
గురుగ్రామ్ : గురుగ్రామ్లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. సైబర్హౌజ్కు 12 కిలోమీటర్ల దూరంలో గల ఉల్లవాస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment