ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీలో చేరతానం టూ వస్తున్న వార్తలను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఖండించారు. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింద న్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడు తూ... తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నారాయణ్ఖేడ్లోని మెగాఫుడ్ పార్క్ భూముల విషయంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని తెలిపారు.
భూ బదలాయింపులో తన ప్రమేయం లేదని, తన పేరిట భూములు లేవని చెప్పారు. తన చెల్లెలు కంపెనీ పేరు మీదనే భూములు ఉన్నాయని, కంపెనీ ఎప్పుడో రైతులకు డబ్బులు చెల్లించిందని, ఇప్పుడు మళ్లీ నష్టపరిహారం కావా లని కోరుతున్నారని పేర్కొన్నారు. 700 ఎకరాల వరకు భూమి ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగిన పక్షంలో వారికి న్యాయం చేస్తానన్నారు.
బీజేపీలో చేరడం లేదు
Published Sat, Sep 2 2017 2:47 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM
Advertisement