Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Heavy rains disrupt traffic from Guntur to the capital1
వరద ముంపులో అమరావతి

సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్‌ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్‌..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు.

Heavy Rain Fall In AP And Telangana Live Updates2
మళ్లీ బుడమేరు టెన్షన్‌.. సూర్యాపేట అతలాకుతలం

Heavy Rain Updates..👉తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. ఏపీలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలు బంద్‌. సూర్యాపేటలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరుసూర్యాపేటలోని నడిగూడెంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు.చౌదరి చెరువు మత్తడి దూకడంతో నీట మునిగిన పలు కాలనీలుఇళ్లల్లో చేరిన నీటిని ఎత్తిపోస్తున్న కాలనీవాసులుఓఆర్‌ఆర్‌ సర్వీస్ రహదారి మూసివేతరాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రహదారి మూసివేతహిమాయత్‌సాగర్ నీరు విడుదలతో రోడ్డు పైనుంచి ప్రవాహంబారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులువాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులుమళ్లీ బుడమేరు టెన్షన్‌..రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.విజయవాడ నగరవాసులకు మళ్లీ బుడమేరు వరద టెన్షన్‌గతేడాది ఇదే సమయంలో విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద.అధికారులు తక్షణమే స్పందించాలంటున్న స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా..నీట ముగిసిన కంచికచర్ల బస్టాండ్చెరువును తలపిస్తున్న బస్టాండ్బస్టాండ్‌లోకి చేరుకున్న భారీ వరద నీరుకంచికచర్ల పట్టణంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు లోతట్టు ప్రాంతాలు జలమయం.జగ్గయ్యపేటలో భారీ వర్షాలకు సత్యనారాయణపురం, బలుసుపాడు రోడ్డులో పోటెత్తిన వరద నీరు.పెద్ద చెరువుకు గండి కొట్టటంతో ఆర్టీసీ కాలనీలో తగ్గిన వరద నీటి ప్రవాహం.ఇబ్రహీంపట్నం ఫెర్రీ కృష్ణానది పరివాహక ప్రాంతం, కొండపల్లి శాంతినగర్ బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన కలెక్టర్తిరువూరు మండలం చౌటపల్లి -జి.కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న వెదుళ్ళవాగుకు పోటెత్తిన వరద.చుట్టుపక్కల పది గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు.పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద పొంగిపొర్లుతున్న కూచివాగు.నిలిచిపోయిన రాకపోకలు.వత్సవాయి మండలం కంభంపాడు, మాచినేనిపాలెంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు. కృష్ణాజిల్లా ..ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణనది వరద నీరు సముద్రంలోకి వదలడంతో దివిసీమకు తాకిన వరద ప్రవాహంఅవనిగడ్డ మండలం పాతఎడ్లంక వద్ద కృష్ణానది వరద నీరు రావడంతోఅవనిగడ్డ, పాతఎడ్లలంక, గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయంపాత ఎడ్లంక గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు తెగిపోయిన నదీపాయలో ఏర్పాటు చేసిన కాజ్ వేనాటు పడవ ద్వారా నదీపాయను దాటుతున్న గ్రామస్తులు, రైతులునదీపాయను దాటేందుకు నాటు పడవను ఏర్పాటు చేసిన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద హైఅలర్ట్‌..ప్రకాశం బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులుప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహంప్రకాశం బ్యారేజీకి 4,87,508 క్యూసెక్కుల వరదబ్యారేజీ 70 గేట్లు తెరిచి మొత్తం నీరు దిగువకు విడుదలప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 13.6 అడుగులుబ్యారేజీ వద్ద కొనసాగుతున్న ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరికబ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులుకృష్ణా నదిలో ప్రయాణం, ఈత నిషేధించిన అధికారులుహైదరాబాద్‌లో వర్షంహైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షంజూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షంబోరబండ, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్ ప్రాంతాల్లో వర్షంసూర్యాపేటకోదాడ నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలుకోదాడలోని పలు కాలనీల్లో నిలిచిన వరద నీరుకాలనీల్లో వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలింపుకోదాడ పెద్దచెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలుమోతె మండలం ఉర్లుగొండ వద్ద పొంగిపొర్లుతున్న పాలేరు వాగుకోదాడ మం. కూచిపూడి, తొగర్రాయి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అంతర గంగా వాగునడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయంఅనంతగిరి మండలం గోండ్రియాల-తమ్మర మధ్య రహదారి పై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయంనాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు బంద్ కావడంతో ఊపిరి పీల్చుకుంటున్న కోదాడ నియోజకవర్గ ప్రజలుపెరిగిన గోదావరి నీటిమట్టం..భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టంభద్రాచలం వద్ద ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 19.3 అడుగులుకొల్లూరు మండలంలో అప్రమత్తతకృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తతబాపట్ల జిల్లాలో కృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తతదోనెపూడి వద్ద చప్టా పైకి వరదనీరు, 4 లంక గ్రామాలకు తెగిన రాకపోకలుకొల్లూరు వద్ద నక్కపాయకు గండిపడిన చోట నుంచి వరద ప్రవాహంనక్కపాయకు గతేడాది గండిపడిన ప్రాంతం నుంచి వరద ప్రవాహంవరద పెరిగితే లంక గ్రామాలకు రాకపోకలు నిలిచే అవకాశంనేడు తెలంగాణలో అతి భారీ వర్షాలునేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంమెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశంమెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీనిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంభూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంమహబూబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంనిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీభూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీభద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీమిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖమహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్‌ జామ్‌..మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షందివిటిపల్లి వద్ద వాగు ఉద్ధృతికి కోతకు గురైన ఐటీ పార్కుకు వెళ్లే రహదారికోతకు గురై గుంతలో పడిన ఓ కంపెనీకి చెందిన బస్సు, తప్పిన ప్రమాదంబెంగళూరు-హైదరాబాద్ శేరిపల్లి సమీపంలో గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై నుంచి పారుతున్న నీళ్లు, నెమ్మదిస్తూ వెళ్తున్న వాహనాలు.జాతీయ రహదారిపై ఇరువైపుల 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.👉తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్ జారీ చేసింది. వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో హెడ్రా, ట్రాఫిక్​, జీహెచ్​ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ఏపీలోని పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

War 2 Movie Public Talk And Twitter Review3
‘వార్‌ 2’ మూవీ ట్విటర్‌ రివ్యూ

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్‌ చిత్రం వార్‌ 2. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్‌. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్‌ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్‌,హృతిక్‌లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్‌ & మైనస్‌ పాయింట్స్‌ ఏంటి తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో వార్‌ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్‌ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్‌ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్‌, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్‌2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్‌ యాక్షన్‌ సీన్‌ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్‌ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్‌2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంట‌ర్వెల్‌, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయ‌ని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్‌ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్‌ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025

Pakistans Independence day Turns Deadly Glbs4
Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

కరాచీ: పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్‌ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారువైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్‌కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్‌లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు. వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Case Filed Shilpa Shetty And Raj Kundra Over Businessman Compliant5
నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్‌ షాక్‌.. కేసు న‌మోదు

ఢిల్లీ: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాకు బిగ్‌ షాక్‌ తగిలింది. వారిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015-2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ.. ఆ నిధులను శెట్టి వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.ఫిర్యాదులో భాగంగా.. రాజేశ్‌ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.#BREAKING | Legal Trouble For Actress #ShilpaShetty- Shilpa Shetty, Raj Kundra booked.- Businessman claims Rs 60 cr fraud; F.I.R filed.- Businessman alleges cheating in deal, claims Rs 60 cr misused for personal expenses. pic.twitter.com/wTgDZtfu2v— TIMES NOW (@TimesNow) August 14, 2025వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు. ఇక, కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

The Hundred League 2025: Clark's Final Ball Heroics Halt Brave's Perfect Start6
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్‌.. కావ్యా మారన్‌ జట్టు సంచలన విజయం

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌లో కావ్యా మారన్‌ జట్టు నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (ఆగస్ట్‌ 13) సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపొందింది. గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో గ్రహం క్లార్క్‌ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్‌ బాది సూపర్‌ ఛార్జర్స్‌ను గెలిపించాడు. తైమాల్‌ మిల్స్‌ వేసిన స్లో డెలివరీని క్లార్క్‌ అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేశాడు. ఈ సిక్సర్‌తో ప్రత్యర్థి హోం గ్రౌండ్‌ ఒక్కసారిగా మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో సథరన్‌ బ్రేవ్‌ వరుసగా విజయాలకు బ్రేక్‌ పడింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సథరన్‌ బ్రేవ్‌.. లారీ ఇవాన్స్‌ (53), జేమ్స్‌ కోల్స్‌ (49 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో జేకబ్‌ డఫీ 3, మిచెల్‌ సాంట్నర్‌ 2 వికెట్లు తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సూపర్‌ ఛార్జర్స్‌.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ గెలుపు కష్టమన్నట్లు సాగింది. అయితే గ్రహం క్లార్క్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కీలక తరుణంలో 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 38 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మిచెల్‌ సాంట్నర్‌ (24) సహకరించాడు. అంతకుముందు జాక్‌ క్రాలే (29), హ్యారీ బ్రూక్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేసి సూపర్‌ ఛార్జర్స్‌ను మ్యాచ్‌లో ఉంచారు. బ్రేవ్‌ బౌలర్లలో ఓవర్టన్‌ 3, జోఫ్రా ఆర్చర్‌, తైమాల్‌ మిల్స్‌ తలో 2 వికెట్లు తీశారు.

NPCI will discontinue P2P UPI Collect Requests7
యూపీఐలోని ఫీచర్‌ నిలిపివేత?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్‌ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్‌పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్‌టెక్‌ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్‌పీసీఐ ఈ ఫీచర్‌ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్‌ అంటే ఏమిటి?యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్‌ స్కాన్‌ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్‌ చేసి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్‌కోడ్‌, మెసేజ్‌ లింక్‌ రూపంలో రెక్వెస్ట్‌ పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేస్తే వెంటనే మనీ ‍ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్‌పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేశ్‌ అంబానీ ఏం చదివారో తెలుసా?ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Influencer with 1 2 Million Instagram Followers Arrested8
రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో లక్షల ఫాలోవర్స్‌ కలిగిన కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్‌లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్‌ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.ఇన్‌స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్‌ కలిగిన సందీప విర్క్‌ ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్‌తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్‌ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.తాజాగా విర్క్‌ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్‌సైట్‌లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్‌తో విర్క్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్‌ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్‌ను పీఎంఎల్‌ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

NASA plans to build a nuclear reactor on the moon by 20309
జాబిలిపై అణువిద్యుత్‌ సాధ్యమా?

వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్‌ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్‌ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్‌ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్‌ ఫిజన్‌) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్‌ అవసరా లను సౌరవిద్యుత్‌ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్‌ డిగ్రీ సెల్సియస్‌ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్‌ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్‌కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్‌ ప్లాంట్‌ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్‌ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్‌ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్‌ ప్లాంట్‌ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్‌అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌సమస్యలెన్నో...జల, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లతో పోలిస్తే అణువిద్యుత్‌ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్‌ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్‌లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్‌చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్‌ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్‌ ల్యాండ్‌ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్‌ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్‌ ప్లాంట్‌ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్‌ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్‌ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్‌ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్‌లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్‌ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.

Chandrababu Govt IPS Postings IN AP10
‘కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌’లకు రెడ్‌బుక్‌ కుట్ర బాధ్యతలు!

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలకు అడ్డగోలుగా వ­త్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అ­వకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కా­రు స­న్నద్దమవుతోంది. అందుకోసం క్యాడ­ర్‌ ఐపీఎ­స్‌ అ­ధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్‌­ఫ­ర్డ్‌ ఐపీఎస్‌’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెడ్‌బుక్‌ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్‌ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్‌ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.సీఐడీ ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రెడ్‌బుక్‌ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్‌ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు. అస్మదీయ కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్‌ కుట్ర.. చంద్రబాబు ప్రభు­త్వం మ­రో ఎత్తుగడకు తెర­తీసింది. తమ­కు అస్మదీయులైన కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్‌ కుట్రను తీవ్రతరం చేయా­లని భావిస్తోం­ది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అ«­దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందు­కు వీలుగా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement