ఆ ‘పోరంబోకు’తో నాకేంటి సంబంధం | MLA dhulipalla Narendra Kumar fire | Sakshi

ఆ ‘పోరంబోకు’తో నాకేంటి సంబంధం

Mar 10 2016 2:10 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఆ ‘పోరంబోకు’తో  నాకేంటి సంబంధం - Sakshi

ఆ ‘పోరంబోకు’తో నాకేంటి సంబంధం

రాజధాని దురాక్రమణ పేరిట సాక్షి పత్రిక, చానల్ తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల

 సాక్షి, హైదరాబాద్: రాజధాని దురాక్రమణ పేరిట సాక్షి పత్రిక, చానల్ తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ ఆయన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీపై, సాక్షి పత్రిక, చానల్‌పై దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వానాన్ని స్వీకరించేందుకు సైతం జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారన్నారు.

వాగు పోరంబోకును తాను కాజేసినట్టు సాక్షి పత్రిక పెద్ద కథనాన్ని రాసిందని, వాస్తవానికి ఆ వాగుకు తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వాగుకు 1993లో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందన్నారు. అప్పటికి తాను చాలా పిల్లవాడినని చెప్పారు. సర్వే నెంబర్లు 270/బీ6 లో 81 సెంట్లు, 274/బీ7లో 96 సెంట్లు, 274/బీ6లో 81 సెంట్లు, 273/బీలో 1.31 ఎకరాలకు పట్టాలున్నాయని, 2009లో ఈ 3.89 ఎకరాలను దేవరపు సాంబశివరావు కొన్నారని, దీంతో తనకేమి సంబంధమో చెప్పాలన్నారు. ఈ వ్యవహారమై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement