’శాతకర్ణి’ పన్ను మినహాయింపుపై నోటీసులు
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఎలాంటి జీవో లేకుండా ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంపై మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం నిర్మాత రాజీవ్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.