
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా రేపు మరికొన్ని నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. గ్రూప్-2 పోస్టుల వివరాలు....