న్యూఢిల్లీ: చత్తీస్గడ్లో గత మార్చిలో జరిగిన ఎన్కౌంటర్ సంఘటనకు సంబంధించి 17 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ దుర్ఘటనలో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని విచారణలో తేలింది. దీంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకున్నారు.