మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ
Published Fri, Feb 19 2016 9:07 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లి ఆల్విన్కాలనీలోని భ్రమరాంభ-మల్లికార్జున ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ చోరీ చేశారు. గురువారం ఉదయం గుర్తించిన ఆలయ నిర్వాహకుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement