ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు | jubilee hills mla maganti gopinath pada yatra on friday | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు

Published Fri, Jun 12 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు

ఎమ్మెల్యే పాదయాత్ర: సమస్యలు ఏకరువు పెట్టిన స్థానికులు

రహమత్‌నగర్ (హైదరాబాద్): రహమత్‌నగర్ డివిజన్ కార్మికనగర్ బస్తీలో మౌలిక సమస్యలపై జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే బస్తీలోని మహిళలతో వారి సమస్యల గురించి ప్రస్తావించారు. కార్మికనగర్ బస్తీలో మురుగు నీటి సమస్య విపరీతంగా ఉందని స్ధానికులు ఎమ్యెల్యే మాగంటి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా బస్తీల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాగంటి గోపీనాథ్ అధికారులను ఆదేశించారు.

ఈ నెల 18 న రహమత్‌నగర్ డివిజన్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద జరిగే సమీక్ష సమావేశంలో స్ధానికులు తమ సమస్యను తెలపితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.. కార్మికనగర్ డ్రైనేజి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement