
విఐపి రిపోర్టర్
కమ్యూనిటీ హాల్ లేదు.. ఇళ్ల పట్టాల్లేవు.. బస్ షెల్టర్ లేక అవస్థలు.. పింఛన్లు ఇవ్వడంలేదు.. ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వండి సార్..అంటూ జనం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వీవీనగర్లో సోమవారం పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ను కోరారు. సాక్షి వినూత్నంగా చేపడుతున్న విఐపీ రిపోర్టర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రిపోర్టర్గా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.