదరిల్లుగా మారింది. అవినీతి లేని పాలన అందిస్తున్నాం. భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు అందుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించాం. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 15 నుంచి 20ర్యాంకులో ఉండేది. ఇప్పుడు నంబర్ వన్గా మారింది. ఇదంతా మంత్రమో, మాయ చేస్తేనో అయితదా? పట్టుదలతో పనిచేస్తున్నాం. నిజాం స్థాపించిన సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉంది. వంద శాతం రాష్ట్ర వాటా ఉండాల్సిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి 49శాతం వాటా ఇచ్చింది. వాళ్లు ఉన్నన్ని రోజులు కంపెనీకి లాభాలు రాలేదు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. కార్మికులకు బోనస్లు పెంచాం. రాష్ట్రాన్ని జాప్యం చేసి గోస పెట్టింది బీఆర్ఎస్ 24 ఏళ్ల కింద పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించకున్నాం. అంతకుముందు 50ఏళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలకులు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గోస పడ్డాం. ఉప్పెనలా ఉధృతంగా ఉద్యమం చేస్తే 2004లో ఎన్నికల ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు కాగానే మాట తప్పింది. మళ్లీ గోస పెట్టింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు పోరాడితే.. చివరికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్ ఎందుకని.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వేస్ట్ పథకమని అంటున్నారు. భూవివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి లంచం ఇవ్వకుండానే అరగంటలో అయిపోతున్నాయి. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలా అంటున్నవారినే బంగాళాఖాతంలో వేయాలి. ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది. రైతుబంధు, ఉచిత విద్యుత్ ఉండాలంటే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే సాధ్యం. వారికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నారని గాంధీభవన్లో ఆ పార్టీ నేతలే రోజూ లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి అధికారమిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారు. అందుకే ప్రజల కోసం పనిచేసే వారిని, కష్టపడే పార్టీని ఎన్నుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైటు వెలుగుతుంది. కానీ మాకు తెలంగాణ ప్రజలే బాసులు. గిరిజనేతరులకూ పట్టాలిస్తాం పారిశ్రామికంగా సిర్పూర్ కాగజ్నగర్ను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ తెచ్చుకోబట్టే ఆసిఫాబాద్ జిల్లా అయ్యింది. గతంలో వానాకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని పత్రికల్లో వచ్చేది. ఇప్పుడు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ, వంద పడకలతో ఆస్పత్రి వచ్చాయి. ఆసిఫాబాద్లో 47వేలు, సిర్పూరులో 16 వేల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం. గిరిజనేతరులకూ త్వరలో పట్టాలు ఇస్తాం. ఈ విషయంలో కేంద్రం అడ్డంకిగా మారింది. ఆలోచించి ఓటు వేయండి ఓటు వేసే ముందు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచించాలి. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను విచారించి ఓటు వేయాలి. మీరు వేసే ఓటు వచ్చే ఐదేళ్లు మీ తలరాతను నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం, మతం లేదు. అందరినీ కలుపుకొని పోతున్నాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. బీఆర్ఎస్ కంటే ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ముస్లింల కోసం వాళ్లు రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. మేం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అన్నీ ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..’’ అని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎంపీ వెంకటేశ్నేత, తదితరులు పాల్గొన్నారు. ïసీఎం సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. మరోసారి మొరాయించిన హెలికాప్టర్ సీఎం కేసీఆర్ పర్యటనల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ మరోసారి మొరాయించింది. మూడు రోజుల కింద బీఆర్ఎస్ సభల కోసం బయలుదేరిన ఆయన హెలికాప్టర్లో సమస్య వల్ల ఫామ్హౌజ్కు వెనుదిరిగి.. మరో హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం కాగజ్నగర్లో ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్లో వెళ్లిన సీఎం.. అది ముగిశాక ఆసిఫాబాద్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ హెలికాప్టర్లో సాంకేతికలోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్కు చేరుకున్నారు. ఇక్కడ సభ ముగిసేలోపు పైలట్ హెలికాప్టర్లో సాంకేతికలోపాన్ని సవరించి ఆసిఫాబాద్కు తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్ హెలికాప్టర్లో బెల్లంపల్లి సభకు హాజరై, తర్వాత హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. -
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్నగర్లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
మాకు ప్రజలే బాస్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీలో ఉండదని, మన బాసులు తెలంగాణ ప్రజలేనని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. టికెట్ల కోసం ఆఫీసులు తగులబెట్టుకునే పరిస్థితి మన దగ్గర లేదని చెప్పారు. మన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయని అన్నారు. ఇతర పార్టీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైట్లు వెలుగుతాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో డజను మంది సీఎం అభ్యర్థులున్నారని విమర్శించారు. అధికారంలోకొస్తే ఏడాదిలో ఎంతమంది మారతారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా మందమర్రిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ ‘కర్ణాటకలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక నిశ్చితాభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, రాష్ట్రానికో నీతి పెట్టింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా..? తెలంగాణలో ప్రకటించిన స్కీమ్స్ ఛత్తీస్గఢ్లో పెట్టారా? రాజస్తాన్లో ఎందుకు అమలు చేయడం లేదు? ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఎన్నికలు అయిపోగానే బయటపడటం కాంగ్రెస్ నైజం. ఇతర పార్టీ నేతలను పశువులను కొన్నట్టు కొంటోంది. నేను కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన ఎన్నికల్లో చొప్పదండి నియోజకరవ్గంలో ఐదుగురు పార్టీ మండల అధ్యక్షులను కొనేశారు. అయితే ఆ ఊళ్లలో వారిని దంచింన్రు. అక్కడ ఆ పార్టీలకు ఐదు ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొంతమంది పిచ్చి నాయకులు గొర్రెల్లాగా పోవొచ్చు. నూరు కథల పడ్డా.. ప్రజల మనసులో గ్యారెంటీగా బీఆర్ఎస్ సర్కార్ వస్తుందనే నమ్మకం ఉంది. అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేనే రావాలి. వేరే ఆయన వస్తే లాభమైతదా.? ప్రజలు ఆలోచన చేయాలి..’ అని కేసీఆర్ కోరారు. 58 ఏళ్లు గోస పోసుకున్న కాంగ్రెస్ 1956కు ముందు తెలంగాణ ఇండిపెండెంట్ స్టేట్గా ఉండేది. అయితే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రాలో కలిపింది. సమైక్య రాష్ట్రంలో సాగు, తాగు నీళ్లు లేవు. కరెంట్ లేదు. ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్కౌంటర్లు, అమాయకులు చనిపోవడం, పోలీసులు చనిపోవడం.. రక్తపాతం.. దారుణమైన పరిస్థితి ఉండేది. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెసోళ్లు తియ్యగా మాట్లాడితే సరిపోదు. 58 ఏండ్లు మా గోస పోసుకున్నది మీరు కాదా..? తెలంగాణ ఉద్యమ ఉప్పెనను చూసి తెలంగాణ ఇస్తామని 15 ఏళ్లు మోసం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. దేశంలోని 33 పార్టీల సపోర్టుతో తెలంగాణ వచ్చింది. గత పదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే మతకల్లోలాలు, కర్ఫ్యూలు.. ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల వాటా పెంచాం ‘పార్లమెంట్ ఎన్నికల్లో అంబేడ్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే. అమ్మా, బొమ్మా పేరు చెప్పి దళితులను మోసం చేసింది. కానీ దేశంలో పొలికేక ‘దళితబంధు’తో ఆ వర్గాలకు మేలు జరిగింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వేస్ట్ పథకమంటున్నారు. రైతుబంధు పదం పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పథకం ఉండాలా? వద్దా? 24 గంటలు విద్యుత్ వద్దు.. 3గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారు. ఉండాలా? వద్దా? ‘ధరణి’ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని కాంగ్రెస్ పార్టీయే ముంచింది. తెలంగాణ వచ్చాక లాభాలు పెంచాం. తెలంగాణ రాక ముందు రూ.419 కోట్ల లాభాలు ఉంటే, ఇప్పుడు రూ.2,184 కోట్లకు చేరుకున్నాయి. కార్మికులకు దసరా, దీపావళికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నాం. సింగరేణి స్థలాల్లో పట్టాలు ఇచ్చాం. వారసత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే పునరుద్ధరించింది. సింగరేణి కార్మికులకు గ్యాస్, నీరు, విద్యుత్ సౌకర్యాలపై వేసే పెర్క్ ట్యాక్స్ను కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా యాజమాన్యమే చెల్లించేలా చూస్తాం. ఎమ్మెల్యే బాల్క సుమన్ వినతి మేరకు కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ వర్తించేలా, మందమర్రి ఏజెన్సీలో ఎన్నికలు జరిగేలా చూస్తాం..’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీసీ చైతన్యం చూపెట్టాలి ‘బీసీ నాయకుడు బలంగా ఎదిగి పనిచేస్తుంటే అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలో ఆలోచించాలి. ఈసారి మంథని ఎన్నికల్లో బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు మీ బీసీల చైతన్యం చూపెట్టి పుట్ట మధును గెలిపించాలి. మధును భారీ మెజార్టీతో గెలిపిస్తే రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధులతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ముగ్గురు మోపయ్యారు. ఒకాయన పేకాట క్లబ్లతో డబ్బులు సంపాదించాడు. సీసాలు పంచుతున్నడు. సూటుకేసులతో వచ్చే వారు కావాల్నా? బాల్క సుమన్ లాంటి వారు కావాల్నా? ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యంలో ఏకైక వజ్రాయుధం ఓటు. ఆషామాషీగా, డబ్బులకో.. ఎవరో చెప్పారనో వేయొద్దు. మీరు వేసే ఓటు మీ తలరాతను, ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుంది. పార్టీ నడవడిక, సరళి, అభ్యర్థిని చూసి ఓటెయ్యాలి. ఏ ప్రభుత్వం మనకు పని చేస్తదో ఆలోచించి వేయాలి..’ అని సీఎం కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పుట్ట మధు, దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, మధుసూదనచారి, ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్ధన్, రాజారమేష్, దుర్గం నగేష్, బీజేపీ నాయకుడు పత్తి శీను బీఆర్ఎస్లో చేరారు. సీఎం హెలికాప్టర్ తనిఖీ సాక్షి, పెద్దపల్లి: మంగళవారం పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో, కాన్వాయ్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అనుసరించి ముఖ్యమంత్రి వారికి సహకరించారు. -
ఆ గోస మళ్లీ కావాల్నా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ ప్రజల 50 ఏళ్ల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని.. సమైక్య పాలకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపి మన ప్రాజెక్టులను రద్దు చేశారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. నదులు పారే పాలమూరు జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించినది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాలు చేస్తే, వందలాది మంది పిల్లలు చనిపోతే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు, నీళ్ల సమస్యలు, దోపిడీ, కమీషన్ల రాజ్యం వస్తుందని.. అలాంటి పాలన మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీలు, వాటి చరిత్రను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరులోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పిడికెడు మందితో తెలంగాణ అంతా తిరిగి అందరినీ చైతన్యవంతం చేశాం. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నాని్చవేత ధోరణితో టీఆర్ఎస్ను ముంచేందుకు ప్రయత్నించింది. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాల తర్వాత.. నేను ఆమరణ దీక్ష చేస్తే తట్టుకోలేక దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనుకకు పోవడంతో వందలాది మంది పిల్లలు చనిపోయారు. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణకు ఈ దుస్థితి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పచ్చబడింది. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మరోసారి ఖతం పట్టించాలని కుట్రలు చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పం.. చెప్పే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ వాళ్లు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు ఒకప్పుడు పాలమూరు జిల్లా పాలుగారిన జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు. పాలమూరును సర్వ నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారు. ఒక్క ప్రాజెక్టు కావాలని ఏ కాంగ్రెస్ నాయకుడూ నోరు తెరిచి అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే.. పాలమూరుకు నీళ్ల గురించి ఏ నాయకుడూ అడగలేదు. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోయి ఉంటే బాగుపడేదని బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లోనే రాసి ఉంది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ గమనించి అప్పట్లో జూరాలకు 17 టీఎంసీలు మంజూరు చేసింది. ఎవరూ పట్టించుకోకపోతే.. తెలంగాణ ప్రాంతవాసి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు. అయినా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. 2001లో గులాబీ జెండా ఎగిరాకే అడుగు ముందుకుపడింది. నాటి ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకున్నామంటూ పునాది రాళ్లు వేసిపోయారే తప్ప ఎవరూ కశికెడు నీళ్లు తెచ్చివ్వలేదు. కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంట పారే జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పాలమూరు ఎలా అయిందో ప్రజలు గమనించాలి. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించారు. కోయిల్సాగర్ లిఫ్ట్నూ పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలను పూర్తిచేసి చెరువుల్లో నీళ్లు నింపుతాం. మరో ఉద్యమం వస్తదేమో.. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందిస్తలేదు. మరో ఉద్యమం వస్తదేమో. సమైక్య రాష్ట్రంలో మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి బోయలను ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీల్లో పెట్టి, ఇక్కడ బీసీల్లో పెట్టింది నిజం కాదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? ఆనాటి మంత్రి రఘువీరారెడ్డి పాలమూరుకు వస్తే.. మంగళహారతులు పట్టి మరీ నీళ్లు తీసుకుపొమ్మని ఎవరు చెప్పారో అందరికీ తెలుసు. బాగా ఆలోచించి ఓటేయాలి నేను కూడ రైతునే, వారికష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. గతంలో రాత్రిళ్లు ఇచ్చే అరకొర కరెంటుతో పాములు కుట్టి, కరెంటు షాక్ తగిలి వేల మంది రైతులు మృత్యువాత పడ్డారు. రైతు బంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటే.. మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రైతులపై విషం చిమ్ముతున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజల దగ్గర ఓటు అనే వజ్రాయుద్ధం ఐదేళ్ల భవిష్యత్ను నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి, సమాజానికి ఎవరుంటే మేలు జరుగుతుందో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి. గద్వాలలో తడబడిన కేసీఆర్ కేసీఆర్ గద్వాలలో తన ప్రసంగం సందర్భంగా తడబడ్డారు. ‘‘ఎన్నికలు వస్తాయి, పోతాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉంటారు. అభ్యర్థుల గుణం చూడాలి. ముఖ్యంగా వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. బండ్ల కృష్ణమోహన్రెడ్డి వెనుక బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటది’’అని చెప్తూ.. ‘బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది’అన్నారు. వెంటనే సవరించుకుని ‘బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’అంటూ ప్రసంగం కొనసాగించారు. నారాయణపేటలో ఉర్దూలో ప్రసంగం సీఎం కేసీఆర్ నారాయణపేట సభలో ప్రసంగించిన సందర్భంగా చివరిలో ముస్లింలను ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో ఒక్క కర్ఫ్యూ లేదు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది’’అని చెప్పారు. హెలికాప్టర్లో సమస్యతో సభలు ఆలస్యం మర్కూక్ (గజ్వేల్): సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే వెనక్కి తిప్పి వ్యవసాయ క్షేత్రంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రచార సభలకు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు మరో హెలికాప్టర్ను తెప్పించారు. కేసీఆర్ అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు.. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ దేవరకద్ర సభకు రావాల్సి ఉండగా.. హెలికాప్టర్ సమస్య వల్ల 3.35 గంటలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి 12 నిమిషాలు ప్రసంగించారు. అక్కడి నుంచి గద్వాలకు చేరుకుని 15 నిమిషాలు, మక్తల్లో ఎనిమిది నిమిషాలు ప్రసంగించారు. చివరగా నారాయణపేటలో 29 నిమిషాలు మాట్లాడారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఇక 'ప్రాంతీయ' శకమే: సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో.. ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నికలు వస్తుంటాయి.. వివిధ పార్టీల అభ్యర్థులు నిలబడతారు.. ఇప్పుడు కూడా నిలబడ్డారు. మనిషి గుణం, గణం చూడాలి. సేవ చేస్తాడా.. గెలిచిన తర్వాత టాటా చెబుతాడా..? అన్నవి పరిశీలించాలి. అంతకన్నా ముఖ్యమైన అంశం.. అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉంటుంది. గెలిచే అభ్యర్థి ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వమే రాబోయే ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్ను నిర్దేశిస్తుంది. మన తలరాత రాస్తుంది. కాబట్టి ఏ పార్టీ చరిత్ర ఏమిటి?..అధికారం ఇచ్చినప్పుడు వారి నడత, సరళి ఏమిటి? ఏం చేశారనేది ఆలోచించి మీ విచక్షణతో ఓటు వేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలవడం ప్రారంభం అవుతుంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ సొంత ఓటు. మీ నిర్ణయాధికారాన్ని సరైన పద్ధతిలో వాడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు..’అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెంల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. మీ కళ్ల ముందే అభివృద్ధి ‘బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ జెండా ఎత్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా భుజాన వేసుకున్నాయా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమాన పరిచారు. కాల్చి చంపారు..జైళ్లల్లో పెట్టారు. వీళ్లకెందుకు ప్రేమ ఉంటుంది? కాంగ్రెస్ నాయకులకు సొంతం ఉండదు కథ. ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ లైటు వెలుగుతుంది. ఈ ఢిల్లీ గులాముల కింద ఉండి మనం కూడా గులాం అవుదామా? తెలంగాణ రాకముందు 70 ఏళ్ల క్రితం ‘నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమురా’అని ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంకటరామారావు పాట రాశారు. ఖమ్మం, కొత్తగూడెం నాడు ఎలా ఉండేవి? ఐదారేళ్లలో ఎలా చేశాం? ఖమ్మం పట్టణం చూస్తే ఇప్పుడు గర్వపడుతున్నా. ఒకనాడు ఇక్కడ పాదయాత్ర చేశా. గోళ్లపాడు ఎట్లా మురికిగా ఉండేది.. ఎన్నేళ్లు ఆ మురికి కంపు భరించాం? లకారం చెరువు ఎంత వికారంగా ఉండేది.. ఇవ్వాళ ఎంత సుందరంగా తయారైంది. అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది..’అని కేసీఆర్ అన్నారు. సింగరేణిని గాడిలో పెట్టాం..లాభాలు పెంచాం.. ‘అప్పట్లో రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి పేరు చెప్పి కేంద్రం నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చాయి. వాటిని సకాలంలో చెల్లించలేదు. దానికి బదులు సింగరేణిలో కేంద్రానికి వాటా ఇచ్చారు. ఫలితంగా సింగరేణి సంస్థలో 49 శాతం వాటా కేంద్రానికి వెళ్లింది. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని గాడిలో పెట్టాం. లాభాలను పెంచడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా సంస్థను తీసుకువచ్చాం. రాష్ట్రంలో కరెంటు కష్టాలు, మంచినీటి వెతలు తీరాయి. గురుకులాలతో విద్యావ్యవస్థ మెరుగైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ మేం ప్రతి దళిత కుటుంబానికి సాయం అందే వరకు దళితబంధు పథకం కొనసాగిస్తాం. ఇవన్నీ విచారించి.. ఆలోచించి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలి..’అని సీఎం విజ్ఞప్తి చేశారు. మైనార్టీలకు పెట్టిన ఖర్చు చూడండి.. ‘మనకన్నా ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది. మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం రూ.900 కోట్లు ఖర్చుచేసింది. ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ఓట్లు దండుకుంది. మనం తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దీన్ని చూస్తే ఎవరు ఏవిధంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. మేం అందరినీ కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నాం. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రం లౌకిక రాష్ట్రంగానే ఉంటుంది. అజయ్కుమార్ను ప్రేమతో అజయ్ఖాన్ పేరుతో పిలుస్తారు. అజయ్ను ఆశీర్వదించండి. ఖమ్మంకు న్యాయం చేస్తాడు..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఖమ్మంకు వాళ్లిద్దరి పీడ వదిలింది.. ‘ఖమ్మం జిల్లాలో ఇద్దరు కరటక దమనకులు ఉన్నారని మొన్న సత్తుపల్లి సభలో చెప్పా. పరావస్తు చిన్నయసూరి కథ చదివితే వాళ్లెవరు ఆ కథ ఏంటో తెలుస్తుంది. లేకపోతే మీ తెలుగు మాస్టర్ని అడగండి. ఖమ్మానికి వీళ్లిద్దరి పీడ వదిలించాం. ఇవ్వాళ ఖమ్మం శుభ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఒకాయన అజయ్ చేతిలో ఓడి మూలకు పడి ఉంటే.. నేను పిలిచి అందరినీ సమన్వయం చేద్దామని మంత్రిని చేసి జిల్లాను అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా. బీఆర్ఎస్ పార్టీ వారిని ఒక్కరినీ అసెంబ్లీ గడప తొక్కనీయనని ఒక అర్భకుడు మాట్లాడుతున్నాడు. ఖమ్మంను గుత్తకు పట్టినవా.. ఖమ్మం జిల్లాకు జిల్లానే కొనేశావా.. ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా?..’అంటూ పరోక్షంగా తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ సభల్లో పువ్వాడ అజయ్కుమార్, వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మ«ధు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, లింగాల కమల్రాజ్, రేగా కాంతారావు, బానోతు హరిప్రియ, బానోతు మదన్లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కోనాయిపల్లిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తనకు సెంటిమెంట్ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వస్వామిని దర్శించుకుని, నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు సీఎంకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి సన్నిధిలోనే గజ్వేల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. మంత్రి హరీశ్రావు సైతం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలుచేసి, వాటిపై సంతకం చేశారు. తర్వాత కేసీఆర్, హరీశ్రావు ఆలయం నుంచి బయటికి రాగా.. గ్రామ మహిళలు వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. సుమారు 1.15 గంటల సమయంలో వారు తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్కు బయలుదేరారు. -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్రావు నామినేషన్కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
మీరే గెలిపించాలి..
మేం స్వార్థంగా ఆలోచించలేదు.. దళిత బంధు మొదలుపెట్టాక హుజూరాబాద్ నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం. ఆ తర్వాత ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని చింతకాని మండలంలో వంద శాతం కుటుంబాలకు ఇచ్చాం. ఈ పథకం కావాలని మాకు మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు ఇవ్వలేదు. స్వార్థంగా మేం ఆలోచించలేదు. ప్రతిపక్ష నేత ఉన్న నియోజకవర్గంలోనూ అమలుచేశాం. మా నిజాయితీకి ఇది గీటురాయి. ఇవాళ పెడబొబ్బలు పెడుతున్న మూడు రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు దళితులకు ఏం చేశాయి? అరచేతికి బెల్లం పెడతా.. చక్కెర గోలీలిస్తా.. చాక్లెట్లు ఇస్తా.. అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపించి, మురిపించి దశాబ్దాల తరబడి ఓటుబ్యాంక్గా వాడుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ వెళ్తున్నామని, అందులో భాగంగా వచ్చిందే దళితబంధు అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. దళితుల ఓట్ల కోసమే ఈ పథకం తెచ్చామని కొందరు విమర్శిస్తుండటం సరికాదని.. అలాంటి చిల్లర రాజకీయాలు తాము చేయబోమని స్పష్టం చేశారు. అలా చేసే వాళ్లమే అయితే మొదటి టర్మ్ చివరిలో పెట్టేవాళ్లమని.. కానీ పక్కా ప్రణాళికతో, పద్ధతిగా అమలు చేసేందుకు రెండోసారి గెలిచాక ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అండగా నిలిచిన బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో, భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం మొట్లగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు. రెండు, మూడు నెలలు మేధోమథనం చేసి.. ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, నీరు, రైతు బంధు, ధరణి వంటివి తెచ్చాం. రాష్ట్ర విభజనతో మనం ఎట్లా బతుకుతామని కొందరు మాట్లాడారు. పరిపాలన వస్తదా అన్నారు. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి అయితే తెలంగాణ చీకటి అవుతుందన్నారు. మరి ఈ రోజున మనం అందరికన్నా ముందున్నాం. హెలికాప్టర్లో వస్తూ కిందికి చూస్తే లక్ష్మి అమ్మవారు నేలపై నాట్యం చేసినట్టు కనిపించింది. ఒకప్పుడు అన్నమో రామచంద్రా అని అల్లాడిన నేలపై ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. విచక్షణతో ప్రజలు ఓటేయాలి.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎల్లయ్య, పుల్లయ్య బరిలో ఉంటారు. వ్యక్తులతోపాటు వారి చరిత్ర ఏమిటి? వారి కార్యదక్షత ఏమిటి? అనుభవం ఏమిటనేది ప్రజలు చూడాలి. వారిని గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గానికి ఏం జరుగుతుందనేది చూడాలి. అలాంటి వ్యక్తుల వెనుక ఏ పార్టీ ఉంది, ఆ పార్టీ చరిత్ర, వైఖరి, దృక్పథం ఏమిటనేది ప్రజలు గమనించాలి. ఎవరో చెప్పారని, మా కులం వాడు నిల్చున్నాడని ఓటు వేయడం సరికాదు. ఒక కులాన్ని ద్వేషించడం కూడా సరికాదు. కూరగాయలు కొనేప్పుడే కాదు.. కుండనో, కూజానో కొనేప్పుడు కూడా చేతితో తడిమి చూసి మంచిదా, కాదా అని పరిశీలిస్తాం. అలాంటిది మీ జీవితాలను మార్చే ఓటు హక్కును వినియోగించుకునే అంశంలో మరింతగా ఆలోచన చేయాలి. దళితబంధును పుట్టించిందే కేసీఆర్.. దేశంలో దళితబంధు పథకాన్ని పుట్టించిన మొగోడు కేసీఆర్. కేసీఆర్ రాక ముందు ఇలాంటి పథకం ఉందా? ఈ పథకం పెట్టాలని నన్ను ఎవరూ అడగలేదు. అది పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. దేశానికి 70ఏళ్ల కింద స్వాతంత్య్రం వస్తే.. ఇప్పటికీ దళితుల పరిస్థితి బాగోలేదు. వివక్షకు, అణచివేతకు గురవుతున్నారు. భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. జాషువా వంటి మహాకవి కూడా బాధపడి, గాయపడి దళితుల గురించి కావ్యాలు రాశారు. ఉత్తర భారతంలో రోజూ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్తాన్, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఈ దాడులు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటివెన్నో ఆలోచన చేసి నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్యజ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నా.. దాని నుంచి పుట్టిందే దళితబంధు. బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించాలి సత్తుపల్లి నియోజకవర్గాన్ని దళితబంధు కింద తీసుకున్న కొద్దిరోజుల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. కొందరు దుర్మార్గులు దళితబంధు లాంటి పథకాలను ఆపాలని ఫిర్యాదులు ఇచ్చారు. మిషన్ భగీరథ, రైతు బంధు, దళితబంధు పథకాలు ఎన్నికల కోసం పెట్టామా? మొత్తం తెలంగాణ దళిత సమాజానికి అప్పీల్ చేస్తున్నా. మీ కోసం మంచి చేసిన, మిమ్మల్ని జాగృత పరిచే, మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునే కేసీఆర్ లాంటి నాయకుడ్ని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నా. బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే బాధ్యతను దళిత జాతి తీసుకోవాలని కోరుతున్నాను. పైరవీకారుల రాజ్యం వస్తుంది రాహుల్ గాందీకి ఎద్దు లేదు, ఎవుసం ఎరుకలేదు. ఎవరో సన్నాసి రాసిస్తే అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామంటున్నాడు. మళ్లీ వీఆర్వోలు, పహణీ నకళ్లు, ఎమ్మార్వో కార్యాలయం, మళ్లీ వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరగాలా? కాంగ్రెస్కు ఓటేస్తే దళారుల రాజ్యం, పైరవీకారుల రాజ్యం వస్తుంది. మీ భూమి మీద పెత్తనం ప్రభుత్వానికి వస్తుంది. అదే బీఆర్ఎస్కు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి బాసులు. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నా ఢిల్లీ వైపు చూడాలి. వాళ్ల స్విచ్ అక్కడే ఉంటుంది. ఇంతకు ముందు అరవై ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజలను వారి ఖర్మానికి వదిలేసింది. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సభల్లో మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి అహంకారం! ప్రధాని నరేంద్ర మోదీకి అహంకారం ఉంది. ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు మొత్తం ప్రైవేటైజేషన్ అంటున్నరు. అదే పిచ్చిలో కరెంట్ రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నరు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నడు. నేను చచ్చినా పెట్టనని చెప్పిన. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే కరెంట్ ఉంది. ఏడాదికి రూ.25 వేల కోట్లు భారం పడినా నష్టం భరించామే కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు. నాకు కూడా అంత అహంకారం లేదు ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు.‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు దుర్మార్గులు ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ నుంచి నిలబడిన వారిని అసెంబ్లీ గేటు తొక్కనివ్వమని అంటున్నారు. తెలంగాణ తెచ్చి, సీఎంగా ఇన్ని పనులు చేసిన నేను కూడా అంత అహంకారంగా రానివ్వ, లేవనివ్వ, వాడిని కూర్చోనివ్వ అని మాట్లాడలేదు. నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తదా? ఈ డబ్బు రాజకీయాలు, అహంకార రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు?’’ అని మండిపడ్డారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ అతిపెద్ద స్కాం: రాహుల్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని అవినీతి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామన్నారు. కంప్యూటరైజేషన్ పేరుతో ధరణిలో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2500 జమ చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500తో పాటు 500కే సిలిండర్ వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సు చార్జీలకే రూ. 1000-1500 ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల బాధలను తగ్గించేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై 24 కేసులు పెట్టాయని, వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తే.. నేను మాత్రం దేశాన్ని కలిపి ఉంచాలని చూస్తానన్నారు. ధరణితో 25 లక్షల మంది రైతుల భూములను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశంలో కులగణన జరగాల్సిందేనని.. ఓబీసీలకు అధికారాన్ని ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్లు నిరాకరిస్తున్నాయని.. అందుకే బీసీ కులగణనకు ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతామని ప్రకటించారు. అదే విధంగా కేంద్రంలో అధికారం చేపట్టగానే హిందూస్థాన్ అంతా కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. చదవండి: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు -
ప్రజలు గెలవాలి
హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ: ‘ప్రజాస్వామ్యం పరిణతి సంతరించుకోవాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే ప్రజలు గెలుస్తారు. లేదంటే నాయకులు గెలుస్తారు..’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. నాయకులు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే వారికి న్యాయం, అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వ్యక్తిత్వం, మనస్తత్వం గుర్తుంచుకోవాలి. అతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ పార్టీ చరిత్ర, ధృక్పథం, సరళిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుని ఓటు వేయాలి..’ అని సూచించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయగాళ్లు వస్తుంటారని, ఒక్క చాన్స్ అని మభ్యపెట్టి గెలిచాక మోసం చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఒరిగిందేమీ లేదు.. ‘1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని ప్రతిపాదన వస్తే ప్రజలు వ్యతిరేకించారు. అప్పుడు పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. అప్పుడు నోరు మూసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిన పాపాత్ములు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. వారు చేసిన చిన్న పనికి 50 ఏళ్లు ఏడ్చాం..గోసపడ్డాం. 2014లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ప్రస్తుతం మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. వారిలో వారు కొట్టుకుంటున్నారు. కానీ అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వారి ధోరణి, వైఖరి, ఆలోచన ప్రజలకు తెలుసు. పేదలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే కాంగ్రెస్ వాడుకుంది. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ బాధలు తప్పించుకుని మంచినీరు తాగుతున్నాం. పల్లెలు పచ్చబడాలని, పంటలు రావాలని, రైతులకు స్వేచ్చ ఉండాలని, రైతులు బాగుపడాలని రైతుబంధు తెచ్చాం. ఈ పథకం బాగుందని దివంగత వ్యవసాయవేత్త స్వామినాథన్తో పాటు యూఎన్ఓ పొడిగింది. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు దండుగ అంటున్నారు. రైతుబంధు ఉండాలా.. తీసివేయాలా?.. ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో రైతులకు అన్నీ పైరవీల బాధలు ఉండేవి. ఇప్పడు హైదరాబాద్లో రైతుబంధు డబ్బులు వేస్తే మీ సెల్ఫోన్లో మెసేజ్ వస్తుంది. రైతులను ఆదుకోవడం వల్ల దేశంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ పంజాబ్ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. అంతకుముందు 30 లక్షలు, 50 లక్షల టన్నులు మాత్రమే పండించేవారు..’ అని సీఎం తెలిపారు. కరెంటు 3 గంటలు సరిపోతదా? ‘కరెంటు వేస్టు చేస్తున్నారని ఒకాయన అంటాడు.. 3 గంటలు చాలని మరొకాయన అంటున్నాడు. 3 గంటలు సరిపోతదా.. ఆలోచించాలి. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి తమ రాష్ట్రంలో రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, వచ్చి చూసుకోవాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అలాంటి వారిని నమ్మితే మోసపోయి గోస పడతాం. తెలంగాణలో ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాందీ, రేవంత్, భట్టి ధరణి తీసివేయాలని మాట్లాడుతున్నారు. భూరికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ను తెచ్చాం. ఒక రైతును ఏడెమినిది మంది రెవెన్యూ అధికారుల బాధలు, అవినీతి నుంచి తప్పించేందుకు ధరణి తెచ్చాం. భవిష్యత్తులో పింఛన్లు క్రమంగా రూ.6 వేల వరకు, రైతుబంధు రూ.16 వేలకు పెంచుతాం, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, బడి పిల్లలకు టిఫిన్, కంటి వెలుగు తదితర పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాం..’ అని సీఎం వివరించారు. ఇప్పుడు బతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించాలి ‘రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. దళిత బిడ్డలు అనాదిగా అణచివేతకు గురవుతున్నారు. మా తండాలో మా రాజ్యం అని ఎల్హెచ్పీఎస్ (లంబాడీ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో కొట్లాడారు. అయినా వారిని ఎవరూ పట్టించుకోలేదు. యువత ఆలోచన చేయాలి. దేశం మీది, భవిష్యత్ మీది.. మీ చేతుల్లో ఉంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండకు గోదావరి జాలాలు.. ‘గోదావరి జలాలను నల్లగొండ జిల్లాకు అందించి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గోదావరి జలాలను ఉదయసముద్రం ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు తీసుకువస్తాం. కాంగ్రెసోళ్ల కేసుల వల్లే డిండి లిఫ్టు పనులు ఆలస్యం అయ్యాయి. రానున్న కొద్దిరోజుల్లోనే లిఫ్టు పనులు పూర్తి చేసి దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం గీటురాయి. ఈ విషయంలో నాడు పదవ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు మొదటి స్థానంలో నిలిచింది. కడుపు, నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. పదేళ్ల వయస్సున్న తెలంగాణ దేశంలోనే నం.1గా నిలిచింది..’ అని సీఎం చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం సెక్యులర్ రాష్ట్రమే.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కర్ఫ్యూలు, మత కల్లోలాలు లేవు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుంది. ఇటీవల దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డిపై దాడి చేశారు. మేము ఏనాడూ అరాచకాలు చేయలేదు. దుర్మార్గాలు, దౌర్జన్యం, కుట్రలకు పాల్పడలేదు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలి..’ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సభల్లో మంత్రి జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్య యాదవ్, టీఎస్ఐఎస్సీ చైర్మన్ బాలమల్లు, బీఆర్ఎస్ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, నలమోతు భాస్కరరావు, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మితే ఉల్టా పల్టానే!
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నారాయణఖేడ్: ఎన్నికలు అనగానే కొందరు ఏమేమో చెబుతూ వస్తుంటారని, వాళ్ల మాటలు విని ఆగమాగం కావొద్దని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లను నమ్మితే అంతా ఉల్టాపల్టా అవుతుందని, వారికి అధికారమిస్తే నిండా ముంచుతారని ఆరోపించారు. ఆలోచనతో, విచక్షణతో ఓటు వేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘2004లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే పదేండ్లు ముందుకు వెళ్లేవాళ్లం. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్ల మరో పదేండ్లు కొట్లాడాల్సి వచ్చింది. 1969 లెక్కనే ఈసారి కూడా ఆగం జేయాలని చూశారు. అలాంటి సమయంలో కేసీఆర్ శవయాత్రనో, జైత్రయాత్రనో తేల్చుకుందామని ఆమరణ దీక్ష చేపడితే.. కేంద్రం దిగివచ్చింది. రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాం తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను అంతా బేరీజు వేసుకోవాలి. అప్పుడు కరెంటు ఉండేది కాదు. నీళ్లు ఉండేవి కాదు. బోర్లు తవ్వి ఎంతో మంది బోర్లా పడ్డారు. నేను గూడా 27 బోర్లు వేసి నష్టపోయినోడినే. ఎన్నో బాధలు అనుభవించినం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. 24 గంటలు కరెంటు ఇçచ్చుకుంటున్నం. మిషన్ కాకతీయతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు అందిస్తున్నం. పదేళ్లలో దేశంలో అగ్రగామిగా నిలిచినం. అప్పట్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో సింగూరు నీళ్ల కోసం ఎన్నో కొట్లాటలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. జుక్కల్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల మధ్యలో ఉంది. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తూనే ఉన్నరు. అక్కడికి, ఇక్కడికి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. ఎక్కడా లేనట్టుగా కరెంటు ఇస్తున్నాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం చూసి పొమ్మంటున్నారు. మనం ఇక్కడ 24 గంటలు కరెంటు ఇస్తుంటే.. వాళ్లు ఐదు గంటల గురించి చెబితే ఏమనాలి? దేనితో నవ్వాలి? మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ అన్నీ బాగుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆలోచించాలి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటున్నారు. రైతు బంధు ఇవ్వడం దుబారానా? రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం దుబారానా? ఆలోచించాలి. రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఏమైనా మిగిలి ఉంటే ఎన్నికల తర్వాత పూర్తవుతాయి. కేసీఆర్ బతికున్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం సెక్యులర్గా ఉంటుంది. బసవేశ్వర ద్వారా 1.80 లక్షల ఎకరాలకు నీరు కాంగ్రెస్ పాలనలోని నారాయణఖేడ్కు, ఇప్పటి బీఆర్ఎస్ పాలనలోని నారాయణఖేడ్కు దునియా ఆస్మాన్ తేడా ఉంది. గతంలో ఇక్కడ అన్నీ రేకు డబ్బాలే కనిపించేవి. ఇప్పుడన్నీ భవంతులు కనిపిస్తున్నాయి. గతంలో తాగేందుకు నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. గిరిజన మహిళా చిమ్నిబాయి మేం ఓటెందుకు వేయాలని అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నించిన విషయం అందరికీ తెలుసు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సింగూరు జలాశయానికి లింకు చేసుకున్నాం. నర్సాపూర్ వరకు కాల్వ తవ్వకం పూర్తయింది. ఆ నీళ్లు వస్తే సింగూరు శాశ్వత జల వనరుగా తయారవుతుంది. నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద రెండు పంటలు పండేలా ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తా..’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సభల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, ఎం.భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హత్యా రాజకీయాలు సిగ్గుచేటు ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కొనలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని బాన్సువాడ, నారాయణఖేడ్ సభల్లో తీవ్రంగా ఖండించారు. ‘‘అది ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి కాదు. కేసీఆర్ మీద జరిగిన దాడి చేసినట్టే. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతగాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేశారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మలు ఇదే హింస అనుకుంటున్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దు. మాకు తిక్కరేగితే.. ఏం జరుగుతుందో ఊహించుకోవాలి. మొండి కత్తో, లండు కత్తో మాకూ దొరుకుతుంది. మేం కత్తులు పట్టుకుంటే రాçష్ట్రం దుమ్ము దుమ్ము అవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో ఎలక్షన్లు జరిగాయి. బీఆర్ఎస్ ఎక్కడా ఇలాంటి ఘటనలకు పాల్పడలేదు. గత తొమ్మిదేళ్లు కర్ఫ్యూలు, కొట్లాటలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే.. కాంగ్రెస్ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ సమాజం బుద్ధి చెప్పాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కొత్త ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలయ్యాయని, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. గ్రీన్ ఛానెల్తో హైదరాబాద్కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్న వైద్యులు.. రక్తం కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం -
తోడేళ్లలా ఆవురావురు
రాహుల్ గాంధీ ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి, కోదాడ: ‘కాంగ్రెస్ పదేళ్లుగా అధికారం లేక ఆకలితో ఆవురావురంటోంది. చాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడేళ్లు పడ్డట్టు పడదాం.. మట్టిగడ్డ కూడా మింగుదామనే ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఉన్నా రు. అలాంటి కాంగ్రెస్ కావాలా? అభివృద్ధిలో ముందుకు పోతున్న బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మేము తెలంగాణ ఇచ్చామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. 14 ఏళ్ల పాటు ఏడిపించారు. ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. ఏడాదిపాటు భయంకరమైన పోరా టం చేస్తే ఇచ్చారు తప్ప పుణ్యానికి ఇవ్వలే..’ అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో, తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ సమర శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. చావునోట్లో తలకాయ పెడితే దిగొచ్చారు.. ‘బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, ఢిల్లీలో అధికారం పొంది ఏడిపించారు తప్ప, మర్యాదగా తెలంగాణ ఇవ్వలేదు. ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లో తలకాయ పెడితే, ప్రజలంతా ఉప్పెనలా ఉద్యమం చేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ కొంతమంది ముందుకు ఎగదోసి రాజీనామా నాటకం ఆడి, వెనక్కి తీసుకున్నారు. తరువాత ఏడాదిపాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మన తెలంగాణ మనకు రాలేదు. ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. ఎంతమంది ఉద్యమకారులను జైల్లో పెట్టారు. చెరుకు సుధాకర్ను కూడా జైల్లో వేశారు. అయినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టి, పోరాటం చేశాం కాబట్టి దిగి వచ్చి ఇచ్చారు. శ్రీకాంతాచారి లాంటి వారి ప్రాణాలను బలి తీసుకొని ఇచ్చారు తప్ప పుణ్యానికి తెలంగాణ ఇవ్వలే. ఎవరెవరివో బూట్లు నాకిన వాళ్లు ఇప్పుడు వచ్చి చెప్పే మాటలు నమ్మొద్దు. తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు పిడికెడు మందే ఉన్నాం. ఒక్క కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకుడు రాలేదు. జేఏసీ ఏర్పాటు కోసం రాజీనామా చేయమంటే మంత్రి పదవులను వదిలిపెట్ట్టలేదు. ఎన్నికలు వచ్చాయంటే రకరకాల మనుషులు వచ్చి రకరకాలుగా మాట్లాడతారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు ఓటు వేయాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాహుల్కు వ్యవసాయం ఎరుకనా? ‘కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ను తీసేస్తామని పదేపదే చెబుతున్నారు. రాహుల్గాంధీ కూడా ధరణి తీసేస్తానంటున్నాడు. ఆయనకు వ్యవసాయం ఎరుకనా.. ఎద్దు ఎరుకనా, ఎన్నడన్న నాగలి దున్నిండా..? ఎవడో సన్నాసి రాసిస్తే చిలుక పలికినట్లు పలుకుతున్నాడు. ధరణి ఉంటేనే మీ భూములు మీకున్నాయి. నిశ్చింతగా ఉన్నారు. ప్రభుత్వం వద్ద, అధికారుల వద్ద భూములపై ఉన్న అధికారాన్ని ధరణితో రైతులకే ఇచ్చాం. ఒకరి భూములను ఒకరికి రాసిన తంటాలు పోయాయి. ధరణితో మీ బొటన వేలు పడితే తప్ప మీ భూమి బదిలీ కాదు. ఆ అధికారాన్ని కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. ధరణి తీసివేస్తే వీఆర్ఓలు వస్తారు, అధికారుల రాజ్యం వస్తుంది. పహాణి నకళ్ల కోసం తిరగాలి. రైతుబం«ధు రూ.10 వేలు వస్తే రూ.3 వేలు ఇమ్మంటారు. గతంలో చూసిన దోపిడీ దొంగల రాజ్యమే రావాలా? ధరణి ఉండి రైతులకే అధికారం ఉండాలా? ఆలోచించండి. ధరణిలో భూమి ఉందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంటున్నారు..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ సల్లగ గావాలి.. ‘కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వృధా అంటున్నాడు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల డబ్బును దుబారా చేస్తున్నామని అంటున్నాడు. రైతుబంధు ఉంచాలా..? తీసి వేయాలా..? ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి. రైతుబంధు అనేది ఒట్టిగా ప్రకటించలేదు. ఎంతో ఆలోచించి ప్రారంభించాం. ఓట్ల కోసం తేలేదు. ఎక్కడకెళ్లి అడిగినా రైతుబంధు ఉండాలని లక్షల మంది సభల్లో చెబుతున్నారు. తెలంగాణ రాకముందు 40, 50 లక్షల టన్నుల వడ్లు పండితే.. ఇçప్పుడు 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ఎక్కడిక క్కడే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఒకనాడు రైతు కుటుంబాలకు పిల్లను ఇచ్చేవారు కాదు, ఇప్పుడు పిల్లను ఇవ్వాలంటే భూమి ఉందా? అని అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్నవారు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ సల్లగ గావాలి..రైతుల ముఖాలు తెల్లగ గావాలి.. అప్పుల బాధలు పోవాలి..’ అని ఆకాంక్షించారు. శివకుమార్.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చాడా? ‘24 గంటల కరెంట్ దేశంలో ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నాలుగైదేళ్లుగా ఒక పాలసీ ప్రకారం ఇస్తున్నాం. కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. మీటర్లు పెట్టాల ని వత్తిడి తెచ్చి పెట్టకపోతే ఏడాదికి రూ.25 వేల కోట్ల కోత పెట్టింది. ఇంకో పది వేల కోట్లు కోత పెట్టినా.. నా ప్రాణం పోయినా మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పా. పీసీసీ అధ్యక్షుడేమో 24 గంటల కరెంటు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నారని అంటున్నాడు. 3 గంటలే సరిపోతుందని చెబుతున్నాడు. 3 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలా? 24 గంటలు ఉండాలంటే బీఆర్ఎస్కే ఓటు వేయండి. కర్ణాటక ఉప ముఖ్యమంతి శివకుమార్.. మా రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం.. మా గొప్పతనం చూడమంటున్నాడు. నవ్వాలో ఏడ్వాలో తెలవడం లేదు. ఆయన ప్రచారానికి వచ్చాడా.. ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చాడా?’ అని సీఎం ఎద్దేవా చేశారు. దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు ‘జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన నాడే దళితుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ మాట గౌరవించి దళితుల అభివృద్ధికి శ్రీకారం చుడితే 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దళితులకు ఈ దరిద్రం ఎందుకు ఉండేది? తెలంగాణ వచ్చాక, ఒక దశకు వెళ్లాక దళిత బిడ్డల దరిద్రాలు పోవాలనే దళితబంధు పథకం తీసుకొచ్చాం. ఎన్నికలు రావ డంతో కొంతమంది వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఒకాయన వస్తున్నాడు. ఆయన రాష్ట్రంలో అన్నా నికే గతి లేదు. యూపీ, బిహార్, బెంగాల్ కూలీలు నాట్లు వేయడానికి, బతకడానికి మన రాష్ట్రానికి వస్తుంటే.. ఆ రాష్ట్రాల సీఎంలు వచ్చి మనకు పాఠాలు చెబుతున్నారు..’ అని విమర్శించారు. సంక్షేమంలో ముందున్నాం.. ‘గతంలో తెలంగాణలో ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. వీటన్నింటికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత చరమగీతం పాడాం. తొమ్మిది, పదేళ్లలోనే దేశానికి తలమానికమైన తలసరి ఆదాయంలో నంబర్ వన్ అయ్యాం. పేదల సంక్షేమం, వ్యవసాయ విప్లవం, ఐటీ విప్లవం రావడంతో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం. పేదల పెన్షన్లను పెంచుకున్నాం. కళ్యాణలక్ష్మి ప్రవేశపెట్టి పెంచుకున్నాం. మత్స్య సంపద రూ.33 వేల కోట్లకు పెరిగింది. రైతుబంధును యూఎన్ఓ ప్రశంసించింది..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పింఛన్లు సహా అన్నీ పెంచుకుందాం ‘సమైక్య పాలనలో రూ.40 నుంచి రూ.200 పింఛన్ ఇచ్చేవారు. తెలంగాణ రాగానే రూ.1,000 వరకు పెంచి దాన్ని రూ.2,016 వరకు తీసుకొచ్చాం. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రూ.5 వేల వరకు పెంచుకుందాం. రైతుబంధు కూడా దశల వారీగా పెంచుకుంటూ పోతాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులను నేరుగా పంపుతుంది. ఇలా ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుంది..’ అని సీఎం హామీ ఇచ్చారు. తుంగతుర్తిలో కిషోర్ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట గోపురం అంత ఎత్తున ఓట్లు వేసి ఆలేరులో గొంగిడి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది వ్యతిరేకించినా కోదాడ నుంచి బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్కు టికెట్ ఇచ్చానని, బీసీలందరూ కష్టపడి అత్యధిక మెజారిటీతో ఆయన్ను గెలిపించాలని చెప్పారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని.. బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెస్లో చేరినా ఆయనను గద్దె దించేందుకేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్లో రావాలని కోరుకుంటున్నారు’’ అని రాజగోపాల్రెడ్డి అన్నారు. ‘‘సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కాగా, తెలంగాణ ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు మరికాసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. చదవండి: బీఆర్ఎస్ను కాపాడుతోంది బీజేపీనే -
నావంతు చేశా.. ఇక మీదే బాధ్యత
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలతోపాటు అన్ని వర్గాలను కాపాడుకునేందుకు తన వంతు పనిచేశానని.. ఇప్పుడు ప్రజలే పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో చోటుచేసుకున్న మార్పును గుర్తించి, ఆలోచించాలని సూచించారు. ఎన్నికల కోసం బహురూపుల వేషాలతో వచ్చే వాళ్లను నమ్మి ఆగమైతే వైకుంఠపాళిలో పాములా మింగేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు, వలసల బతుకులే మిగులుతాయని.. రైతులు గోసపడతారని పేర్కొన్నారు. తాము ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వబోమని, సాధ్యాసాధ్యాలపై ఆలోచించి క్రమపద్ధతిలో అమలు చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. పూటకో పార్టీ మార్చుతూ, డబ్బు మదం, అహంకారంతో వచ్చేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని అచ్చంపేట, వనపర్తి, నల్లగొండ జిల్లా మునుగోడులలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘24 ఏళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరిన.. నాడు ఎవడూ లేడు. పక్షిలా ఒక్కడినే తిరిగా. అదే ఇప్పుడు లేసినోడు, లేవనోడు అంతా వచ్చి కేసీఆర్ నీకు దమ్ముందా? అంటున్నారు. కొడంగల్ వస్తవా, గాంధీ బొమ్మకాడికి వస్తవా అంటున్నరు. ఇదేనా రాజకీయం? ఎన్నికలు వస్తయ్, పోతాయ్. కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగుపడతాయి. తెలంగాణకు ముందు ఈ సన్నాసులు ఎక్కడున్నరో, ఎవరి బూట్లు తుడిచారో చెప్పాలి. పదేళ్ల కింద పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో ప్రజలే గమనించాలి. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసింది ఎన్నికలు వస్తున్నాయని అంతా వస్తరు. ఉపన్యాసాలు ఇస్తరు. దేశంలో ఏ సీఎం, పీఎం కూడా మన దాంట్లో పది శాతం కూడా లేరు. కేసీఆర్ దమ్మేంటో ఇండియా చూసింది. నవంబర్ 30న దుమ్ము రేగాలి. నల్లమలలోని అప్పర్ ప్లాటు అమ్రాబాద్కు నీళ్లిచ్చే బాధ్యత నాది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 192 కేసులు వేసి అడ్డంపడ్డది కాంగ్రెస్ వాళ్లే. 1969 ఉద్యమంలో 400 మందిని పిట్టల్లా కాల్చింది, లక్ష మందిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో మన పొత్తుతో గెలిచి 2014 దాకా పదేళ్లు ఏడిపించారు. వాళ్లు ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు. తప్పనిసరై ఇచ్చారు. వాళ్లకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు, ఇక్కడి ప్రజలపై పెత్తనం కావాలి. పైరవీకారుల పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పైరవీకారుల పార్టీ. వాళ్లకు పాత దళారీలు కావాలి. రైతు బంధుకు సంవత్సరానికి రూ.15 వేల కోట్లు ఇస్తుంటే వాళ్లకు కడుపు మంటగా ఉంది. అందులో రెండు వేల కోట్లయినా తినొద్దా అని ఆలోచిస్తున్నారు. ఆ దుర్మార్గులను రానిస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. రైతు బంధు రాంరాం అవుతుంది. దళితబంధు జైభీం అయిపోతది. కరెంటు కాట గలుస్తది. మళ్లీ మొదటికే వస్తది. కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. 5 గంటలు కూడా ఇవ్వలేకపోతోంది. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. రాహుల్గాంధీ నుంచి రేవంత్రెడ్డి దాకా అందరూ ధరణిని తీసేస్తాం అంటున్నరు. దీన్ని తమాషాగా తీసుకోవద్దు. రైతుకు అధికారం ఇస్తామంటోంది బీఆర్ఎస్ పార్టీ అయితే.. లాక్కుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ.. మీకు ఏ పార్టీ కావాలి? ఇప్పటిదాకా నావంతు పనిచేశా.. ఇప్పుడు మీదే బాధ్యత. నష్టపోయేది ప్రజలే.. దళితబంధుతో దళితుల బతుకులు బాగుపడుతున్నాయి. మమ్మల్ని గెలిపించకపోతే వ్యక్తిగతంగా పోయేదేం ఉండదు. రెస్ట్ తీసుకుంటాం. కానీ నష్టపోయేది ప్రజలే. తెలంగాణ తెచ్చినవాడిగా చెప్తున్నా. రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ఉండాలో ఆలోచించాలి. మేం ఎన్నికల కోసం అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం లేదు. రూ.70, వంద అంటూ అర్థంపర్థం లేకుండా ఇచ్చిన పెన్షన్ను బీఆర్ఎస్ వచ్చాక రూ.వెయ్యికి, తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలవగానే రూ.మూడు వేలలకు పెంచి.. తర్వాత దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. రాష్ట్రంలోని 93 కోట్ల రేషన్కార్డు దారులకు రైతు బీమా తరహాలో బీమా సౌకర్యం కల్పిస్తాం. రేషన్పై సన్నబియ్యం ఇస్తాం. అన్నింటినీ బేరీజు వేసుకొని ఆలోచన చేయాలి’’అని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా.. అచ్చంపేట, వనపర్తి సభల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్ , నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్.. మునుగోడు సభలో మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాయకులు పల్లె రవికుమార్, ఎలిమినేటి సందీప్రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో జరిగిన అచ్చంపేట, వనపర్తి సభల్లో స్థానిక ఎంపీ పి.రాములు పాల్గొనలేదు. దీనితోపాటు వనపర్తి సభలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 119 నియోజకవర్గాల అభ్యర్థులంతా కేసీఆర్లే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కేసీఆర్లే. లేచినోడు, లేవలేనోడూ నాపై పోటీ చేస్తామంటూ బీరాలు పలకటం ఏమిటి? మా పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి కేసీఆర్తో సమానులే. డబ్బు మదంతో వచ్చేవారిని ఓడించాలి ‘‘నల్లగొండ, మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతాలు. మీ చైతన్యం మూగబోవద్దు. పైసలు పట్టుకొని వచ్చేవాళ్లను, పూటకోపార్టీ మార్చేవాళ్లను నమ్మొద్దు. వాళ్లకో నియమం లేదు. సిద్ధాంతం, నిబద్ధత లేవు. నిన్నొక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ. డబ్బు మదం, అహంకారంతో ప్రజలను కొనగలుతాం అనుకుంటున్నారు. అలాంటి వారికి నల్లగొండ, మునుగోడు చైతన్యం చూపించి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం నెరవేర్చాం. చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశాం. 100 పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ 50–60 ఏళ్లు పాలించినా ఫ్లోరైడ్తో ప్రజలు నడుములు వంగి, చనిపోయే వరకు చూశారే తప్ప నివారణ చేయలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఫ్లోరైడ్ గోస పోయింది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే డిండి ప్రాజెక్టుకు, శివన్నగూడెంకు నీళ్లు వస్తాయి. ఆ బాధ్యత నాది. ఏడాదిన్నరలో మునుగోడు నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. తొలి నుంచీ ఉద్యమాల్లో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని మునుగోడులో గెలిపించాలి. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
సాక్షి, కరీంనగర్: నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఎక్కడున్నావ్? బయటకు రా.. వాస్తవాలు జనానికి చెప్పు అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొన్న కాళేశ్వరంలో మోటార్లు మునిగాయి. నేడు ప్రాజెక్టు కుంగిపోయింది. నువ్వే కదా కేసీఆర్ ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్నది. జాతీయ హోదా ఇస్తే మా పరువు పోయేది. కేసీఆర్ తీరుతో దేశంలో తెలంగాణ నవ్వుల పాలైంది. కమీషన్ల కోసం కుక్కుర్తి పడ్డారు’’ అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణమంతా లోపాలే: ఈటల రాజేందర్ హైదరాబాద్: కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.. సోమవారం ఆయన హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రాజెక్టు నిర్మాణమంతా లోపాలే. కేవలం తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్కు ఈ పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ వేల కోట్లు దండుకున్నారు. లక్ష కోట్లు ఖర్చు చేశామంటూ కబుర్లు చెబుతున్నారు. ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టారు’’ అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. చదవండి: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ -
సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన తీరు విన్నూత్నంగా ఉంది. సాధారణంగా అన్ని రంగాల ప్రస్తావనతో మానిఫెస్టో ఉంటుంది. కాని ఆయన తన పార్టీ పక్షాన దాదాపు పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికనే ప్రకటించడం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. అదే సమయంలో అందులో ఆయన ధైర్యం కనిపిస్తుంది. ✍️తెలంగాణలో అభివృద్దికి సంబంధించి ఒక నివేదికను ఇవ్వడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తామో ఆయా పార్టీలు చెబుతుంటాయి. కాని కేసీఆర్ అందుకు విరుద్దంగా కేవలం ఒక రంగానికి సంబంధించి వాగ్దానాలను ప్రకటించి సరిపెట్టుకున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు వాగ్దానాలను దృష్టిలో ఉంచుకుని కొన్నిటిని ప్రకటించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, తదితర భారీ ప్రాజెక్టుల ప్రస్తావన ఉండేది. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి వాటి గురించి వివరించి, ఆ తరహాలో ఇంకేమి చేస్తారో చెప్పేవారు. అలాగే పరిశ్రమల రంగం, ఉపాధి రంగం మొదలైనవాటి గురించి హామీలు ఇస్తుంటారు. ✍️ఒక వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు గందరగోళంగా మారడం, నిరుద్యోగ యువతలో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, కేసీఆర్ వాటిని పెద్ద సీరియస్గా తీసుకున్నట్లు కనిపించలేదు. తాను ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అలాగే వాటిని భవిష్యత్తులో ఇంకా అధికంగా ఇచ్చే తీరునే మానిఫెస్టో లో పెట్టారు. ప్రత్యేకించి హైదరాబాద్కు సంబంధించి కొత్త ఆలోచనలేవీ ప్రకటించలేదు. అయితే కొత్తగా కేసీఆర్ బీమా- ప్రజలకు ధీమా అన్న స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని అర్హమైన 94 లక్షల కుటుంబాలకు బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించారు. దీనిద్వారా ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల బీమా మొత్తం అందుతుంది. ఇదే ప్రధానమైన కొత్త హామీ అని చెప్పాలి. ✍️అలాగే గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ అంటే ఈయన ఇంకో వంద తక్కువకే సరఫరా చేస్తానని చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తమ హామీలను కాపీ కొట్టారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ను పదిహేను లక్షలకు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. వీటిని జర్నలిస్టులకు కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా, పలు కొత్త స్కీములు కూడా అమలు చేశామని, దళిత బంధు మొదలైనవాటిని ఆయన ఉదహరించారు. ✍️ఈసారి పాతవాటికే కొనసాగింపుగా హామీలు ఇస్తూ, ఉద్దీపనలు ఉంటాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు రైతు బంధు పథకం కింద ఇంతవరకు ఎకరాకు రెండు దపాలుగా పదివేల రూపాయలు చొప్పున ఇస్తుండగా, దానిని క్రమేపి పదహారువేల కు తీసుకు వెళతామని అన్నారు. అధికారంలోకి మళ్లీ వచ్చిన వెంటనే దీనిని పన్నెండువేలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదిహేనువేలు ఇస్తామని వాగ్దానం చేస్తే, కేసిఆర్ మరో వెయ్యి అదనంగా ఇస్తానంటున్నారు. ఈసారి ఆయన ఏ స్కీమ్ అయినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా దశలవారీగా చేస్తామని ప్రకటించడం విశేషం. ఆర్థిక భారం రీత్యా ఇలా చేస్తామని తెలిపారు. ✍️కాంగ్రెస్ పార్టీ ఆరు వాగ్దానాలను కూడా దృష్టిలో పెట్టుకుని వివిధ స్కీములను కేసీఆర్ విస్తరిస్తున్నా, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అర్హులైన పేదలకే అని షరతు చెప్పారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న వృద్దాప్య పెన్షన్ స్కీమ్ ను ప్రశంసించడంలో కూడా వ్యూహం ఉన్నట్లు అనిపించింది. తెలంగాణలో ఉన్న జగన్ అభిమానులను ఆకట్టుకోవడానికి ఆయన ఇలా చేసి ఉండవచ్చు. జగన్ ఏపీలో పెన్షన్ను రెండువేల నుంచి ప్రతి ఏటా కొంత పెంచుకుంటూ మూడువేల రూపాయలకు తీసుకువెళ్లి విజయవంతగా అమలు చేస్తున్నారని అభినందించారు. ✍️అలాగే తెలంగాణలో పెన్షన్ను ముందుగా మూడువేల రూపాయలు చేసి, ఆ తర్వాత ఏటా ఐదు వందల చొప్పున ఐదువేల రూపాయలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాలుగువేల రూపాయల పెన్షన్ అంటే కేసీఆర్ ఇంకో వెయ్యి పెంచారు. అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల రూపాయల భృతి స్కీమ్ను కూడా హామీ ఇచ్చారు. ఇది కూడ కాంగ్రెస్ తరహా స్కీమ్ అయినా, కొంత అదనంగా ఇస్తామని అంటున్నారు. కాకపోతే అర్హత అన్న షరతు పెట్టారు. అగ్రవర్ణ పేదలకు కూడా గురుకుల పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో పెడతామని కొత్తగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ✍️కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ కార్యక్రమాలు మానిఫెస్టోలో పెట్టి, అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది. దానిని గమనంలోకి తీసుకుని కేసీఆర్ కొంత జాగ్రత్తపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో మాదిరి అన్నీ అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. నిజానికి అది చాలా కష్టం. అందుకే కేసీఆర్ ప్రజలకు నమ్మశక్యంగా ఉండేలా హామీలు ఇచ్చినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ ఈ మానిఫెస్టోకి ఎంత వ్యయం అవుతుందన్న దానిపై వివరాలు ఇవ్వగలిగితే బాగుండేది. తద్వారా ఈ వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలు అందరికి తెలిసేవి. రాజకీయ పార్టీలు వనరుల గురించి పట్టించుకోకుండా, హామీలు ఇచ్చేస్తూ ప్రజలను భ్రమపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పై అదే విమర్శ రాగా, ఇప్పుడు బిఆర్ఎస్ కూడా ఆ కోవలోకే వెళ్లిందని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వాళ్లొస్తే కాటగలుస్తం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, మేడ్చల్ జిల్లా: నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 20 గంటలు కరెంటు ఇస్తామని మాట తప్పిందని.. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే కాటగలుస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాడని గుర్తు చేశారు. వాళ్లొస్తే కరెంటుకు కటకట తప్పదని.. రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ఆపేస్తారని ఆరోపించారు. అడ్డం పొడుగు ఏదో మాట్లాడి గోల్మాల్ చేయాలని చూస్తున్న వారి మాటలను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. అందరికీ మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని, కారుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బుధవారం జడ్చర్ల, మేడ్చల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. 20 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఏమైంది? కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు గంటల కరెంటు ఇస్తామంటున్నారు. పొద్దున సగం, రాత్రి సగమని చెప్తున్నారు. ఉచిత కరెంటు ప్రధాన మంత్రికి సైతం చేతకావడం లేదు. ఆయన సొంత రాష్ట్రంలోనూ కరెంట్ లేదు. రైతులు రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారు. దేశం మొత్తంలో రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. సీతారామ పూర్తవుతోంది. మంచినీళ్ల బాధ కూడా పోయింది. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్గా ఉన్నాం. కులమతాలకు అతీతంగా పేదలందరినీ ఆదుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంట్ బాధలు వస్తాయి, పరిశ్రమలు దెబ్బతింటాయి. ఇక్కడి బాధలు చూసి పాట రాశా.. ఒకనాడు జయశంకర్ సార్, నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్లడానికి నవాబ్పేట అడవి గుండా వస్తున్నాం. అమ్మవారి గుడి ఉంది అక్కడ. పక్కన చిన్న అడవిలో ఉన్న ఆ దేవాలయం దగ్గర లైట్ల వెలుగు అంత దూరం కనిపించింది. మహబూబ్నగర్లో మనుషులే కాదు.. చివరికి అడవి కూడా బక్కపడిందని బాధపడ్డాం. మహబూబ్నగర్లో గంజి, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెలవిసేలా బాధకలిగేది. పక్కనే కృష్ణానది పారుతున్నా ఎందుకీ దుర్గతి? ఆ బాధలు చూసి ‘‘పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయె.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ఎట్టా పంటలు ఎండిపాయె..’’ అంటూ పాట రాశా. మహబూబ్నగర్ దరిద్రం పోవాలంటే పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని, ప్రజలు గెలిపిస్తారని జయశంకర్ సార్ చెప్పారు. ఇదే జిల్లా నుంచి పోటీ చేశా. ఆనాడు నన్ను గెలిపించినది లక్ష్మారెడ్డిగారే. 15 ఏళ్లు పోరాటం చేసినప్పటికీ మహబూబ్నగర్ ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి నిలిచిపోయింది. దద్దమ్మ ఎమ్మెల్యేలు అడగక నష్టపోయాం ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరులోని దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు తెరవక, అడగలేక నష్టపర్చారు. అడిగేవారు లేక నాటి పాలకులు జూరాల నుంచి పాలమూరుకు నీళ్లు తీసుకోవాలని సోర్స్ ఇచ్చారు. జూరాల బెత్తెడు ప్రాజెక్టు.. అందులో ఉండే నీళ్లు 9–10 టీఎంసీలే. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మనం రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. ఆ లెక్కన జూరాలలో నీళ్లు మూడ్నాలుగు రోజుల్లో అయిపోతాయి. అందుకే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలంను సోర్సుగా ఎంపిక చేశాం. ఆ ప్రాజెక్టు ఎవరి జాగీరు కాదు. రైతుల బాధలు తీర్చేందుకు ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశా. కానీ ఇక్కడి దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చూశారు. ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్కు పేరొస్తుందని కుట్రలు చేశారు. అయినా మొండిపట్టుతో రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తి చేసుకున్నాం. రెండు, మూడు నెలల్లో బ్రహా్మండంగా నీళ్లను చూడబోతున్నాం. కాంగ్రెస్ వల్లే తెలంగాణకు 60ఏళ్ల గోస.. 1956లో కాంగ్రెస్ తెలంగాణను ఆంధ్రలో కలిపి 60 ఏళ్ల గోసకు కారణమైంది. సమైక్య రాష్ట్రంలో ఆ బాధలు కళ్లారా చూశా. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. నేను సైతం చావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది. 60ఏళ్లు గోస పడేట్టు చేసిన కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు మళ్లీ వచ్చి పెద్ద మాటలు మాట్లాడుతుండటం సిగ్గుచేటు. రైతుల బతుకులు మారాలనే.. నిన్నగాక మొన్ననే మేనిఫెస్టో విడుదల చేశాం. రైతుల బతుకులు మారాలన్నదే నా లక్ష్యం. నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇండియాలోనూ ఎక్కడా లేదు. రైతుల కోసం రూ.37 వేలకోట్ల రుణమాఫీ చేశాం. ఇప్పుడిప్పుడే తెల్లగవుతున్నాం. ఇంకో పదేళ్లు కష్టపడితే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడతాయి. బీఆర్ఎస్ మళ్లీ గెలవగానే.. రాష్ట్రంలో 93 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు రైతు బీమా తరహాలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తాం. సన్న బియ్యం అందిస్తాం. ఆసరా పెన్షన్లను రూ.5 వేల వరకు పెంచుతాం. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేలు అందిస్తాం. రైతుబంధు సాయాన్ని రూ.16 వేల వరకు పెంచుతాం. అగ్రవర్ణాల పిల్లలకు 110 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తాం’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. జడ్చర్ల సభలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మేడ్చల్ సభలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి అభ్యర్థులు వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంటరిగా పోరాడి సాధించా.. నాడు తెలంగాణలో తాగు, సాగునీరు లేక ప్రజలు వలసపోయారు. పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడి వెళ్లిన. వాళ్లకు సాయం చేయాలంటూ నాటి సీఎంను జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంత దుర్మార్గపు పాలనను అనుభవించాం. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని నాడు సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 20ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిప్పుడు ప్రతి ఒక్కరూ నవ్వులాటగా చూశారు. హేళనగా మాట్లాడారు. నా మీద ఎన్నో నిందలు వేసి అవమానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉద్యమంలో నాతో కలసి రాకపోయినా ఒంటరిగా పోరాటం చేశాను. దాని ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. నేడు అదే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. -
ఆపద మొక్కులకు ఆగం కావొద్దు!
సిద్దిపేట రక్తమే నన్ను ఇంతటివాడిని చేసింది యావత్ దేశం ఆశ్చర్యపడేలా.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నానంటే ఈ గడ్డ పుణ్యమే. సిద్దిపేట నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలమే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. చింతమడకలో అమ్మ చనుబాలు తాగే సమయంలో అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఊర్లో ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది. సిద్దిపేటే నన్ను సాది పెద్ద చేసి, చదువు చెప్పింది. రాజకీయంగా జన్మనిచ్చి నాయకుణ్ణి చేయడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ గడ్డ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. –కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, సిద్దిపేట: ‘ఎన్నికల సమయంలో కొందరు ఆపద మొక్కులవారు వస్తారు. అలవిగాని హామీలతో మభ్యపెట్టాలని చూస్తారు. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దు. మోటార్లకు మీటర్లు పెట్టేవారిని, మత పిచ్చోళ్లను కూడా నమ్మొద్దు. ముఖ్యంగా రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. మూడేళ్లు కష్టపడి ధరణిని రూపొందించాం. గతంలో వీఆర్వో నుంచి రెవెన్యూ సెక్రటరీ దాకా ఎవరికి కోపమొచ్చినా రైతుల భూమి మాయమయ్యేది. కానీ ధరణితో రైతుల అనుమతి లేకుండా.. సీఎం కూడా రైతు భూమి జోలికి వెళ్లలేని స్థితి కల్పించాం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తే.. రైతులు భూములపై ఆశలు వదులుకోవాల్సిందే..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హెచ్చరించారు. సిద్దిపేట రక్తం, మాంసం, బుద్ధి, బలమే తనను ఇంతవాణ్ణి చేశాయన్నారు. సిరిసిల్లను సోలాపూర్లా మారుస్తామని, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రం, సిద్దిపేటల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ మొండిపట్టుతోనే 24 గంటల కరెంటు ‘గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు, ఆగిన మగ్గాలు, పాముకాట్లు, తేలు కాట్లతో రైతుల ప్రాణాలు పోవడం తప్ప వారు చేసిందేమీ లేదు. ప్రస్తుతం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్లు 3 గంటలు మాత్రమే చాలు అంటున్నారు. మీకు 24 గంటలు కావాలా? 3 గంటలు కావాలా? (అంతా 24 గంటలు కావాలంటూ కేకలు వేశారు) ప్రధాని మోదీ సొంత ఊర్లో కూడా 24 గంటల కరెంటు రావడం లేదు. కానీ మనకు అది ఎలా సాధ్యమైంది? కేవలం కేసీఆర్ మొండిపట్టు పట్టడం వల్లే. ఇదొక్కటే కాదు..అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1గా ఉంది. విద్యుత్తు వినియోగం, ఇంటింటికీ నల్లా కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మోటార్లకు మీటర్లు అంటూ బీజేపీ వాళ్లు బెదిరించాలని చూసినా జంకలేదు. హిందు–ముస్లిం అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతపిచ్చిగాళ్లు కూడా వస్తున్నారు. మనం ఏళ్లుగా గంగా జమునా తెహిజీబ్లా ఒకే కుటుంబంలా కలిసి ఉన్నాం. మన మధ్య పంచాయితీలు పెట్టేందుకు వచ్చే వారితో జాగ్రత్త..’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. నిరుపేదలకు సూపర్ ఫైన్ బియ్యం ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి కొత్తగా చెప్పేదేం లేదు. కల్యాణలక్ష్మి కింద తొలుత రూ.50 వేలు ఇచ్చాం. క్రమంగా దాన్ని రూ.లక్షకు పెంచాం. పింఛన్ కూడా రూ.1,000 నుంచి రూ.2,000 చేశాం. క్రమంగా దాన్ని రూ.5 వేలు చేస్తాం. కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో 30 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. అందుకే నిరుపేదలకు సూపర్ ఫైన్ సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నాం..’ అని తెలిపారు. సిరిసిల్లను షోలాపూర్గా మారుస్తాం.. ‘నేను చదువుకుంటున్న రోజుల్లో ఎగువ మానేరు నీటితో కళకళలాడేది. ముస్తాబాద్లో పదుల సంఖ్యలో రైస్ మిల్లులు కూడా ఉండేవి. కానీ నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాక.. సమైక్య పాలనలో మానేరు నీరు, రైస్ మిల్లులు క్రమంగా కనుమరుగయ్యాయి. కానీ తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎటుచూసినా కరువు నేలలతో ఉన్న సిరిసిల్ల నేడు నదులు, ప్రాజెక్టుల్లో నీటితో సజీవ జలధారగా మారింది. పచ్చటి పొలాలతో కళకళలాడుతోంది. ఉద్యమ సమయంలో సిరిసిల్లలో ఆత్మహత్యలు కలచివేసేవి. సిరిసిల్ల ఎమ్మెల్యే, చేనేత మంత్రి కేటీఆర్ కావడం మీ అందరి అదృష్టం. చేనేత మగ్గం నడవాలి, నేత కార్మికులకు ఉపాధి రావాలని పట్టుబట్టి ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల పనులను సిరిసిల్ల చేనేతలకు అప్పగించాడు. అన్ని మతాల పండగల సమయంలో పేదలు కొత్తబట్టలు కట్టుకోవాలన్న ఆశయంతో.. చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కానీ కొందరు ఆ చీరలను కాల్చి, కార్యక్రమాన్ని అవమానించారు. భవిష్యత్తులో సిరిసిల్లను షోలాపూర్గా మారుస్తాం. విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కేటీఆర్ గురించి నా కంటే బాగా మీకే తెలుసు. మరోసారి ఆశీర్వదించండి..’ అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమ విజయానికి పునాది ఇక్కడే... ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు ఆత్మీయులు వందలాది మంది ఉన్నారన్నారు. కొండంరాజ్పల్లి మాదన్న.. మా నవాబ్ సాబ్.. నాకు డిపాజిట్ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. తాగునీటి కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు చెప్పలేం. లోయర్ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషన్ భగీరథకు పునాది. దళితబంధుకు ప్రేరణ రామంచ గ్రామం. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరడుగుల బుల్లెట్ హరీశ్రావు ‘ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్రావు.. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు, బ్రహా్మండంగా సిద్దిపేటను అభివృద్ధి చేశాడు. హరీశ్రావు మీద ఒక జోక్ ఉంది. ‘అటు ఇటు తిరుగుతడు.. ఎక్కడన్నా ఓ తట్టెడు పెండ కనబడితే తీసుకుపోయి సిద్దిపేటలో వేసుకుంటడు’ అని చెబుతారు. ఇక్కడికి అన్నీ వచ్చాయ్. నీళ్లు, రైళ్లు వచ్చాయి. కన్నీరు కార్చిన సిద్దిపేటలో చెక్ డ్యాంలన్నీ పన్నీరు కారినట్టు మత్తళ్లు దుంకుతున్నాయి. ఒక్క ఎయిర్పోర్ట్ మాత్రమే రావాలి. హరీశ్ స్థానంలో నేనున్నా ఇంతలా చేసేవాడిని కాదేమో. అంత అద్భుతంగా పని చేస్తున్నాడు. గత ఎన్నికల రికార్డును తిరగరాసి భారీ మెజార్టీతో హరీశ్ను గెలిపించాలి..’ అని సీఎం కోరారు. ఎక్కడ నిలబడ్డా కోనాయిపల్లి వెంకటేశ్వస్వామి ఆశీర్వాదం ‘కరీంనగర్, మహబూబ్నగర్ ఎంపీగా పోయినా.. గజ్వేల్ ఎమ్మెల్యేగా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా..కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టే పోతా అనే విషయం మీకు తెలుసు. బ్రహ్మాండంగా 50 ఏండ్లు కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు నేలగా ఉన్న సిరిసిల్లను కాళేశ్వరం జలాలతో పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. సిరిసిల్ల సాధించిన అభివృద్ధి, ఇక్కడి భూగర్భ జలాల గురించి ట్రైనీ ఐఏఎస్లు తమ శిక్షణలో భాగంగా తెలుసుకునే స్థాయికి కేసీఆర్ చేర్చారని కొనియాడారు. సిద్దిపేట ప్రజలు చూపిస్తున్న అభిమానానికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని అక్కడి సభలో మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు అన్నారు. చివరి శ్వాస ఉన్నతం వరకు సీఎం కేసీఆర్కు, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. -
సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్ భావోద్వేగం
సాక్షి, సిద్ధిపేట: జన్మభూమిని మించిన స్వర్గం లేదని.. సిద్ధిపేట గడ్డ తనను నాయకుడ్ని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన సిద్ధిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సిద్ధిపేట తనను తెలంగాణకు ముఖ్యమంత్రికి చేసిందని, సిద్ధిపేట రుణం జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. ‘‘సిద్ధిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉంది. సిద్ధిపేటలో నేను తిరగని పల్లె, ప్రాంతం లేదు. ‘‘చింతమడకలో నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది’’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సిద్ధిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికే ఆదర్శం. సిద్ధిపేటను హరీష్రావు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. సిద్ధిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. తెలంగాణలోనే సిద్ధిపేట వజ్రం తునుకలా తయారవుతోంది. ఆరు అడుగుల బుల్లెట్ హరీష్రావు సిద్ధిపేటకు అప్పగించా’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్కు కాంగ్రాట్స్.. తనయుడిని పొగిడిన కేసీఆర్ మంత్రి హరీష్రావు భావోద్వేగం.. ఈ రోజు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ దివెనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి హరీష్రావు అన్నారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్వాస ఉన్నంత కాలం, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్కి, సిద్దిపేట జనాలకే నా జీవితం అంకితం చేస్తాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కట్టించిన తక్కువే. నా చివరి శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీకు సేవ చేస్తాను’’ అంటూ హరీష్రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఘనత కేసీఆర్దే.. ఇది ఎన్నికల ప్రచార సభలా లేదని, మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్. ఆనాటి సీఎం ఎన్టీఆర్కు సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. సిద్ధిపేటకి కాళేశ్వరం నీళ్లు వస్తాయంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే.. రైతుల బాధలు ఆయనకు తెలుసు’’ అని హరీష్రావు పేర్కొన్నారు. రోడ్డు పక్కన హోటల్లో చాయ్ తాగిన సీఎం కేసీఆర్ సిద్దిపేట సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ కాసేపు సేద తీరారు. మార్గంమధ్యలో సోనీ ఫ్యామిలీ దాబా వద్ద కాసేపు ఆగి చాయ్ తాగారు. ఆయనతో పాటు, మంత్రి హరీష్రావు, మాజీ స్పీకర్ మధుసూదనచారి ఉన్నారు. -
కేటీఆర్కు కాంగ్రాట్స్.. తనయుడిని పొగిడిన కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: తన జీవితంలో సిరిసిల్లాకు వందసార్లు వచ్చానని, ఇక్కడ తనకు బంధువర్గం ఎక్కువని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కలలో ఊహించని అభివృద్ధి సిరిసిల్లలో జరిగిందని, వేసవిలో కూడా అప్పర్ మానేర్ ఉరకలేస్తోందన్నారు. అప్పర్ మానేరును చూస్తే ఆత్మ సంతృప్తి కలుగుతోందని కేసీఆర్ అన్నారు. ‘‘కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండటం సిరిసిల్ల అదృష్టం. చేనేత కార్మికుల అవసరాలన్నీ కేటీఆర్ తీర్చారు. చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్కు అభినందనలు. సోలాపూర్ తరహాలో సిరిసిల్ల రూపుదిద్దుకోవాలి. చేనేతల కన్నీళ్లు తుడిచేందుకే బతుకమ్మ చీరలు తెచ్చాం. కొంతమంది దుర్మార్గులు చీరలను కాల్చేసి రాజకీయాలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లను పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే అన్నం పెడుతోంది. వరిసాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉంది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి సాగువుతోంది. పేదల కడుపునిండేలా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’’ అని సీఎం తెలిపారు. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి: కేటీఆర్ కలలో కూడా ఊహించని, కల్పన కూడా చేయని అభివృద్ధి ఇవాళ సిరిసిల్లలో కళ్లకు కనబడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా ఆప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. కన్నీరు చూసిన ఈ నేలలో కేసీఆర్ తాగు, సాగు నీరు అందుతోంది. ఇది చేతల, నేతన్నల ప్రభుత్వం.. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రమై లెక్కకు మిక్కిలి విద్యా, వైద్య సంస్థలతో సిరిసిల్ల తులతూగుతోంది.. సిరిసిల్లలో మరోసారి జై కొట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
పైరవీల రాజ్యం మళ్లీ రావాలా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలని ధరణిని తెచ్చామని.. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. రైతుల కష్టాలు తెలుసు కాబట్టే రెవెన్యూ అధికారుల అధికారాలను ధరణితో రైతుల చేతికి అందించామని.. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి అధికారులను రైతుల నెత్తిన రుద్దుదామని, మళ్లీ పైరవీల రాజ్యం తేవాలనేది కాంగ్రెస్ ఉద్దేశమని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలిపితే అందరం బాగుంటామని వ్యాఖ్యానించారు. పదేళ్ల అభివృద్ధిని ఆగం చేయాలని చూసే వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సోమవారం జనగామ, భువనగిరిలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. అందులో జనగామ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ రాకముందు అరిగోసపడ్డాం. జనగామ ప్రాంతాన్ని చూసి కండ్లనీళ్లు పెట్టుకున్నా.. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉండేది. ఎక్కడికి వెళ్లి చూసినా వలసలు, ఎండిపోయిన పంటలు, ఇబ్బందులు చూస్తే దుఃఖం ఆగకపోయేది. నిలబడి, కలబడి అందరి ఆశీర్వాదం, మద్దతుతో తెచ్చుకున్న తెలంగాణలో.. చీకట్లో బాణం వేసినట్టు పనులు మొదలుపెట్టాం. మేధోమథనం చేసి పథకాలు తెచ్చాం. పదేళ్లలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. ఒకప్పుడు కరువున్న తెలంగాణలో ఇవాళ రెండు నెలల పాటు వేలాది లారీల్లో ధాన్యం తరలివెళ్తుంటే సంతోషమేస్తోంది. ఎన్నికల కోసం మేనిఫెస్టోలు తేలేదు తెలంగాణ ప్రజల గోస, బాధలను చూసినవాడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోసం అబద్ధాల మేనిఫెస్టోలను తేవడం లేదు. మేనిఫెస్టోలో పేర్కొన్నవే కాకుండా చెప్పని అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో తెచ్చాం. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. 93లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తాం. రైతుబీమా తరహాలోనే ఎవరైనా చనిపోతే వారంలోనే రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అత్యధిక కాలం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ఏనాడూ దళితులను పట్టించుకోలేదు. అందుకే దళితులతో కోసం దళితబంధు ప్రారంభించాం. కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంత వరకు దళితబంధు సహా అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయి. రోల్ మోడల్గా జనగామ ఉద్యమ సమయంలో సిద్దిపేట నుంచి సూర్యాపేటకు వెళ్తూ బచ్చన్నపేటలో ఆగాను. ఆ ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్లను అడిగితే.. ఊరిలో యువకులంతా పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లారని చెప్పారు. అలాంటి బచ్చన్నపేటలో ఇప్పుడు 365 రోజులు నీళ్లు ఉంటున్నాయి. జనగామ జిల్లాను అభివృద్ధిలో పథంలో రోల్మోడల్గా మారుస్తాం. మెడికల్ కశాశాల మంజూరుతో అనివార్యంగా నర్సింగ్, పారామెడికల్ కళాశాల కూడా వస్తాయి. మళ్లీ గెలిచిన నెలలోపే చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇస్తా. నాడు చంద్రబాబు మోసపూరిత విధానాలతో దేవాదుల ప్రాజెక్టుకు పూజలు చేసి వదిలేశారు. మేం సమ్మక్క బ్యారేజీని 7.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేశాం. ముత్తిరెడ్డిని నేనే వద్దన్నా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నాకు మంచి మిత్రుడు. కొన్ని అంశాల వల్ల పోటీచేసి సీటు పోగొట్టుకోవద్దని నేనే చెప్పి వద్దన్నాను. జనగామను అగ్రగామి నిలిపేందుకు మన ఇంట్లో మనిíÙలా ఉండే పల్లా రాజేశ్వర్రెడ్డిని అభివృద్ధి దూతగా పంపాను. ఆయనను లక్ష మెజారీ్టతో గెలిపించుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యా: పొన్నాల కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సోమవారం జనగామ సభా వేదికపై గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినట్టు చెప్పారు. జనగామ ప్రాంతంలో కేసీఆర్ ఏడు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. ఇక్కడ పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఈ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కరెంటు మాయం.. దళితబంధు ఆగం – కాంగ్రెస్ వస్తే రైతుల భూములకు ఎసరు: భువనగిరి సభలో కేసీఆర్ సాక్షి, యాదాద్రి: ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరెంటు మాయమవుతుందని.. దళిత బంధు ఆగమవుతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘రైతులను పైరవీకారుల పాలుచేసిన కాంగ్రెస్ రాజ్యం మళ్లీ రావాలా?.. మళ్లీ అదే పాట పాడాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రైతుల భూముల మీద రైతులకే హక్కులుండాలని ధరణి పోర్టల్ను తెచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నది. పొరపాటున అదే జరిగితే.. రైతులపై రాబందులు పడతారు. మళ్లీ కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ రికార్డుల కెక్కియ్యడం వంటి వాటితో రైతుల భూములన్నీ ఆగమైపోతయ్. అదే జరిగితే ఒకరి భూమి మరొకరి పేర్ల మీదకు వస్తుంది. మళ్లీ తహసీల్ ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. మూడు గంటల కరెంటు చాలంటున్నరు నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఇవ్వాళ 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ఓటు వేయాలి..’’ అని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ 12 నిçమిషాలు మాత్రమే ప్రసంగించారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య తదితరులు సభలో పాల్గొన్నారు. సభలో గుండెపోటుతో వ్యక్తి మృతి భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన మెట్టు సత్తయ్య (55) బీఆర్ఎస్ కార్యకర్తలతో కలసి ఈ సభకు వచ్చారు. ఈ క్రమంలో ఆకస్మికంగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సత్తయ్య వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారని, ఆయన భార్య ఇప్పటికే మృతిచెందారని, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు తెలిపారు. నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. మతం పేరిట విభేదాలు సృష్టించే కుట్ర ఒకప్పుడు కుల, మత ఘర్షణలతో అట్టుడికిపోయే హైదరాబాద్లో గత పదేళ్లుగా ఎలాంటి మతకలహాలు లేవు. శాంతి సామరస్యాల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కానీ కొందరు వచ్చి మతం పేరిట విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఓటంటే వజ్రాయుధం. ఓటు మన తలరాతను, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అబద్ధాలు చెప్పేవారిని నమ్మి అలవోకగా ఓటేస్తే పరిణామాలు వేరే తీరుగా ఉంటాయి. ఆలోచించి వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. -
60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం ఒరగబెట్టింది.. మరో చాన్స్ ఎందుకివ్వాలి?
సాక్షి, సిద్దిపేట/ హుస్నాబాద్: ‘‘కొన్ని పార్టీలు వచ్చి తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాయి. కానీ ప్రజలు ఇప్పటికే పది చాన్సులు ఇచ్చారు కదా.. 60ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే రాజ్యమేలింది కదా.. ఏం ఒరగబెట్టారు? వారికి ఇంకో చాన్స్ ఎందుకివ్వాలి?’’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు ఇంకా ఇంత దుస్థితిలో ఉన్నారంటే.. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. 60, 70 ఏళ్ల కిందే దళితబంధు వంటి పథకాన్ని ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో పేదరికం ఉండేదా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఇవాళ ఎవరు ఒక్క చాన్స్ అడుగుతున్నారో.. వాళ్లకు 10, 12 చాన్సులు ఇచ్చినా ఏమీ చేయలేదని, వారి విధానాల లోపమే ప్రస్తుత దుస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘సభలో చెప్పిన మాటలు ఇక్కడే విడిచిపెట్టి పోవద్దు. మీ పట్టణం, గ్రామానికి, తండాకు వెళ్లిన తర్వాత కేసీఆర్ చెప్పినదాంట్లో నిజమెంత, అబద్ధమెంత అనేది ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి పోతాయి. కానీ ప్రజలు ఆగమాగం కావద్దు. రాయి ఏదో, రత్నమేదో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ‘తీర్థం పోతాం సమ్మక్క అంటే నేను కూడా వస్తా రామక్క..’ అన్నట్టు అలవోకగా ఓటేయొద్దు. బామ్మర్ది చెప్పాడనో, మా మేనమామ చెప్పాడనో ఓట్లు వేయొద్దు. స్పష్టంగా ఆలోచించి ఓట్లు వేయాలి. మేధో మథనం చేసినం.. మెదడు కరగదీసినం తొమ్మిదిన్నరేళ్ల కింద తెలంగాణలో ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి ఉండేది. వలసలు, కరువు.. సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కొత్తకుండలో ఈగ సొచ్చినట్టు.. కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి? ఏవిధంగా పైకి తీసుకెళ్లాలి?ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే సమస్య ఉండేది. తెలంగాణ వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ మీదనే బాధ్యత పెట్టడంతో.. ఆర్థిక నిపుణులతో రెండు మూడు నెలల పాటు మేధోమథనం చేసినం. మెదడు కరగదీశాం. ఇప్పుడు అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్, సాగు, తాగునీటిలో, పచ్చదనం, పంచాయతీరాజ్ వ్యవస్థ, పారిశ్రమిక విధానం అమలులో టాప్గా మారింది. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చాం.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించింది. భూగర్భ జలాలు కూడా పెరిగి వ్యవసాయానికి స్థిరత్వం వచ్చింది. కడుపు నిండా కరెంట్.. కల్లాల నిండా వడ్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటంతో మోటార్లు కాలడం లేదు. రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ కరువు ప్రాంతం. గతంలో హుస్నాబాద్ వాగుపై ఒక్క చెక్డ్యాం ఉండేది కాదు. నీళ్లుండేవి కాదు. ఇవాళ హెలికాప్టర్లో వస్తుంటే.. వాగుపై వరుసగా మూడు చెక్డ్యాంలు, వాటిలో నిండా నీళ్లు, కనుచూపు మేర పచ్చని పంటపొలాలు కనిపించాయి. కేంద్ర సహకారం లేకున్నా, ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కుట్రలు చేసినా.. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేసుకున్నాం. ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలలు కష్టపడితే అది పూర్తయి లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి. హుస్నాబాద్తో గెలుపునకు నాంది 2018లో ఎన్నికల ప్రచారం కోసం హుస్నాబాద్కే వచ్చా, ఈ గడ్డ ఆశీర్వాదంతో 88 సీట్లతో విజయం సాధించాం. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, ఆశీర్వాదం కోరడానికి వచ్చా. హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలి. ఇవాళ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శం అయ్యాం, మళ్లీ గెలిపిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాం. ఎమ్మెల్యే సతీశ్బాబు 50– 60వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ఉంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గొంతు గరగరతో సీఎం ప్రసంగం ఇటీవల సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. హుస్నాబాద్లో సభలో ఆయన గొంతు గరగరతోనే ప్రసంగించారు. మధ్య మధ్యలో గొంతును సరిచేసుకుంటూ 21 నిమిషాల పాటు మాట్లాడారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్కు సభ వేదికపైనే పార్టీ బీఫారంను కేసీఆర్ అందజేశారు. సభలో బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు: హరీశ్రావు సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను చూసి ప్రజల హృదయాలు ఉప్పొంగిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే 88 సీట్లతో విజయం సాధించామని గుర్తు చేశారు. మళ్లీ ఇక్కడి నుంచే బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి ఎల్లమ్మ దయతో ఈసారి సెంచరీ సాధించి తీరుతామన్నారు. సీఎం కేసీఆర్ ఏ మాటిచ్చినా తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. -
అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయండి: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాక ముందు దారుణ పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థాయికి చేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు కరెంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేదని, ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు. ‘‘పచ్చదనం, పారిశుధ్యంలో తెలంగాణ నెంబర్ వన్. వలసలు, కరెంట్ కోతలతో ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించండి. పారిశ్రామిక విధానంలో మనమే నంబర్వన్గా ఉన్నాం. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అన్నీ పూర్తి చేసుకున్నాం. ఎన్నికలొస్తే పార్టీలు ఏవేవో మాట్లాడుతుంటాయి’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ‘‘పెన్షన్లు ఎందుకివ్వాలని ఆలోచించాం. పనిచేసుకోలేని వారికి అండగా నిలచే ఉద్దేశంతోనే పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆర్థిక భరోసా కోసమే పెన్షన్లు ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ వస్తాం. ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. రైతు బంధుతో అన్నదాతలకు అండగా ఉంటున్నాం. రైతుబంధు సాయం ఇంకా పెంచాలని నిర్ణయించాం’’ సీఎం తెలిపారు. ‘‘ఒక్కొక్క ప్రాజెక్టునూ పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రైతు ఇవాళ కంటి నిండా నిద్ర పోతున్నాడు. మిషన్ భగీరథ లాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆడబిడ్డ బిందె పట్టుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ముగింపు పలికాం. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటువేయాలి. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్లు అందజేసి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ‘‘మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని కేసీఆర్ సూచించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఎన్నికల కో ఆర్డినేటర్ భరత్ కుమార్కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈ రోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో వైపు, 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదని, మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయని కేసీఆర్ చెప్పినప్పటికీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ అన్ని స్థానాలకు బీఫామ్లు ఇస్తారని అంతా భావించారు.. కానీ 51 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరికిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే బీఫామ్లు ఇవ్వలేదని, ఆ స్థానాలను మార్చనున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో వారిలో టెన్షన్ నెలకొనగా.. వారు ఎవరనేది ఇప్పడు హాట్ టాపిక్గా మారింది చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..! -
బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం చదవండి: ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసలు -
15 నుంచి రంగంలోకి కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో.. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా గోదాలోకి దిగుతున్నారు. ఈ నెల 15 నుంచి సభలు, ఇతర కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధంచేసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ నెల 15న తెలంగాణభవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పార్టీ బీఫారాలు అందజేస్తారు. తర్వాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ వెంటనే నియోజకవర్గాల పర్యటనకు బయలుదేరుతారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి.. 15న తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులతో జరిగే భేటీలో.. ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు, సమావేశాల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విపక్షాల ఎత్తులను చిత్తుచేసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. తర్వాత అదే రోజున సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. వరుసగా నియోజకవర్గాల పర్యటన సుమారు 50రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కేసీఆర్.. ఈ నెల 15 నుంచి నియోజకవర్గాల్లో ప్రచార సభలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో 18 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగే బహిరంగ సభల షెడ్యూల్ను బీఆర్ఎస్ ప్రకటించింది. 15న హుస్నాబాద్, 16న జనగామ, భువనగిరి, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచార సభల షెడ్యూల్ను త్వరలో ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ నెల 16న వరంగల్లో భారీ బహిరంగ సభను తలపెట్టినా కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. ఆ సభను ఈ నెల 26 లేదా 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. కోనాయపల్లి ఆలయంలో పూజలు చేసి.. కేసీఆర్ తాను పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 9న నామినేషన్లు దాఖలు చేస్తారు. కేసీఆర్ సెంటిమెంట్, ఆనవాయితీ మేరకు ఆ రోజున ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకుని రెండో నామినేషన్ సమర్పిస్తారు. అనంతరం కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. -
సీఎం కేసీఆర్కు ఛాతీలో ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం బారినపడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు క్రమంగా కోలుకుంటున్నారని మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వైరల్ జ్వరం బారినపడిన కేసీఆర్కు తర్వాత బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపారు. ఛాతీలో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని వివరించారు. దీంతో కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు అనుకున్న సమయం కంటే ఎక్కువకా లం పట్టే అవకాశం ఉందని తెలిపారు. వైరల్ జ్వరం బారిన పడిన సీఎం కేసీఆర్ దాదాపు మూడు వారాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కేటీఆర్ వెల్లడించారు. చదవండి: ప్లీజ్ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్కు ఫోన్ చేసి.. -
ప్రగతి నిరోధక శక్తులకు.. పరాజయమే
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ ప్రగతి రథచక్రాలు దూసుకుపోతున్నాయని.. దేశంలో ఎక్కడ, ఎవరినోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని.. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని పేర్కొన్నారు. మన సమైక్యతే మనకు బలమని.. జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలసిన ‘సెప్టెంబర్ 17’ సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరికం నుంచి పరిణామం పొంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిందని.. ఈ చారిత్రాక సందర్భాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం నంబర్ వన్. రూ.3,12,398 తలసరి ఆదాయంతోనూ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో ముందడుగు వేస్తోంది. సకల జనులకు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. కొత్త వైద్య కళాశాలలతో ఏటా పది వేల మంది డాక్టర్లను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆగదు హైదరాబాద్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా అర్హులకు ఇళ్లు రాకపోయినా ఆందోళన చెందవద్దు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది. సొంత జాగా ఉన్న పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 44 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. ఇక అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకంకొత్త చరిత్రను సృష్టించింది. బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు, ఈత, తాటిచెట్లపై పన్నురద్దు, 5 లక్షల వరకూ బీమా సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రజకులు, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ, ఆర్థికసాయంతో అండగా నిలుస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చాం. రాష్ట్రంలో ఐటీ దూకుడు తెలంగాణ ఏర్పడే నాటికి 3,23,390 మంది ఐటీ ఉద్యోగులుంటే.. ఇప్పుడు 9,05,715 మందికి పెరిగారు. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు వృద్ధిచెందాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించుకున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67 వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నాం. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నగరానికి మరింత శోభ చేకూర్చాయి.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరో నాలుగేళ్లలో 1.25 కోట్ల మాగాణగా.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వీటితోపాటు కాళేశ్వరం, పాలమూరు, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి ప్రధాన ఎత్తిపోతల పథకాల ద్వారా 75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇతర భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా మరో 50 లక్షల ఎకరాలు సాగవుతాయి. మొత్తంగా మరో నాలుగేళ్లలో కోటీ 25 లక్షల ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో వ్యవసాయం పండుగగా మారింది. -
ఆగమైతే గోసపడతాం!
‘స్కూల్’ ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువు రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల కట్టుకుంటున్నాం. నేడు స్కూల్ స్థాయిలో ఫీజు కడితే ఎంబీబీఎస్ చదువుకునే పరిస్థితి ఉంది. తమిళనాడులో స్కూల్ విద్యార్థులకు టిఫిన్ ఇస్తుండటం బాగుందంట. రాష్ట్ర బృందాన్ని అక్కడికి పంపాం. తెలంగాణలో టెన్త్ వరకు విద్యార్థులందరికీ ఉదయం టిఫిన్, కోడిగుడ్డు అందిస్తాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారని.. అలా వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే గోసపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. వారి చేతిలో ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాములా మింగేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే ప్రాణగండంలా మారారని మండిపడ్డారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణా తీరంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే వలస కూలీలుగా పేరుపడితే.. నేడు బెంగాల్, యూపీ రాష్ట్రాలతోపాటు పక్కనున్న రాయచూర్, కర్నూల్ జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని పొలాల్లో పని చేయించుకుంటున్న రైతు బిడ్డగా మారాడు. పాలమూరు–రంగారెడ్డిలో ఒక్క పంపును నడిపితేనే వాగు పారేంత నీళ్లు తరలుతున్నాయి. త్వరలో మొత్తం పంపులు, కాలువలన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రాంతాలకూ నీళ్లు అందుతాయి. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని 20 లక్షల ఎకరాల్లో నీటి పారకాన్ని నా కళ్లతో చూసేదాకా ప్రజల దీవెనలు ఉండాలి. ఇప్పుడు ఇంటి దొంగలతోనే గండం ఉద్యమ సమయంలో జోగుళాంబ ఆలయం నుంచే మొదటి పాదయాత్రను ప్రారంభించా. పాలమూరును దత్తత తీసుకున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు, ఆయన తాబేదార్లు మాట్లాడారు. ఆర్డీఎస్ను మూసేయకపోతే బద్దలు కొడతామన్నారు. అదే నేను సుంకేశుల ప్రాజెక్టును వంద బాంబులు పెట్టి పేల్చుతానని చెప్పిన. మాకు కూడా బాంబులేసే మొనగాడు పుట్టిండని పాలమూరు ప్రజలు అప్పుడు సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులకు ఇంటి దొంగలే, ఈ జిల్లాలో పుట్టిన సన్నాసులే ప్రాణగండంలా మారారు. ప్రాజెక్టు పనులకు అడ్డం పడ్డారు. లేకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం మూడు నాలుగేళ్ల కిందే పూర్తయ్యేది. ఆగమైతే గోస పడతాం.. ఎన్నికలు వస్తున్నాయనగానే కొందరు గంటలు పట్టుకుని బయలుదేరుతారు. నాడు రాష్ట్రం నుంచి బొంబాయి, దుబాయి వలసపోతే ఒక్కడూ సాయం చేయలే. కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకుని బాగుచేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో వస్తున్న పిచ్చివాళ్ల మాటలు నమ్మి ఆగమైతే.. గోసపడతాం. ఒక్కసారి మోసపోతే వైకుంఠపాళిలో పెద్దపాము లెక్క మింగేస్తారు. నేను హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుంటే బీజేపీ వాళ్లు జెండాలు పట్టుకుని అడ్డం పడుతున్నారు. ఏం పాపం చేశాం, ఎవరిని మోసం చేశామని అడ్డుపడుతున్నారు. కృష్ణా ట్రిబ్యునల్లో నీటి వాటా కేటాయింపునకు పదేళ్లు పడుతుందా? సిగ్గు, చీము, నెత్తురు, పౌరుషం ఉంటే జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులం అని చెప్పుకునేవారు ఢిల్లీలో కూర్చుని లేఖలు రాయాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రాకు చెప్పేది ఒక్కటే. మాకు ఎవరి నీళ్లూ అవసరం లేదు. మా వాటా మాకు చెబితే బాజాప్తాగా నీళ్లు తీసుకుంటాం. మేం మంది సొమ్ము అడుగుతలేం. మూడూ పూర్తయితే.. తెలంగాణ వజ్రపు తునకే! తెలంగాణలో అంచనాలు వేసుకొని, హక్కులు చూసుకొని, రావాల్సిన వాటాలు చూసుకొని మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకున్నాం. గోదావరి మీద కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు ఎత్తిపోతల. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఒక వజ్రపు తునకలా తయారై దేశానికే అన్నం పెట్టే స్థాయికి పోతుంది. మన రైతులు తలఎత్తుకొని బతుకుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేసుకున్నాం. సీతారామ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ట్రిబ్యునలే పట్టించుకుని ప్రాజెక్టు ఇచ్చింది మహబూబ్నగర్ చరిత్ర చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీరి్పచ్చినప్పుడు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా మా మహబూబ్నగర్కు నీళ్లేవని అడగలే. చివరికి ట్రిబ్యునల్ జడ్జి బచావత్ అనే ఆయనే.. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండుంటే చాలా బాగుపడి ఉండేదన్నారు. కనీసం ఈ ప్రాంతానికి నీళ్లడగటం లేదని, తమకు చూడబుద్ధి కావడం లేదని చెప్పి.. తామే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు జూరాల ప్రాజెక్టును ఏదో కారణం చెప్పి మరోచోటికి తరలించకుండా తాము సూచించిన చోటే కట్టాలన్నారు. ట్రిబ్యునల్ రికార్డుల్లో ఈ రోజుకూ ఈ విషయాలు ఉన్నాయి. అంత జరిగినా 1981 దాకా జూరాల ప్రాజెక్టును మొదలుపెట్టలే.. శంకుస్థాపన చేసినా పనులు చేయలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టి నిలదీశాకే పూర్తిచేసి, నీళ్లు నిల్వ చేశారు. కేసీఆర్ పుణ్యంతో పాలమూరు పచ్చబడింది: నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ పుణ్యమా అని పాలమూరు గడ్డ పచ్చబడిందని, వలస వెళ్లినవారంతా తిరిగి వస్తున్నారని మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ కోసం 45వేల మంది 12 ఏళ్లపాటు పనిచేశారని.. సుమారు పదివేల మంది పాలమూరు బిడ్డలు ప్రమాదాల్లో మరణించినా ఈ గడ్డకు మాత్రం ఫలితం దక్కలేదని మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమని అభివర్ణించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, ఇప్పుడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాగా.. వలసల ప్రాంతంగా గుర్తింపు పొందిన పాలమూరు జిల్లాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి అన్నారు. పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల సర్జిపూల్ ఆసియా ఖండంలోనే పెద్దదని, ఇంజనీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. పండుగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలసి ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో నార్లాపూర్ పంపుహౌస్కు చేరుకున్నారు. తొలుత పంపుహౌస్ వద్ద ఏర్పాటుచేసిన పాలమూరు ప్రాజెక్టు పైలాన్ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత కేసీఆర్ 145 మెగావాట్ల సామర్థ్యమున్న మొదటి మోటారును ఆన్ చేసి, నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. సర్జ్పూల్, పంపుహౌస్లను పరిశీలించారు. నార్లాపూర్ పంపుహౌజ్ వద్ద డెలివరీ సిస్టర్న్ నుంచి అంజనగిరి రిజర్వాయర్కు తరలుతున్న నీటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలకు పూలు, సారె సమర్పించి, జలహారతి పట్టారు. అనంతరం కొల్లాపూర్ శివార్లలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాస్రెడ్డి, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, బాల్క సుమన్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో అల్పాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విజయదశమి కానుక ముందుగానే ప్రకటించింది. ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉదయంపూట విద్యార్థులు ఖాళీ కడుపుతో వస్తుండడంతో చదువుపై ధ్యాస తగ్గుతోందని విద్యాశాఖ వర్గాల పరిశీలనలో తేలింది. దీనిని అధిగమించడంతోపాటు పిల్లలను శారీరకంగా మరింత పటిష్టంగా తయారు చేసే దిశగా సీఎం కేసీఆర్ అల్పాహార పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తుండగా, అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే కాకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఈ పథకం అమలు చేస్తారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 27 జారీ చేశారు. వచ్చే నెల 24 నుంచి అమల్లోకి... ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులను డీటైల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేసింది. ఈ పథకం కేవలం పాఠశాలల పనిదినాల్లోనే అమలులో ఉంటుంది. మొత్తంగా దసరా కానుకగా అక్టోబర్ 24 తేదీన ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బడిపిల్లలకు వరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా పేదపిల్లలే. వారికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఇక అల్పాహార పథకం వారికి సీఎం ఇస్తున్న వరంగానే చెప్పొచ్చు. ఈ పథకం అమలుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. – రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని స్వాగతిస్తున్నాం. బడికి వచ్చే పేదవిద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఆలోచనతో పథకాన్ని తీసుకురావడం శుభసూచకం. దీనిని శాశ్వతంగా అమలు చేయాలి. కార్యాచరణ ప్రణాళిక పకడ్భందీగా రూపొందించాలి. – కె.జంగయ్య, చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభుత్వ మానవీయకోణం సీఎం కేసీఆర్ మానవీయకోణంలో తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతం. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. – జూలూరు గౌరీశంకర్, చైర్మన్, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఇది కూడా చదవండి: ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష -
సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, నల్గొండ: సగం నెల పూర్తయినా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి.. ఇప్పటికైనా జీతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలన్న ఒకటికే జీతాలు ఇవ్వాలంటూ లేఖలో సూచించారు. జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓపీఎస్ను అమలు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. చదవండి: లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి బుధవారం ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. బానిస బతకుల పార్టీ బీఆర్ఎస్దే. కనీసం అపాయింట్మెంట్ అడిగినా తనకు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. కాళేశ్వరం కాంట్రాక్టర్లు, భూ కబ్జాకోరులు బీఆర్ఎస్కు కావాలి. ఉద్యోగులకు ఒకటినే జీతాలు ఇవ్వాలి. ఏడాది కాలంగా పదమూడు, పద్నాలుగునా జీతాలు ఇస్తున్నారు. డిఫాల్టర్లుగా మారడంతో భవిష్యత్తులో లోన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోడంతో ఉద్యోగులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు అమ్ముడుపోయారు. కేటీఆర్ చేతగాని దద్దమ్మ. పింఛన్లు ఇవ్వలేని వాళ్లు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దోచుకున్న సొమ్మంతా రాబోయే రోజుల్లో బయట పడుతుంది. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తాం’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘రేపటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. నల్లగొండను దత్తత తీసుకుంటున్నామని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయలేదు.దత్తత తీసుకుంటే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఎస్సెల్బీసీ సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేటలో వేల ఇళ్లు నిర్మించారు. నల్లగొండలో ఒక్క ఇళ్లు కూడా ఎందుకు నిర్మించలేదు. రోడ్డు కోసం ఇళ్లు కూలగొట్టి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాత్రం కట్టుకున్నారు. దత్తత పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్కు డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్ అధికారంలోకి రాగామే స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తాం’’ అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఒకే రోజు 9 కొత్త మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఒకేసారి వీటిని ప్రారంభించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను వెంటనే సమకూర్చాలని సూచించారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాకో కాలేజీ ఏర్పాటులో భాగంగా.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని హరీశ్రావు గుర్తు చేశారు. గతేడాది ఒకే వేదిక నుంచి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కొత్త మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశంపై శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, వైద్య విద్య సంచాలకులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో కేవలం ఐదే మెడికల్ కాలేజీలు ఉండేవని, అందులోనూ మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని హరీశ్ చెప్పారు. అదే ఇప్పుడు కొత్తవి కలిపి మొత్తం 26 కాలేజీకు చేరాయన్నారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఏకంగా 3,915 సీట్లకు పెరిగాయని వివరించారు. మహిళల ఆరోగ్యం కోసం.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కొత్తగా మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలను ఈ నెల 12వ తేదీన ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాల సంఖ్య 372కు చేరుతోందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ నిర్వహించి, వివిధ సమస్యలున్న 13,673 మంది మహిళలను ఆస్పత్రులకు రిఫర్ చేశామని చెప్పారు. 5,204 స్టాఫ్ నర్స్ రిక్రూట్ మెంట్ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని.. ఏఎన్ఎంల పీఆర్సీ, ఎరియర్స్ వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు..16న జాతికి అంకితం
ప్రపంచంలోనే భారీ పంపులతో.. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ పంపులతో నిర్మించిన ‘పాలమూరు’ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చరిత్రాత్మకం. దశాబ్దాల కల సాకారమవుతున్న ఈ సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు. ప్రాజెక్టును ప్రారంభించిన మరునాడు (సెపె్టంబర్ 17 న) ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పల్లెపల్లెనా ఊరేగింపులతో సంబురంగా జరుపుకోవాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 16న మధ్యాహ్నం ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తొలుత బటన్ నొక్కి నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్దనున్న బాహుబలి పంపులను కేసీఆర్ ఆన్ చేస్తారు. పంపుల నుంచి కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్కు చేరుతాయి. సీఎం కేసీఆర్ వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుధవా రం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీలో సీఎం చెప్పి న అంశాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో తాగు, సాగునీటికి నోచుకోక ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలను అనుభవించాయి. పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి పాలకులది. ఎటుచూసినా వలసలే కనిపించేవి. జిల్లా ప్రజల బాధలను చూసిన గోరటి వెంకన్న వంటి పాలమూరు కవులు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే.. పాలమూరులోనా’ అంటూ పాటలు కూడా రాశారు. బంగారు తెలంగాణ సంపూర్ణమవుతుంది పాలమూరులో నాటి పాలకులు మొదలుపెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశాం. పాలమూరు జిల్లా పచ్చబడింది. వలసలు ఆగిపోయాయి. ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్ప అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయ రంగాభివృద్ధిని సాధిస్తుంది. రైతుల లోగిళ్లు బంగారు పంటలతో తులతూగుతాయి. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రాజెక్టుపై స్వయానా పాలమూరు జిల్లా నేతలే వందల కేసులు పెట్టడం దురదృష్టకరం. వారు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ దిశగా కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు హమీద్ఖాన్, రమణారెడ్డిల కృషిని అభినందిస్తున్నాం. కృష్ణా జలాలతో మొక్కులు తీర్చుకోవాలి మనందరి కృషికి దైవ కృప తోడు కావడంతోనే ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చాయి. ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో నాణేలు వేసి నీటి కోసం మొక్కాం. కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుళ్ల పాదాలు కడుగుతామన్నాం. మనందరం ఆ మొక్కులను తీర్చుకోవాల్సి ఉంది. రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తమతో తెచ్చుకున్న కలశాలతో కృష్ణా జలాలను తీసుకెళ్లి దేవుళ్ల పాదాలకు అభిõÙకం చేయాలి. కొబ్బరికాయలు కొట్టి, పూలుచల్లాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారీగా బహిరంగ సభ ‘పాలమూరు’ ప్రాజెక్టును ప్రారంభించుకునే చరిత్రాత్మక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు ఈ సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం, బహిరంగసభ నిర్వహణ, ప్రజలకు రవాణా, భోజన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఒక్కోటీ 12 కిలోల బోల్టులు ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నట్టు అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. వాటికి బిగించే ఒక్కో బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుందని తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నామని.. ఇంకా ఎన్నో నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని వివరించారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో ‘పాలమూరు’ పనులను పూర్తి చేయాలని, కాల్వల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అవలంబించాలని సూచించారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో కాల్వల పనులను మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కలసి పర్యవేక్షించాలని కోరారు. తర్వాత ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావుతో, తాగునీటి తరలింపు చర్యలపై మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డితోనూ సీఎం సమీక్షించారు. -
ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ షాక్ ట్రీట్మెంట్..
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సీట్లు రాని కొందరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలం మాకు సీటివ్వరా అంటూ రోదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చారు గులాబీ దళపతి. ఒక సీటును సిటింగ్ను కాదని ఎమ్మెల్సీతో భర్తీ చేశారు. మరో సీటును సిటింగ్కు ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. సీట్లు రాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలపించడంతో వారి అనుచరులు కూడా కంటతడి పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను అయోమయానికి గురిచేస్తుంది. రాజకీయంగా నాటకీయ పరిణామాలకు దారి తీస్తోంది. జనగామ, స్టేషన్ ఘనపూర్ టికెట్లు అక్కడి ఎమ్మెల్యేలను కన్నీరు మున్నీరుగా విలపించే పరిస్థితి తీసుకొచ్చాయి. అందరూ ఉహించినట్లుగానే స్టేషన్ ఘనపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. స్వయం కృతాపరాధంతో టికెట్ కోల్పోయిన రాజయ్య భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. జరిగిన పరిణామాలను తలుచుకుంటూ కార్యకర్తలను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారంతో పశ్చాత్తాపం చెందుతున్నారు. టికెట్ రాకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. కొందరు పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాత్రం అధినేతను కలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కెసిఆర్ గీసిన గీతను దాటనని, తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు. తనకు కేసిఆర్ ఆశీస్సులున్నందున.. ఆందోళన చెందకుండా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు. డాక్టరయిన తనకు స్థాయికి తగ్గ స్థానం కేసీఆర్ కల్పిస్తారనే నమ్మకం ఉందంటున్నారు. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇక జనగామ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టికెట్ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెరపైకి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లు రావడంతో పల్లా వద్దు.. ముత్తిరెడ్డే ముద్దు అంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగి కన్నీటి పర్యంతమయ్యారు. మా బాపుకు అన్యాయం చెయ్యొద్దు అంటు ముత్తిరెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ముత్తిరెడ్డి సైతం కన్నీటి పర్యంతమై ఒక్క అవకాశం ఇవ్వండని రెండు చేతులు జోడించి దండం పెడుతూ కేసీఆర్ను వేడుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన అధికారం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెక్కి వెక్కి ఏడ్వడం ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా కలకలం రేపింది. మరి ఎమ్మెల్యేల కన్నీరు గులాబీ దళపతిని కరిగిస్తుందా? వారి అనుచరుల ఆవేదన ఫలితాన్నిస్తుందా? కొద్ది రోజుల తర్వాత గాని ఏ విషయం తెలిసే అవకాశం లేదు. -
మోసగాళ్లను నమ్మితే గోసే
సాక్షి ప్రతినిధి, మెదక్: ‘కోటి కుటుంబాలకు నల్లా నీళ్లు ఇస్తున్న, వ్యవసాయానికి.. పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇన్ని సౌకర్యాలను వదిలేసి రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించొద్దు. చేతగాని వారి చేతుల్లో పెట్టొద్దు..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మితే గోస పడతామని హెచ్చరించారు. ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతోందని, ఆనాడు రూ.200 పెన్షన్కే పరిమితమై ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామని చెబుతున్న ఆ పార్టీని నమ్మొద్దని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం మెదక్ చర్చి గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ధరణితో ఇబ్బందులు తొలగిపోయాయి.. ‘వరి ధాన్యం పండించడంలో రాష్ట్రం పంజాబ్ను మించి పోయింది. రైస్ మిల్లులు చాలనంత ధాన్యం పండుతోంది. ధరణి వచ్చాకే వారి భూములపై రైతులకు సర్వహక్కులు దక్కాయి. ధరణి రాకముందు వీఆర్ఓ మొదలుకుని సీసీఎల్ఏ సెక్రటరీ వరకు అంతా వారి చేతుల్లోనే ఉండేది. రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. తమ పంటలను విక్రయించాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. సేట్లు.. బీట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ధాన్యం డబ్బుల కోసం వెళితే వారం తర్వాత రావాలని, నెల రోజుల తర్వాత రావాలనే సమాధానం ఎదురయ్యేది. ధరణితో పరిస్థితి మారింది. రైతులు పండించిన ధాన్యమంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. అదే ధరణి రద్దయితే కైలాసంలో పెద్ద పాము మింగినట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది..’ అని కేసీఆర్ హెచ్చరించారు. ఆలస్యమైనా రుణమాఫీ చేశాం.. ‘కరోనా, కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వంటి కారణాలతో ఆలస్యమైనప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.37 వేల కోట్ల రైతుల పంట రుణాలను మాఫీ చేశాం. రైతు బీమా పథకం అమెరికా, ఇంగ్లాండ్..ఇలా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా పరిహారం సొమ్ము బాధిత రైతు కుటుంబానికి చెందిన వారి ఖాతాలో జమ చేస్తున్నాం. ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీతో పాటు, టీడీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఘనపురం ఆనకట్టను పట్టించుకోలేదు. సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్కు పరిమితం చేసి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పంటలను ఎండ బెట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో మాదిరిగానే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని ఆ రాష్ట్ర రైతులు అంటున్నారు..’ అని సీఎం తెలిపారు. సర్కారును నడపడమంటే సంసారాన్ని నడిపినట్లే.. ‘సర్కారును నడపడమంటే సంసారాన్ని నడిపినట్లే. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న మేరకు కళ్యాణలక్ష్మి, పెన్షన్ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళుతున్నాం. ప్రభుత్వ ఆదాయం పెరిగే కొద్దీ ఆయా సంక్షేమ పథకాల మొత్తాన్ని పెంచుతాం. అక్టోబర్లో వరంగల్లో జరగనున్న బహిరంగ సభలో అన్ని నిర్ణయాలు ప్రకటిస్తాం. ఎన్నికలు వస్తే ఆగం కావద్దు. ధీరత్వాన్ని ప్రదర్శించాలి. ఎవరు నిజమైన ప్రజా సేవకులో, వాస్తవం ఏంటో గుర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి..’ అని కేసీఆర్ అన్నారు. బహిరంగ సభలో మంత్రులు టి.హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, రసమయి బాలకిషన్, భూపాల్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. రెండు కొత్త పథకాలు ప్రారంభం మెదక్లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబి్ధదారులకు పంపిణీ చేశారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించారు. పది సీట్లు సీఎంకు కానుకగా ఇస్తాం: హరీశ్రావు మెదక్: మెదక్ జిల్లాకు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేయలేని పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మెదక్ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక మెదక్కు రైలు వచ్చిందని, ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాకు నీళ్లు అందుతున్నాయని, మండుటెండలో సైతం మత్తడులు దుంకుతున్నాయని చెప్పారు. నేడు దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు అబద్ధాలతో కాలం గడుపుతుంటే కేసీఆర్ మాత్రం అభివృద్ధితో దూసుకెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తామని హరీశ్ అన్నారు. రెండు కొత్త పథకాలు ప్రారంభం మెదక్లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబి్ధదారులకు పంపిణీ చేశారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించారు. -
కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్: బండి సంజయ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మూడోసారి సీఎం అయితే అంతకంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేస్తారా?.. మీకోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా?’’ అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ను తరిమి తరిమికొట్టి రామరాజ్యం తేవడమే బీజేపీ లక్ష్యం. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులంతా దండు పాళ్యం ముఠా. వాళ్లను జనం ఓడిస్తారని కేసీఆర్కు తెలిసిపోయింది. చివర్లో వాళ్లలో సగం మందికి బి ఫాం ఇవ్వకూడదని సీఎం ఎత్తుగడ వేసిండు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చదవండి: కేసీఆర్ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు -
మెదక్లో కేసీఆర్ పర్యటన.. ఎస్పీ ఆఫీస్ ప్రారంభం
►మెదక్ జిల్లాలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించిన సీఎం కేసీఆర్ ►63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం ►జీ ప్లస్ 3 పద్దతిలో 38.50 కోట్లు వ్యయంతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం ►ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్...పక్కనే పోలీస్ క్వార్టర్స్ ►జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, హోం మంత్రి మొహమ్మద్ అలీ చేతులమీదుగా బుధవారం మధ్యాహ్నాం ప్రారంభించారు. ►ఎకరా స్థలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన పార్టీ కార్యాలయం.. సభలు, సమావేశాలకు వేదిక కానుంది. ►కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా పెద్ద హాల్ నిర్మాణం చేపట్టారు. ఇక మెదక్ పర్యటనలో భాగంగా.. జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం తన చేతులతో ప్రారంభిస్తారు. దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను మంత్రి హరీశ్ పర్యవేక్షించారు. స్వయంగా సీఎం ప్రారంభోత్సవానికి వస్తుండటంతో జిల్లా పోలీసు కార్యాలయ సముదాయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. కలెక్టరేట్ భవనం, లోపలి చాంబర్లను రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు సిబ్బంది. ఇది కూడా చదవండి: గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు? -
115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా.. సిట్టింగులకే సై!
టికెట్ దక్కని సిట్టింగ్లు.. ఆత్రం సక్కు (ఆసిఫాబాద్–ఎస్టీ),రాథోడ్ బాపూరావు (బోథ్–ఎస్టీ), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), బేతి సుభాష్రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ఘన్పూర్–ఎస్సీ), రాములు నాయక్ (వైరా–ఎస్టీ), చెన్నమనేని రమేశ్బాబు (వేములవాడ–జనరల్) వీరి స్థానంలో టికెట్లు పొందినవారు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), బానోత్ మదన్లాల్ (వైరా), చల్మెడ లక్ష్మీకాంతరావు (వేములవాడ). ఏడుగురు మహిళలకు టికెట్లు ఎమ్మెల్యేలు సబితా (మహేశ్వరం), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), బానోత్ హరిప్రియనాయక్ (ఇల్లందు)తోపాటు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బడే నాగజ్యోతి (ములుగు),లాస్య నందిత (కంటోన్మెంట్)కు టికెట్ ఇచ్చారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సిట్టింగ్లకే ప్రాధాన్యమిస్తూ, పెద్దగా మార్పు చేర్పులేవీ లేకుండానే.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. నాలుగు సీట్లు మినహా మిగతా 115 నియోజకవర్గాల టికెట్లను ప్రకటించారు. మిగతా నాలుగు చోట్ల స్థానిక పరిస్థితులను మరోసారి మదింపు చేశాక అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితుల మేరకు ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా.. 4 చోట్ల కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మూడు చోట్ల వారసులకు అవకాశమిచ్చారు. అభ్యర్థుల విశేషాలు ఇవీ.. ► తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో నలుగురు.. అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), లాస్య నందిత (కంటోన్మెంట్), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ► చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినా.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్కు మాత్రమే అవకాశమిచ్చారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మృతి చెందడంతో.. ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. ► దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పోటీ చేయనున్నారు. ► గత ఎన్నికల్లో ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో.. ఆమె గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ నిరాకరించారు. ► పౌరసత్వ వివాదం నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును తప్పించి.. చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశం ఇచ్చారు. ► మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డిని తప్పించి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని భావించారు. అయితే ఇద్దరూ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టడంతో పెండింగ్లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించాకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ► నాలుగైదు రోజులుగా చర్చనీయాంశంగా మారిన జనగామ స్థానం కూడా పెండింగ్లో పడింది. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును ఖరారు చేశారని.. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒత్తిడి నేపథ్యంలో పెండింగ్లో పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముత్తిరెడ్డి సోమవారం ఉదయం టికెట్ల ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి.. తనకే టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ► ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం పార్టీతో మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతుందని ప్రకటించారు. ఎంఐఎం ప్రాబల్యం కలిగిన నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను పెండింగ్లో పెట్టారు. ముందుగా నిర్ణయించిన సమయానికే ► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించుకున్న సమయానికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి తదితరులు వచ్చారు. తాండూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. మైనంపల్లికి ఇష్టముంటే పోటీ చేస్తారని, లేదంటే వారేవాళ్లు పోటీ చేస్తా రని పేర్కొన్నారు. ఇక మైనంపల్లి వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. మంత్రి హరీశ్రావుకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. కాగా తాను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పట్నం మహేందర్రెడ్డి మీడియాకు చెప్పారు. -
గులాబీ బాస్ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే..
గులాబీ బాస్ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రయోగం చేయబోతున్నారా? గతంలో సిద్ధిపేటలో వరుసగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయరంటూ ప్రచారం సాగుతోంది. నిజంగానే గజ్వేల్ నుంచి మరో నియోజకవర్గానికి వలస వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం నిజమే అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోకి వచ్చే కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఉమ్మడి జిల్లాలోని 9 నియోజవర్గాల్లోనూ స్వీప్ చేయవచ్చనే ఆలోచనతో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అక్కడి నేతలు కేసీఆర్ను కోరుతున్నట్లు చెబుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ స్వయంగా కేసీఆర్ పోటీ గురించి ప్రకటించడంతో జిల్లాలో సంచలనంగా మారింది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్ను మూడు సార్లు కోరినట్లు గోవర్థన్ తెలిపారు. కేసీఆర్ బరిలో ఉంటే ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి కేసీఆర్ను గెలిపించుకుంటామని అన్నారు. తాను ఏమి చేయాలో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని ప్రభుత్వ విప్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్ అని గోవర్థన్ తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం తన నానమ్మ పేరిట సొంత నిధులతో కోనాపూర్లో ప్రభుత్వ పాఠశాల నిర్మించారన్నారు. అయితే కేసీఆర్ కామారెడ్డి బరిలో ఉంటారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: కాంగ్రెస్కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలైన జగిత్యాల, సిరిసిల్లా, సిద్దిపేటలోను బీఆర్ఎస్కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 స్థానాల్లో బీఆర్ఎస్ నిర్వహించిన పలు సర్వేల్లో రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు తేలింది. దీంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో ఉంటే ఉమ్మడి జిల్లాలోని 9 సీట్లలోనూ క్లీన్ స్వీప్ చేయవచ్చని ఆ పార్టీ ముఖ్యనేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్తో పోటీ చేయించాలన్న ఆలోచనను ఆ పార్టీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. గత ఏడాది కిందట బీబీపేట మండలం కోనాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్లోని ఇల్లుని మంత్రి కేటీఆర్ సందర్శించి తన పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కేటీఆర్ కోనాపూర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను 2.5 కోట్ల సొంత నిధులతో పునర్నిర్మించారు. పాఠశాల భవనమే కాకుండా ఆ గ్రామంలో పలు బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఎనిమిదింటిని గులాబీ పార్టీ గెలుచుకుంది. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్ కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కామారెడ్డిలో వ్యతిరేకత మరింతగా పెరిగిందని..కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి పోటీ చేయడం వల్ల ఆ సీటును కాపాడుకోవడంతో పాటు.. చుట్టుపక్కల నియోజక వర్గాలు, జిల్లాల్లో ప్రభావం పడేలా చేయడం ద్వారా ద్విముఖ వ్యూహం అనుసరించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫైనల్ డెసిషన్ తీసుకోగలిగేది గులాబీ బాస్ మాత్రమే. -
కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను నమ్మొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట.. జిల్లా కావడం ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. అభివృద్ధిలో ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు. ‘‘తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుంది. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభారతి నిర్మిస్తాం. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టికి రూ.50 కోట్లు మంజూరు చేస్తాం. ఆర్అండ్బి గెస్ట్హౌస్ కూడా నిర్మిస్తాం. సూర్యాపేటపేట జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్, బీజేపీలకు 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈ 50 ఏళ్లలో ఆ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయి. రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందా?’’ అని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ తప్పకుండా పెంచుతాం.. తర్వలోనే ప్రకటిస్తాం. ఇచ్చిన ఏ మాటా తప్పలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా సాగునీళ్లు ఉన్నాయి. రైతులకు 3 గంటలే కరెంటు చాలని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో కరెంటు కష్టాలు ఇప్పటికే మొదలయ్యాయి. ధరణి వ్యవస్థ తెచ్చాం.. వీఆర్వోలను తొలగించాం. వీఆర్వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భూముల రిజిస్ట్రేషన్లో అక్రమాలు తొలగిపోయాయి. ధరణితో రిజిస్ట్రేషన్ కష్టాలు తీరిపోయాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ధరణి వ్యవస్థను తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదు. పైరవీకారులకు మళ్లీ అధికారం రాకూడదు. కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను ప్రజలు నమ్మొద్దు. మోసపోతే ఘోష పడతాం. ఎవరు ఎన్ని కథలు చెప్పిన విజయం బీఆర్ఎస్దే’’ అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. -
అసమ్మతులకు ‘చేరికల’తో చెక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. అదే సమయంలో సొంత పార్టీని చక్కదిద్దే చర్యలపైనా దృష్టి పెట్టారు. సిట్టింగ్లకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజల్లో, స్థానిక పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత, ఆరోపణలున్నవారిని పక్కనపెడుతున్నారు. ఆయా చోట్ల సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా గెలవగలిగిన వారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల నుంచి ఎదురయ్యే అసమ్మతికి చెక్ పెట్టేదిశగా పావులు కదుపుతున్నారు. ఆయా నేతలు పార్టీని వీడినా, అంతర్గతంగా సహకరించకపోయినా నెలకొనే నష్టాన్ని అంచనా వేస్తూ.. దానికి విరుగుడుగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల వారిని ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. అసమ్మతి నేతలకే గెలుపు బాధ్యతలు రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టిపోటీ ఉండగా.. అందులో కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఇతరులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల జాబితా విడుదల చేశాక టికెట్ దక్కని నేతల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని అంచనా వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే నేతల వివరాలను నిఘా సంస్థల ద్వారా సేకరిస్తున్నారు. టికెట్ ఆశించి, భంగపడిన నేతలను కూడా కలుపుకొనిపోవాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు బాధ్యతల్లో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా చేరికలతో.. మరోవైపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సొంత పార్టీ నేతలు, విపక్షాల నాయకుల వివరాలను బీఆర్ఎస్ ఇప్పటికే సేకరించింది. అసమ్మతులతో పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. క్షేత్రస్థాయిలో బలం కలిగిన ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకునే పని మొదలుపెట్టింది. గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా లేదా ఇతర చిన్న పార్టీల నుంచి పోటీచేసి గణనీయంగా ఓట్లు సాధించిన నాయకుల డేటాపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే స్థానికంగా బలం కలిగిన కౌశిక్ హరి (రామగుండం), ఉప్పుల వెంకటేశ్ (కల్వకుర్తి) వంటి నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇలాంటి చేరికల ద్వారా అంతర్గత అసమ్మతికి చెక్ పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కని నేతలను కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా కూడా.. విపక్షాల ఎత్తుగడలను దెబ్బకొట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి జిల్లా మంత్రులు, నమ్మకస్తులైన నేతలకు కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ చేరికల ఆపరేషన్ను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు సమన్వయం చేస్తున్నారు. -
86 స్థానాల్లో ‘కారు’ ఖరారు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేసేందుకు పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు సన్నాహాలు చేస్తున్నారు. 86 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మంచిరోజు కావడంతో ఈ నెల 21న తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో 90 నుంచి 105 మంది పేర్లతో జాబితా వెలువడే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా 15%మంది సిట్టింగ్లకు టికెట్ లభించే అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వీరిలో కొందరు అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు సిట్టింగ్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు తదితరులను కలిసి ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. వీరికి చాన్సున్నా కొనసాగుతున్న కసరత్తు ఆర్మూర్, పెద్దపల్లి, హుజూరాబాద్, తాండూరు, నకిరేకల్, ఆసిఫాబాద్ సీట్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉన్నా.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరికపై సందిగ్ధత కొనసాగుతుండంతో సంగారెడ్డి అభ్యర్థి ఎంపిక కూడా కొలిక్కి రావాల్సి ఉంది. ► ములుగు, మధిర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జహీరాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, జగిత్యాల, చొప్పదండి, రామగుండం, నర్సాపూర్, ముషీరాబాద్, అంబర్పేట, కల్వకుర్తి, నాగార్జునసాగర్, కోదాడ, ఇల్లందు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లపై తొలి జాబితాలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ► సికింద్రాబాద్ కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, ఆసిఫాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పేర్లు సీఎం పరిశీలనలో ఉండటంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. ► మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుల పేర్లు ఖరారైనప్పటికీ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ► కాంగ్రెస్, టీడీపీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తుండటం కూడా అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. కమ్యూనిస్టులతో పొత్తు తేలితే రెండో జాబితా ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐతో బీఆర్ఎస్ ఎన్నికల పొత్తు కుదిరే సూచనలు ఉన్నాయి. అయి తే వారితో చర్చలకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో పాటు టికెట్ల కోసం నెలకొన్న తీవ్ర పోటీ, ఇతర పార్టీల నుంచి ఒకరిద్దరి చేరికలపై స్పష్టత వచ్చిన తర్వాత రెండో జాబితా విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. వేములవాడ, ఉప్పల్, స్టేషన్ ఘన్పూర్, జనగామ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులుగా పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే మునుగోడు, భద్రాచలం స్థానాలను వదిలేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. -
ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.. కుటుంబ పాలనను తరిమికొట్టండి: కిషన్రెడ్డి
సాక్షి, నల్గొండ: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. నకిరేకల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందన్నారు. గ్రామకంఠం భూములతో సహా, దళితులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారన్నారు. లిక్కర్ షాపుల్ని ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారు. కుటుంబ పాలనను తరిమికొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం పంపిణీ బీజేపీ పోరాట ఫలితమే’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ: రేవంత్రెడ్డి -
బీఆర్ఎస్లో 20 మందికిపైగా సిట్టింగ్లకు నో టికెట్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు పడటం ఖరారైందా? సుమారు 20–25 మందికి ఈసారి టికెట్ దక్కనట్టేనా? దీనిపై ఆయా ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారా..?.. ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ,ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్.. జాబితాను దాదాపు ఖరారు చేశారని స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. రెండు మూడు రోజుల్లో సుమారు 80–90 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నాయి. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు వివరిస్తున్నాయి. ఆ సంకేతాలతోనే భేటీలు! 20మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కదనే సంకేతాల నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరిపై వేటు పడుతుందన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. తమకు అవకాశం దక్కదనే సంకేతాలు అందుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. చివరి ప్రయత్నంగా కేసీఆర్తోపాటు కీలక నేతలు కేటీఆర్, హరీశ్రావు తదితరులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి సహకరించి, గెలుపు కోసం పనిచేయాలని.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం. పోటీ అవకాశం దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించడం, సర్దుబాట్లు, ఇతర నష్ట నివారణ చర్యలపైనా కీలక నేతలకు కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ నిరాకరణపై ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో తమ ప్రధాన అనుచరులు, కేడర్తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వేటుపడే సిట్టింగ్ల స్థానంలో అవకాశం దక్కిందనే సంకేతాలు అందుకున్న నేతలు.. ఆయా నియోజకవర్గాల్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. సిట్టింగ్ల అనుచరులు, క్షేత్రస్థాయి శ్రేణులతో భేటీ అవుతూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వేటు వెనుక కారణాలెన్నో.. గెలుపు అవకాశాలు, ఆరోపణలు, సామాజికవర్గ సమీకరణాలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బాబూమోహన్ (ఆందోల్), మల్కాజిగిరి (కనకారెడ్డి), ఎం.సు«దీర్రెడ్డి (మేడ్చల్), కొండా సురేఖ (వరంగల్ తూర్పు), సంజీవరావు (వికారాబాద్), బొడిగె శోభ (చొప్పదండి)లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక వారి పనితీరుతోపాటు నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కీలకంగా మారినట్టు సమాచారం. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల పట్ల ఎలాంటి ప్రతికూలతలు లేకున్నా.. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలు, బలాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి మార్పునకు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. స్థానిక కేడర్తో విభేదాలు, అవినీతి, బంధుప్రీతి తదితరాలతో పార్టీకి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరారు. వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కొత్తగా ఎవరు?.. మారేదెవరు? కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్కు టికెట్ ఇవ్వొచ్చనే అంచనా ఉంది. దీనితోపాటు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పల్లా రాజేశ్వర్రెడ్డి (జనగామ), లక్ష్మీకాంతరావు (వేములవాడ), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), బానోత్ మదన్లాల్ (వైరా)లకు కూడా కేసీఆర్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇక మంత్రులు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్నగర్), మల్లారెడ్డి (మేడ్చల్)లను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం భావిస్తే.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. – కమ్యూనిస్టులతో పొత్తు కుదరితే మునుగోడు (సీపీఐ), భద్రాచలం (సీపీఎం) వారికి కేటాయించవచ్చని.. తాండూరు, మానకొండూరు, పెద్దపల్లి, కామారెడ్డి తదితర నియోజకవర్గాలపై మలి జాబితాలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు.. కేసీఆర్పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్గొండ జిల్లా: ఓట్ల కోసమే కేసీఆర్ దళిత బంధు తెచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు గుప్పించారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని, బీసీ బంధు కూడా ఎన్నికల తర్వాత మాయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉన్నారన్న ఆయన కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడని దుయ్యబట్టారు. ‘‘బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పనులు చేయడం లేదు. సిద్దిపేటలో లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి నన్ను 10 సంవత్సరాలుగా ఏడిపిస్తవా. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని గ్రామాలకు సాగు నీళ్లు ఇస్తా. కుటుంబ పాలన పోతేనే పేదలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. కేసీఆర్ దళిత బంధు పథకం ఓట్ల కోసమే తెచ్చారు. దళిత బంధు పేరుతో రూ.10 లక్షల ఇస్తే అందులో 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారు’’ అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: కేసీఆర్ పక్కా ప్లాన్.. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. -
BRS Party: కారులో ‘సిట్టింగ్’ లొల్లి!..తెరపైకీ రోజుకో పంచాయితీ
సీన్ –1 హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా.. జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల నేతలు భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా.. ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఇవ్వాలంటూ వారు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లడం, అక్కడి నేతలతో వాగ్వాదం వంటివి జరిగాయి. అసమ్మతి భేటీకి వచ్చినవారిలో ముఖ్య నేతలెవరూ లేరని ముత్తిరెడ్డి ప్రకటించగా.. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పలువురు సర్పంచ్లు, ఇతర ప్రజా ప్రతినిధులు భేటీకి వచ్చినట్టు అసమ్మతి వర్గం తెలిపింది. సీన్ –2 మంథని నియోజకవర్గంలో.. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం పెట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరులకు ఎవరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పుట్టమధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామనీ ప్రకటించారు. ..అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల అనుచరులు బహిరంగంగానే ఈ వ్యతిరేకతను బయటపెడుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి, దేవరకొండ, చొప్పదండి, రామగుండం, నాగార్జున సాగర్, కోదాడ.. ఇప్పుడు జనగామ, మంథని.. ఇలా చాలాచోట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. వీటిపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు సన్నాహాలు చేస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీలో ‘లొల్లి’ రేపుతున్నాయి. సిట్టింగ్ స్థానాల్లో అసమ్మతులు, ఆశావహుల ప్రయత్నాలతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు నేరుగా కోరుతుండగా.. మరికొందరు తెర వెనుక అసమ్మతిని రాజేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, పైగా పోలీసు కేసులు, ఇతర రూపాల్లో వేధిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజా, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర గ్రామ, మండల స్థాయి క్రియాశీల నేతలు ఉంటుండటం గమనార్హం. అంతర్గత భేటీలే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ అసమ్మతిని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అసమ్మతి పెరిగితే నష్టమనే అంచనాతో.. పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్కు రాష్ట్రవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందనే నివేదికలు అందుతున్నట్టు సమాచారం. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు, సిట్టింగ్లు సహా చాలా మందిపై క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వస్తున్నాయని.. ఏకపక్ష ధోరణి, బంధుప్రీతి, అవినీతి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాల్లో జోక్యం, పోలీసు, రెవెన్యూ అధికారులతో సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిసింది. పార్టీ కేడర్ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను విశ్లేషించగా.. చాలాచోట్ల విభేదాలు సమసిపోలేదని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేసీఆర్ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ‘ఫీల్ గుడ్’ భావన ఉన్నా.. పార్టీ నేతల మధ్య కలహాలు నష్టం చేస్తాయని కేసీఆర్ ఆలోచనకు వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత త్వరగా టికెట్ కేటాయింపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా చెక్పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్హౌజ్లో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి తదితరులతో జరిపిన భేటీలో అసమ్మతుల కట్టడికి వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘‘వీలైనంత త్వరగా అభ్యర్థులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్ను కోరాం. సిట్టింగ్లకు ఇవ్వాలా, అవసరమైన చోట కొత్త వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆయనే చూసుకుంటారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ లో ఉండేదెవరో, వీడేదెవరో అన్నదానిపై స్పష్టత వస్తుంది. తద్వారా అసమ్మతి కట్టడి, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని కేసీఆర్కు వివరించాం’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలకు బాధ్యతలు అసమ్మతులు, అసంతృప్తుల సమస్యను చక్కదిద్దే పనిని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నేతలకు కేసీఆర్ అప్పగించినట్టు తెలిసింది. వేములవాడలో కేటీఆర్, హుస్నాబాద్, మెదక్, జహీరాబాద్లో హరీశ్రావు, రామగుండంలో కొప్పుల ఈశ్వర్, చొప్పదండిలో గంగుల కమలాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, బోధన్, జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, మానకొండూరులో మాజీ ఎంపీ వినోద్ ఇప్పటికే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వరుసగా.. అసంతృప్తి సెగలు! ► కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు టికెట్ కేటాయించవద్దంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్దాస్, జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు ఇటీవల సమావేశమై పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ► దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్కు టికెట్ ఇవ్వద్దంటూ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మరో 70 మంది ముఖ్య కార్యకర్తలు డిండి మండలం రుద్రాయిగూడంలో సమావేశమై తీర్మానించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తప్పించాలంటూ స్థానిక నేతలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేశారు. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏకమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకోవాలని నచ్చచెప్పినా.. అక్కడ అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ► నాగార్జునసాగర్, కోదాడ, మహబూబాబాద్, మహేశ్వరం, తాండూరు, ఉప్పల్, పెద్దపల్లి, ఇల్లందు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నారు. ► కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయనను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్కడ మరో బీసీకి అవకాశం ఇస్తారని, జూలూరి గౌరీ శంకర్ పేరు తెరపైకి వస్తోందని ప్రచారం జరుగుతోంది. ► రాష్ట్రవ్యాప్తంగా మరో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది. ‘పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దు’ ముత్తారం (మంథని): మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క, మాజీ జెడ్పీటీసీలు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతి, దుర్గం మల్లయ్య, బండం వసంతరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను పుట్ట మధు పట్టించుకోవడం లేదని, నియంత పోకడలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత ఎజెండాను మంథనిలో అమలుపరుస్తూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వవద్దని, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామన్నారు. జనగామ ‘టికెట్’ రాజకీయం! హైదరాబాద్ హరిత ప్లాజాలో ‘పల్లా’ క్యాంపు అసమ్మతి నేతలు జనగామ: జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ లొల్లి హైదరాబాద్కు చేరింది. బుధవారం ఇక్కడి బేగంపేటలోని హరిత ప్లాజాలో అసమ్మతి నేతల సమావేశం హాట్టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపుమేరకు.. జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగిందని, పల్లాకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్తో సీఎంను కలవాలని వారు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. వారికి సీఎం అపాయింట్మెంట్ కూడా దొరికిందని, ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూ హరిత ప్లాజాలో వేచి ఉన్నారని తెలిసింది. అయితే.. ఈ సమావేశం విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా సమావేశ గది తలుపులు తీసుకునిలోనికి వెళ్లిన ఆయనను చూసి.. అసమ్మతి నేతలు కొంత ఉలికిపాటుకు గురయ్యారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని నేతలను ఎమ్మెల్యే అడగడంతో.. మంత్రి హరీశ్రావును కలిసేందుకు వచ్చామని, రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముత్తిరెడ్డి స్పందిస్తూ.. ప్రగతిభవన్కు తీసుకెళ్తానని, తనతో రావాలని వారితో చెప్పగా, తాము విడిగానే కలుస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమయంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ‘పల్లా’కు అనుకూలంగా.. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డికి అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో భాగంగా నర్మెట పీఏసీఎస్ చైర్మన్ పెద్ది రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాగిళ్ల తిరుపతిరెడ్డి, చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ భర్త అంకుగాని శశిధర్రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పగిడిపాట సుగుణాకర్రాజు, జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్రెడ్డి, కొందరు సర్పంచ్లు, నాయకులు హరిత ప్లాజా భేటీకి వెళ్లినట్టు తెలిసింది. కాగా.. హోటల్లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లానే తప్ప, తానే నాయకులను తీసుకువచ్చినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. ఇలా చేయడం బాధాకరం: ముత్తిరెడ్డి జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు హరిత ప్లాజాకు వచ్చారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల అధ్యక్షులు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. అయినా అధిష్టానం ఇటువంటి చర్యలను క్షమించబోదన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారని.. ఇప్పుడిలా చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హరీశ్రావుతో ‘పల్లా’ వర్గం భేటీ! హరిత ప్లాజాలో భేటీ అయిన ‘పల్లా’ వర్గీయులు సాయంత్రం ప్రగతిభవన్లో మంత్రి హరీశ్రావును కలసి పరిస్థితిని వివరించారు. దీనిపై హరీశ్రావు స్పందిస్తూ.. జనగామ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని, మరో మూడు రోజుల్లో తేల్చేస్తామని చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డితో నెల రోజులక్రితమే మాట్లాడి.. ఆయన కుమార్తెతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా సరిదిద్దుకోక ఆయన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. -
ఆశీర్వదించండి!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నేడు నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాల్వలు, పచ్చని చేలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోంది. ఇరవైకి పైగా రిజర్వాయర్లతో తెలంగాణ పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. నాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు! పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దుఖం తన్నుకొస్తుంది. ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నలు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు. ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు. యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు. ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు. ఇలాంటి అగమ్యగోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఒక దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని సూచికలుగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1గా నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో తొలి స్థానంలో ఉంది. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.37 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించింది. కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ వక్ర భాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నా. సాగునీరు, వైద్యారోగ్య రంగంలో ప్రగతి మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినా కేసులు వీగిపోయాయి. పర్యావరణ అనుమతులు లభించాయి. స్వల్ప కాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి రాష్ట్రం చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీలను త్వరలోనే ప్రారంభించి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నాయి. అనాథ పిల్లలను ‘స్టేట్ చి్రల్డన్’గా గుర్తిస్తూ వారికోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం రూపొందించింది. విద్యారంగ వికాసం..ఐటీలో మేటి వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించాం. మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందిస్తున్నాం. టీఎస్ ఐపాస్ చట్టం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజం వచ్చింది. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రా్రష్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. 17.21 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి. త్వరలో ‘తెలంగాణ చేనేత మగ్గం’ దళితబంధు కింద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వ లైసెన్సు వ్యాపారాల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు, బీసీల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీలకు రూ.లక్ష సాయం, ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో గౌడలకు 15శాతం రిజర్వేషన్లు, గీతన్న, నేతన్నలకు రూ.5 లక్షల బీమా, నేత కార్మికులకు నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఫ్రేమ్ మగ్గాల పంపిణీకి ‘తెలంగాణ చేనేత మగ్గం’అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు, లబ్దిదారుల సంఖ్యను 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. లబ్దిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. దివ్యాంగుల పెన్షన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచాం. 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలను పొందుతున్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి పండుగల బోనస్గా రూ.1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నాం. వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్దీకరించాలని నిర్ణయించాం. హైదరాబాద్లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి రైతుబంధు సాయం సైతం అందించింది. పోడు కేసుల నుంచి విముక్తులను చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో తక్షణ సహాయంగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నాం. నగరం నలువైపులకూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం తగ్గుముఖం సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని, తలసరి ఆదాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సగటుతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. 2015–16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019–21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది. లక్ష్యం చేరని స్వతంత్ర భారతం 75 ఏళ్ల స్వతంత్ర భారతం గణనీయ ప్రగతి సాధించినా, ఆశించిన లక్ష్యాలు, చేరవల్సిన గమ్యాలను ఇంకా చేరలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల్లో పేదరికం తొలగిపోలేదు. వనరుల సంపూర్ణ వినియోగంతో ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత. అమర వీరులకు నివాళి గోల్కొండ కోటలో జెండావిష్కరణకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవానుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్, ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఇతర ఆర్మీ అధికారులు అమర సైనికులకు నివాళులర్పించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎంఓ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వరదల్లో ఉత్తమ సేవలకు 'పురస్కారాలు'
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సందర్భంగా విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన, అత్యుత్తమ సేవలందించిన పలువురు అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందజేశారు. వారి వివరాలు.. ► ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను అదే జిల్లాకు చెందిన ఎస్జీటీ పాయం వీనయ్య రక్షించారు. ► జనగామ జిల్లాకు చెందిన విద్యుత్ లైన్మెన్ ఎం.డి.రెహ్మాన్ వరదల్లో సైతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ధైర్య సాహసాలతో విధులు నిర్వహించారు. ► ములుగు జిల్లాకు చెందిన పంచాయతీ సెక్రటరీ సంజీవ్రావు ముత్యాలధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు. ► ములుగు జిల్లా జెడ్పీ సీఈఓ ప్రసన్నరాణి కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని జాగ్రత్తగా పర్యవేక్షించారు. ► భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆర్.ఎ.ఎస్.పి. లత వరదల్లో చిక్కుకున్న పలు గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ► భూపాలపల్లి జిల్లా రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి.ప్రదీప్ కుమార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు బోట్లు, హెలికాప్టర్ సేవలను సమర్థంగా వినియోగించి 100 మందికి పైగా ప్రజలను రక్షించి, వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అడిషనల్ కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి, రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల పంచాయతీ అధికారి ముత్యాలరావు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు. రక్షణ, పునరావాస చర్యలను సమర్థంగా నిర్వహించారు. ► భూపాలపల్లి జిల్లాలో సీఐ రామనరసింహారెడ్డి వరదల్లో చిక్కుకున్న ప్రజల తరలింపు, తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించడంతో పాటు, మరో మూడు మృతదేహాలను గుర్తించారు. ► భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పీఎస్ ఎస్ఐ నరేశ్ మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు. ► వరంగల్ జిల్లా మటా్వడ పీఎస్ ఏఎస్ఐ కె.సంపత్ తన బృందంతో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► ములుగు జిల్లాలో ఏఎస్ఐ జి.రాంబాబు మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించారు. ► ములుగు జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కె.శ్రీకాంత్ తన టీమ్తో కలిసి మేడారం వరదల్లో చిక్కుకున్న 19 మందిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► రాష్ట్ర సచివాలయంలో జీఏడీ శాఖలోని ఎన్ఆర్ఐ సెక్షన్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏడిగ చిట్టిబాబు ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యా ర్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్రను పోషించారు. కొన్నేళ్లుగా వేర్వేరు దేశా ల్లో ప్రాణాలు కోల్పోయిన 1,200 మంది వ్యక్తు ల మృతదేహాలను తెలంగాణకు తరలించడంలో ఆయా దేశాల ఎంబసీలు, కాన్సులేట్ అధికారులు, హైకమిషనర్లతో సమన్వయం, సంప్రదింపులు జరిపి, కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడంలో కీలక పాత్రను పోషించారు. -
17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్ఎస్ జంబో లిస్ట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కార్యాచరణను వేగవంతం చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఆయన.. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లిస్టును ప్రకటించనున్నట్టు తెలిసింది. సీఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో జంబో జాబితా ప్రకటించనున్నారని.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ తొలి జాబితాలోనే కనీసం 80–90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముందని బీఆర్ఎస్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తూ.. దుబ్బాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వంటి పలు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి రెండో జాబితాను ప్రకటించడంతోపాటు వామపక్షాలతో పొత్తుపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఇక కాంగ్రెస్కు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నెల 17న లేదా 18న బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైందని.. తొలి జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ మరోమారు గజ్వేల్ నుంచే పోటీ చేయడం కూడా ఖాయమైనట్టు పేర్కొన్నాయి. కేటీఆర్, హరీశ్లతో సుదీర్ఘ మంతనాలు గత మూడు రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన కేసీఆర్.. అభ్యర్థుల ఎంపిక, పార్టీ ఎజెండా, మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై లోతుగా కసరత్తు చేసినట్టు తెలిసింది. శనివారం యాదాద్రి జిల్లా పోచంపల్లి పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్రావు ఇద్దరూ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో సాయంత్రానికల్లా ఫామ్హౌజ్కు చేరుకున్నారు. వీరంతా శనివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఇందులో అభ్యర్థుల ఎంపిక వంటి పార్టీ అంశాలతోపాటు రైతు రుణమాఫీ, బీసీ బంధు, ఉద్యోగుల పీఆర్సీ వంటి ప్రభుత్వపర అంశాలపైనా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పాలన, పారీ్టపరమైన పలు అంశాలపై ఇద్దరు కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. 19న మెదక్, 20న సూర్యాపేటకు కేసీఆర్ సీఎం కేసీఆర్ ఈనెల 19, 20 తేదీల్లో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. 19న శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు. 20న ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ ఆఫీసు, మెడికల్ కాలేజీ కొత్త భవనాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అక్కడ కూడా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఐదు బిల్లులకు ఆమోదం
ఇవాళ ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ. 1, టిమ్స్ ఆసుపత్రుల బిల్లు. 2, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు. 3, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు. 4, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు. 5, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. ► బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేసీఆర్ సర్కార్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా.. హస్తం నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ► సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంచివారే. ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించారని కేసీఆరే చెప్పారు. రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ లేదు.. ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అని అన్నారు. ► కాంగ్రెస్.. ఎక్స్పైర్ అయిన మందు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు లెక్కలు రావు. కాంగ్రెస్కు విశ్వసనీయత పోయింది. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మాకు కట్టడం మాత్రమే తెలుసు. విపక్షాలకు కూలగొట్టడం ఒక్కటే తెలుసు. ► కాంగ్రెస్లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు. ఆ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులని ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమయ్యాయన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ► అలాగే, తాము ప్రధాని మోదీకి భయపడలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు. ► పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. ► మంత్రి తలసాని కూడా భట్టికి కౌంటరిచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. ► కొల్లూరు డబుల్ బెడ్రూం సముదాయంలో ఇళ్లు చూస్తే కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతాయని ఎద్దేవా చేశారు. సాక్షి, హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం మరో మూడు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
ఎలక్షన్.. యాక్షన్! మార్చి నుంచే ప్లాన్ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎన్నికల కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచుతున్నారు. కరోనా, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పటివరకు అమలు చేయని పలు పథకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులపై నిశిత పరిశీలనతో ఖరారు చేసుకున్న వ్యూహాలను ఒకటొకటిగా అమలు చేస్తున్నారు. తద్వారా ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలకు చెక్ పెట్టాలని, రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంశాలతో పాటు విపక్షాలు ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించేందుకు అవకాశమున్న సమస్యలపై వెంటనే స్పందిస్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. వారిని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి నుంచే ఎలక్షన్ మోడ్ కేసీఆర్ ఈ ఏడాది మార్చి నుంచే పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు ఇతర మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్కుమార్ వంటి సుమారు డజను మంది కీలక నేతలకు ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున సమన్వయ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సిన కార్యాచరణపై నిత్యం దిశా నిర్దేశం చేస్తున్నారు. పెండింగ్ అంశాలపై స్పీడ్గా.. తాజాగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంశాలతో పాటు విపక్షాలు ఎన్నికల అస్త్రాలుగా ప్రయోగించేందుకు అవకాశమున్న సమస్యలపై సీఎం శరవేగంగా స్పందిస్తున్నారు. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు రుణమాఫీని మాస్టర్ స్ట్రోక్గా బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు. సీఎం నిర్ణయంతో విపక్షాలకు గొంతు లేకుండా పోయిందని వారంటున్నారు. ఇక వికలాంగుల పింఛను పెంపు, బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష చొప్పున ఆర్దిక సాయం, గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్, నోటరీ భూముల రిజిస్ట్రేషన్, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ వంటి మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ఇటీవలి కాలంలోనే తీసుకున్నారు. వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, ప్రభుత్వలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి నిర్ణయాలు సైతం తీసుకున్న కేసీఆర్.. త్వరలో ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతిపై సంచలన నిర్ణయం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సామాజిక పింఛన్ల పెంపు, హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపైనా స్పష్టత నివ్వడంపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి చెల్లింపు అంశం మినహా విపక్షాలకు ఏ ఒక్క ప్రచార అస్త్రం దొరక్కుండా చేయాలన్నదే కేసీఆర్ వ్యూహమని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రకటనలను ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనువుగా మలుచుకునేందుకు క్షేత్ర స్థాయిలో సంబురాలు నిర్వహించాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, కేడర్కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల సమీకరణపైనా స్పెషల్ నజర్ రుణమాఫీ, రైతుబంధు చెల్లింపుల్లాంటివి సెప్టెంబర్ మూడో వారంలోగా పూర్తి చేసేందుకు వీలుగా నిధుల సమీకరణపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రుణాలు, గ్రాంట్ల ద్వారా నిధులు వచ్చే అవకాశం లేకపోవడంతో అంతర్గత ఆదాయాన్ని నిర్దేశిత గడువులోగా రాబట్టాలని ఆర్థిక శాఖకు లక్ష్యం నిర్దేశించారు. నిధుల సేకరణ సమన్వయ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్కు అప్పగించినట్లు తెలిసింది. ఇలా రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు మూడు నెలల ముందుగానే మద్యం దుకాణాల వేలం, నోటరీ భూముల రిజిస్ట్రేషన్, హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలం వంటివి చేపట్టడం ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఎన్నికల సమయంలో ప్రజల్లో వ్యతిరేకత, విపక్షాల విమర్శలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టికెట్లు, చేరికలపై కసరత్తు సొంత సర్వేలు, ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాలు, బలహీనతలపై కేసీఆర్ అంచనాకు వచ్చారు. సుమారు 15 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం, గెలుపు గుర్రాల అన్వేషణ, ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకోవడం వంటి అంశాలపై తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరోక్షంగా అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసంతృప్త నేతలను ఖాళీగా ఉన్న పదవుల్లో సర్దుబాటు చేయడంపైనా కసరత్తు జరుగుతోంది. టికెట్ల రేసులో ఉన్న సుమారు అరడజను మంది ఎస్సీ సామాజికవర్గం నేతలతో త్వరలో ఎస్సీ కమిషన్ను కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ నేతకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దాదాపు ఖాయమైందని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వరద నష్టం వంటి అంశాలపై జరిగే చర్చల్లో స్వయంగా సమాధానం ఇవ్వడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. -
రుణమాఫీ మళ్లీ షురూ.. గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా, కేంద్రం వైఖరితోనే ఆలస్యం ‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించాం. అయితే కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం రాష్ట్రం పట్ల అనుసరించిన కక్షపూరిత వైఖరి తదితర కారణాల వల్ల ఏర్పడిన ఆర్థిక లోటుతో.. రుణ మాఫీ ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైంది. కానీ రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే వస్తోంది. మేం ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. రైతు సాధికారత సాధించే వరకు, రైతులను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు..’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని తెలిపారు. బకాయిలు చెల్లించినా మాఫీ వర్తింపు! లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటివరకు రూ.36 వేల వరకు బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన వారికీ మాఫీ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద తీసుకున్నాయి. మరోవైపు కొత్త రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించినట్టైతే తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొందరు రైతులు సొంతగా బ్యాంకులకు చెల్లింపులు చేశారు. కొందరు మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. కాగా కొత్త రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రుణం చెల్లించిన రైతులకు సైతం ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రైతుల జాబితా ప్రకారమే సొమ్మును వారివారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.రూ.19 వేల కోట్ల చెల్లింపుతో రూపాయి కూడా మిగలకుండా తెలంగాణలో సంపూర్ణ ‘రైతు రుణమాఫీ’కార్యక్రమం పూర్తి కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 42 లక్షల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ జరగనుంది. తద్వారా 29.61 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రైతుబంధు తరహాలో విడతల వారీగా.. ► రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలా పదిహేను రోజుల్లో, సెపె్టంబర్ రెండో వారం వరకు రైతు రుణమాఫీ కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే పునఃప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరి్వంద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కేటీఆర్కు పిండ ప్రదానం.. రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉప్పల్ పర్యటనలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరణించిన కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. మున్సిపల్ మంత్రికి పిండప్రదానం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వరదలపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టిపెట్టారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ బర్త్డే పార్టీల్లో మునిగిపోయారు అంటూ రేవంత్ మండిపడ్డారు. ‘‘వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలతో 30 మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్కు బుద్ధి రాలేదు’’ అని ధ్వజమెత్తారు. చదవండి: బండి బలమేంటో కమలానికి తెలిసొచ్చిందా? ‘‘సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి. లేకపోతే సోమవారం పార్లమెంట్లో నితిన్ గడ్కరీకి నివేదిస్తాం. వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్రెడ్డిపై ఉంది. వెంటనే ప్రధానిని కిషన్రెడ్డి కలిసి నిధులు తీసుకురావాలి. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట’’ అంటూ రేవంత్రెడ్డి నిప్పులు చెరిగారు. -
సీఎం కేసీఆర్ దూకుడు.. ఆగస్టులో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. అభ్యర్థులపై గులాబీ బాస్ కసరత్తు ప్రారంభించారు. ఆగస్టులో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నేతల చేరిక తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశముంది. మొదటి విడతలో గెలుపు గుర్రాల మొదటి జాబితా బీఆర్ఎస్ అధినేత సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. చదవండి: కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.. మొదటి జాబితాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. -
Telangana: వీఆర్ఏ వ్యవస్థ రద్దు
మానవీయ కోణంలో నిర్ణయం కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా.. 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్ఏ జేఏసీ మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్ వీఆర్ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఆసరా పింఛన్ రూ.3,016?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న పథకాల్లో లబ్ధిని పెంచడం, కొత్త పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించారు. ఆసరా పింఛన్లను మరో రూ.వెయ్యి మేర పెంచడం నుంచి స్థలాలున్న పేదలు సొంతిల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలిచ్చే ‘గృహలక్ష్మి’ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడం దాకా కీలక అంశాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ మేని ఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్నారని అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే కొన్ని కొత్త పథకాల అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని పేర్కొంటున్నాయి. ప్రతిపక్షాలకు దీటుగా ఉండేలా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యువత, రైతు డిక్లరేషన్లను ప్రకటించింది. ఇతర వర్గాలను ఆకట్టుకునే హామీలు, డిక్లరేషన్లపై కసరత్తు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పలు రకాల హామీలను గుప్పిస్తోంది. ప్రజలను ఆకట్టుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రకటించే హామీలు, మేనిఫెస్టోలకు దీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండేలా ప్రణాళిక రూపొందుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేయడం కేసీఆర్ ప్రభుత్వ ప్రత్యేకత అని, ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం. మైనారిటీ వర్గాలకు రూ.లక్ష ఆర్థిక సాయం రాష్ట్రంలో దళితులకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక చేయూతను అందించే దళితబంధు పథకం 2021లో ప్రారంభమైంది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ.. రెండో విడతలో రాష్ట్రంలో 1.30లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇదే తరహాలో వెనుకబడిన తరగతుల్లో కులవృత్తులపై ఆధారపడిన 3 లక్షల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇక సొంత జాగా కలిగిన పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘గృహలక్ష్మి’ లబ్ధిదారుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. తాజాగా మైనారిటీ వర్గాల వారికి కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆకట్టుకునేలా.. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి సవరణ వేతన కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల మేరకు 2018 జూన్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ జరిగింది. తొలి పీఆర్సీ గడువు గత నెలలోనే ముగిసింది. రెండో పీఆర్సీ ఏర్పాటు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో వీరిని ఆకట్టుకునేలా త్వరలో రెండో పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ అయి, మధ్యంతర భృతిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన విధంగా.. ఎన్నికల వేళ గ్రామాల వారీగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడిస్తున్నాయి. -
ఆగస్టు 1న మహారాష్ట్రకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు ఆగస్టు 1న మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, రచయిత అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అన్నాభావు జన్మించిన సాంగ్లి జిల్లాలోని వటేగావ్లో ఆయన చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా సాఠే కోడలు, మనవడితో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్లో చేరతారు. స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే మాంగ్ లేదా మాతంగ్గా పిలిచే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. ఇలావుండగా అదే రోజు మధ్యాహ్నం కొల్హాపూర్లోని అంబాబాయి (మహాలక్ష్మీ) దేవాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ఒకటి రెండురోజుల్లో పూర్తి షెడ్యూల్ వెలువడుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సోలాపూర్ సభ వాయిదా బీఆర్ఎస్ సత్తా చాటేలా ఈనెల 30న సోలాపూర్లో సుమారు మూడు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ తొలుత ప్రణాళిక రూపొందించారు. సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి హరీశ్రావుకు అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే వర్షాలు కురుస్తుండటం, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సోలాపూర్ సభను వచ్చే నెలకు వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. సాంగ్లి, కొల్హాపూర్ పర్యటన ముగిసిన తర్వాత వచ్చే నెలలో సోలాపూర్తో పాటు పుణేలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 జిల్లాలు, 27 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్కు క్షేత్ర స్థాయి వరకు నిర్మాణం జరిగినట్లు సమాచారం. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షల మంది క్రియాశీల సభ్యులు (పదాధాకారులు) చేరగా, ఇందులో 6 లక్షల మంది ఆన్లైన్లో, 9 లక్షల మంది ప్రత్యక్షంగా సభ్యత్వం స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో జనరల్, మహిళ, రైతు, యువత, కార్మిక తదితర విభాగాలకు సంబంధించి తొమ్మిది కమిటీల చొప్పున ఏర్పాటయ్యాయి. త్వరలో క్రియాశీల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎంపీలు, సుమారు డజను మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకోగా, వందల సంఖ్యలో సర్పంచ్లు, పదుల సంఖ్యలో జిల్లా పరిషత్ సభ్యులు పార్టీలో చేరినట్లు స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ సిట్టింగ్ ఎంపీ చేరే అవకాశం? మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతను అనుకూలంగా మలుచుకుని పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్న కేసీఆర్తో.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీలో చేరికలపై సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ కూడా ఇటీవల కేసీఆర్తో భేటీ అయ్యారు. జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీల చేరికల కోసం జరుపుతున్న సంప్రదింపుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. -
నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. తన కేబినెట్ సహచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా ఉమ్మడి జిల్లాల వారీగా జరుపుతున్న సమావేశాల్లో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సర్వే సంస్థలు, నిఘావర్గాల ద్వారా అందిన నివేదికలు, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ఇన్చార్జిలు ఇచ్చిన రిపోర్టుల్లోని అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర కీలక నేతల పనితీరు, నియోజకవర్గ స్థాయిలో వారి నడుమ సమన్వయ లోపం వంటి అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి కారణంగా చాలాచోట్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఈ భేటీల్లో వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల పార్టీ నేతలు గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేసీఆర్కు మంత్రులు తెలిపారు. కాగా పార్టీకి నష్టం చేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి, వారి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై కూడా ఈ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది. అవసరమైన చోట చేరికలకు గ్రీన్ సిగ్నల్ సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై మాత్రం ఈ భేటీల్లో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని భావించే అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీలోనే ఉండేట్టుగా చూడటంతో పాటు ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నేతలతో సంప్రదింపులు జరపాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులకే పరిమితం కాకుండా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్టీ మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై మంత్రుల నుంచి సీఎం అభిప్రాయాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై తన అభిప్రాయాలను కూడా ఈ భేటీల్లో కేసీఆర్ వెల్లడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, కీలక నేతలకు కేటీఆర్ క్లాస్ సీఎం కేసీఆర్ ఇలా మంత్రులతో వరుస భేటీలు జరుపుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు.. పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతుండటం, టికెట్ను ఆశిస్తున్న నేతల నడుమ ఆధిపత్య పోరుపై ఆయన దృష్టి సారించారు. వివాదాస్పద ప్రకటనలు, పనులతో తరచూ వార్తలకెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేటీఆర్ తరఫున ఫోన్లు వెళ్తున్నాయి. ఈ మేరకు ప్రగతిభవన్కు వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్ సీరియస్గా క్లాస్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, రోహిత్రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు ప్రగతిభవన్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. టికెట్ల కేటాయింపు అంశం అధినేత కేసీఆర్ చూసుకుంటారని, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కేసీఆర్ మంగళవారం లేదా బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. -
టీ కాంగ్రెస్లో ‘సీఎం సీటు’పై మాణిక్రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడుతోందని, అది కేసీఆర్కి నచ్చడం లేదని, అందుకే కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. కేసీఆర్ పదేళ్ల పాటు తన కుటుంబం బాగు కోసమే పని చేశాడు. తెలంగాణలో పంటల బీమాకు దిక్కు లేదు. రైతు రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. 24 గంటల ఉచిత కరెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం’’ అని ఠాక్రే వెల్లడించారు. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! ‘‘తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకు కొదవలేదని, మాది కేసీఆర్లా కుటుంబ పార్టీ కాదు. రేవంత్, ఉత్తమ్, భట్టీ, మధు యాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక ఉంటుంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదు’’ అని ఠాక్రే తెలిపారు. -
సీఎం కేసీఆర్ నిర్ణయం.. వారంలోగా వీఆర్ఏల సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)ను వారి సేవలు విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. వారిని నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ ఏల సర్దుబాటు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్కమిటీ వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. ఉప సంఘం సూచనల ప్రకారం వీఆర్ఏల సేవల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదే శించారు. ఉప సంఘం తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించారు. లక్ష్యాలు సాధిస్తే క్రమబద్ధీకరణ నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిబంధనల మేరకు పరిశీలించి క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, నిర్దేశిత లక్ష్యాల్లో మూడింట రెండో వంతు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతోపాటు పలు రకాల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును కేసీఆర్ ఆదేశించారు. వారి పాత్ర అభినందనీయం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ కోటా చాన్స్ ఎవరికో..? 20 మంది ఆశావహులు.. ఆ ఇద్దరు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: సుమారు నెలన్నరకు పైగా ఖా ళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ప్రక్రియపై బీఆర్ఎస్ అధి నేత, సీఎం కె.చంద్రశేఖర్రావు కసరత్తు చేపట్టారు. అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపాదనలు పంపడంపై దృష్టి సారించారు. ఇద్దరి పేర్లను వారం రోజుల్లో నే గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశ ముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 27న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వీరి స్థానంలో ఎవరినీ నామినేట్ చేయకపోవడంతో సుమారు నెలన్నర రోజులుగా ఈ రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో ఆశావహులు మైనార్టీ వర్గానికి చెందిన ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్ ఇద్దరూ తమకు మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు క్రిస్టియన్ మై నారిటీ వర్గానికి చెందిన రాయిడిన్ రోచ్.. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలు సంఘాలు చేసిన తీర్మానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తున్నారు. వీరితో సుమారు 20 మంది నేతలు ఎమ్మె ల్సీ పదవులను ఆశిస్తుండగా పలువురి పేర్లు ముఖ్య మంత్రి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, దాసోజు శ్రవణ్, పీ ఎల్ శ్రీనివాస్ తదితరుల పేర్లకు సంబంధించి వడ పోత జరుగుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నా యి. 40 మంది సభ్యులున్న శాసనమండలిలో ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మినహాయిస్తే ఇప్పట్లో ఇతర కోటాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం లేదు. సుమారు మూడొంతులకు పైగా మండలి సభ్యులు 2027 నుంచి 2029 మధ్యకాలంలో ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోను న్నారు. వచ్చే ఏడాది ఒక్క ఖాళీ కూడా ఏర్పడే అవ కాశం లేకపోగా, 2025లో మాత్రం కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, టి.జీవన్రెడ్డి పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గట్టి పోటీ నెలకొందని, ఈ కారణంగానే సీఎం కేసీఆర్ వీటి భర్తీ విషయంలో నెలన్నర రోజులుగా తాత్సారం చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో మండలికి కూచుకుళ్ల గుడ్బై! బీఆర్ఎస్ నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి త్వరలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతు న్నారు. కూచుకుళ్ల కుమారుడు నాగర్కర్నూల్ అసెంబ్లీ టికెట్ను ఆశిస్తుండటం, సిట్టింగ్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కూచుకుళ్ల కుమారుడు ఇప్పటికే రాహుల్ సమ క్షంలో కాంగ్రెస్లో చేరగా, ఈనెల 20న కొల్లా పూర్లో జరిగే ప్రియాంకాగాంధీ సభలో ఆయ న కూడా చేరనున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కూచుకుళ్ల భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈ ఏడాది చివర్లో కాని, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ ఖాళీ భర్తీకి ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. -
ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతోందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహా రాలు, సంస్కృతులు కలిగి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని తేల్చిచెప్పారు. అందులో భాగంగా యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమైంది. యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసింది. దేశ ప్రజల అస్థిత్వానికి, వారి తరతరాల సాంప్రదాయ, సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆరోపించింది. ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కె.తారకరామారావు పాల్గొన్నారు. పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం... ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా, బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకే యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొనిపోతూ యూసీసీ బిల్లుపై పోరాడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావుకు సూచించారు. కాగా దేశంలోని గంగా జమున తహజీబ్ను రక్షించేందుకు ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను సీఎం కేసీఆర్కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ధన్యవాదాలు తెలిపింది. ఏపీ సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తాం: అసదుద్దీన్ ఉమ్మడి పౌర స్మృతి వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు, గిరిజనులతో పాటు హిందూవులకు కూడా మంచిది కాదని చెప్పారు. హిందూ వివాహ చట్టం రద్దు అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఏపీ సీఎంకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. -
ప్రధాని మోదీ వరంగల్ టూర్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ వరంగల్ టూర్ను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ, కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. మోదీ పర్యటనకు తాము వెళ్లమంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నామని, తెలంగాణపై విషం చిమ్ముతున్న వ్యక్తి ప్రధాని మోదీ అంటూ మండిపడ్డారు. గుజరాత్లో రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి తెలంగాణకి రూ.520 కోట్లతో ఏదో దిక్కుమాలిన ఫ్యాక్టరీ ఇస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి కాబట్టే మోదీని ఒక్కమాట అనడు. రేవంత్రెడ్డివి పిచ్చిమాటలు. రాహుల్గాంధీ ఏ హోదాలో రూ.4వేల పెన్షన్ ప్రకటించారు. 50 ఏళ్లు తెలంగాణను పీక్కుతిన్నారు. ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు’’ అంటూ మంత్రని కేటీఆర్ నిప్పులు చెరిగారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. విపక్షాల విమర్శలను ఉపేక్షించకూడదని, విరుచుకుపడే విధానాన్ని అవలంబించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తూ.. ఇరు పార్టీల విధానాలను, అనుసరిస్తున్న పంథాను ఎండగట్టాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ! ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ను అనవసరంగా విమర్శిస్తూ, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎదురుదాడి చేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నారని వివరిస్తున్నాయి. -
'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ!
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. విపక్షాల విమర్శలను ఉపేక్షించకూడదని, విరుచుకుపడే విధానాన్ని అవలంబించాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తూ.. ఇరు పార్టీల విధానాలను, అనుసరిస్తున్న పంథాను ఎండగట్టాలని అభిప్రాయానికి వచ్చారు. ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ను అనవసరంగా విమర్శిస్తూ, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎదురుదాడి చేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నారని వివరిస్తున్నాయి. ‘ఏ టీం, బీ టీం’పై ఆగ్రహం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పరస్పరం తలపడాల్సిన కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేసీఆర్ సీరియస్గా పరిగణిస్తున్నారు. బీఆర్ఎస్ను ‘ఏ టీం’, ‘బీ టీం’ అంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను నిలువరించకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ను జతచేస్తూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న బీఆర్ఎస్ ప్రభావాన్ని నిలువరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ తమను లక్ష్యంగా చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలను ఏకకాలంలో ఇరుకున పెట్టేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో దూకుడుగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అనేక అంశాల్లో కాంగ్రెస్, ఇతర విపక్షాలతో కలసి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. మళ్లీ ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్లకు సమదూరం పాటిస్తూ బీఆర్ఎస్ గొంతు వినిపించేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దీనికి సంబంధించి వచ్చే వారం బీఆర్ఎస్ ఎంపీలతో భేటీ నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపేలా తమ కార్యాచరణ ఉంటుందని పార్టీ ఎంపీ ఒకరు వెల్లడించారు. విపక్షల్లోని అసంతృప్త నేతలకు గాలం..! బీఆర్ఎస్లోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు జాతీయ పార్టీల్లోని సంస్థాగత లోపాలను అనువుగా మలుచుకోవాలని.. అసంతృప్త, అసమ్మతి నేతలకు గాలం వేసి, పార్టీ చేర్చుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఆదేశాల మేరకు కీలక నేతలు పలువురితో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్, భిక్షమయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి పల్లె రవికుమార్ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన రాకను నిరసిస్తూ సంబంధిత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కేడర్ సమావేశమై తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేశారు కూడా. గతంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్లో చేరి, ఎంపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారిన నేత కూడా బీఆర్ఎస్లో చేరడం ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. సదరు నేతకు పెద్దపల్లి లోక్సభ స్థానం లేదా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామనే హామీ బీఆర్ఎస్ నుంచి వచ్చినట్టు సమాచారం. ఇదే తరహాలో మరికొందరు నేతలపైనా బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టు తెలిసింది. ప్రధాని మోదీ పర్యటనపై ఫోకస్ ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్కు రానున్న నేపథ్యంలో.. బీజేపీ, కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలను లేవనెత్తనున్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల ద్వారా ప్రధానికి ప్రశ్నా్రస్తాలు సంధించనున్నారు. ప్రధాని పర్యటన ముందు, తర్వాత బీజేపీపై ఎదురుదాడిని తీవ్రం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
సొంతంగా ఎదుగుతాం.. కలిసొస్తే ఆదరిస్తాం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఏ ఇతర పార్టీకి ఏ టీమో, బీ టీమో కాదని.. భారత్లో గుణాత్మక మార్పు కోసం సొంతంగా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీ మినహా ఇతర భావసారూప్య పార్టీలను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం రాష్ట్రానికి వచ్చిన యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాల గురించి సుమారు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం. పట్నా సమావేశం వివరాలపై.. అఖిలేశ్ యాదవ్ గత నెల 23న బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీలో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్కు వివరించారని తెలిసింది. బీఆర్ఎస్ సహా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని తాము బలంగా కోరుకుంటున్నామని చెప్పారని.. పట్నా భేటీలో పలువురు నేతలు ఈ విషయాన్ని నొక్కి చెప్పారని వివరించినట్టు సమాచారం. బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే పట్నా సభకు తాము హాజరుకాబోమని తేల్చి చెప్పామంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దీనితో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానాల వల్లే బీజేపీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. రాహుల్ గాంధీ పరిణతి లేని వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ మరింత పలుచన అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. యూపీలో సమాజ్వాదీ చీలికకు కుట్ర! మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎన్సీపీని చీల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు కేసీఆర్, అఖిలేశ్ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. మహారాష్ట్ర తరహాలో యూపీలో సమాజ్వాదీ పార్టీని చీల్చి, విపక్షాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అఖిలేశ్ పేర్కొన్నట్టు సమాచారం. దీనితో గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించగా, తాము అడ్డుకున్నామని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. జాతీయ స్థాయికి బీఆర్ఎస్.. ఇక ఈ నెల మూడో వారంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగే విపక్షాల భేటీ అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే మహారాష్ట్రలో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్నారు. నాగ్పూర్ నుంచి షోలాపూర్ దాకా బీఆర్ఎస్ నిర్వహించిన సభలకు మంచి స్పందన వచ్చింది. మధ్యప్రదేశ్లోనూ మా పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. త్వరలోఅక్కడ పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒడిశాలో మాజీ సీఎం కూడా బీఆర్ఎస్లో చేరారు. పార్లమెంటు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతుంది. ఆ దిశగా మేం సాగిస్తున్న ప్రస్థానంలో కలసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొనిపోతాం’’ అని అఖిలేశ్కు కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అఖిలేశ్కు ఘన స్వాగతం...వీడ్కోలు యూపీలోని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్ యాదవ్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్కు చేరుకున్న అఖిలేశ్కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తర్వాత జరిగిన లంచ్ భేటీలో కేసీఆర్, అఖిలేశ్లతోపాటు మంత్రులు వేముల, తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎస్.వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత సాయంత్రం 5.15కు అఖిలేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో బయలుదేరగా.. విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్సీ వీడ్కోలు పలికారు. -
కష్టంలోనే కాళేశ్వరం విలువ తెలిసేది
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీఎంసీ నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిర్విరామంగా 24 గంటలూ నడిపించాలి. సుందిళ్ల నుంచి అంతే నీటిని మధ్య మానేరుకు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని దిగువ మానేరుకు, సగం నీటిని పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యాపేటలోని చివరి ఆయకట్టు చినసీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బంది చర్యలు చేపట్టాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఆదివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో, అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని నొక్కిచెప్పారు. ‘ఇన్ని రోజులు ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. ఇది నీటిపారుదల శాఖకు పరీక్షా సమయం’అని వ్యాఖ్యానించారు. పాలేరు రిజర్వాయర్కు నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చుక్క చుక్కనూ ఒడిసిపట్టాలి... తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు ఈ మేరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా చుక్కచుక్కనూ ఒడిసిపట్టి ప్రజలకు నీటిని అందించాలన్నారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిపారుదల, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు. మళ్లీ విత్తనాలు, ఎరువుల పంపిణీకి ప్రణాళిక... ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, ఇతర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకొనే పరిస్థితులున్నాయని ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖను కేసీఆర్ ఆదేశించారు. సంక్షోభంలో సైతం పంటలు పండించి చూపాలి... ‘ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి’అని సీఎం స్పష్టం చేశారు. తాగునీటి సమస్య రాకూడదు.. రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి కొరత ఉందని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పంపింగ్ నిర్వహణ జెన్కోకు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్కోకు ఇచ్చేలా విధివిధానాల ఖరారుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడాలి... ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు, రైతాంగం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల సూచనలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులను కోరారు. -
విడివిడిగా... కలివిడిగా.. పక్కా ప్లాన్తో కేసీఆర్.. ఆ సిట్టింగ్లకు టికెట్లు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా రాజకీయ స్థితిగతులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, సంస్థాగత బలాలు, బలహీనతలు మదింపు చేస్తున్నారు. అలాగే విపక్ష పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేల అనుకూలతలు, ప్రతికూలతలపైనా లెక్కలు వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గాలవారీగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు, జూన్ 2 నుంచి 21 రోజులపాటు జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారు. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు, సొంత ప్రయోజనాల కోసం తలనొప్పులు సృష్టిస్తున్న వారి జాబితా కూడా కేసీఆర్ చేతికి అందినట్లు సమాచారం. ప్రభుత్వ నిఘా వర్గాలతోపాటు వివిధ సర్వే సంస్థలు, పార్టీ జిల్లా ఇన్చార్జీల నుంచి అందిన నివేదికలను క్రోడీకరించి నియోజకవర్గాలవారీగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ ఎమ్మెల్యేల బృందాలతో భేటీ అవుతున్న కేసీఆర్... సందర్భాన్ని బట్టి కొందరిని విడిగా కూడా ప్రగతి భవన్కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. జిల్లా పర్యటనల సందర్భంగా ఆశావహులు, ఇతరత్రా ముఖ్యులను కూడా ప్రగతి భవన్కు వచ్చి కలవాల్సిందిగా కేసీఆర్ సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలు, ప్రాంతాలు, రంగాలవారీగా అపరిష్కృత సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు, సర్దుబాట్ల వంటి అంశాలకు కూడా కేసీఆర్ ఎన్నికల వ్యూహంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల కేటాయింపు కసరత్తు కొలిక్కి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా సుమారు 15–20 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. టికెట్ ఖాయమైన వారు చురుగ్గా పనిచేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. మన్నె క్రిషాంక్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్), కొత్త ప్రభాకర్రెడ్డి (దుబ్బాక), చలిమెడ లక్ష్మీనర్సింహరావు (వేములవాడ) తదితరులకు ఈ తరహా సంకేతాలు అందినందునే పూర్తిస్థాయిలో ఎన్నికలు లక్ష్యంగా పనిచేసుకుంటున్నారు. ఖమ్మంలో తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్తోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు బీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో ఎన్నికలు సమీపించేకొద్దీ బీఆర్ఎస్ నుంచి ఈ తరహా వలసలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి నేతలతోపాటు గ్రామస్థాయి నుంచి అవసరమైన చోట చేరికలు ఉండేలా చూసుకోవాలని పార్టీ అధినేత సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు, అసంతృప్తులు, వారి ప్రభావం చూపే ఓటు బ్యాంకు తదితరాలపై ఇప్పటికే కేసీఆర్ వద్ద సమాచారం ఉంది. దీంతో ఎన్నికలు సమీపించే నాటికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో అధినేత ఉన్నారు. అరడజను సీట్లపై చివరి వరకూ సస్పెన్స్? అభ్యర్థుల ఎంపికలో విపక్షాల ఎత్తుగడలు, టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి తదితరాలను దృష్టిలో పెట్టుకొని కనీసం అరడజను స్థానాల్లో చివరి నిమిషం వరకు బీఆర్ఎస్లో సస్పెన్స్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల పేరిట జూన్లో విస్తృతంగా జిల్లా పర్యటనలు చేసిన కేసీఆర్ జూలైలోనూ ఈ తరహా సభలు, సమావేశాల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో భాగంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. వామపక్షాలకు చెరో రెండు సీట్లు! అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో అవగాహన ఉంటుందని సీపీఐ, సీపీఎం ఉమ్మడి ప్రకటన నేప థ్యంలో వారికి కేటాయించే సీట్ల సంఖ్య, నియోజ కవర్గాల పేర్లపై బీఆర్ఎస్లో ఆసక్తి నెలకొంది. అయితే కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుకొని చెరో రెండు స్థానాలకు మించి ఇచ్చే అవకాశాల లేవని సమాచారం. అసెంబ్లీ టికెట్లకు బదులుగా శాసనమండలిలో చోటు కల్పించేందుకే కేసీఆర్ సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత శాసనసభలో ప్రాతినిధ్యం లేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టే ఉద్దేశంతో కేసీఆర్కు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. -
నేడే పోడు పట్టాలు
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు. పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలే. కాగా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు. కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్లో ఆసిఫాబాద్కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోడు రైతులకు పట్టా పుస్తకాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతిభవన్ చేరుకోనున్నారు. -
మాది రైతుల టీం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైన మూడు నెలల్లోనే బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఏ పార్టీ కూడా తమను వదలకుండా విమర్శలు చేస్తోందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఒకరికొకరు తమను బీ టీం అంటూ విమర్శలు చేస్తున్నాయని, తాము ఎవరికీ ‘ఏ’ టీం, ‘బీ’ టీం కాదని చెప్పారు. తాము రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీమ్ అని ప్రకటించారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం సర్కోలిలో ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే భరత్ బాల్కే కుమారుడు భగీరథ బాల్కే తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్కు దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న రైతులు, కార్మికులు మద్దతు పలుకుతున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక అన్ని పార్టీలు వింత ప్రకటనలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదని భారత్ పరివర్తన కోసం పనిచేసే మిషన్ అని చెప్పారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా లక్ష్యం లేకుండా పయనిస్తోందని, దక్షిణకొరియా, జపాన్, సింగపూర్, మలేసియా, చైనా వంటి ఎన్నో దేశాలు గొప్పగా అభివృద్ధి చెందాయని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ సహా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అతి తక్కువ సమయంలో రైతు సంక్షేమం కోసం పనిచేసిందన్నారు. తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాలేదని ప్రశ్నించారు. దేశంలో కోట్లాది ఎకరాల వ్యవసాయ భూమి, 75 వేల టీఎంసీల నీరు ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు. నూతన జల విద్యుదుత్పత్తి విధానాలను బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలోని బొగ్గు నిల్వలు 150 సంవత్సరాలపాటు అవసరాలను తీరుస్తాయని, రైతులు ఏకమైతేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి తెలంగాణ పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలన్నారు. పనిచేయని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన భగీరథ బాలే్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. రైతు బతికుంటేనే ప్లేటులోకి భోజనం ‘రైతు బతికుంటే ఎవరు మరణిస్తారు, రైతు మరణిస్తే ఎవరు బతుకుతారని నేను నిత్యం చెబుతుంటాను. రైతు జీవించి ఉంటేనే భోజనం మన ప్లేటులోకి వస్తుంది. రైతు మరణిస్తే అందరి భోజన పాత్రలు ఎండిపోతాయి. రైతులు లేకుంటే ఇక ఎవరు బతకగలరు’ అని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే రైతులందరికీ పెన్షన్ ఇవ్వడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామన్నారు. ‘తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తాయి. మామిడి పండ్లు తినాలనుకుంటే మామిడి చెట్టునే నాటాలి. పాలు కావాలంటే ఆవులకు గడ్డి వేయండి, గాడిదలకు గడ్డి వేసి, ఆవుల నుండి పాలు ఎలా పొందగలం’ అంటూ ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ అన్నారు. ముగిసిన మహారాష్ట్ర పర్యటన రెండురోజుల పర్యటనకు రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్తో వెళ్లిన కేసీఆర్ మంగళవారం రాత్రి హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. సోమవారం రాత్రి షోలాపూర్ బాలాజీ సరోవర్ హోటల్లో బస చేసిన కేసీఆర్ మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు పండరీపూర్కు చేరుకున్నారు. 10 గంటలకు పండరీపూర్లోని శ్రీ విఠల్ రుక్మిణిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం సర్కోలిలోని భగీరథ బాల్కే నివాసానికి చేరుకుని ఆయన తండ్రి స్మారకానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తర్వాత పార్టీ నేతలతో కలిసి భాల్కే నివాసంలో భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు సోలాపూర్కు చేరుకున్నారు. సోలాపూర్లోని స్థానిక కార్పొరేటర్ నగేశ్ వల్లియర్ నివాసానికి చేరుకుని పార్టీ నేతలతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు తుల్జాపూర్ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. విఠల్, రుక్మాయిలను దర్శించుకున్న కేసీఆర్ షోలాపూర్: పార్టీ విస్తరణలో భాగంగా షోలాపూర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం పండరీపూర్లోని విఠల్, రుక్మాయిలను దర్శించుకున్నారు. ఉత్తరద్వారం నుంచి ఆలయంలోకి చేరుకున్న కేసీఆర్కు అర్చకులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. విఠలేశ్వరుడి పాద ముద్రికలు, మూల విరాట్ విగ్రహం దర్శనానంతరం కేసీఆర్ రుక్మిణీ అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. అర్చకులు కేసీఆర్ మెడలో తులసిమాలను వేశారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆషాఢ ఏకాదశి పర్వదినానికి రెండు రోజులే ఉండటంతో ఆలయంలో, బయట భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో కేసీఆర్, కొందరు ప్రజాప్రతినిధులు మినహా ఆయన వెంట వచ్చిన మిగతా వారికి వీఐపీ దర్శనం కల్పించలేదు. దీంతో వారు ఆలయ శిఖర దర్శనం చేసుకుని వెనుదిరిగారు. అదేవిధంగా ముందుగా ప్రకటించిన ప్రకారం వేయి కేజీల గులాబీ పూలను హెలికాప్టర్ ద్వారా కురిపించేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ వెంట వచ్చిన 600 వాహనాలను భద్రతా కారణాలతో పోలీసులు పండరీపూర్లోకి అనుమతించలేదు. కేసీఆర్ షోలాపూర్ నుంచి పండరీపూర్ ఆలయానికి వస్తున్న క్రమంలో స్థానికులు ఆయనను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కేసీఆర్కు భగీరథ్ బాల్కే ఆధ్వర్యంలోని నాయకులు విఠలేశ్వరుడి సంగీత పరికరాలుగా భావించే తంబుర, చిడతలతోపాటు విఠలేశ్వర, రుక్మిణీ అమ్మవారి ప్రతిమను బహూకరించారు. -
ప్రత్యేక బస్సు.. 600 కార్లు
సాక్షి, హైదరాబాద్: రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్ర బయలుదేరి వెళ్లిన భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం షోలాపూర్కు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. కేసీఆర్ చేతికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి వీడ్కోలు పలికారు. 600 కార్లతో కూడిన భారీ వాహన శ్రేణి ఆయన వాహనాన్ని అనుసరించింది. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను దాటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగు పెట్టారు. మొత్తం 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కాగా మహారాష్ట్రకు వెళ్లే మార్గమంతా కేసీఆర్కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వెలిశాయి. ప్రజలు, పార్టీ శ్రేణులు పూలు, గులాబీ కాగితాలు వెదజల్లుతూ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట సుమారు 6 కిలోమీటర్ల పొడవున వాహన శ్రేణి బారులు తీరింది. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం కేసీఆర్ వాహన శ్రేణి తెలంగాణలోని పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ప్రయాణించి కర్ణాటకలో అడుగు పెట్టింది. ముర్కుంద, మన్నెకెల్లి, తలమడిగి, హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్రలోని దారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లా ఒమర్గాకు కేసీఆర్ చేరుకున్నారు. స్థానిక మహిళలు సాంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తన వెంట వచ్చిన నేతలతో కలిసి ఒమర్గాలో సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం షోలాపూర్ చేరుకున్న కేసీఆర్కు స్థానిక తెలుగు ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకగా, మహిళలు హారతులు ఇచ్చారు. భారీగా డప్పు చప్పుళ్లు, స్థానిక కళారూపాల ప్రదర్శన నడుమ తాను బస చేసే బాలాజీ సరోవర్ హోటల్కు కేసీఆర్ చేరుకున్నారు. మాజీ ఎంపీ సాదుల్ ధర్మన్న ఇంటికి కేసీఆర్ షోలాపూర్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహా్వనం మేరకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి షోలాపూర్ భావనారుషి పేట్లోని ఆయన నివాసానికి కేసీఆర్ తేనీటి విందుకు వెళ్లారు. తిరిగి హోటల్కు వెళ్తున్న సమయంలో మీడియా ప్రశ్నించడంతో.. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధించిన తర్వాత పండరీపూర్ విఠలేశ్వరుని మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకుంటానని మొక్కుకున్నానని చెప్పారు. ఇప్పుడు దైవ దర్శనం కోసమే వచ్చానని, రాజకీయాలు మాట్లాడనని అన్నారు. నలుగురు మినహా కేబినెట్ మొత్తం.. సీఎం కేసీఆర్ వెంట నలుగురు మంత్రులు మినహా రాష్ట్ర కేబినెట్ మొత్తం తరలి వెళ్లింది. మంత్రులు కేటీ రామారావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ మినహా మిగతా మంత్రులంతా ఆయన వెంట ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, సంతో‹Ùతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్లారు. మొత్తంగా వందలాది మంది నేతలు షోలాపూర్కు వెళ్లడంతో స్థానిక హోటళ్లు, లాడ్జీలు కిక్కిరిసిపోయాయి. బసకు ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు స్థానికంగా స్థిరపడిన తెలంగాణవాసుల ఇళ్లలో ఆశ్రయం పొందారు. నేడు పండరీపూర్, తుల్జాపూర్లో ప్రత్యేక పూజలు కేసీఆర్ మంగళవారం ఉదయం పండరీపూర్లోని శ్రీ విఠల్ రుక్మిణి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సమీపంలోని సర్కోలి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సభకు హాజరవుతారు. సర్కోలి సభ వేదికగా స్థానిక ఎన్సీపీ నేత భగీరథ్ భల్కే బీఆర్ఎస్లో చేరుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం తుల్జాపూర్కు చేరుకుని భవానీ మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. -
మంత్రి సత్యవతి రాథోడ్ ఎందుకా శపథం చేశారు..?.. అసలు వ్యూహం ఏంటి?
ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాని మండలికి ఎన్నికయ్యారు.. ఎస్టీ కోటాలో మంత్రి పదవి పొందారు. తనను మంత్రిని చేసిన సీఎం కేసీఆర్పై స్వామిభక్తి చాటుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. చేతి మీద అధినేత పేరుతో పచ్చబొట్టు వేసుకుని సంబరపడుతున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా చెప్పులు వేసుకోవడంలేదు. రాజకీయాల్లో పదవులు కాపాడుకోవడం, ఉనికి కాపాడుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదవులు పొందడానికి, ఉన్న పదవిని కాపాడుకోవడానికి అధినేత మెప్పు పొందడానికి ఎన్ని బాధలైనా పడతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహార సరళి గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి గులాబీ దళపతి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. గత 4 నెలలుగా పాదరక్షలు లేకుండా తిరుగుతున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తాజాగా తన చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేసుకుని స్వామి భక్తిని మరో సారి చాటుకున్నారు. స్వామి భక్తిని చాటుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవ్వరి అంచనాలకు అందకుండా తనను మంత్రిని చేసిన కేసీఆర్పై సత్యవతి రాథోడ్ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శపథానికి కట్టుబడి నాలుగు మాసాలుగా చెప్పులు లేకుండా తిరగడంతో వేసవి ఎండల దృష్ట్యా అరికాళ్లకు బొబ్బలొచ్చి కంటతడి పెట్టారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు కాళ్ల బొబ్బలు పెద్ద సమస్యే కాదని భావించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో చేతిపై కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకురాలైన మంత్రి సత్యవతి రాథోడ్ తన పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. కేసీఆర్ కోసం చెప్పులు వేసుకోవడం మానేసిన విషయాన్ని అందరూ మర్చిపోవడంతో పచ్చబొట్టు వేసుకొని తన ప్రతిజ్ఞను గుర్తుచేయడంతో పాటు.. కేసీఆర్ పట్ల ఎంతో అభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పే ప్రయత్నమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. డోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న సత్యవతి రాథోడ్ కేసీఆర్ కరుణ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది. చదవండి: జానారెడ్డి అసలు స్ట్రాటజీ ఇదేనా?.. సీఎం కుర్చీ కోసమేనా..? నియోజకవర్గం లేకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి, డోర్నకల్ టికెట్ ఆశిస్తున్నప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కాదని సత్యవతికి టిక్కెట్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. మహబూబాబాద్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవిత మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ పై స్వామిభక్తిని చాటుకుంటే ఎక్కడో ఓ చోట అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో నొచ్చుకున్నారట. ఏమి అడగకుండానే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకుంటే ప్రత్యర్థులు లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే పదవి బెటర్ కావడంతో ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఎమ్మెల్యే టికెట్ సాధించి తన రాజకీయ జీవితాన్ని పటిష్టపర్చుకునేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. -
మీ వెలుగులో ముందుకు
ఇక్కడ నివాళి అర్పించాకే.. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అంతటి త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా, అమరుల పేర్లు అందరి మదిలో నిలిచేలా ‘అమర జ్యోతి’ని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోయేలా, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల పేర్లు ఎల్లకాలం అందరి మదిలో నిలిచేలా ‘తెలంగాణ అమరుల స్మారకం’ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఫొటోలతో గ్యాలరీని ఏర్పాటు చేస్తామని, ఉద్యమ ప్రస్థాన చరిత్రను సమగ్రంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం హుస్సేన్సాగర్ తీరాన నిర్మించిన ‘అమరజ్యోతి’ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమ ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలను ప్రస్తావించారు. కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా దీపాలు చేతబూని అద్భుత రీతిలో అమరులకు నివాళి అర్పించాం. ఈ సందర్భంలో సంతోషం ఒకపాలు, విషాదం రెండు పాళ్లుగా ఉంది. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే భావనతో ప్రాణత్యాగం చేసిన వారికి వెలకట్టలేం. అందిన సమాచారం మేరకు ఆరేడు వందల మంది కుటుంబాలకు ఉద్యోగాలు, ఒక్కో ఇంటికి రూ.10లక్షలు, కొందరికి ఇళ్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి మనం ఉదారంగా సాయం చేసుకోవచ్చు. వెలుగులీనుతున్న అమరుల స్మారకం కుట్రకోణాలతోనే అనేక బలిదానాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలు దాగి ఉండటంతో అనేక మంది బలయ్యారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 1965, 66 సమయంలో ఖమ్మం జిల్లాలో మొదలైన పొలికేక 1967 నాటికి యూనివర్సిటీకి చేరింది. కేసులు, వేధింపులు, ఉద్యోగుల నుంచి తొలగింపు వంటివి జరిగినా.. 58 ఏండ్ల పాటు సమైక్య రాష్ట్రంలోనూ తమ అస్తిత్వం కోల్పోకుండా టీఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమాన్ని కొనసాగించారు. జీవితాంతం తెలంగాణవాదిగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు వంటి వారు ఉద్యమ సోయిని బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని లెఫ్ట్ పార్టీలు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ వంటి పేర్లతో వారి పంథాలో ఉద్యమానికి జీవం పోశాయి. పిడికెడు మందితో మొదలైన మలిదశ.. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రారంభంలో మధుసూదనాచారి, వి.ప్రకాశ్ వంటి పిడికెడు మందితో కలసి ఆరేడు నెలలు, ఐదారు వేల గంటలు మేధోమథనం చేసి ఒక వ్యూహం రచించుకుని బయలుదేరాం. భావోద్వేగాలతో ఉండే విద్యార్థులతోపాటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమాన్ని మొదలుపెట్టాం. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించే క్రమంలో హింసాత్మక ఆందోళన మార్గాన్ని అనేక మంది సూచించినా.. గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో అహింసా పద్ధతిలో ముందుకు సాగాం. రాజీనామాలను అ్రస్తాలుగా మార్చి హింస రాకుండా చూశాం. కానీ నా మీద సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే వారి తొత్తులు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో దాడి చేశారు. ఆ తిట్లనే దీవెనలుగా భావిస్తూ ముందుకు సాగుతూనే టీఎన్జీఓ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సిద్దిపేట ఉద్యోగ గర్జన వేదికగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఆమరణ దీక్షను ప్రకటించా. నిమ్స్ వైద్యుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జరిగిన దీక్షకు పార్లమెంటులో అన్ని పారీ్టల సహచర ఎంపీల మద్దతు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితో తెలంగాణ ప్రకటన వచ్చింది. కుట్రలు, కుహకాలతో తెలంగాణను అడ్డుకునేందుకు వలసవాదులు చివరికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి చేసే స్థాయికి దిగజారారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల ప్రతినిధులు నివాళి అర్పించాకే.. అమరుల బలిదానాల నేపథ్యంలో అమరుల స్మారకాన్ని ప్రత్యేకంగా నిర్మించాలనే ఉద్దేశంతో అనేక దేశాల్లో నమూనాలను పరిశీలించాం. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నివసించిన జలదృశ్యం ప్రదేశంలోనే స్మారకం నిర్మించాం. కళాకారుడు రమణారెడ్డి సాయంతో దీపకళిక (వెలుగుతున్న దీపం) నమూనాను ఖరారు చేసి ఖర్చుకు వెనుకాడకుండా ఎక్కువ సమయం తీసుకుని నిర్మించాం. ఇకపై ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు అమరుల జ్యోతి వద్ద నివాళులు అర్పించాకే ఇతర కార్యక్రమాలు జరిగేలా ఆచారాన్ని పెట్టుకుంటాం. ఇప్పటికే సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, బుద్ద విగ్రహం, అమరుల స్మారకంతో హుస్సేన్సాగర్ తీరం ల్యాండ్మార్క్లా తయారైంది. త్వరలో సచివాలయం, అమరుల స్మారకం నడుమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అమరుల స్మారకంలో 1969తో పాటు ప్రస్తుత ఉద్యమ ఘట్టాలు ఉండేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. అమరుల స్ఫూర్తి, ఉద్యమ సాధనలో పడిన శ్రమను కసిగా తీసుకుని అన్నివర్గాలకు అవసరమైన సాయం అందిస్తూ తెలంగాణ పురోగమిస్తున్నది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్ నగర్ 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్షిప్ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో.. కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్షిప్లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్ గ్రౌండ్ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారానే విద్యుత్ సరఫరా కేబుళ్లు వేశారు. లిఫ్టులకు, వాటర్ సప్లై, ఎస్టీపీలకు విద్యుత్ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్లైన్ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్లైన్, 10.60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్ కాంప్లెక్స్లలో 118 షాపులు, ప్రతి బ్లాక్కు రెండు చొప్పున 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. సామాజిక వసతులూ ఎన్నో.. ► టౌన్షిప్ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీపర్పస్ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. ► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్స్టాప్, పోలీస్స్టేషన్, ఫైర్స్టేషన్, మిల్క్ బూత్లు, పెట్రోల్ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. శంకర్పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏటా 500 రైల్వేకోచ్లు, 50లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, అధికారులు పరిశీలించారు. పటాన్చెరులో బహిరంగ సభ కొల్లూరులో డబుల్ బెడ్రూం టౌన్షిప్ను ప్రారంభించిన అనంతరం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా బీఆర్ఎస్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగుస్తున్నాయి. దీంతో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములను చేస్తూ మరిన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై ఇప్పటికే కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఈ నెలాఖరులో పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ప్రభుత్వ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసిన కేసీఆర్ ఎన్నికల సన్నద్ధతలో తదుపరి కార్యాచరణకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. యువజన, విద్యార్థి సమ్మేళనాలు దశాబ్ది ఉత్సవాల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను చేరుకున్న బీఆర్ఎస్ నేతలు యువత, విద్యార్థులతో మమేకమయ్యేలా మరో కార్యక్రమాన్ని కేసీఆర్ రూపొందించారు. నియోజకవర్గ స్థాయిలో యువత, విద్యార్థులతో పార్టీ పక్షాన ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ ‘నిధులు, నీళ్లు, నియామకాలు’అంశంపై ఆయా వర్గాలను చేరుకునేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఉద్యోగ, ఉపాధి కల్పన, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలను యువత, విద్యార్థులతో నిర్వహించే సమ్మేళనాల్లో వివరిస్తారు. అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న బీఆర్ఎస్, ఆలోగా పార్టీ యంత్రాంగం అనునిత్యం క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. -
Telangana: మళ్లీ వచ్చేది మేమే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి.. నాలుగైదు మాసాల్లోనే రిజర్వాయర్లను నీటితో నింపుతామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని.. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాలకు కాళేశ్వరం జలాలను తరలిస్తామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు అర్బన్ఫారెస్ట్లో సీఎం కేసీఆర్ హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాళేశ్వరంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్లు అడ్డు తగిలి కోర్టుల్లో కేసులు వేసి పనులు ఆగేలా చేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పనులు కొనసాగించి ఇప్పటికే 85 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాలుగైదు మాసాల్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపుతాం. కాళేశ్వరం జలాలపై ఎలాంటి వివాదాలూ లేవు. కృష్ణా జలాలపై వివాదం కొనసాగుతోంది. రంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తాం.. రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లిలో నాకుగతంలో పదిపదిహేను ఎకరాలు ఉండేది. 20 బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగా పోసే బోర్లతో అనేక కష్టాలు పడ్డాం. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం తెలంగాణలో ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఓ చిన్న లిఫ్ట్ను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్, పరిగి సహా చేవెళ్ల, మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. కొండపోచమ్మ కింది నుంచి ఘట్కేసర్ మీదుగా కాళేశ్వరం నీళ్లను మూసి దాటించి లోయపల్లి రిజర్వాయర్ను నింపడం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. వారి నోళ్లు మూతపడ్డాయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా మంది హేళన చేశారు. తెలంగాణ వారికి పంటలు పండించడం రాదన్నారు. కరెంట్ లేక చీకట్లో మగ్గుతామన్నారు. ప్రస్తుతం దేశంలోనే ధాన్యం దిగుబడిలో, తలసారి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొక్కలను నాటి చెట్లను పెంచడంలో ముందుంది. 100 శాతం ఓడీఎఫ్ సాధించడంలోనూ ముందున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలోనూ టాప్లో నిలిచింది. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి నేను హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్లు హేళన చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంపై జోకులు వేసి నవ్వుకున్నారు. కానీ హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 శాతం ఉన్న పచ్చదనం 30శాతం దాటింది. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే 267 కోట్ల మొక్కలు నాటాం. ఇప్పటికే 170 అర్బన్ ఫారెస్ట్లను పూర్తి చేసుకున్నాం. ఇది మనందరి విజయం. హరితహారంలో భాగంగా ఈ ఏడాది పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందిగా ముఖ్య కార్యదర్శికి సూచించాం. హరితహారం చట్టం తెచ్చినప్పుడు సర్పంచులు నాపై కోపం తెచ్చుకున్నారు. అయినా కష్టపడి పనిచేశారు. ఫలితంగా మోడువారిన దారులన్నీ నేడు పూల తేరులయ్యాయి. గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కుతుంది. ఫారెస్ట్ అధికారుల కోసం 20 పోలీస్ స్టేషన్లు అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ఓ బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ఇస్తున్నాం. మనిషినైతే తేలేం కానీ కొన్ని డబ్బులు ఇచ్చాం. 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫారెస్ట్ ఆఫీసర్లకు సాయుధ సాయం అందజేయాలని నిర్ణయించాం. అటవీ అధికారుల భద్రత కోసం తెలంగాణవ్యాప్తంగా 20 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. నాలుగు మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. జల్పల్లి, తుక్కుగూడ, మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపాలిటీలకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బలం పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందేమోనన్న అంచనా కానివ్వండి.. బీజేపీ పెరిగితే తనకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం అన్న భావన కానివ్వండి.. లేదా జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపడానికి ఒక అవకాశం అన్న ఉద్దేశం కానివ్వండి.. ఇంతకాలం ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు కురిపించేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అనేవారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోకపోయినా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలను ఆయన గమనించి తన రూట్ మార్చారు. ఇప్పుడు బీజేపీపై కన్నా కాంగ్రెస్పై దాడి చేస్తున్నారు. తెలంగాణలో తాను చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివిధ సభలలో వివరిస్తున్నారు. పలు జిల్లాలలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలలో ఎన్నికల ప్రచారానికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైపు చూడకుండా ఉండడానికి ఎన్ని యత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ అంశాన్ని పెద్ద సమస్యగా మార్చుతోంది. పేదల భూములు కొట్టేయడానికే ధరణి పోర్టల్ తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్ను బంగళాఖాతంలో కలుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అవినీతి అరికడుతుందని, దీనిని అడ్డుకునేవారిని బంగళాఖాతంలో కలపాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం ధరణి అంశం ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెడుతున్నట్లుగానే ఉంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రంలో కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మొదలైన అభివృద్ది అంశాలను పదే,పదే ప్రస్తావిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన బాగా యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలలో బీఆర్ఎస్పై కాస్త నెగిటివ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానిని తగ్గించడానికి ఆయన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. కారణం ఏమైనా సెటిలర్లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంటే, తెలంగాణలో పుట్టి పెరిగినవారిలో ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న కథనాలు, ఇంటర్వ్యూలు తరచుగా మీడియాలో వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో వంతెనలు నిర్మిస్తే సరిపోతుందా.. జిల్లాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెబుతుంటే, దానినే ఆయనకు మైనస్ చేయడానికి ఆయా రాజకీయ పక్షాలు ,తెలంగాణవాదులు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటే బీఆర్ఎస్కు అది చేటు తెస్తుందని గమనించి కేసీఆర్ కాంగ్రెస్పై దాడి పెంచారు. అంతేకాక బీజేపీలో మొదట ఉన్న జోష్ ఇప్పుడు లేదన్న భావన ప్రబలింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వాదనను కొట్టిపారేస్తున్నా, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్నది వాస్తవం. దీనివల్ల బీజేపీ కన్నా బిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. బీజేపీ, కాంగ్రెస్లు సమానంగా ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెలుపు సులువు అవుతుంది. అలాకాకుండా ఏదో ఒక పార్టీనే ప్రత్యర్ధిగా మారితే అది టైట్ ఫైట్గా మారవచ్చు. కర్నాటకలో మాదిరి ముస్లిం ఓట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపితే మాత్రం అది బీఆర్ఎస్కు బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! మామూలుగా అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు హైదరాబాద్ పాతబస్తీ మినహా మిగిలినచోట్ల టీఆర్ఎస్ వైపే ఉంటారు. కాని బీజేపీని అడ్డుకోవడానికి వారు కాంగ్రెస్కు అనుకూలంగా మారితే అది బీఆర్ఎస్కు కూడా చికాకు కలిగించవచ్చు. వీటన్నిటిని అంచనా వేసుకున్న కేసీఆర్ జిల్లాల పర్యటనల వేగం పెంచి, బీఆర్ఎస్ చెక్కు చెదరకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు. మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కాస్త జోష్ వచ్చింది. సంస్థాగతంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ , టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అన్న భావన కొంతమేర తేగలిగారు. దానికి తగ్గట్లుగానే ఆయా నేతలు బీజేపీలో కన్నా కాంగ్రెస్లో చేరడానికే సుముఖత చూపుతున్నారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని, మాజీ మంత్రి , నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు వంటివారు కాని కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిని ఆకర్షించడానికి బీజేపీ యత్నించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు ఆ పార్టీలో చేరలేదు. సొంతంగా పార్టీ పెట్టడం కన్నా బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్లో చేరితే బెటర్ అన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదరరెడ్డి కూడా కాంగ్రెస్లో చేరవచ్చని చెబుతున్నారు. చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా? అది జరిగితే నాగర్ కర్నాల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కు గట్టిపోటీనే ఇస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పోల్చితే నియోజకవర్గాలలో బలమైన క్యాడర్, నాయకత్వం కాంగ్రెస్కే ఉంది. పార్టీ విజయం సాదించే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే వారంతా తీవ్రంగా కృషి చేస్తారు. బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఏర్పాటు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి తేవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాదన్న భావన నెలకొంటే, హంగ్ వచ్చేంత బలాన్ని అయినా పొందడానికి యత్నిస్తారు. అదికాకపోతే కాంగ్రెస్ నైతే అధికారంలోకి రావాలని వారు కోరుకోరని, అది జరిగితే దేశ వ్యాప్తంగా కొంత ప్రభావం పడుతుందని వారు భావించవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్కే వారు ఎంతో కొంత సాయపడవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మామూలుగా అయితే కేసీఆర్కు నల్లేరు మీద బండిలా గెలుపు రావాలి. కాని ఆయన వ్యవహార శైలి, వివిధ కారణాల వల్ల పోటీని ఎదుర్కునే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు కదా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ఇదేదో వింత ఆలోచనలాగా ఉంది!
ఇదేదో వింత ఆలోచనలాగా ఉంది! -
మోదీ మంచి మిత్రుడు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, నీతి ఆయోగ్ వంటి సమావేశాల్లో తాము ఆలోచనలు పంచుకోవడంలో వింతేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కేంద్రం మీ పథకాలు కాపీ కొడుతోందని నాగ్పూర్లో కొందరు మీడియా ప్రతినిధులు అనడంతో కేసీఆర్ పై విధంగా స్పందించారు. మా ఎజెండాతో కలిసి వచ్చే వారితో కలిసి పనిచేస్తామని, విపక్షాల ఐక్యతపై సందర్భాన్ని బట్టి ఆలోచిస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని నాగపూర్లో గురువారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో ఫ్రంట్లతో ఫలితం సాధించలేక పోయాం.. ‘గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లాంటివి అనేకం చూసినా ఫలితం సాధించలేకపోయాం. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా మారాం. ఓట్ల చీలిక బీజేపీకి అనుకూలిస్తుందనే వాదనతో మాకు సంబంధం లేదు. ఎవరికో బీ టీమ్, సీ టీమ్ అనే విమర్శలు మాకు అక్కరలేదు. దేశ ప్రజల కోసమే మా పార్టీ పనిచేస్తుంది. మహారాష్ట్రలోనూ పొత్తుల గురించి మేము ఆలోచించడం లేదు. అవసరమవుతుందని అనుకోవడం లేదు. మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. గెలుపోటములతో సంబంధం లేకుండా సంపూర్ణ లక్ష్యం చేరుకునే వరకు మా ప్రయాణం సాగుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో బాల్కసుమన్, తోట చంద్రశేఖర్, కేకే, బీబీ పాటిల్, జీవన్రెడ్డి విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు ‘దేశంలో అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్రాల కోరిక ఉంది. మిథిలాంచల్ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల ఏర్పాటులో శాస్త్రీయ విధానం కావాలి. దేశంలో మరో పది పన్నెండు రాష్ట్రాలు ఏర్పడితే ఏమవుతుంది? కొత్త రాష్ట్రాలు ఏర్పడితే విదర్భ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుంది. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే మా పార్టీ కార్యకలాపాలు మహారాష్ట్ర నుంచి ప్రారంభించాం. గతంలో తెలంగాణ రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు 14 రాష్ట్రాల వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ తరహాలో మహారాష్ట్రలోనూ అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు. పార్టీలు బ్రతికి ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అప్పుడే మోదీ సహా పార్టీలకు అవకాశాలు లభిస్తాయి. పార్టీలను వేధించకుండా బ్రతకనివ్వాలి. ఐటీ దాడులను ఖండిస్తున్నాం..’ అని అన్నారు. విమానాలు అందరికీ అందుబాటులోకి రావాలి.. ‘మహిళల భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పార్లమెంటుతోపాటు అసెంబ్లీల్లోనూ స్త్రీలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తాం. రైతులను అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తాం. పార్టీలో చేర్చుకునేందుకు మహారాష్ట్రకు ప్రైవేటు విమానం పంపడం తప్పేమీ లేదు. అది మా పార్టీ విమానం. నేను అందులోనే వెళ్తున్నా. అమెరికాలో రైతుల వద్ద కూడా విమానాలు ఉన్నాయి. ఇక్కడా అందరికీ విమానాలు అందుబాటులోకి రావాలి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు (బండి సంజయ్) చెప్పడం పెద్ద బక్వాస్’ అని సీఎం అన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి... ‘మనకంటే అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలు, అమెరికా గతంలో ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినా తిరిగి బ్యాలెట్ విధానం పాటిస్తున్నాయి. ఇక్కడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ పనితీరులో మార్పు కోసం రాజ్యాంగంతో పాటు ఆర్థిక, న్యాయ, పాలన, ఎన్నికల రంగాల్లో వ్యవస్థాగత మార్పులు రావాలి. మూస విధానాల నుంచి బయట పడకుంటే ప్రపంచంతో పోటీ పడలేం. దేశ జల, విద్యుత్ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముంది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్లు, రైల్వే వ్యవస్థల్లో మౌలిక వసతులు పెరుగుదల.. దేశంలో గుణాత్మక మార్పుతోనే సాధ్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రంగాలను మెరుగు పరుస్తాం. త్వరలో ఢిల్లీలో మా మేనిఫెస్టోను ప్రకటిస్తాం. దేశంలో దళితుల అభ్యున్నతి, ఉచిత విద్య వంటివి ఇందులో ఉంటాయి. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ సరికాదు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వ రంగంలోనే కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నాం. లోపాలు సరిదిద్దితే ఆర్థిక రంగం మెరుగవుతుందనే భావనతో మేము తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయి. దేశంలో మార్పులకు గడువేమీ పెట్టుకోలేదు, మా లక్ష్యం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేయనందు వల్లే ధరలు పెరుగుతున్నాయని, చట్ట సభల్లో చర్చ లేకుండా బిల్లులు ఆమోదం జరగడం వంటి అంశాల్లో మార్పులు రావాలని అన్నారు. -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో తాను సాధించిన గొప్ప గురించి చెప్పుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని ఆయన ఆంధ్ర ప్రదేశ్ గురించి అనవసర ప్రస్తావన తెస్తున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉందట. ఏపీలో లేదట. దానిని ఆయన చీకటితో పోల్చుతున్నారు. అది నిజమా?కాదా? అన్నదాని గురించి ఆయన పట్టించుకోకుండా మాట్లాడుతున్నట్లుగా ఉంది. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏదో గట్టి పోటీ రాబోతోందన్న అనుమానంతో ఆయన స్పీచ్ లు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఏపీలో ఎక్కడా విద్యుత్ సమస్యలేదు. ఎప్పుడైనా కొద్దిపాటి సాంకేతిక అవాంతరాలు వచ్చినా వెంటనే విద్యుత్ వచ్చేస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభు,త్వం, విద్యుత్ శాఖలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆ మాత్రం ఇబ్బంది తెలంగాణలో అయినా ఉంది. ఆ మధ్య ఆంగ్ల పత్రికలలో వచ్చిన కథనం ప్రకారం హైదరాబాద్ శివార్లలో కరెంటు కోతలు ఎక్కుగా చేయాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ తెలంగాణలో విద్యుత్ సమస్య తీర్చడానికి ప్రయత్నించలేదని ఎవరూ అనడం లేదు. కాని తన ఘనత కోసం ఏపీని అవమానించినట్లుగా మాట్లాడడం మాత్రం సరికాదు. గద్వాల వద్ద జరిగిన సభలో తుంగభద్ర ఆవల, ఈవల అంటూ ఏదో చెప్పారు. ఆయన చెప్పారో లేదో, ఈనాడు పత్రికలో కార్టూన్ వేసి సంతోషపడిపోయారు. కేసీఆర్ గారు ఒకసారి నిజంగానే తుంగభద్ర ఆవల ఉన్న కర్నూలు లేదా భద్రాచలం ప్రాంతంలో ఉన్న ఏపీ సరిహద్దు గ్రామాలలో పర్యటించి కొన్ని విషయాలు అడిగితే తెలంగాణకు, ఏపీకి ఉన్న తేడా తెలుస్తుంది. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు ఆధునిక వసతులతో కళకళలాడుతున్నాయి.. మరి తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ఏపీని పరిశీలించాక ఇప్పుడు ఆరంబించారు. మంచిదే. కాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నడైనా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు చూడండి.. తెలంగాణలో స్కూళ్లు చూడండి.. అని ఏమైనా వ్యాఖ్యానించారా?లేదే! ఏపీలో అమ్మ ఒడి కింద ప్రతి విద్యార్ధికి 15 వేల రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ఇస్తున్నారా? తెలంగాణలోని సరిహద్దు గ్రామాలవారు కొందరు తాము కూడా ఏపీలో ఉంటే బాగుండు అని అనుకున్నారని వార్తలు వచ్చాయి. అంతమాత్రాన తెలంగాణ వెనుకబడిపోయిందని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా! ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఏపీలో ఇప్పటికే పుస్తకాలు, బాగ్లు, డ్రెస్లు, కిట్లు ఇచ్చేశారు. మరి తెలంగాణలో ఇచ్చారా అని ఎవరైనా అడిగితే సమాధానం ఇస్తారా? కరోనా సమయంలో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులై తెలంగాణ నుంచి తరలివచ్చారు. చెక్ పోస్టులు పెట్టి ఆపవలసి వచ్చింది. అందువల్ల తెలంగాణలో కరోనా నివారణ చర్యలు చేపట్టలేదని అనగలమా? ఏపీలో చేయూత కింద మహిళలకు 18500 రూపాయలు చొప్పున ఏటా ఇస్తున్నారు. ఆ స్కీమ్ తెలంగాణలో ఉందా? ఏపీలో కొత్తగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మొదలైనవి నిర్మాణం అవుతున్నాయి. తెలంగాణలో సముద్రమే లేదు కనుక అవి వచ్చే అవకాశం లేదు. ఏపీలో అవి వచ్చా యి మీకేమున్నాయని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా?. కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేసిఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఏపీలో అత్యధిక ఉత్పత్తి జరుగుతోంది. కాని వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా డిమాండ్ బాగా పెరుగుతోంది. అలాంటప్పుడు బహిరంగ మార్కెట్లో ఏపీ కూడా కొంటోంది. తెలంగాణకూడా తన అవసరాల కోసం అదే పని చేస్తోంది. దానికి అనుగుణంగా ప్రజల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఈనాడు వంటి మీడియాను కేసీఆర్ కంట్రోల్ చేయగలుగుతున్నారు కనుక అక్కడ విద్యుత్ లేదా ఆర్టీసీ చార్జీలు పెరిగితే తప్పనిసరి పరిస్థితి అని, అనివార్యమని ఈనాడు రాస్తోంది. అదే ఏపీలో అయితే చార్జీలతో జనాన్ని ఏపీ ప్రభుత్వం బాదుతోందని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఏపీలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. తెలంగాణలో ఎందుకు చేయలేకపోయారు. తమది ధనిక రాష్ట్రమని కేసీఆర్ తరచూ చెబుతుంటారు.. అయినా సుమారు ఐదు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటాయి. లక్ష కోట్ల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం జరుగుతోందని కూడా అవి ప్రశ్నిస్తున్నాయి. అంతమాత్రాన అవన్ని నిజం అయిపోయినట్లు అనుకుందామా!. వీటిని ఆంధ్ర నేతలు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అంతెందుకు! ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రం ఏపీకి విద్యుత్ బకాయిల కింద ఇవ్వవలసిన ఏడువేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఏదో ఒక వివాదం పేరుతో బకాయిపెడుతోందే. కేంద్రం కూడా ఏపీకి తెలంగాణ బకాయిపడిందని చెప్పినా చెల్లించడం లేదు. చదవండి: చంద్రబాబు.. సీఎం జగన్కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా? అంతేకాదు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుమారు లక్షనలభైవేల కోట్ల ఆస్తులు ఏపీకి రావల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. అయినా జాతీయ పార్టీ పెట్టానని చెప్పుకునే కేసీఆర్ ఆ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదు? ఈ మధ్య మంత్రి హరీష్ రావు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏపీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ వారికి మాటలు ఎక్కువ,చేతలు తక్కువ అన్నట్లు మాట్లాడితే మాజీ మంత్రి పేర్ని నాని దానిని తిప్పికొట్టారు. ఇప్పుడు కేసీఆర్ అనవసర పోలిక తీసుకు వచ్చి వివాదం సృష్టించుకుంటున్నారు. ఒకవేళ ఏపీలో పరిస్థితి బాగోలేదని ఆయనకు సమాచారం ఉంటే స్వయంగా వచ్చి చూసి తెలుసుకుంటే మంచిదికదా! ఎవరో చెవిలో చెప్పిన మాట విని కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. కేసీఆర్ మాటలు మాత్రం గొప్పగా ఉంటాయన్నది వాస్తవం. కొసమెరుపు ఏమిటంటే కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో తిరుమల, తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలను పునర్మించారని చెబుతూ ముఖ్యమంత్రిని జగనన్న అంటూ సంభోదించి అభినందించారు.. అలాగే టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ప్రశంసించారు. మరి దీని గురించి కేసీఆర్ ఏమంటారో! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
భారత్ పరివర్తనతోనే కష్టాల నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. సాంప్రదాయ పార్టీలు తమ చిత్తశుద్ధి లేని కార్యాచరణతో, మూస పద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినంత కాలం దేశాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం ప్రగతిభవన్లో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వనరులను ఉపయోగించుకోవాలనే తపన ఉండాలి.. ‘దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలనే తపన, మనసు పాలకులకు ఉండాలి. ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాలుగా పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం. భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు భారత్ సొంతం. అయినప్పటికీ, ఇన్ని దశాబ్దాలైనా.. రైతులు, బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలైన నీరు విద్యుత్ కోసం తపిస్తున్నారు. ప్రభుత్వాలు రైతు కేంద్రంగా, దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలి. మేం అలా చేసుకోగలిగాం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యింది..’అని సీఎం తెలిపారు. మనసుంటే మార్గం ఉంటుందని తెలంగాణ నిరూపించింది.. ‘ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్ మోడల్ కాగలిగింది? నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్నే కోరుకోవడానికి కారణమేంటి?’అనే విషయాలను కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్ధతిలో ఈ దేశంలో పాలన సాగటం లేదు. దేశంలో పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదు. ప్రజా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలనే మనసు లేనే లేదు..’ అని విమర్శించారు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుందనే విషయాన్ని తొమ్మిదేళ్ల తెలంగాణ నిరూపించిందని అన్నారు. అభివృద్ధి దిశగా భారతదేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో.. ఎన్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్తో పాటు ఆ పార్టీ ఓబీసీ సెల్ అహ్మద్నగర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కర్, దర్శకుడు ప్రకాష్ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్ షిండే, మాజీ చైర్మన్ విలాస్ భైలుమే, సర్పంచ్లు కేశవ్ జెండే, షాహాజీ ఇతాపే, శరద్పవార్తో పాటు చంద్రకాంత్ పవార్, ప్రకాష్ పోతే, ప్రశాంత్ షెలార్, సిద్ధేష్ ఆనంద్కర్, ప్రవీణ్ షెలార్, సంజయ్ వాగాస్కర్, వహతుక్ సేన అధ్యక్షుడు సందీప్ దహతోండే, సేవాదళ్కు చెందిన షామ్ జారే తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలు ఖదీర్ మౌలానా, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు. -
ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత! ‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను. మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు. గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి. సేవలు మరింత పెరగాలి వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. భారీగా ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నాగ్పూర్కు కేసీఆర్ – బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్పూర్కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్కు చేరుకుంటారు. హైదరాబాద్ బయట మూడో కార్యాలయం.. నాగ్పూర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్పూర్లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. -
ధరణితో రాబందులు మాయం
సాక్షి, నాగర్కర్నూల్/గద్వాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో రైతులను దోచుకునే రాబందులు మాయమయ్యాయని.. అలాంటి ధరణిని తీసేస్తామంటూ మళ్లీ దళారులు మోపయ్యారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు కింద డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో పడేందుకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తారా? అని మండిపడ్డారు. అప్పట్లో దళారుల దయతో వాళ్లు రాసిందే లెక్క, గీసిందే గీతగా సాగేదని.. ధరణితో దళారులు, పైరవీకారులు, పట్వారీలు లేకుండా పోయారని చెప్పారు. మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ధరణిని బంగాళాఖాతంలో వేయడమంటే ప్రజలను వేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో పంట డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూసేవాళ్లమని, ఇప్పుడు రోజుల్లోనే ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్లు సైతం పది నిమిషాల్లో పూర్తయి పట్టా చేతికందుతోందన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగించారు. పాలమూరు కళకళలాడుతోంది గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎందరో మంత్రులుగా పనిచేశారని.. వారు ఎన్నో మాటలు చెప్పినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని కేసీఆర్ విమర్శించారు. ఉద్యమ సమయంలో నడిగడ్డ పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఉన్నా తాగు, సాగు నీటికి కష్టాలు ఉండేవన్నారు. ఒకప్పుడు ఎండిపోయి ఎడారిని తలపించిన పాలమూరు.. ఇప్పుడు ధాన్యపు రాశు లు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో కళకళలాడుతోందన్నారు. గతంలో ఇక్కడ బతకలేక, బతుకులేక వలసపోయారని.. అలాంటిది ఈ రోజు రాయచూర్, బిహార్, జార్ఖండ్ నుంచి మిర్చి, పత్తి ఏరేందుకు మన దగ్గరికి వలస వస్తున్నారని చెప్పారు. మహబూబ్నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని.. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలో, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని చెప్పారు. గద్వాల జిల్లాకు ప్రత్యేక నిధులు జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్ష ల చొప్పున, 12 మండల కేంద్రాలకు రూ.15 లక్షల చొప్పున, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జిల్లా సరిహద్దుల్లో మరో వంద పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రవీందర్రావు, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 13 నిమిషాలే ప్రసంగం గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. సాయంత్రం 6.10 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన.. 6.13 గంటలకు మాట్లాడటం ప్రారంభించి 6.26 గంటలకు ముగించారు. కాసేపటికే హెలికాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరారు. సీఎం సభలో కూచుకుళ్ల గద్వాల బీఆర్ఎస్ సభలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత మల్లు రవి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీనితో కూచుకుళ్ల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సోమవారం ఆయన సీఎం కేసీఆర్తో కలసి వేదిక పంచుకోవడం గమనార్హం. ఉద్యోగులు పట్టు వదలొద్దు.. జట్టు చెదరొద్దు.. దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులంతా పట్టు వదలకుండా, జట్టు చెదరకుండా పనిచేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్లో ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా తలసరి ఆదాయంతోపాటు విద్యుత్ వినియోగంలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని వివరించారు. రాష్ట్రంలో మానవీయ కోణంలో పాలన సాగుతోందని.. ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం పథకాలను రూపొందించలేదని చెప్పారు. దేశంలో 90 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే.. అందులో తెలంగాణ వాటానే 50 శాతానికిపైగా 56 లక్షల ఎకరాలు అని వివరించారు. -
కట్టు తప్పితే కటువుగానే!
సాక్షి,హైదరాబాద్: ఏడాది చివర్లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు పార్టీలో అసమ్మతిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంతర్గత అసమ్మతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదనే సంకేతాలివ్వాల ని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైతే కొందరిపై వేటు వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. హ్యాట్రిక్ విజయానికి ప్రధానంగాఅవరోధంగా భావిస్తున్న అంశాలపై ఇప్పటికే అంచనాకు వచ్చిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలను సైతం వేగవంతం చేయాలని నిర్ణయించారు. పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దడంపైనా దృష్టి సారించారు. అవసరమైన చోట బుజ్జగింపు చర్యలు చేపట్టే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు మంత్రులకు అప్పగించారు.అదే సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆత్మీయ సమ్మేళనాల్లో బయటపడ్డ విభేదాలు.. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా పలుచోట్ల బీఆర్ఎస్ నేతల నడుమ విభేదాలు బయటపడ్డాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ల కోసం సిట్టింగ్లు, ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో చాలాచోట్ల నేతలు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వేముల వీరేశం (నకిరేకల్), కోటిరెడ్డి(నాగార్జునసాగర్), కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు), శ్రీహరిరావు (నిర్మల్), పట్నం మహేందర్రెడ్డి (తాండూరు) తదితరులు ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనూ కొందరు అసమ్మతి నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరుపుతుండగా, తాజాగా నిర్మల్కు చెందిన కీలక నేత కూచాడి శ్రీహరిరావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే అవకాశముందని ఇప్పటికే కేసీఆర్ ఓ అంచనాకు వచ్చారు. వారి కదలికలపై ఇప్పటికే నిఘా వేసిన అధినేత.. బుజ్జగింపుల వంటి దిద్దుబాటు చర్యలకు, అవసరమైతే కొందరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికార పదవులు అనుభవిస్తూనే కొందరు, అవకాశాలు దక్కలేదని మరికొందరు అసమ్మతి గళం వినిపించడాన్ని కేసీఆర్ సీరియస్గా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన కూచుకుళ్ల దామోదర్రెడ్డికి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నించడంపై అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఓడినా, జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశమిచ్చిన విషయాన్ని కేసీఆర్ పార్టీల నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఇలాంటి నేతలను వదులుకోవడం ద్వారా పార్టీపై వ్యతిరేకతను ఉపేక్షించబోమనే గట్టి సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్! సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నియోజకవర్గాల్లో వీలైనంత మేర పరిస్థితిని చక్కదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే లోతైన సమాచారంతో కూడిన నివేదికలు కేసీఆర్కు సర్వే, నిఘా సంస్థలు అందజేశాయి. గ్రామ, మండల స్థాయి వరకు పార్టీల వారీగా ప్రభావం చూపే నాయకులు, క్రియాశీల వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఈ నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నివేదికల్లో బీఆర్ఎస్తో పాటు విపక్ష పార్టీల బలాబలాలకు సంబంధించిన అంచనాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతల వ్యవహార శైలికి సంబంధించిన అన్ని అంశాలను ఇప్పటికే పార్టీ ఇన్చార్జిలు నివేదికలు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని పార్టీ సమావేశాల్లో చెబుతూనే.. మరోవైపు పనితీరు మెరుగుపర్చుకోవాలని, ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. తద్వారా దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయం తప్పదని భావిస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్ కూడా అందరికీ టికెట్టు ఇస్తామని ఆరు నెలల ముందే ఎలా చెబుతామని ప్రశ్నించడం చూస్తుంటే.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయాన్ని కేసీఆర్ సిద్ధం చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
తాతలు, తండ్రుల పేర్లతో రాజకీయాలు చెల్లవు!
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్తలు, తాతల, తండ్రుల పేర్లు చెప్పుకొని ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవు. ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాళ్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే)’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రగతిభవన్లో మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మార్పు తీసుకొచ్చే బాధ్యత ప్రజలదే.. దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్టస్థితి, సూర్యరశ్మి వంటి ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి ఉండటం దారుణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే దీనికి కారణమన్నారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల వారు ఇంకా అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా.. తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ‘‘ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే.. పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయి. ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాదు.. మిషన్.. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని కేసీఆర్ చెప్పారు. మన కోసం పనిచేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విఫలమైంది! తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని, ప్రచారాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్లోని ప్రతి గ్రామంలో పార్టీ తరఫున రైతు, దళిత, మహిళ, యువ, బీసీ వంటి 9 కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ‘కోవర్టుల’అంశం కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయపార్టీల కార్యకలాపాలు ఊపందుకోగా, కోవర్టుల అంశాన్ని బీజేపీ మరోసారి చర్చకు తెరలేపింది. బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ కోవర్టులే తాను కాంగ్రెస్లో చేరబోతున్నానని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ తాజాగా చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కోవర్టులెవరో జాతీయ, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీలో కోవర్టులు ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు పార్టీ నాయకుల్లో సాగుతున్నాయి. ఇప్పటికే కోవర్టులపై ఈటల వ్యాఖ్యలు.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. బహిరంగంగా మాత్రం తమ పార్టీలో ఎవరూ లేరని గంభీరంగా చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఫలానా నేత అయ్యి ఉండొచ్చా.. సదరు నాయకుడి ప్రకటనలు, ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది’అనే దాకా చర్చలు వెళ్లాయి. ఇప్పుడు నందీశ్వర్గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. గత కొన్నిరోజుల్లో ముఖ్యనేతలు నాలుగైదు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలు పేర్లు ప్రస్తావించకుండా పత్రికల్లో ప్రచురితమవ్వడం, టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? మళ్లీ ఇప్పుడెందుకు ? నందీశ్వర్గౌడ్ వ్యాఖ్యలతో మళ్లీ కోవర్టుల పంచాయితీ ముందుకొచ్చింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో అధినాయకత్వం మేధోమథనం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని.. సంస్థాగతంగా అధ్యక్షుడి మార్పు, ఎన్నికల కమిటీ నియామకం వంటి మార్పుచేర్పులపై నాయకత్వం దృష్టి పెట్టిన సందర్భంలో ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఇవి ఎవరిని ఉద్ధేశించి చేసినవి? అనే చర్చ సాగుతోంది. ఈ కోవర్టుల గోలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్
సాక్షి, నాగర్కర్నూల్: రైతు పేరిట ఉన్న భూమి మార్చేందుకు ఇప్పుడు ఎమ్మార్వో, మంత్రి, చివరకు ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదని, ధరణితో కేవలం రైతు బొటన వేలికే భూముల రికార్డులు మార్చే అధికారం ఇచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. ధరణి తీసేస్తే రైతులు మళ్లీ పంట డబ్బుల కోసం చిట్టీలు పట్టుకుని సేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రూ.5 లక్షలు, వడ్లు అమ్మితే పంట డబ్బులు వెంటనే అందుతున్నాయని తెలిపారు. మంగళవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు. ధరణి లేకుంటే ఎన్ని పంచాయతీలయ్యేవో.. ‘ప్రపంచంలో ఎక్కడినుంచైనా బటన్ నొక్కి రైతు తన పేరిట ఉన్న భూమిని చూసుకునే చక్కని సదుపాయం ధరణి కల్పించింది. ధరణి లేకుంటే కోట్ల రూపాయలు పలుకుతున్న భూములతో ఎన్ని పంచాయతీలు, పోలీసు కేసులు, మర్డర్లు అయ్యేవో ఆలోచించాలి. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలన్న కాంగ్రెస్ నేతలకు ఇదంతా ఇష్టం లేదు. అందువల్ల వారినే బంగాళాఖాతంలో పడేయాలి. కాంగ్రెస్ మాటలు విని రైతులు సాధికారతను కోల్పోవద్దు. రైతుల మధ్య మళ్లీ భూ తగాదాలు పెరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. ధరణి తీసేస్తే వీఆర్వోలు, గిర్దావరీల చేతుల్లోకి మన బతుకులు వెళ్తాయి. మళ్లీ వాళ్లు రాసిందే రాత, గీసిందే గీతగా మారుతుంది. ఇప్పుడు అడుగుతున్నా ధరణి తీసేద్దామా? కాపాడుకుందామా? ధరణితో నూటికి 99 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఏవైనా సమస్యలు మిగిలి ఉంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిషాల్లో పరిష్కారం చేస్తారు..’ అని కేసీఆర్ అన్నారు. మంది మాటలకు ఆగం కావొద్దు.. ‘తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇందులో ఒకటిన్నర ఏళ్లు కరోనా, మరో ఏడాది నోట్ల రద్దుతోనే గడిచిపోయింది. అయినా మిగిలిన ఆరున్నర ఏళ్లలోనే దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం నంబర్వన్గా ఉంది. మంది మాటలు విని ఆగం కావొద్దు. కాంగ్రెస్ రాజ్యంలో దళారులదే భోజ్యం. ఆ ప్రబుద్ధుల పాలనలో కంప చెట్లే దిక్కయ్యాయి. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..’ అని సీఎం పేర్కొన్నారు. ఇకపై బంగారు తునకగా పాలమూరు.. ‘ఉద్యమ సమయంలో నన్ను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిపిస్తామని పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. అప్పుడు పాలమూరులో ఉద్యమం అంతగా లేకున్నా ఎంపీగా గెలిపించారు. ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడి కష్టాలు అర్థమయ్యాయి. కల్వకుర్తి తండాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. దుందుభి వాగుపై గోరటి పాట రాస్తూ ‘వాగు ఎండిపోయెరా, చేను ఎండిపోయెరా..’ అని బాధపడ్డడు. నేను ఇక్కడి ఎంపీగా ఉండగానే రాష్ట్రం సాధించుకున్న చరిత్ర పాలమూరుకు ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరును పంటల భూమిగా మార్చిన సంతోషం ఉంది. ‘వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా.. నేడు చెరువులన్నీ నిండి పన్నీటి జలకమాడే పాలమూరు’ అంటూ నేనే పాట రాసిన. నాగర్కర్నూల్ నుంచి శపథం చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఏ పని చేసినా భగవంతుడు ఓడించలే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. నార్లాపూర్, ఏదుల, మిగతా అన్ని రిజర్వాయర్లను ఆగస్టులోనే నింపుతాం. నా బలగం, బంధువులు తెలంగాణ ప్రజలే.. దేశంలో ఎక్కడకు పోయినా తెలంగాణ మోడల్ గురించే అడుగుతున్నారని కేసీఆర్ చెప్పారు. తన బలగం, బంధువులు తెలంగాణ ప్రజలేనని, మీరిచ్చిన ధైర్యంతోనే దేశ రాజకీయాల్లోకి పోవాలన్న నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాలమూరులో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇకపై నా పాలమూరును బంగారు తునకగా చూడబోతున్నాం. రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాం. కానీ వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం. కులవృత్తుల కుటుంబాలకు ఈ నెల 9 నుంచి ఇంటికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
నాయకత్వ శిక్షణ
మణికొండ (హైదరాబాద్): దేశ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకుంటూ పనిచేసే సమర్ధవంతమైన నాయకత్వం వర్తమాన దేశానికి అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో బోధన, శిక్షణ అవసరమని తెలిపారు. వీటన్నిటినీ ఒకేచోట అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగానే భారత్ భవన్ (సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్) నిర్మాణం చేపడుతున్నామన్నారు. సోమవారం హైదరాబాద్ నగర శివారు కోకాపేటలో 15 అంతస్తులతో నిర్మిస్తున్న భారత్ భవన్ పనులను సీఎం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమర్థత, మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా భారత్ భవన్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులకు ఇక్కడ సమగ్ర, సమస్త సమాచారం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన మేధావులు, నోబెల్ లారెట్లతో నాయకత్వ శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సౌకర్యాలు ఎన్నో.. భారత్ భవన్లో శిక్షణకు వచ్చే వారికి విలాసవంతమైన వసతులతో పాటు తరగతి గదులు, ప్రొజెక్టర్లతో కూడిన చిన్న, విశాలమైన సమావేశ మందిరాలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, ప్రపంచ మేధావుల రచనలు, గ్రంథాలు, స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా చానల్స్ సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామన్నారు. దేశ, విదేశీ వార్తా పత్రికలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. వార్తలు, కథనాలను ఎప్పటికపుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలపై అవగాహన కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. మీడియా రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా సీనియర్ టెక్నికల్ బృందాలు సైతం ఇక్కడ పనిచేస్తాయన్నారు. భారత్ భవన్కు కేటాయించిన 11 ఎకరాల స్థలంలో కొంత మేరకే నిర్మాణం చేపట్టి ఎక్కువ శాతం పచ్చదనం నింపి ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ, బోధన కొనసాగించే ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారు. భారత్ భవన్ పనులను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి ప్రశాంత్రెడ్డి తదితరులు భూ వరాహ హోమం.. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు వేదపండితులు నిర్వహించిన భూ వరాహ హోమం పూజల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ స్థలమంతా కలియ దిరిగి నాలుగు మూలలా సరిహద్దుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు, భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, పి.సబితారెడ్డి, మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ఎంపీలు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, జోగినిపల్లి సంతోష్కుమార్, బీబీ పాటిల్, దామోదర్రావు, బి.లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, కవిత, శేరి సుభాష్రెడ్డి, శంభీపూర్ రాజు, మహేందర్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..!
తెలంగాణలోని రాజకీయ పక్షాలు మరికొద్ది నెలల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవడానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఒక అవకాశంగా వినియోగించుకున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రగతికి తాము ఎంత కృషి చేసింది వివరిస్తూ, త్వరలో ఆయా వర్గాలకు ఇవ్వదలచిన కొత్త వరాలను ప్రకటించింది. తెలంగాణ మోడల్ దేశానికి మార్గదర్శి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విశేషం. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణ సాధన కాంగ్రెస్ వల్లే అయిందన్న విషయాన్ని గుర్తు చేయడానికి, తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో సహకరించిన ఆనాటి స్పీకర్ మీరా కుమార్ను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే అవకాశమా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పోటీగా ఉత్సవాలు జరపడమేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంది.. ఇందులో గవర్నర్ తమిళసై కూడా భాగస్వామి అవడం విశేషం. వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల తదితర రాజకీయ పక్షాల వారు కూడా తెలంగాణ ఉత్సవాలను తమదైన శైలిలో నిర్వహించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయ ప్రాంగణంలో అట్టహాసంగా ఉత్సవం నిర్వహించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అదంతా శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లే అనిపిస్తుంది. అయితే అదే సమయంలో.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కొత్త హామీలు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్, మిషన్ భగీరధ, దళిత బంధు, హైదరాబాద్లో చేపట్టిన అభివృద్ది, రైతు బంధు, కొత్త నీటి ప్రాజెక్టులు మొదలైనవాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి అభివృద్ది తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు ఆయన స్పీచ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యం నెరవేరినట్లే అన్న భావం స్పురించింది. అయితే అదే సమయంలో కొత్తగా బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం గమనించదగ్గ అంశమే. ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి.. దళిత బంధు కింద దళితులకు పది లక్షల ఇస్తుండడంపై మిగిలిన వర్గాలలో ఏర్పడిన కొంత అసంతృప్తిని చల్లార్చడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. మరో వైపు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా ఆయన తెలిపారు. స్థూలంగా చూస్తే కేసీఆర్లో మళ్లీ గెలుస్తామన్న ఆత్మ విశ్వాసం కనిపించినప్పటికి, ఎక్కడో ఏదో తేడా వస్తుందో అన్న సంశయం కూడా ఉందనిపిస్తుంది. అందుకే కొత్త హామీలను ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలలో వ్యతిరేకతను పొగొట్టడానికి తెలంగాణ ఉత్సవాలను ఆయన ఉపయోగించుకున్నారని భావించవచ్చు. ఇరవై ఒక్క రోజులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వీరికి పోటీగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గోల్కండలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాని , బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లు తెలంగాణ ఏర్పాటువల్ల కేవలం కెసిఆర్ కుటుంబమే బాగుపడిందన్న సందేశం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంజయ్ మాత్రం యధా ప్రకారం ఎమ్.ఐ.ఎమ్ ఆఫీస్ దారుసలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇస్తామని అనడం అతిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాగా, గవర్నర్ తమిళసై కూడా రాజ్ భవన్ లో ఉత్సవం జరిపి కొందరి అభివృద్ది అందరి అభివృద్ది కాదని ఎద్దేవా చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం జరిపే కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదు. అది అసంతృప్తిగానే ఉన్నా, తమిళసై స్వయంగా సందర్భానుసారం కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకత నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ముఖ్య అతిధిగా పిలిచి తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను ప్రజలకు మరోసారి వివరించే యత్నం చేసింది. చదవండి: రాహుల్ ‘తుడిచివేత’ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో..? లక్ష్యం నెరవేరిందా? తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందని ఆమె అన్నారు. మీరాకుమార్ తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో తీసుకున్న చొరవను ఆయా నేతలు వివరించారు.బిల్లు పాస్ అయినప్పుడు కెసిఆర్ లోక్ సభలో లేరని కాంగ్రెస్ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి గుర్తు చేశారు. సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని కేసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బాగా నష్టం జరిగిందని ఆయన వెల్లడించడం విశేషం. ఎన్నికల ప్రచారానికి రిహార్సల్ తెలంగాణకు ఒక్క పైసా నిధులు ఇవ్వబోమని కిరణ్ అనడం వల్ల డామేజీ అయిందని హనుమంతరావు చెప్పారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అనలేదు. కాకపోతే హరీష్ రావుతో వాదోపవాదాలలో సిద్దిపేటకు నిధులు ఇవ్వబోనన్న మాటను మొత్తం తెలంగాణకు వర్తింప చేసి తెలంగాణవాదులు ప్రచారం చేశారు. అయినా అదంతా చరిత్ర. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందన్నదానిపై ఆత్మ విమర్శ చేసుకుంటే ఉపయోగం తప్ప, ఇప్పుడు అయిపోయినదాని గురించి నిందించుకుంటే ఏమి ప్రయోజనం? ఏది ఏమైనా శాసనసభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు రిహార్సల్ అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
ధరణిని వద్దన్న కాంగ్రెస్.. బంగాళాఖాతంలోకే!
నిర్మల్: రైతులకు ఎంతో మేలు చేస్తున్న ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ దుర్మార్గులనే బంగాళాఖాతంలోకి విసిరేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. ధరణితోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు, రైతు బీమా సొమ్ములు పడుతున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహాణీలు, భూమి రికార్డులు మార్చేయడం వంటి ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటికి చెక్ పెట్టేందుకే ధరణిని తెచ్చామని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ మళ్లీ వస్తే రైతు బంధు, దళిత బంధు పథకాలు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.56 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయంతోపాటు బీఆర్ఎస్ భవన్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం, పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక క్రషర్ గ్రౌండ్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. సభ ప్రారంభమయ్యే సమయంలో కాసేపు వర్షం కురిసింది. అయినా ప్రజలు వేచి ఉన్నారు. కేసీఆర్ కూడా తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ దేశంలో రైతులకు మేలు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదేనని, దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ పక్కా అన్నారు. ‘‘మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి రైతులు రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేస్తారా? రైతు బీమా పైసలు నేరుగా నామినీ ఖాతాలో వేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్.. మాకు మీరు కావాలె. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని అక్కడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు..’’అని కేసీఆర్ చెప్పారు. దోపిడీని ఆపేందుకే ధరణి ధరణి పోర్టల్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటారా? ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా డబ్బులు ఖాతాలలో పడుతున్న విషయం వాళ్లకు తెలుసా? ఇప్పుడు ధరణి వద్దంటున్న దుర్మార్గులు 50ఏళ్లపాటు పాలించారు. రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. కాంగ్రెస్ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం చూశాం. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారేసరికి పహాణీలు మారిపోయేవి. ధరణితో ఆ సమస్యలన్నీ తీరాయి. ఇలాంటి ధరణి ఉండొద్దా? ధరణి పోర్టల్ను తీసివేస్తామంటున్న కాంగ్రెస్ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలి..’’అని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దోపిడీతో బాధలు పడ్డామని.. మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ముగింపు పలుకుతారని కేసీఆర్ పేర్కొన్నారు. వేల కోట్లతో ఉచిత్ విద్యుత్ ఇస్తున్నాం.. రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని.. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. రైతులకు ఎన్ని మీటర్లు పెట్టావని అడిగేవారే లేరని పేర్కొన్నారు. ఉద్యోగుల కృషితో అద్భుత ఫలితాలు కొత్త కలెక్టరేట్ను ప్రారంభించిన తర్వాత జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సమష్టిగా కృషి చేసి అద్భుత ఫలితాలు సాధించగలిగామన్నారు. ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందని.. ముఖ్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇందుకు అధికారుల కృషే కారణమని అభినందించారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల్లో నిరుపేదలు ఉన్నారని, వారికోసం చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డి, రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు సీఎం వరాలు తన పర్యటన సందర్భంగా నిర్మల్ జిల్లాకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున.. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నామని.. జేఎన్టీయూ ఆధ్వర్యంలో దానిని ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా నంబర్ వన్గా నిలవడంపై టీచర్లు, విద్యార్థులను అభినందించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తామని.. దీనికి పునాదిరాయి వేసేందుకు త్వరలోనే బాసరకు వస్తానని కేసీఆర్ తెలిపారు. మండలం సార్.. చూసిన.. చూసిన.. బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలను మండలంగా ఏర్పాటు చేయాలంటూ సొనాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్మల్ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మేరకు గట్టిగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దానిపై స్పందిస్తూ.. ‘చూసిన.. చూసిన..’ అని సమాధానమిచ్చారు. దీంతో తమ విజ్ఞప్తి సీఎం దృష్టికి వెళ్లిందని సొనాల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో విస్తరణ కోసం పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చినా.. ప్రస్తుతానికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాల విస్తరణ చేపట్టినా.. అంతకన్నా ముందు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన నేతగా ఇప్పటికే గుర్తింపు పొందిన కేసీఆర్.. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఘనతను సొంతం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఈ ఏడాది ఏప్రిల్లోనే ఎన్నికల సన్నద్ధతను ప్రా రంభించిన కేసీఆర్.. తాజాగా ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో అంతర్భా గం చేస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకోవడం దిశగా అడుగులు వేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు పూర్తికాగానే పూర్తిస్థాయిలో ఎన్నికల సమరానికి కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి.. అక్టోబర్ 10న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభతో ఎన్నికల సన్నద్ధతను పతాక స్థాయికి తీసుకెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెంచుకునేందుకూ.. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ద్వారా జాతీయస్థాయిలో గ్రాఫ్ పెంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే.. 2024 ఆరంభంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఆకర్షణ పెరుగుతుందని సీఎం లెక్కలు వేస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలోని సుమారు 20 లోక్సభ స్థానాలపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందని మహారాష్ట్ర బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటిదాకా విపక్షాలకు దూరమే! జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు విపక్ష పార్టీల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు తాము సమ దూరమనే సంకేతాలు ఇవ్వకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంటాయనే అభిప్రాయంలో పార్టీ అధినేత ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి. ఇటీవల ప్రగతిభవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో జరిగిన భేటీ సందర్భంగా కూడా జాతీయ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారని అంటున్నాయి. భావసారూప్య పార్టీలతో స్నేహభావంతో వ్యవహరిస్తామని చెప్తూనే.. జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యతపై ఆచితూచి అడుగులు వేయాలని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నాయి. -
పదో వసంతంలోకి తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం పదో వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి మూడు వారాల పాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అన్ని శాఖల పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఉదయం 7.30గంటలకే జాతీయ జెండా ఆవిష్కరించాలని.. తర్వాత సచివాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హెచ్ఓడీల అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయానికి హెచ్ఓడీల కార్యాలయాల నుంచి ఉద్యోగులను తరలించడానికి ప్రత్యేకంగా 278 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. వివిధ హెచ్వోడీల్లో పనిచేస్తున్న దాదాపు 13,510 మంది అధికారులు, ఉద్యోగులను ఈ వేడుకలలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శాఖలు, విభాగాల వారీగా ఉద్యోగులను తీసుకుని వచ్చే బస్సుల కోసం పార్కింగ్ స్థలంతోపాటు, వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు లాన్లో ఎక్కడెక్కడ ఆసీనులు కావాలో తెలియచేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెచ్ఓడీల ఉద్యోగుల్లో కనీసం 60శాతం మంది సచివాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. రోజుకో కార్యక్రమంతో.. ఇక దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రోజు ఒక్కో రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సైతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
ధూపదీప నైవేద్య భృతి రూ.4వేలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆలనాపాలనా లేని ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తున్న భృతిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు వర్తిస్తున్న ధూపదీప నైవేద్య పథకాన్ని మరో 2,796 ఆలయాలకూ వర్తింపచేయనున్నట్టు చెప్పారు. గోపనపల్లిలో 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని కేసీఆర్ పలువురు పీఠాధిపతుల సమక్షంలో బుధవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. అనువంశిక అర్చకుల విధానాన్ని పునరుద్ధరించాలంటూ కొన్నేళ్లుగా అర్చక కుటుంబాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్లో చర్చించి త్వరలో పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. తన సంజీవని వ్యాఖ్యతో మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లాలోని కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. సర్వజన సమాదరణ ‘లోకా సమస్తా సుఖినోభవన్తు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. సర్వజన సమాదరణ అన్నది తెలంగాణ ప్రభుత్వ విధానం, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లో ఎంతోమంది పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే 2017లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వంద కోట్ల నిధులను దానికి కేటాయిస్తున్నాం. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ (బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ స్టేట్) పథకం కింద రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.150 కోట్లను వెచ్చించింది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సనాతన సంస్కృతి కేంద్రంగా ‘బ్రాహ్మణ సదనం’ను నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణ వివాహాలకు ఉచిత కల్యాణ వేదికగా, కులాలతో ప్రమేయం లేకుండా పేదలు తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాలకు పురోహితులను ఉచితంగా పంపే సేవాకేంద్రంగా విలసిల్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు వివిధ వ్రతాలకు సంబంధించిన పుస్తకాలతో సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు చేయాలని కోరారు. వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు అందులో ఉంచాలన్నారు. సూర్యాపేటలో డాక్టర్ ఎ.రామయ్య ఇచ్చిన ఎకరం స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లోనూ బ్రాహ్మణ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా శృంగేరీ పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆడియో సందేశ రూపంలో ఆశీర్వదించారంటూ వారితోపాటు ప్రత్యక్షంగా విచ్చేసిన ఇతర పీఠాధిపతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు.. ఓం శాంతి.. శాంతి.. శాంతిః అన్న శ్లోకంతో సీఎం ప్రసంగాన్ని ముగించారు. యాగంలో పాల్గొన్న సీఎం బుధవారం ఉదయం తొలుత సదనానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా యాగశాలకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంకు శంఖ నాదం, వేద పఠనం మధ్య వారు తలపాగా, శాలువాలతో ఆశీర్వదించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులను పలకరించారు. ప్రాంగణంలో కొనసాగుతున్న చండీయాగం, సుదర్శనయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తర్వాత వాస్తుపూజ నిర్వహించారు. బ్రాహ్మణ సదనం శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తర్వాత సభాస్థలిలో పీఠాధిపతులకు సత్కరించి వారికి పాదాభివందనం చేశారు. పుష్పగిరి పీఠం విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సుభుధేంద్ర తీర్థస్వామి, మదనానంద సరస్వతీ పీఠం మాధవానంద స్వామి, హంపీ విరూపాక్షపీఠం విద్యారణ్య భారతీ స్వామి, ధర్మపురి పీఠం సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, సీతారాంబాగ్ జగన్నాథ మఠం వ్రతధర రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సతీశ్, బాల్క సుమన్, నగర మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, జస్టిస్ భాస్కర్ రావు, అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: నయా ‘అసెంబ్లీ’పై నజర్.. నిర్మాణంలో ధోల్పూర్ ఎర్రరాయి!
సాక్షి, హైదరాబాద్: కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అనువైన స్థలాలు వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి రోడ్డులోని పాటిగడ్డలో దాదాపు 40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైందని సమాచారం. కాగా ఆదర్శ్నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాంగణంలో 17 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అసెంబ్లీ భవనం అక్కడ నిర్మించినా బాగానే ఉంటుందని సూచించినట్టు తెలిసింది. ఎర్రమంజిల్లో 2019లోనే భూమిపూజ.. రాష్ట్ర సచివాలయానికి కొత్తగా భవనం సమకూరటంతో ప్రభుత్వం ఇక అసెంబ్లీ భవనంపై దృష్టి పెట్టింది. వాస్తవానికి ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకొన్న సచివాలయ భవనంతో పాటు అసెంబ్లీ కొత్త భవన నిర్మాణానికి కూడా 2019లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేశారు. సచివాలయ భవనాన్ని పాత భవనాలు కూల్చి అదే స్థానంలో నిర్మించగా, అసెంబ్లీ భవనాన్ని మాత్రం ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్యాలెస్ ఉన్న స్థానంలో నిర్మించాలని నిర్ణయించి అక్కడ భూమి పూజ చేశారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎర్రమంజిల్ భవనం వారసత్వ కట్టడం కావటం, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడినది కావటంతో, దాన్ని కూల్చాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు ఆ భవనం ఉన్న ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తే భవిష్యత్తులో పార్కింగ్ సమస్య తలెత్తుతుందని, ఆ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటాయని అధికారులు నివేదించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అక్కడ అసెంబ్లీ భవన నిర్మాణ ఆలోచనను విరమించుకుంది. తర్వాత ప్రస్తుత అసెంబ్లీ భవనం ఉన్న చోటుకు పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్లో నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా అప్పట్లో జరిగింది. అయితే పబ్లిక్ గార్డెన్ నగరంలోనే తొలి అతిపెద్ద ఉద్యానవనం కావటం, అందులో ఇప్పటికీ వేల సంఖ్యలో చెట్లు ఉండటంతో దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అక్కడ అసెంబ్లీకైతేనే బాగుంటుంది! రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా సచివాలయం ముందున్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విభాగాధిపతులకు సమీకృత భవన సముదాయం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు జంట భవనాలను నిర్మించాలని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ఆదర్శ్నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం, పాటిగడ్డ స్థలం పరిశీలనకు వచ్చాయి. ఇందులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం అయితే బాగుంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. అయితే అది అధికారులకు సంబంధించిన జంట భవనాల కోసం కన్నా అసెంబ్లీకైతేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు..! ప్రస్తుతం అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు సొంతంగా భవనాలున్నాయి. అవన్నీ విశాలంగానే ఉన్నాయి. అవి సచివాలయ భవనానికి కేవలం నాలుగైదు కి.మీ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విభాగాలన్నింటికీ సమీకృత భవన సముదాయం నిర్మిస్తే వేల సంఖ్యలో ఉద్యోగులు ఒక్కచోటకు రావాల్సి ఉంటుంది. పంచాయితీరాజ్, నీటిపారుదల, రోడ్లు భవనాలు, రవాణా.. ఈ నాలుగు శాఖల భవనాల్లోనే ప్రస్తుతం మూడు వేల మంది పనిచేస్తున్నారు. ఇతర విభాగాలన్నింటినీ కలిపితే ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణం ఇరుకు రోడ్ల మధ్య ఉన్నందున వాటితో పాటు, అక్కడికి దారితీసే ఇతర రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ చిక్కులేర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ విభాగాలను కొత్త భవనాల్లోకి తరలిస్తే, వాటికి ఉన్న ప్రస్తుత భవనాలు నిరుపయోగంగా మారతాయి.తదుపరి సమావేశాల్లో ఈ దిశలో చర్చ జరిగే అవకాశం ఉందని, దీనిపై సీఎం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. కొత్త అసెంబ్లీ భవనానికీ ధోల్పూర్ ఎర్రరాయి! రాజస్థాన్లోని ధోల్పూర్ గనుల నుంచి తెప్పించిన ఎర్ర రాయి.. భవిష్యత్తులో నిర్మించబోయే తెలంగాణ అసెంబ్లీ భవనానికి వినియోగిస్తారని సమాచారం. ఇటీవల కొత్త సచివాలయ భవనం కోసం ధోల్పూర్లో ఓ గని నుంచి దాదాపు 4 వేల క్యూబిక్ మీటర్ల ఎర్రరాయిని తెప్పించారు. దాన్ని సచివాలయ బేస్మెట్, భవనం పై భాగంలో వినియోగించారు. దానికి సరిపోగా మరో వేయి క్యూబిక్ మీటర్ల వరకు మిగిలింది. దీన్ని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయం ఉండే ఇర్రమ్మంజిల్కు తరలించారు. అక్కడి పురాతన ప్యాలెస్ ముందు భాగంలో నిల్వ చేశారు. అది ఖరీదైన రాయి కావటంతో.. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉంచారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆసుపత్రి భవనాల నిర్మాణం జరుగుతోంది. వరంగల్లో రాష్ట్రంలోనే ఎత్తయిన ఆసుపత్రి భవనం రూపుదిద్దుకుంటుండగా, మరో పక్షం రోజుల్లో నిమ్స్ విస్తరణ పనులు మొదలు కానున్నాయి. అయితే ఆసుపత్రి భవనాలకు ఈ ఎర్రరాయి వినియోగం సరికాదని అధికారులు నిర్ణయించారు. ఇక సచివాలయం తరహాలోనే అసెంబ్లీ భవనాన్ని కూడా ప్రత్యేక డిజైన్తో నిర్మించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎర్ర రాయిని దానికి వినియోగిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త అసెంబ్లీ భవనానికి ఏ స్థలం అయితే బాగుంటుందో ఇప్పటివరకు తేలనప్పటికీ, నగిషీలకు బాగా నప్పే ధోల్పూర్ ఎర్రరాయి అయితే సిద్ధంగా ఉన్నట్టయింది. -
‘దశాబ్ది’ స్కాన్!
మూడో వంతు నియోజకవర్గాలపై నిశిత పరిశీలన.. ఓ వైపు మారుతున్న రాజకీయ పరిణామాలు.. మరోవైపు దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇలాంటి కీలకమైన సమయంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇటీవలి వరకు జరిగిన ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన తీరు ఆధారంగా ఎమ్మెల్యేలపై ఓ అంచనాకు వచ్చిన ఆయన.. కొందరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారన్నది పరిశీలించి.. పనితీరు మార్చుకోనివారిపై వేటు వేయాలని, తీవ్ర అవినీతి ఆరోపణలున్న వారిని పక్కనపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడో వంతు నియోజకవర్గాల్లో నిశిత పరిశీలన జరుపుతున్నారని అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమాన్ని ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. 21రోజుల పాటు సాగే దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు మమేకమయ్యే తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్, మేలో రెండు నెలల పాటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన విధానం, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ ఇన్చార్జులు కేసీఆర్కు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ యంత్రాంగాన్ని కలుపుకొనిపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఈ క్రమంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణలోనూ ఎమ్మెల్యేల తీరును మదింపు చేసి.. టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అనుభవంతో.. 2020లో గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలికి జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ కార్పోరేటర్లపై వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడైనా.. సిట్టింగులకే టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత మొగ్గు చూపారు. కానీ ఆ వ్యతిరేకతకు తోడు మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు కూడా.. పలువురు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల ఫలితాలు తేల్చాయని, అదే తరహాలో నిఘా సంస్థల నుంచి కేసీఆర్కు నివేదికలు అందాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. ఇక పార్టీలోనే ఉంటూ తలనొప్పులు సృష్టిస్తున్నవారు, అవకాశాలు దక్కినా అసంతృప్త స్వరం వినిపిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిపై కేసీఆర్ దృష్టి సారించారని.. అవసరమైతే వారిని బయటికి పంపాలని భావిస్తున్నారని సమాచారం. 40 పర్సెంట్ కమిషన్ వివాదంతో కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 40 నియోజకవర్గాలపై ఫోకస్! నకిరేకల్, ఇల్లెందు, తాండూరు, పాలేరు, బెల్లంపల్లి, తుంగతుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, జహీరాబాద్, నాగార్జునసాగర్, ఎల్లారెడ్డి, ఉప్పల్, కొత్తగూడెం, ఖానాపూర్, జగిత్యాల, హుస్నాబాద్, షాద్నగర్, మహబూబాబాద్, కోదాడ, వరంగల్ తూర్పు, మెదక్, అలంపూర్ సహా సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ, ఎమ్మెల్యేల పనితీరును కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్ట బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పలుచోట్ల టికెట్ కోసం తీవ్ర పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల స్థానిక నేతల అసంతృప్తి, ఇంకొన్ని చోట్ల అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయని అంటున్నాయి. మొత్తం నియోజకవర్గాల్లో మూడో వంతు చోట్ల టికెట్ల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. 119 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్ఎస్కు 103 మంది సభ్యులు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తామని పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ 103 మందిలో 46 మంది వరుసగా రెండుసార్లు, మరో 18 మంది మూడు కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఈ క్రమంలో సహజంగానే వారిపై నెలకొనే ప్రతికూలత.. పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
కేసీఆర్ నిర్ణయం.. నూతన సచివాలయం సమీపంలో ట్విన్ టవర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన నూతన సచివాలయం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో కీలకమైన పనులన్నీ ఒకే చోట జరిగేందుకు మార్గం పడింది. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాధిపతుల (హెచ్ఓడీల) కార్యాలయాలను ఒకే గొడుగు కిందికి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇందుకోసం కొత్త సచివాలయానికి సమీపంలో ట్విన్ (జంట) టవర్లు నిర్మించాలని.. దీనికి సంబంధించి స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. హెచ్ఓడీల వివరాలపై ఆరా.. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయం ఉద్యోగుల విధి నిర్వహణకు అత్యంత అనువుగా ఉందని.. ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారని సమీక్షలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో.. మౌలిక వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్లను నిర్మించే అంశంపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని హెచ్ఓడీల వివరాలు, మొత్తం ఉద్యోగుల సంఖ్య, అవసరమైన స్థలం, సదుపాయాలు తదితర అంశాలపై ఆరా తీశారు. సచివాలయానికి సమీపంలో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మంచి స్థలాలను అన్వేషించాలని.. హెచ్ఓడీల అధికారులు, సిబ్బంది తరచూ సచివాలయానికి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. సమీపంలోనే ట్విన్ టవర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్థలం ఎంపిక పూర్తయిన వెంటనే ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపడతామని ప్రకటించారు. ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరగాలని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాల విషయంలో.. సంబంధిత శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్కు వివరించారు. జూన్ 9 నుంచి కుల వృత్తులకు ఆర్థిక సాయం కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎంబీసీ కులాలు, రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతుల ప్రజలకు దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ గంగుల కమలాకర్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు వివరించారు. దీంతో దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. అమరుల స్మారకం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ లుంబినీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ ఈఈ శశిధర్కు సూచించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బీఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో ట్వీన్ టవర్స్? ఆదర్శ్నగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో హెచ్ఓడీల కార్యాలయాల కోసం ట్వీన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కార్యాలయాల కోసం 40 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అవసర మని అంచనా వేసినట్టు సమాచారం. అంతమేర భవనాల నిర్మాణానికి ఆదర్శ్నగర్ స్థలం అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
ఇవి ఎమర్జెన్సీ రోజులు!
చాలా రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోంది. రకరకాల దాడులు చేస్తూ వేధించడంతోపాటు అనేక రకాల దుర్మార్గాలకు బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ మూడు పర్యాయాలు గెలిచినా.. కేంద్రం దుర్మార్గంగా లెఫ్టినెంట్ గవర్నర్ను తెచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఊపిరాడనీయకుండా చేసింది. కేజ్రీవాల్ ప్రభు త్వం సుప్రీంను ఆశ్రయించి ఉపశమనం పొందినా.. మోదీ సర్కారు ఆర్డినెన్స్ తెచ్చి ఢిల్లీ ప్రజలను అవమానించింది. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. – కేసీఆర్ ప్రజా ప్రభుత్వాలను పనిచేయనీయరా? ప్రజలు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. ఆ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ పని చే యనీయరు. విపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నారు. ఈడీ, సీబీఐల ను పంపి బెదిరించి ఎమ్మెల్యేల్లో చీలిక తె స్తారు. లేకుంటే గవర్నర్లను దుర్వినియోగం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వాన్ని పనిచేయనీయరు. తెలంగాణ గవర్నర్ సైతం బిల్లులు పాస్ చేయడం లేదు. – కేజ్రీవాల్ సాక్షి, హైదరాబాద్: దేశంలో కేంద్ర ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు మితిమీరి పరాకాష్టకు చేరుకుంటున్నాయని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ పనిచేయనీయడం లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పుకు కూడా అతీగతీ లేకుండా పోయిందని, ఎమర్జెన్సీ రోజులు గురుకొస్తున్నా యని పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీకి ముందు ఇలాంటి పరిస్థితే ఉండేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే అధికారులందరూ పనిచేయాలని.. వారి బదిలీలు, ఇతర అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. కానీ కేంద్రం ఆ తీర్పును కాలరాసేలా ఆర్డినెన్స్ తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు అర్వింద్ కేజ్రివాల్, భగవంత్సింగ్ మాన్లతో కూడిన బృందం.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయింది. కేంద్ర ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు సీఎంలు మాట్లాడారు. ఇందులో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘చీకటి రోజులు అంటూ ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు గొంతు చించుకుని మాట్లాడుతారో.. ఇప్పుడు సరిగ్గా అలానే జరుగుతోంది. నాడు అలహాబాద్ హైకోర్టు తీర్పును తోసిరాజంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఇప్పట్లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన తరహాలోనే అప్పుడు చేసింది. నాడు మహాశక్తివంతురాలు అనుకున్న ఇందిరాగాంధీని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో దేశం పక్కన పెట్టేసింది. ఆ స్థానంలో జనతా పార్టీని గద్దెనెక్కించినా.. ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్లీ ఇందిరాగాంధీని ప్రజలు గెలిపించారు. ఏదైనా తప్పు జరుగుతుంటే భారతదేశం ప్రతిస్పందిస్తుంది. మీరూ (ప్రధాని మోదీ) ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు. మీకు, వారికి ఏమీ తేడా లేదు. నిన్నగాక మొన్న కర్ణాటక ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టిన్రు. వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసిపడేశారు. ఇకనైనా బుద్ధి రావాలి. రైతు చట్టాల తరహాలో ఢిల్లీ ఆర్డినెన్స్ను కూడా ఉపసంహరించుకోవాలి. క్షమాపణ కోరడం మీ వృత్తే కదా (మాఫీ కే సౌదాగర్)! ఉపసంహరించుకోకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు. ఆర్డినెన్స్ను ఓడిస్తాం ఢిల్లీ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మేమంతా (విపక్షాలు) అర్వింద్ కేజ్రివాల్ పక్షాన నిలబడతాం. లోక్సభ, రాజ్యసభలలో మా శక్తినంతా ప్రయోగించి ఆర్డినెన్స్ను ఓడిస్తాం. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు నన్ను అర్వింద్ కేజ్రివాల్ స్వయంగా తీసుకెళ్లి అక్కడ జరిగిన మంచి పనులను చూపించారు. మొహల్లా క్లినిక్స్, తాగునీటి సరఫరా, విద్యుత్ రాయితీలు వంటివి పేదలకు మేలు చేస్తున్నాయి. ప్రజాదరణ గల ప్రభుత్వం కాబట్టే ప్రజలు మూడు సార్లు గెలిపించారు. అలాంటి పాపులర్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం సరికాదు. ఇలాంటి దౌర్భాగ్యం ఎన్నడూ చూడలేదు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా.. కేంద్రం ఎన్నో కుయుక్తులు పన్నింది. గెలిచిన మేయర్ను ప్రమాణ స్వీకారం చేయనీకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గవర్నర్ పదవి అలంకారప్రాయమైనది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఏర్పాటు గవర్నర్ల బాధ్యత. కానీ పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సెషన్ పెట్టనంటే.. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్యాన్ని దేశంలో ఎన్నడూ చూడలేదు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముగ్గురు సీఎంలతోపాటు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ఆప్ ఎంపీలు సంజయ్సింగ్, రాఘవ్ చద్దా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుంటే ఎలా?: కేజ్రివాల్ ఢిల్లీలో పాలనా వ్యవస్థల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రధాని పాటించకుంటే ఎలాగని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయనీయకపోవడం దుర్మార్గమని.. ఒక ప్రధాన మంత్రి, 31 రాష్ట్రాల గవర్నర్లు కలిసి దేశాన్ని ఏలుతారంటే, ఇక దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని నిలదీశారు. ‘‘2015 ఫిబ్రవరిలో మా ప్రభుత్వం తొలిసారిగా అధికారంలో వస్తే.. మే 23న నోటిఫికేషన్ ద్వారా కేంద్రం మా అధికారాలను లాక్కుంది. మాకంటే ముందు పాలించిన సీఎం షీలా దీక్షిత్ నియంత్రణలోనే ఢిల్లీలో అన్ని పాలన వ్యవస్థలు పనిచేశాయి. ఢిల్లీ సీఎంగా వైద్య, విద్య శాఖల కార్యదర్శులను బదిలీ చేసే అధికారం నాకు లేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడాం. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 11న ఢిల్లీ ప్రజల పక్షాన తీర్పు ఇచ్చింది. కానీ కేంద్రం ఈ నెల 19న సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానం. ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించనంటే దేశం ఎలా నడుస్తుంది?’’ అని కేజ్రివాల్ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ను ఓడిస్తాం.. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని.. 238 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 93 ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు వస్తే బీజేపీయేతర పార్టీలన్నీ కలసి ఓడించగలమని కేజ్రివాల్ చెప్పారు. ఈ బిల్లును ఓడించడం ద్వారా 2024లో దేశంలో బీజేపీ అధికారంలోకి రాదని ప్రజల్లో విశ్వాసం కలిగించిన వాళ్లం అవుతామని.. ఇది 2024 ఎన్నికలకు సెమీఫైనల్ వంటిదని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్కు ఢిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. బీజేపీ కార్యాలయాలుగా రాజ్భవన్లు: భగవంత్సింగ్ రాజ్భవన్లు బీజేపీ కార్యాలయాలుగా, గవర్నర్లు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్ విమర్శించారు. పంజాబ్లోని 117 స్థానాల్లో 92 స్థానాలను ఆప్ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టేందుకు గవర్నర్ నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచారని చెప్పారు. సీఎంలు ఫోటోలు దిగడానికే నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లాలని.. ఎందుకంటే అక్కడికి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని చెప్పారు. అందుకే శనివారం నాటి నీతి ఆయోగ్ భేటీకి తాను, కేజ్రివాల్ వెళ్లలేదన్నారు. -
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖర్రావు గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలి దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. హరితహారం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం, వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, వానాకాలం పంటలకు ఇన్పుట్ సబ్సిడీగా రైతుబంధు పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్కు షాక్