‘‘తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం సాగించిన యోధుడు ‘కొమరమ్ భీమ్’. ఆయన చరిత్రను 1990లోనే సినిమాగా మలిచాను. రెండు దశాబ్దాల తర్వాత ఆలస్యంగా విడుదలైనా ఆ సినిమా ఘనవిజయం సాధించి, రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందించింది. ఒక తెలంగాణ వ్యక్తిగా కొమరమ్ భీమ్ జీవితాన్ని దేశానికి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే... ‘కొమరమ్ భీమ్’ కథ ఆధారంగా బాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నా’’ అని దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్ తెలిపారు. సోమవారం ఈ విషయమై మాట్లాడుతూ -‘‘కొమరమ్ భీమ్ గొప్పతనం మొన్నటివరకూ చాలామంది తెలంగాణ ప్రజలకు కూడా తెలీదు. నా సినిమాతో అది తేటతెల్లమైంది.
ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైందీ సినిమా. ఆ తర్వాతే హైదరాబాద్లో ట్యాంక్బండ్పై కొమరమ్ భీమ్ విగ్రహం పెట్టారు. ఆదివాసీలకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ‘కొమరమ్ భీమ్’ చిత్రాన్ని ప్రదర్శించడం ఓ ఆనవాయితీ అయ్యింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘కొమరమ్ భీమ్’ చిత్రం పాఠ్యాంశమైంది. ఒక దర్శకునిగా ఇంతకంటే నాకేం కావాలి’’ అన్నారు. డా. దయాకిషన్ గోయల్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించనున్నారనీ, స్వీయ దర్శకత్వంలో తానే నిర్మించనున్న ఈ సినిమాలో ‘కొమరమ్ భీమ్’ పాత్రకు గాను.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి మంచి నటుణ్ణి ఎన్నుకోవడం జరుగుతుందని అల్లాణి తెలిపారు.
బాలీవుడ్లో ‘కొమరమ్ భీమ్’
Published Mon, Oct 6 2014 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement