కబ్జా భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ | regularisation for lands Invaded in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కబ్జా భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

Published Wed, Jan 13 2016 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

regularisation for lands Invaded in Andhra Pradesh

హైదరాబాద్: ఆక్రమణలకు గురైన భూముల క్రమబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా 500 గజాల వరకు ఆక్రమిత భూములను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు సబ్ కమిటీ తెలిపింది.

100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31వరకు ఆక్రమణలో ఉన్న భూములకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ మేరకు వచ్చే ఏపీ కేబినెట్ సమావేశానికి సబ్ కమిటీ క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలు అందజేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement