gurugram
-
మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!
పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్ కంప్లాయింట్ ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్కు చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్ ప్రకటించడంతో సహా ఇంటింటికీ వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్మహల్ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.ఎలాగైనా గ్రేహౌండ్స్ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు. వారి ప్రచారం సోషల్మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్ రెస్క్యూ గ్రూప్లు, వాలెంటీర్లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్ను చూసిన టూర్ గైడ్ ప్రశాంత్ జైన్ నుంచి దంపతులకు ఫోన్ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్ తన పెంపుడు పేరెంట్స్ దగ్గరికి చేరుకుంది. (చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!) -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
గూగుల్ (Google) గురుగ్రామ్లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్స్పేస్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్లోని మొత్తం టవర్ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్కు అందిస్తుందని సమాచారం.ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.2022లో హైదరాబాద్లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్మేన్ డెవలపర్లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది. -
భారత్లో కార్టర్ పేరిట గ్రామం!!
కార్టర్పురీ(గురుగ్రామ్): అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు మీద భారత్లో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలీదు. 46 సంవత్సరాల క్రితం అంటే 1978 జనవరి మూడో తేదీన హరియాణాలోని గురుగ్రామ్ సమీపంలోని దౌల్తాబాద్ నసీరాబాద్ గ్రామంలో జమ్మీ కార్టర్ దంపతులు పర్యటించారు. కార్టర్ పర్యటించిన ఆ గ్రామం పేరును నాటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సిఫార్సు మేరకు కార్టర్పురీగా నామకరణంచేశారు. అంతకుపూర్వం ఈ గ్రామాన్ని ఖేదాగానూ సమీప గ్రామస్తులు పిలిచేవారు. కార్టర్ మరణవార్త తెల్సి కార్టర్పురీ గ్రామస్థులు విచారం వ్యక్తంచేశారు. ‘‘మా గ్రామం సొంత కుమారుడితో సమానమైన కార్టర్ను కోల్పోయింది’’అని కార్టర్పురీ గ్రామ మాజీ సర్పంచ్ యద్రామ్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారత్లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కార్టర్ తల్లి లిలియాన్ 1960వ దశకంలో శాంతిదళాలతో కలిసి భారత్లో ఆరోగ్యకార్యకర్తగా సేవలందించారు. జైల్దార్ సర్ఫరాజ్కు చెందిన ఒక భవనంలో ఉంటూ లిలియాన్ సామాజిక కార్యకర్తగా చిన్నారులకు సేవచేశారు. వైద్యసాయం అందించారు. ‘‘కార్టర్ మా గ్రామానికి వచ్చినపుడు ఆయన భార్య రోసాలిన్ సంప్రదాయ భారతీయ గ్రామీణ కట్టుబొట్టులో వచ్చి అందరితో కలిసిపోయారు. కార్టర్ దంపతులు గ్రామంలో కలియతిరిగారు. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అయితే ఆ తర్వాతి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాయి. అయినా కార్టర్పై మాప్రేమ అలాగే ఉంది. 2003లో కార్టర్కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకున్నాం. గతంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ నుంచి ప్రత్యేక బృందం మా గ్రామంలో సందర్శించింది’’అని గ్రామస్థులు చెప్పారు. భారత్లో ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో జనతాపార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్టర్ భారత్లో పర్యటించారు. ఎమర్జెన్సీ తర్వాత భారత్లో పర్యటించిన తొలి ప్రెసిడెంట్ ఈయనే. ఈ సందర్భంగా భారత పార్లమెంట్లోనూ కార్టర్ 1978 జనవరి రెండో తేదీన ప్రసంగించారు. 100 ఇళ్ల నిర్మాణంలో చేయూత మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పటాన్ గ్రామంలో దిగువ తరగతి వర్గాల కోసం 2006 ఏడాదిలో వంద ఇళ్ల నిర్మాణం కోసం కార్టర్ ఎంతో సాయపడ్డారు. ఆ ఏడాది అక్టోబర్లో ఒక వారంపాటు ఇక్కడే ఉండి పనుల్లో మునిగిపోయారు. స్వయంగా కార్పెంటర్గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో 2,000 మంది అంతర్జాతీయ, స్థానిక వలంటీర్లు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులూ తమ వంతు కృషిచేశారు. 1984 ఏడాది తర్వాత ప్రతి ఏటా ఒక వారం పాటు సమాజసేవకు కార్టర్ కేటాయించారు. ‘‘67 ఏళ్ల తల్లి లిలియాన్తో కలిసి నేను విఖ్రోలీలో కుషు్టరోగుల కాలనీలో సేవచేశా’’అని కార్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కార్పెంటరీ, లేబర్ పనుల్లో ఆరితేరిన కార్టర్ న్యూయార్క్లోనూ ఒక భవంతి ఆధునీకరణ పనుల్లో పాలుపంచుకున్నారు. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్హౌస్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్మెంట్కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
పుట్టిన రోజు వేడుకలు.. అంతలోనే విషాదం
పుట్టిన రోజుల వేడుకలను ఆనందంగా జరుపుకున్న వేళ విధి ఆ స్నేహితుల కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి తన కారు గార్డ్రైల్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ఐశ్వర్యా పాండే మృతి చెందింది.ఐశ్వర్య పాండే, తన నలుగురు స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం అద్దెకు తీసుకున్న హ్యుందాయ్ కారులో గురుగ్రామ్ నుండి తిరిగి అతివేగంతో వస్తుండగా కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న గార్డ్రైల్పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో గార్డ్రైల్ గుచ్చుకోవడంతో ఐశ్వర్యాతో పాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే దేశ్ పాండే చికిత్స పొందుతూ మృతి చెందారు. మద్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాదమిక విచారణ తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇదీ చదవండి : మా సంస్థపై విష ప్రచారం తగదు -
యాక్సిడెంట్ నిందితునికి అరగంటలోనే బెయిల్..!
ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఓ యువ బైకర్ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్ గార్గ్.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్ఎఫ్ ఫేజ్ 2 గోల్ఫ్ కోర్స్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్రూట్లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్యూవీ వాహనం అతని బైక్ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్ మీద రిలీజ్ చేశారు.అక్షత్ స్నేహితుడి బైక్కు ఉన్న గోప్రో యాక్షన్ కెమెరా ద్వారా యాక్సిడెంట్ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్ నడుస్తోందిShocking Car-Bike Collision in Gurgaon, accused released on bail same day! Car driving on wrong side of Gurgaon Golf Course road DLF Phase-II rammed into a bike killing the rider Akshat Garg on the spot. Accused driver Kuldeep Thakur who was in the SUV with a BJP sticker on it… pic.twitter.com/qUETDrAZ1C— Nabila Jamal (@nabilajamal_) September 19, 2024 -
ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ టాప్ క్రికెటర్.. ఇండియాలో చికిత్స
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్జిత్కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.మొహాలీ నుంచి ఐర్లాండ్కు సిమి సింగ్గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్జిత్ సింగ్ భారత్లోని పంజాబ్లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్రౌండర్కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు ఐర్లాండ్కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికాపై శతకం బాదిఅద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో శతకం బాది సంచలనం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. భార్య కాలేయదానంకాగా సిమి భార్య అగమ్దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్ -
గురుగ్రామ్లోని మాల్కు బాంబు బెదిరింపు..
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్కు బాంబ్ బెదిరింపు అందింది. గురుగ్రామ్లోని ఆంబియెన్స్ మాల్కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు.. బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.అయితే మాల్ మేనేజ్మెంట్కు వచ్చిన మెయిల్లో.. బిల్డింగ్లో బాంబులు అమర్చినట్లు, మాల్లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు. -
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
వింత వివాహం.. వీళ్లకు పెళ్లేంటి? అంటూ పురోహితుడు పరార్
హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన వింత పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగామారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే పెళ్లి జరిపించాల్సిన పురోహితునికి తాను ఇద్దరు యువతులకు పెళ్లి చేయాల్సి ఉందని తెలియానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వారి బంధువులలో ఒకరు ఆ పురోహితుడిని ఒప్పించి వివాహ వేడుక సవ్యంగా జరిగేలా చూశారు. -
1051 అపార్ట్మెంట్ల కోసం రూ.2000 కోట్లు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ 'క్రిసుమి కార్పొరేషన్' తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్లో 1,051 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.క్రిసుమి కార్పొరేషన్ అనేది కృష్ణా గ్రూప్ అండ్ జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. ఇది ఇప్పటికే సెక్టార్ 36A, గురుగ్రామ్లో పెద్ద లగ్జరీ టౌన్షిప్ 'క్రిసుమి సిటీ'ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొదటి దశ 433 యూనిట్లతో కూడిన 'వాటర్ఫాల్ రెసిడెన్సెస్' పూర్తికాగా, రెండవ దశ 320 యూనిట్లతో కూడిన 'వాటర్ఫాల్ సూట్లు' 2028లో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేసింది.ఇవి కాకుండా.. మరో 1,051 లగ్జరీ యూనిట్లతో కూడిన తమ టౌన్షిప్లో ఫేజ్ 3, ఫేజ్ 4లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం క్రిసుమి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుంది. అదనంగా.. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో టౌన్షిప్లో సుమారు 1,60,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 ఎకరాలలో అత్యాధునిక క్లబ్ను సంస్థ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు గత నెలలో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్లో తండ్రి రాజేష్తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
గురుగ్రాం. మిలీనియం సిటీ. దేశ రాజధానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం. బహుళజాతి కంపెనీలకు నిలయం. శనివారం పోలింగ్ జరగనున్న ఈ లోక్సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇందర్జీత్ సింగ్, కాంగ్రెస్ నుంచి నటుడు రాజ్ బబ్బర్, జేజేపీ నుంచి హర్యాన్వీ గాయకుడు రాహుల్ యాదవ్ హోరాహోరీ తలపడుతున్నారు... మిలీనియం సిటీగా పేరొందిన గురుగ్రాంలో ఫార్చ్యూన్ 500 జాబితాలోని 250కి పైగా కంపెనీలున్నాయి. పెప్సికో, నెస్లే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. ఇంతటి కీలక నగరంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన సమస్య. వర్షాకాలంలో ఇది కొట్టొచి్చనట్టు కని్పస్తుంటుంది. నీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, ట్రాఫిక్ రద్దీ స్థానికులను ఆందోళనపరిచే అంశాల్లో కొన్ని మాత్రమే. గురుగ్రాం లోక్సభ స్థానంలో ఏకంగా 25.3 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లపరంగా హరియాణాలో ఇదే అతి పెద్ద లోక్సభ స్థానం. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్ ఇన్ క్యూ యాప్, ఓటర్లకు పోలింగ్ ఆహా్వనాలు, బహుళ అంతస్తుల సొసైటీల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు వంటివి చేశారు.ముక్కోణపు పోటీ... కేంద్ర మంత్రి రావ్ ఇందర్జీత్ సింగ్ గురుగ్రాం నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బీజేపీ పట్టణ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే అహిర్వాల్కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కెపె్టన్ అజయ్ సింగ్ యాదవ్ను పక్కన పెట్టి రాజ్ బబ్బర్కు టికెటిచి్చంది. ఈ స్థానంలో కాంగ్రెస్ యాదవేతర అభ్యర్థిని నిలబెట్టడం ఇదే మొదటిసారి. ఇది హరియాణా కాంగ్రెస్లో అసంతృప్తికి కారణమైంది. 2019లో ఓడిన అజయ్ సింగ్ యాదవ్ కూడా బబ్బర్ ఎంపికపై అసంతృప్తితో ఉన్నారు. యాదవ్ ఓట్లను రాబట్టుకునేందుకు జననాయక్ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రాపర్ సింగర్ రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్పురియాకు టికెటిచి్చంది.విమర్శల హోరు... బబ్బర్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించగానే ఆయనపై ‘ఔట్ సైడర్’ ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. దీన్ని రాజ్ బబ్బర్ గట్టిగానే తిప్పికొడుతున్నారు. దేశ విభజన తరువాత తన కుటుంబం అంబాలాకు చేరుకుందని, గురుగ్రాం, ఫరీదాబాద్ల్లో తమ బంధువులున్నారని చెబుతున్నారు. ‘మై బాహారీ నహీ హూ’ అని ప్రతి సభలోనూ ప్రత్యేకంగా చెబుతున్నారు. హరియా ణాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నా గురుగ్రాంలో మౌలిక సదుపాయాలే లేవంటూ బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నగరంలో జరిగిన అభివృద్ధంతా తన హయాంలో జరిగిందేనని ఇందర్జీత్ అంటున్నారు. ఆయన తరఫున కూతురు ఆర్తి సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకోసమే తాను పోటీ చేస్తున్నానని ఫజిల్పురియా చెబుతున్నారు. పక్కా లోకల్ పార్టీ అయిన జేజేపీకే ఓటేయాలన్న ఆయన అభ్యర్థనకు మంచి స్పందనే వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్పూర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్లో చెప్పారు’ అంటున్నాడు అశోక్రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
ద్వారకా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్లో ప్రారంభించారు. ఎనిమిదిలైన్ల హై-స్పీడ్ ఎక్స్ప్రెస్వే దేశంలోనే తొలి ఎలివేటేడ్ హైవే. ఈ రహదారి ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య నేషన్నల్ హైవే 48పై ట్రాఫిక్ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్ప్రెస్వేను రూ. 4,100 కోట్లతో నిర్మించారు. ఎక్స్ప్రెస్వే మొత్తం రూ. 10,000 కోట్లతో నిర్మిస్తుండగా.. హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి . ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ఆర్ఓబీ(10.2 కి.మీ), బసాయి ఆర్ఓబీ నుంచి ఖేర్కి దౌలా (క్లోవర్లీఫ్ ఇంటర్చేంజ్) (8.7 కి.మీ) వరకు. ఇక దేశవ్యాప్తంగా 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు, ఇవి ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైనవి. #WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of 114 road projects worth about Rs One Lakh Crore, in Gurugram, Haryana. pic.twitter.com/9ulZD98ncD — ANI (@ANI) March 11, 2024 #WATCH : Drone Footage of Dwarka Expressway in Gurugram. #DwarkaExpressway #Gurugram #Delhi pic.twitter.com/9QTbcBdJoN — shivanshu tiwari (@shivanshu7253) March 11, 2024 -
డ్రై ఐస్ నిజంగా అంత ప్రమాదమా?
గురుగ్రామ్లో జరిగిన ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సరదాగా డిన్నర్ చేద్దామని కేఫ్కి వెళ్లితే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది ఆ వ్యక్తులకు. డిన్నర్ చివరి టైంలో తీసుకున్న మౌత్ ప్రెషనర్ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. ఏంటా మౌత్ ఫ్రెషనర్ కథ? ఎందువల్ల అలా అయ్యిందంటే.. గురుగ్రామ్లో అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్కి వెళ్లి డిన్నర్ చేశారు. చివరిగా మౌత్ ఫ్రెషనర్గా రూపంలోని డ్రై ఐస్ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. నీళ్లతో కడుక్కున్న లాభం లేకుండా పోయింది. ఐస్ నోటిలో పెట్టుకున్న ఉపశమనం లేకపోగా ఒకటే బాధ,నొప్పితో విలవిలలాడారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఏం తీసుకున్నారని ఆరా తీయగా..వారు తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ని ప్యాకెట్ని చూపించారు. అది డ్రై ఐస్ అని వైద్యులు చెప్పారు. అది తీసుకుంటే మరణానికి దారితీసే యాసిడ్గా మారుతుందని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేంటి డ్రై ఐస్? అంత డేంజరా అంటే?.. డ్రై ఐస్ అంటే.. కార్బన్డయాక్సైడ్(CO2) వాయువును శీతలీకరించి ఘనీభవించడం ద్వారా డ్రై ఎస్ ఏర్పడుతుంది. దీన్ని 1900ల ప్రారంభంలో కనుగొన్నారు. 1920లలో దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా వినియోగించటం ప్రారంభించారు. ఆహార, ఔషధ పరిశ్రమల్లో షిప్పింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ డ్రై ఐస్ దాదాపు 78 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో రవాణ సమయంలో పదార్థాలను స్తంభింపజేసి ప్యాకింగ్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే కొన్ని వ్యాక్సిన్లు తరలించే సమయంలో కూల్గా ఉంచేందుకు కూడా వినియోగిస్తారు. ధాన్యం ఉత్పత్తుల్లో కీటకాలు రాకుండా ఉండేందుకు వినియోగిస్తారు. అయితే ఈ డ్రై ఐస్ పెద్ద బ్లాక్స్ గానూ లేదా చిన్న గుళికల రూపంలోనూ వినయోగిస్తారు. దీన్ని తప్పుగా వినియోగిస్తే ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదు. గురుగ్రామ్లో ఆ వ్యక్తులు కూడా అలా చేయడంతోనే రక్తపు వాంతులు కక్కుకుని విలవిలలాడటానికి కారణమయ్యింది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే.. పొడి మంచుకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల ఫ్రాస్ట్బైట్ ద్వారా చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోవడంతో హైపర్క్యాప్నియా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ డ్రై ఐస్ను బాగా వెంటిలేషన్ ఉండే వాతావరణంలో మాత్రమే బయట గాలికి బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అలాగే కాక్టెయిల్ వంటి డ్రింక్లక పొగమంచులా కనిపించేందుకు ఈ డ్రై ఐస్ను ఉపయోగిస్తారు . అనుకోకుండా పానీయం నుంచి గనుక ఈ గుళికలను తీసుకుంటే ఆ వ్యక్తి అన్నవాహిక , కడుపు తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక్కడ గురుగ్రామ్ కేఫ్లోని వ్యక్తులు ఆ డ్రైఐస్ని నేరుగా లోపలికి తీసుకోవడంతోనే వారు కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్నే వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ డ్రై ఐస్ని నోటిలో పెట్టుకునే యత్నం చేయకూడదు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ కావడంతో నోటిలోని లాలజలం తేమతో కలిసి రియాక్షన్ చెందడం జరుగుతంది. ఫలితంగా తీవ్రమైన గాయాలు, కణజాల నష్టం వంటివి జరుగుతాయి. అలాగే ఈ పొడిమంచు ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ని పీల్చినా ప్రాణాంతకమే. అందువల్ల పొడిమంచును వినియోగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించటం మంచిది. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
ప్రాణం మీదకు తెచ్చిన మౌత్ ఫ్రెష్నర్.. రక్తపు వాంతులతో ఆసుపత్రికి..
హర్యానాలోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్న అయిదుగురు వ్యక్తులు.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏకంగా నోటీలో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురుగ్రామ్లో మార్చి రెండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్లోని సెక్టార్ 90లో లాఫోరెస్టా కేఫ్కు వెళ్లాడు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం అయిదుగురు రెస్టారెంట్లోని మౌత్ ఫ్రెష్నర్ తీసుకున్నారు. అంతే వెంటనే ఒకరి తర్వాత ఒకరికి నోటిలో నొప్పి మొదలైంది. నోరు మండటం, నాలుకపై వేడి కారణంగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికే రెస్టారెంట్ ఫ్లోర్పై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు. నోటిని నీటితో శుభ్రం చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. రెస్టారెంట్లో ఉన్నవారు ఒకరు దీనిని వీడియో తీశారు. ఇదులో అందరూ నోటి బాధతో ఏడుస్తూ కనిపించారు. ఓ మహిళ తన నోటిలో ఐస్ను పెట్టుకోవడం, తన నోరు మండుతోందని పదే పదే చెబుతుండటం వినిపిస్తుంది. వెంటనే కేఫ్లోని వ్యక్తులను పోలీసులకు కాల్ చేయమని కోరారు. Five people started vomiting blood and reported a burning sensation in their mouths after eating mouth freshener after their meal at a cafe in Gurugram. They were hospitalized and two are critical. pic.twitter.com/brMnbWbZQW — Waquar Hasan (@WaqarHasan1231) March 4, 2024 అనంతరం పోలీసులు కేఫ్కు చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్ ప్యాకెట్ను వైద్యుడికి చూపంచగా.. అది డ్రై ఐస్ అని డాక్టర్ చెప్పారు. ఇది మరణానికి దారితీసే యాసిడ్గా పనిచేస్తుందని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. குருகுராமில் உள்ள தனியார் உணவகத்தில் Mouth Freshener சாப்பிட்ட 05 பேருக்கு ரத்த வாந்தி ஏற்பட்டதை தொடர்ந்து ஆபத்தான நிலையில் மருத்துவமனையில் அனுமதி. pic.twitter.com/QB4jzeTW5C — Ramesh (@RHoneykumar) March 4, 2024 -
ఒక్క ఫ్లాట్.. రిజిస్ట్రేషన్ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్ లేడీ?
Gurugram Property Deal : దేశ రియల్ ఎస్టేట్లో ఖరీదైన డీల్స్లో ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల గురుగ్రామ్లోని అపార్ట్మెంట్ రూ.95 కోట్లకు అమ్ముడుపోయింది. దీనికి రిజిస్టేషన్ ఖర్చులే రూ.5 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన ఫ్లాట్ను ఓ బిజినెస్ లేడీ కొనుగోలు చేశారు. ఇంతకీ ఎవరీమె.. ఆ డీల్ విశేషాల్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వెస్బాక్ లైఫ్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వీ బజార్ సీఎండీ హేమంత్ అగర్వాల్ సతీమణి స్మితి అగర్వాల్ గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్లో అపార్ట్మెంట్ను 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంపాదించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. స్మితి అగర్వాల్ పేరు మీద సేల్ డీడ్ 2024 జనవరి 18న ఖరారైంది. లావాదేవీలో భాగంగా ఆమె రూ. 4.75 కోట్ల స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50,003 చెల్లించారు. పత్రాల ప్రకారం.. 10,813 చదరపు అడుగుల అపార్ట్మెంట్ డీఎల్ఎఫ్ ది కామెలియాస్లో ఉంది. ఇది గురుగ్రామ్లోని గోల్ఫ్ కోర్స్ రోడ్, డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో ఉన్న ఒక ఉన్నత స్థాయి లగ్జరీ కండోమినియం. అదనంగా అపార్ట్మెంట్లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీని చదరపు అడుగు రూ.87,857.20 చొప్పున విక్రయించారు. గురుగ్రామ్ ఉన్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అనేక ఖరీదైన, లగ్జరీ ఆస్తి లావాదేవీలు జరిగాయి. ఇటీవలి డీల్స్ గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ వద్ద 2023 అక్టోబరు3లో 11,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రీసేల్ చేయడం ద్వారా రూ. 100 కోట్లకుపైగా లభించింది. అదే నెలలో మేక్మైట్రిప్ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్లోని 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే జెన్పాక్ట్ మానవ వనరుల అధిపతి పీయూష్ మెహతా అదే కాంప్లెక్స్లో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను రూ. 32.60 కోట్లకు కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సతీమణి వసుధ రోహత్గీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,100 చదరపు గజాల బంగ్లాను రూ. 160 కోట్లకు కొనుగోలు చేశారు. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
Divya Pahuja: అశ్లీల ఫొటోలతో బెదిరిస్తోందనే చంపేశాడా?
మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు దివ్య పహుజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోట్ల నుంచి మృతదేహాన్ని తరలించిన బీఎండబ్ల్యూ కారును పోలీసులు తాజాగా పంజాబ్లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా, లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పటియాలాలోని బస్ స్టేషన్లో బీఎండబ్ల్యూ కారు పార్క్ చేసి ఉందని గురుగ్రామ్ పోలీస్, క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజయ ప్రతాప్ సింగ్ తెలిపారు. దివ్య మృతదేహాన్ని పంజాబ్కు తరలించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు నిందితులు బాల్రాజ్, రవి బంగర్ పరారీలో ఉన్నారని, వీరికోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. దివ్యతోపాటు ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్కు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, దివ్య వద్ద మరో ఫోన్ ఉందని ఆమె సోదరి చెప్పిందని, దాని కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. కాగా పహుజా తన ప్రియుడు, గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ హత్య కేసులో ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించి గతేడాది జూన్లో బెయిల్పై విదుదల అయ్యారు. బుధవారం గురుగ్రామ్లోని ఓ హోటల్లో విగత జీవిగా కనిపించారు. హోటల్ యజమాని అభిజీత్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజీత్ సింగ్ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. దివ్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వార్త: మాజీ మోడల్ దారుణ హత్య నిందితుడు అభిజీత్ మంగళవారం రాత్రి దివ్యను హోటల్ రూముకు తీసుకెళ్లి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తనకు సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలు దివ్య ఫోన్లో ఉన్నాయని.. వాటిని డిలీట్ చేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్కు పాల్పడి డబ్బులు డిమాండ్ చేయడం వల్లే ఆమెను హతమార్చినట్టు అభిజీత్ అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దివ్య సోదరి నైనా పహుజా వాదన మరోలా ఉంది. సందీప్ గడోలీ సోదరి సుదేశ్ కటారియా, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్లే కలిసి అభిజీత్తో హత్య చేయించారని ఆరోపించింది. గడోలీ హత్య విషయానికి వస్తే.. 6 ఫిబ్రవరి 2016లో ముంబైలో పోలీసులు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లో గడోలీ మరణించాడు. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఏడేళ్లపాటు జైలులో ఉన్న దివ్య ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. -
గ్యాంగ్స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య
గురుగ్రామ్: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లో ఓ హోటల్ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు. నకిలీ ఎన్కౌంటర్లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బిందర్ గుజ్జర్ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్కౌంటర్ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్ చేశారు. -
Ex-Model Divya Pahuja: గురుగ్రామ్లోని హోటల్లో మాజీ మోడల్ దారుణ హత్య
హర్యానాలోని గురుగ్రామ్లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్గా తేల్చారు. అబిజిత్తోపాటు అతడి హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్లో బెయిల్పై విడుదలైంది. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి
దేశంలో రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మెుత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరువత్తూర్ జిల్లా వానియంబాడి రహదారిపై శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోనూ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ సమీపంలోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేగంగా దూసుకొచ్చి కారును, మరో వ్యాన్ను బలంగా ఢకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు కారుకు సైతం అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్ డ్రైవర్ కూడా అక్కడికికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ట్యాంకర్లో సీఎన్జీ సిలిండర్లు ఉండటంతో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. చదవండి: టోల్ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి -
కొంపముంచిన డేటింగ్ యాప్: ‘ఐస్’తో కిలాడీ నిలువు దోపిడీ
డేటింగ్ యాప్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. బంబుల్యాప్లో పరిచయమైన గురుగ్రామ్కు చెందిన యువకుడికి మత్తుమందు ఇచ్చి మరీ మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్తో పాటు, బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్ చెప్పింది. గత వారం పాయిల్కు ఫోన్ చేసి, కలుద్దామని రోహిత్ను కన్విన్స్ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ల ఇంట్లో కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఐస్ తీసుకురమ్మనే నెపంతో అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్ కోసం వెళ్లగానే డ్రింక్లో ఏ మత్తుమందు తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్ స్పృహ కోల్పోయాడు. ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు. బంగారు గొలుసు, ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన బ్యాంకు అకౌంట్నుంచి రూ. 1.78 లక్షలు విత్డ్రా అయినట్లు కూడా గుర్తించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. -
గుర్గావ్ : ఇంత ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఇంటికెప్పుడు వెళ్తారు?
-
అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన
ప్రతిష్టాత్మక జీ20 అంతర్జాతీయ సదస్సును ఈ ఏడాది భారత్ నిర్వహిస్తోంది. దేశ రాజధానిలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమ్మిట్ జరగబోతోంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. జీ20 సదస్సు కోసం యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సెప్టెంబర్ 8న భారత్కు వస్తున్నారు. జీ20 సమ్మిట్కు ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయి. సన్నాహకాల్లో భాగంగా న్యూఢిల్లీకి దక్షిణంగా ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రమైన గురుగ్రామ్ బహుళజాతి కంపెనీలకు వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) సలహా జారీ అయింది. ఢిల్లీలో సమ్మిట్ను సజావుగా నిర్వహించేందుకు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షలలో భాగంగా ఈ వర్క్ ఫ్రం హోం అడ్వయిజరీ జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు ఆయా రోజుల్లో స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు. న్యూఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 11 మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. న్యూ ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్దిష్ట ట్రాఫిక్ నిబంధనలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మెట్రో, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 48 మినహా న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) పరిధికి వెలుపల ఉన్న ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్పై ఎలాంటి ప్రభావం ఉండదని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: Layoffs: భారత్లో లేఆఫ్లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు! -
తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!
ఆమె భర్త ఆ సమయంలో సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఆమె సోదరుడు, తల్లి, తండ్రి ఆమె ఇంటికి వచ్చారు. తల్లి ఆమె చేతులను గట్టిగా అదిమిపట్టుకుంది. సోదరుడు ఆమె కాళ్లను నొక్కిపెట్టాడు. తండ్రి ఆమె గొంతు నొక్కాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి, తమ గ్రామానికి తీసుకువెళ్లి, అక్కడున్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ కుమార్తె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. గ్రామంలోని అతని స్నేహితులు అతనికి ఫోన్ చేసి, నీ భార్య చనిపోయిందని, దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దీంతో అతను తన అత్తామామలపై అనుమానంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరువు హత్యకు పాల్పడిన మృతురాలి తల్లిదండ్రులతో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. కాగా నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పండుగ పూట దారుణం ఈ ఘటన ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు జరిగింది. అంజలి(22) అనే మహిళ హరియాణాలోని గురుగ్రామ్లోని సెక్టార్ 102లో గల రాఫ్ ఆల్యాస్లోని ఫ్లాట్ నంబరు 201లో భర్త సందీప్తో పాటు ఉంటోంది. అంజలి బీఎస్సీ పూర్తి చేసింది. ఆమె భర్త అతని సోదరి ఇంటికి తీజ్ ఉత్సవం సందర్భంగా మిఠాయిలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అంజలి ఇంటికి ఆమె తండ్రి కుల్దీప్, తల్లి రింకీ, సోదరుడు కుణాల్ వచ్చారు. వారు ఒక్కసారిగా అంజలిపై దాడి చేశారు. తండ్రి ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత వారు అంజలి మృతదేహాన్ని తమ కారులో ఉంచి, తమ గ్రామమైన సురౌతికి చేరుకున్నారు. తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అంజలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తొలుత గ్రామస్తులకు ఈ విషయం తెలియలేదు. తరువాత అసలు విషయం వెలుగు చూసింది. కుమార్తె బ్రాహ్మణ యువకుడిని వివాహం చేసుకున్నదని.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంజలి భర్తకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. వెంటనే సందీప్ తన భార్య అంజలిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు గురించి పోలీసు ఉన్నతాధికారి వరుణ్ దహియా మాట్లాడుతూ ఇది పరువు హత్య అని తెలిపారు. అంజలి జాట్ కుటుంబానికి చెందినది, సందీప్ బ్రాహ్మణుడని, ఇద్దరూ ప్రేమించుకుని, 2022 డిసెంబరు 19న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అయితే వారు తమకు పెద్దల నుంచి ముప్పు ఉందని గ్రహించి, అప్పటి నుంచి గురుగ్రామ్లో ఉండసాగారు. పథకం ప్రకారం పరువు హత్య అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె ఇంటిలోని వారికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఒక పథకం ప్రకారం అంజలిని హత్య చేశారని పోలీసు అధికారి వరుణ్ తెలిపారు. కాగా అంజలి సోదరుడు కుణాల్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తన సోదరిని హత్య చేసేందుకు ఒక పథకం ప్రకారం ఆమె భర్త సందీప్తో పరిచయం పెంచుకుని వారుంటున్న అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో కాపురం పెట్టాడు. ఆగస్టు 17న సందీప్ తీజ్ ఉత్సవం సందర్భంగా అతని సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని కుణాల్ తన తల్లిదండ్రుకు తెలిపాడు. వెంటనే వారు అంజలి ఇంటికి చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంజలి తండ్రి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తుంటాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వరుణ్ దహియా తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం
గురుగ్రామ్: రెండు వర్గాల మధ్య ఘర్షణతో హరియాణా అట్టడుకుతోంది. నూహ్ జిల్లాల్లో చెలరేగిన హింసతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్లలో 144 సెక్షన్ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. బజరంగ్ దళ్ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. Hamein kuch nahin chahiye... Bas Delhi tak chor do... #Muslim slum-dwellers in #Gurugram after their men were beaten by drunk goons reportedly from #BajrangDal for being Muslim. #NuhConspiracy pic.twitter.com/ST3baTlsyf — Ankita Anand (@ankita_das_) August 2, 2023 ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి గురుగ్రామ్లో నివసిస్తున్న 100 ముస్లిం కుటుంబాల్లో.. ప్రస్తుతం తాము 11 మంది మాత్రమే మిగిలి ఉన్నామని ఓ ముస్లిం వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్ల కారణంగా తాము ఎక్కడికి పోలేని పరిస్థితి తలెత్తిందని, సొంత ఊరు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చులు కూడా లేవని కన్నీటి పర్యంతమయ్యాడు 25 ఏళ్ల షమీమ్ హుస్సేన్... చదవండి: Haryana communal violence: బలగాల్ని దింపండి #GuruGramViolence: Muslim owned shops looted & vandalised! Shanties of poor Muslims burnt! Spillover of #NuhViolence was seen in Gurgaon! Fires were reported from 3 locations! Meat shops & Muslim hotels were ransacked & vandalised! Muslims have been threatened to leave Gurugram! pic.twitter.com/H717JUn8pg — Muslim Spaces (@MuslimSpaces) August 2, 2023 ఆయన మాట్లాడుతూ.. ‘గత సాయంత్రం కొంతమంది గుంపు వచ్చి, రెండు రోజుల్లో ఇక్కడున్న ముస్లింలందరూ ఖాళీ చేయాలని బెదిరించారు. రోడ్డు మీదకు వెళ్తే పేరు అడిగి కొడుతున్నారు. తిరిగి వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అప్పు చెల్లించాల్సి ఉంది. నాకేం జరిగినా పర్లేదు. కానీ నాకు ఏడాది వయస్సున్న కొడుకు ఉన్నాడు. మామల్ని కాపాల్సిందిగా ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని ఆర్థిస్తున్నానంటూచేతులు జోడించి వేడుకున్నాడు. మా కుటుంబం జీవనోపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్కు వచ్చి కేవలం ఏడు రోజులు మాత్రమే అయ్యింది. రెండు రోజుల క్రితమే ఫుడ్ డెలివరీ ఏజెంట్గా ఉద్యోగం దొరకగా.. ఇంకా జీతం ఇవ్వలేదు. నా ఏడాది వయస్సున కొడుకు పేరు అలీషాన్. అల్లరి మూకలు వచ్చి నన్ను, నాభార్యను కొడతారని భయమేస్తోంది. ఇది తలుచుకొని భయపడి నా భార్య రెండు రోజులుగా ఏడుస్తోంది. సొంత ఊరిలోనూ ఉపాధి లేకపోవడంతో తిరిగి వెళ్లలేం.. ఇక్కడా ఉండలేకపోతున్నాం.. ఎలా బతకాలి’ ’ అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ వాపోయాడు. చదవండి: మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్ #MuslimsUnderAttack Is it a crime to do journalism in Gurugram Gurugram: In Sector 70, 200 Muslim families have fled fearing threats and assault by local Bajrang Dal workers. I was threatened twice when I was reporting there. my religion was asked,and the camera was turned off pic.twitter.com/LRZ2FEFZYN — Tarique Anwar (@imtariqueanwar) August 2, 2023 దీనిపై గురుగ్రామ్ జిల్లా కమిషనర్ స్పందిస్తూ.. స్థానిక వలస కార్మికులను ఖాళీ చేయమని బెదిరించినట్లు వార్తలు అందాయని, జిల్లా, పోలీసు అధికారులను సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వలస కుటుంబాలను ఆదుకుంటామని, వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సున్నిత ప్రాంతాలు, ఇరు వర్గాల మతపరమైన ప్రదేశాలైన మసీదులు, దేవాలయాల చుట్టూ రాత్రిపూట మోహరింపు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, రేపటి వరకు నగరంలో పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. -
మళ్లీ మతం మంటలు!
విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్ పట్టణాలు అట్టుడికిపోయాయి. ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు. ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్ అంటుకుంది. అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది. నూహ్ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు. ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి. -
హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్
హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. ఢిల్లీ పోలీసుల అప్రమత్తం గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్లోని సోహ్నా సబ్-డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిరసనలకు పిలుపు మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్లోని భీసం దాస్ మందిర్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. నుహ్లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్లోని బాద్షాపూర్లో అల్లరి మూకల గుంపు బైక్లపై వచ్చి రెస్టారెంట్కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్షాపూర్ మార్కెట్ను మూసివేశారు. చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? ఎందుకీ ఘర్షణలు హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. మరో మణిపూర్ కాబోతున్న హర్యానా? గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
గుర్గ్రామ్కు పాకిన అల్లర్లు.. రెస్టారెంట్కు నిప్పు పెట్టిన అల్లరిమూకలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆందోళనలు ప్రారంభమై 18 గంటలు గుడుస్తున్నా ఏమాత్రం చల్లారడం లేదు. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లా నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్షాపూర్ ప్రాంతంలో తాజాగా నిరసనకారులు రెచ్చిపోయారు. దుకాణాలను ఆందోళనకారులు కూల్చేస్తున్నారు. ఓ రెస్టారెంట్కు నిప్పంటించారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దాదాపు 200 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. షాపులను, మాంసం దుకాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లలో దాదాపు నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 44 కేసులు నమోదు కాగా.. 70 మందిని అరెస్టు చేశారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శోభాయాత్రపై ఓ వర్గం ప్రజలు రాళ్లదాడి జరిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన అల్లర్లు నుహ్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లరిమూకలు ఇప్పటికే వందల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణలను అదుపు చేయడానకిి కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్ని కూడా నిలిపివేసింది. సంయమనం పాటించాలని ప్రజలను సీఎం కోరారు. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
రీల్స్ చూసి నేరాలు... బ్యాంకు ఉద్యోగిని లూటీ చేసిన విద్యార్థులు!
రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగిపై దోపిడీకి పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులు తుపాకీతో బ్యాంకు ఉద్యోగిని బెదిరించి, నగదుతో పాటు ఒక ట్యాబ్లెట్ డివైజ్,ఇతర విలువైన సామగ్రి అపహరించుకుపోయారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.22,800 నగదు, ఒక ట్యాబ్లెట్ డివైజ్, లోన్ఫారాలు, ఒక బయోమెట్రిక్ స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరు బ్యాంకు ఉద్యోగిని బెదిరించేందుకు వినియోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన విద్యార్థులంతా సోహనా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థులను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జూలై 5న ఒక బ్యాంకు ఉద్యోగి సోహనా సిటీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను డీజీ గోయంకా యూనివర్శిటీ వెనుక రోడ్డులో వెళుతుండగా గుర్తుతెలియని యువకులు తుపాకీతో తనను బెదిరించి తన బ్యాగు లాక్కుపోయారని ఆరోపించారు. ఆ బ్యాగులో నగదు, ట్యాబ్లెట్ డివైజ్ మొదలైనవి ఉన్నాయని తెలిపారు. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోహనాలో ఉంటున్న ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. తరువాత కోర్టుకు అప్పగించారు. ఈ విద్యార్థులంతా 19 నుంచి 22 సంవత్సరాల మధ్యవయసు కలిగినవారని, వీరంతా నేర పూరితమైన రీల్స్ చూస్తుంటారని, వీటి ఆధారంగానే ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: కూరలో టమాటా వేశాడని.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయిన భార్య! -
ప్రేమ పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు.. ఆమె నో చెప్పడంతో..
గురుగ్రామ్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేసి ఘనంగా పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడితో పెళ్లికి ఆమె నో చెప్పింది. దీంతో, ఆవేశానికి గురైన లవర్.. యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. యూపీలోని బదౌన్కు చెందిన రాజ్కుమార్(23), నేహా(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే, సడెన్గా ఏమైందో తెలియదు కానీ.. నేహా.. రాజ్తో పెళ్లికి నో చెప్పింది. దీంతో, నేహాను రాజ్ వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. కానీ ఆమె ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో, ఆమెపై రగిలిపోయిన రాజ్కుమార్ తనను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో సోమవారం నేహా తన తల్లితో కలిసి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వారిని అడ్డగించిన రాజ్.. ఆమెతో మాట్లాడాలంటూ దగ్గరి వచ్చాడు. ఏదో మాట్లాడుతున్నట్టు నటించి.. తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కడుపులో, మెడపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. దీంతో నేహా అక్కడికక్కడే మృతి చెందింది. ఇక, నేహాపై రాజ్ దాడి చేస్తున్న సమయంలో ఆమె తల్లి పక్కనే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ సమయంలో అక్కడ చాలా మందే ఉన్నారు. అయితే అతడి చేతిలో కత్తిని చూసి వారంతా భయంతో పరుగులు పెట్టారు. అనంతరం.. నేహా తల్లి రాజ్ను చెప్పులతో కొడుతూ ఆవేదనకు లోనైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను చంపేసినట్ల నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం షాకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
గురుగ్రామ్లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు..
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. రహదారుపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొకాళ్ల లోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిన నీటిలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నర్సింగపూర్ చౌక్ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. #WATCH | Heavy waterlogging in parts of Gurugram after rain lashed the city (Visuals from Narsinghpur Chowk) pic.twitter.com/B8Q7IlC8oh — ANI (@ANI) June 21, 2023 Welcome to Gurgaon, The city of Lakes. #gurugram #gurugramTraffic #gurugramrains @mlkhattar pic.twitter.com/IulhUYFcqH — Ankit Jain (@ajsunnyboy) June 21, 2023 బుధవారం ఉదయం ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్డబ్ల్యూఎఫ్సీ) గురుగ్రామ్తో సహా ఢిల్లీలోని పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఢిల్లీ (పాలెం, ఐజిఐ విమానాశ్రయం), ఎన్సిఆర్ (గురుగ్రామ్, మనేసర్) ఫరూఖ్నగర్, సోహానా, నుహ్ (హర్యానా) మొరాదాబాద్, సంభాల్, బిల్లారి, చందౌసి, జహంగీరాబాద్, అనుప్షహర్, బహజోయ్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. #Gurugram में बारिश से दरिया बनी सड़कों पर फंसी गाड़ियां, सवारियों से भरी बस बीच सड़क फंसी, चारो तरफ हाहाकार#Emergency #WaterLogging #GurugramRains #Gurgaon @cmohry @OfficialGMDA @MunCorpGurugram @pcmeenaIAS pic.twitter.com/FhRdijHC2t — Sunil K Yadav (@SunilYadavRao) June 21, 2023 -
నకిలీ ఇన్వాయిస్ రాకెట్..రూ.861 కోట్ల జీఎస్టీ ఎగవేత..
గురుగ్రామ్:గురుగ్రామ్లో భారీ నకిలీ ఇన్వాయిస్ రాకెట్ను ఇంటెలీజెన్స్ ఐటీ అధికారులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.861 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టినట్లు వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా 461 నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలు, రెంట్ అగ్రిమెంట్లు, కరెంట్ బిల్లులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డుల వంటివి ల్యాప్టాప్లో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లను ఉపయోగించుకుని నకిలీ ఇన్వాయిస్లను సృష్టిస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే 461 ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ.861కోట్ల విలువైన పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఈ మోసానికి సంబంధించిన ఇద్దరు ప్రధాన నిందుతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఫేక్ ఇన్వాయిస్లు ఇనుము, స్టీల్ సెక్టార్కు బదిలీ అవుతున్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఇదీ చదవండి:సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు! -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్కు వెళ్లాడు. అయితే, హోటల్కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్ అరెస్ట్
పాట్నా: నమ్మి వచ్చిన పాపానికి ఓ బాలికపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫోటోలను నెట్టింట పోస్టు చేసి చివరికి అరెస్ట్ అయ్యాడు భోజ్పురి గాయకుడు. నిందితుడిని బీహార్కు చెందిన 21 ఏళ్ల అభిషేక్గా గుర్తించారు. అతని యూట్యూబ్ ఛానల్లో 27వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం అభిషేక్ రాజీవ్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అభిషేక్కు ఓ బాలికతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అయితే స్నేహం నెపంతో బాలికను హోటల్ గదిలోకి రప్పించాడు. అతని నిజం స్వరూపం తెలియని బాలిక రూంలోకి వెళ్లగానే.. ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు పలు అసభ్యకర ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బాలిక నిందితుడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నిందితుడు బాలిక ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో తనపై జరిగిన ఆఘాయిత్యాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. బాలిక వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు ప్రతినిధి సుభాష్ బోకెన్ తెలిపారు. అనంతరం అతడిని సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి.. -
Video: మద్యం మత్తులో హల్చల్.. కారుపై పుష్అప్స్ చేస్తూ..
గురుగ్రామ్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, చలాన్లు విధించినా కొందరు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రన్నింగ్లో ఉన్న కారుపై పుష్అప్స్ చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హర్యానా నెంబర్ ప్లేట్తో(HR72F6692) ఉన్న ఆల్టో కారు రాత్రి హైవేపై వెళ్తోంది. ఈ క్రమంలో కారులో నలుగురు వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించి డ్యాన్స్లు, పుష్అప్స్ చేస్తూ హల్చల్ చేశారు. అయితే, కారు రన్నింగ్లో ఉండగా ఓ వ్యక్తి కారుపై పుష్ అప్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న అతడి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. దీంతో, సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. అనంతరం, చేతిలో మద్యం బాటిల్ తాగుతూ కేకలు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో గురుగ్రామ్ పోలీసుల దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.6,500 జరిమానా విధించారు. అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారున స్వాధీనం చేసుకుని వాహనం యజమాని లోకేష్ను అదుపులోకి తీసుకున్నట్టు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు. pls take action @gurgaonpolice @mlkhattar @DGPHaryana @HTGurgaon @DC_Gurugram @TrafficGGM @dcptrafficggm @Gurgaon_Tweets @Vikas_dayal_9 pic.twitter.com/5xYkTUtfMd — Ravi Potliya (@RaviKan82888324) May 31, 2023 ఇది కూడా చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
మహిళా యజమాని బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు..ఆ తర్వాత..
గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ.. పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా బెడ్రూమ్, బాత్రూంలో... -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - ఎందుకంటే?
వాహనాల కొనుగోలు విషయంలో గానీ, వాహనాల తయారీ విషయంలో గానీ ఏదైనా సమస్య అనిపిస్తే, దానికి సంబంధిత సంస్థలు బాధ్యత వహించకపోతే మీరు కంజ్యూమర్ కోర్టుని సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) గురుగ్రామ్లోని పోర్షే అవుట్లెట్కు భారీ జరిమానా విధించింది. ఒక వినియోగదారుడు తనకు విక్రయించిన కారుని తయారు చేసిన సంవత్సరం తప్పుగా ఉందని పిర్యాదు చేసిన కారణంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య కోర్టుకు విన్నవించారు. వినియోగదారుడు ప్రవీణ్ కుమార్ మిట్టల్ పోర్షే ఇండియా, గురుగ్రామ్లోని పోర్స్చే సెంటర్కు వ్యతిరేకంగా ఫిటిషన్ వేయడంతో ఈ చర్చ జరిగింది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!) తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) ఫిర్యాదుదారుని దుర్మార్గపు ఉద్దేశ్యాలతో ఆరోపించే ఆరోపణలను పోర్స్చే తిరస్కరించింది. తయారీ సంవత్సరం గురించి అతనికి బాగా తెలుసు. కాబట్టే దానికి తగిన తగ్గింపు కూడా పొందినట్లు పేర్కొంది. ఇరువర్గాలు తమ పత్రాలను కోర్టులో సమర్పించారు. మిట్టల్ సమర్పణలు సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద పబ్లిక్ అథారిటీ ద్వారా సేకరించడం వల్ల వాటి ప్రామాణికతను కోర్టు సమర్థించింది. చివరకు రూ. 18 లక్షలకు పైగా ఉన్న వడ్డీతో కలిపి అతనికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని పోర్షేను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారుడికి లిటిగేషన్ ఖర్చుగా రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. కల్పిత పత్రాల విషయమై అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంత పరిధిలోని పోలీసులచే విచారణ జరిపించాలని కూడా కమిషన్ ఆదేశించింది. -
యువతులే అతడి టార్గెట్.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్ బ్యాచిలర్..
ధనవంతుడిలా కటింగ్ ఇచ్చాడు ఓ కన్నింగ్ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్ బ్యాచ్లర్గా కలరింగ్ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ముజఫర్నగర్కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్సైట్లను టార్గెట్ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ఫ్రొఫైల్ సెట్ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాడు. యువతి టచ్లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు. అయితే, తాజాగా విశాల్ మ్యాట్రిమోనీ ప్రోఫైల్ చూసి పెళ్లి విషయమై గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్నెస్ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్ఫోన్స్ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్తో డెకాయ్ ఆపరేషన్ చేపించి విశాల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్ బ్యాచిలర్ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్ తిన్నారు. -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్ఫారమ్ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్తో పాటు డాష్బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్ సెక్టార్ 63లో ‘ద ఆర్బర్’ పేరుతో గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం. అతిపెద్ద కంపెనీగా.. ఫ్లాట్స్ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్కే ఫ్లాట్స్ రానున్నాయి. మార్కెట్ క్యాప్లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్లో భాగంగా గురుగ్రామ్లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
3 రోజులు అక్కడ.. 3 రోజులు ఇక్కడ.. ఒక భర్త, ఇద్దరు భార్యల మధ్య ఒప్పందం!
ఒక్కోసారి కోర్టులో తీరని సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే తీరుతాయంటారు. అదే చేశారు ఓ భర్త ఇద్దరు భార్యలు. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి తన ఇద్దరి భార్యలతో సమస్య రాగా కోర్టుకు వెళ్లారు. చివరికి కూర్చుని మాట్లాడుకుని ఓ ఒప్పందం చేసుకుని సమస్యను పరిష్కరించుకున్నారు. భర్తకు దూరంగా.. అసలు విషయం తెలిసి షాక్ హర్యానాలోని గురుగ్రామ్లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ 2018లో 28 ఏళ్ల సీమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి సంసారం కరోనా రాకతో చెక్ పడింది. లాక్డౌన్ కారణంగా సీమ భర్త కుటుంబానికి దూరంగా తాను పని చేస్తున్న చోటు ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన సహోద్యోగులలో ఒకరితో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇదిలా ఉండగా తన భర్తలో మార్పు రావడం, తనకి దూరంగా ఉండడాన్ని గమనించిన సీమకు భర్తపై అనుమానం వచ్చింది. అసలువిషయం తెలుసుకునేందకు సీమ గురుగ్రామ్కు పయనం కాగా అక్కడ తన భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసి ఆగ్రహానికి గురైంది. వారాన్ని ఇలా పంచుకున్నారు సీమ తన భర్త పెళ్లి చేసుకున్న యువతితో గొడవపడింది. ఫలితం లేకపోయే సరికి తన కుమారుడి పోషణకు తగిన భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. అనంతరం కోర్టు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించింది. చివరికి వారి ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరి ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం.. ఆ వ్యక్తి ఒక వారాన్ని ఇద్దరు భార్యలతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారంలో ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మరో మూడు రోజలు గడపాల్సి ఉంటుంది. మిగిలిన ఒక్క రోజు తనకు నచ్చిన చోటు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్లో ఆ ఇద్దరి మహిళలకు రెండు వేర్వేరు అపార్ట్మెంట్లు ఉంచి సంసారం సాగిస్తున్నాడు. చదవండి: లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎక్కిన విద్యార్థి.. ట్విస్ట్ ఏంటంటే! -
వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!
కొంత మంది బడా బాబులు తమ కూతుళ్లు లేదా కొడుకుల వివాహాలప్పుడూ లేదా ఎన్నికల్లో గెలిచిన డబ్బులను బహిరంగంగా వెదజల్లడం చూస్తుంటాం. అంతేందుకు ఇటీవలే బెంగుళూరులో ఒక వ్యక్తి ఫ్లై ఓవర్పై డబ్బులు వెదజల్లి ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసిన ఉదంతాన్ని కూడా చూశాం. అవన్నీ మరువక మునుపే అచ్చం అలాంటి మరో ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు కదులుతున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరారు. ఇటీవలే విడుదలైన ఫర్జీ అనే వెబ్సీరిస్లోని సీన్ మాదిరిగా సీన్ని రీ క్రియేట్ చేసినట్లుగా చేశారు. ఈ మేరకు ఏసీపీ వికాస్ కౌశిక్ మాట్లాడుతూ..సదరు యువకులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాళ్లు సినిమాలోని సీన్ మాదిరిగా చేయడం కోసం ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ఆ యువకులు గోల్ఫ్కోర్సు రోడ్డు వద్ద కరెన్సీని విసిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సదరు వ్యక్తులును గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. #WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter. (Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy — ANI (@ANI) March 14, 2023 (చదవండి: ట్రైన్లో మహిళపై మూత్ర విసర్జన ఘటన:టీసీపై సస్పెన్షన్ వేటు) -
ఖరీదైన కారులో వెళ్లి పూలకుండీల దొంగతనం.. వీడియో వైరల్..
ఖరీదైన లగ్జరీ కారు. పైగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. వీళ్ల బిల్డప్ చూస్తే చాలా రిచ్ అనుకుంటారు. కానీ వీళ్లు చేసిన పని తెలిస్తే మాత్రం ఇదేం బుద్ధిరా నాయనా అంటారు. ఔను మరి.. వీళ్లు పట్టపగలు కారులో వెళ్లి రోడ్డుపై ఉన్న పూలకుండీలను ఎంచక్కా డిక్కీలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గురుగ్రాంలోని శంకర్ చౌక్లో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూలకుండీలను ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఇద్దరి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జీ-20 కార్యక్రమం కోసం శంకర్ చౌక్లో ప్రత్యేకంగా ఈ పూలను అలంకరించినట్లు తెలుస్తోంది. రంగురంగుల పుష్పాలు, రకరకాల పూల కుండీలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని చూసిన ఈ ఇద్దరికీ ఏమనిపించిందో ఏమో తెలియదు గానీ.. ఎంచక్కా కారులో వచ్చి పూలకుండీలను దర్జాగా ఎత్తుకెళ్లారు. #G20 के सौंदर्यीकरण के "चिंदी चोर" गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon — Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023 అయితే వీరిద్దరు నిజంగా దొంగలేనా? పూలకుండీలను చోరీ చేశారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వీరిని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కారు నంబర్ప్లేట్ను కనిపెట్టి పోలీసులకు క్లూ అందించేందుకు తమ వంతు కృషి చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలో తల్లీకొడుకులు!
33 ఏళ్ల మహిళ, ఆమె కొడుకు మూడేళ్లుగా స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. అదీ కూడా అద్దె ఇంట్లోనే అలా నిర్బంధంలో ఉండిపోయారు. పోలీసుల రంగంలోకి దిగి వారిని ఆస్పత్రికి తరలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురుగ్రామ్లోని చక్కర్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మున్మున్ మాఝీ అనే మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోవిడ్ మహామ్మారి వచ్చినప్పటి నుంచి అంటే సరిగ్గా 2020 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. కనీసం ఆ మహిళ కొడుకు సూర్యుడు ఉదయించడాన్ని కూడా చూడకుండా అలానే ఇంట్లో ఉండిపోయాడు. ఆఖరికి ఆ భయంతో ఆమె తన భర్త సుజన్మార్జీను అస్సలు ఇంట్లోకి రానివ్వలేదు. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను మొదట్లో స్నేహితులు, బంధవుల ఇళ్లల్లో తలదాచుకున్నాడు. ఇక రాను రాను కష్టమవ్వడంతో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం ప్రారంభించాడు. అప్పుడప్పుడూ వీడియో కాల్లోనే మాట్లాడుతుండే వాడు. తన భార్య కొడుకు ఉన్న ఇంటి అద్దె, తదితరాలు కట్టడం, వారికి కావాల్సిన వస్తువులు డోర్ ముంగిట పెట్టి వెళ్లిపోవడం ఇలానే మూడేళ్లు గడిచిపోయాయి. ఐతే మున్మున్ మాత్రం లాక్డౌన్ ఎత్తేసి మాములుగా అయిపోయినా ఇంకా అలా స్వయం నిర్బంధంలోనే ఉండిపోయింది. భర్త ఎంత నచ్చచెప్పిన వినక పోయే సరికి చక్కర్పూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటు తీసుకువచ్చారు. ఆ తల్లి కొడుకులను గురుగ్రామ్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే మున్మున్ కాస్త సైక్రియాట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు వారి ఇల్లు చాలా అపరిశుభ్రంగా చెత్త పేరుకు పోయి ఉందని చెప్పారు. ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే అవాంఛనీయమైన ఘటన జరిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళ కనీసం వంటగ్యాస్ కానీ, నీటిని గానీ వినయోగించ లేదని వెల్లడించారు. కాగా ఆమె భర్త సుజన్ తన భార్య కొడుకుని బయటకు తీసుకొచ్చినందుకు పోలీసులకు దన్యావాదాలు తెలిపాడు. తొందరలోనే వాళ్లిద్దరూ కోలుకుంటారని మళ్లీ తాము మునుపటిలా హాయిగా ఉంటామని సంబంరంగా చెబుతున్నాడు సుజన్. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
యజమాని జంట పైశాచిక ఆనందం.. బాలికను చిత్ర హింసలు పెడతూ...
ఇంట్లో పని నిమిత్తం చేరిన ఓ మైనర్ బాలికను దంపతులైన యజమానులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాలికకు అన్నం పెట్టకుండా పస్తులుంచి ఆమెను శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు బాధితురాలిని వేధించిన రాక్షస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. జార్ఖండ్కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఉద్యోగస్తులైన ఓ దంపతుల ఇంట్లో పని మనిషిగా చేరింది. కాగా బాలికపై దంపతులు గత కొంత కాలంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని, ఇంట్లోని వస్తువులను దొంగిలించిందనే నిందలు వేస్తూ కర్రలు, ఇనుప వస్తువులను వేడి చేసి ఆమెపై దాడికి పాల్పడుతున్నారు. ముఖం, చేతులపై కొడుతూ దారుణంగా గాయపరిచారు. రోజులపాటు ఆమెకు అన్నం పెట్టకుండా హింసిస్తూ రాక్షస ఆనందం పొందారు. దీంతో ఆకలికి అలమటించి యజమానులు తిని చెత్తబుట్టలో పడేసిన ఆహారాన్ని బాలిక తినేది. అయితే దీపక్ నారాయణ అనే యాక్టివిస్ట్ బాలిక ఘోర పరిస్థితిని తెలుసుకొని ఆమె ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బాలిక ముఖం, పెదాలు, చెంపలు, చేతులపై కాలిపోయిన గాయాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. దీనిపై స్పందించిన గురుగ్రామ్కు చెందిన ఓ స్వంచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక యజమానుల బారి నుంచి మంగళవారం సాయంత్రం బాలికను రక్షించారు. గత కొన్ని నెలలుగా ఆమెను భయంకరంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను రక్షించే సమయంలో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఏడాది కిత్రం ఓ ఏజెన్సీ ద్వారా తమ మూడు నెలల పాపను సంరక్షణ కోసం బాలికను నియమించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సంబంధింత సెక్షన్ల ప్రకరం కేసు నమోదు చేశారు. అయితే దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారడంతో అరెస్ట్ అయిన మహిళను ఆమె పనిచేస్తున్న సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. -
బైక్ను ఢీకొట్టిను లగ్జరీ కారు.. మూడు కి.మీలు రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
గురుగ్రామ్: ఓ కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న బైక్ను ఢీకొట్టాడు. అనంతరం, కారు బ్యానెట్కు బైక్ లాక్ అవడంతో కారు డ్రైవర్ బైక్ను అలాగే ఈడ్చుకుంటూ దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాడు. అనంతరం, కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఈ షాకింగ్ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బౌన్సర్ మోను తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై పార్క్ చేసిన తన బైకును తీస్తుండగా హోండా సిటీ కారు ఒకటి హైస్పీడ్తో దూసుకొచ్చింది. పార్క్ చేసి ఉన్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోను తృటిలో తప్పించుకున్నాడు. క్షణాల వ్యవధిలో కారు.. బైక్ను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇంతలో మోను కారు ఆపాలంటూ అరిచిన కారు డ్రైవర్ మాత్రం ర్యాష్ డ్రైవింగ్తో బైకును మూడు కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు వెళ్తున్న వాహనదారులు కారును ఆపాలని ఎంత ప్రయత్నించిన అవేవీ పట్టించుకోకుండా డ్రైవర్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత.. కారు రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. #BigExclusive कार के पीछे उठती चिंगारियों का ये कोई #फिल्मी सीन नहीं है, ये कार सवार गुरुग्राम की सड़क पर बाइक को कई किलोमीटर घसीटते हुए ले जा रहा है ।#roadrage #roadaccident #car #bike #gurugram #haryana #viral #video pic.twitter.com/ledRpF8JYA — Metro News (@MetroNewsHindi) February 3, 2023 అనంతరం, మోను వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని ఫరీదాబాద్కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు గురుగ్రామ్ పోలీసులు సుభాష్ బోకెన్ తెలిపారు. -
ట్రాఫిక్లో కారుపైకి ఎక్కి పెగ్గులేసిన మందుబాబు.. వీడియో వైరల్..
ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ఎరరికైనా చికాకు వస్తుంది. ఒక్కోసారి బండి ముందుకు కదిలేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్లో ఇరుక్కుంది. దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడేమే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. ఎంచక్కా పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by RTG2😃 (@20degreecelsius) ఇలాంటివి గురుగ్రామ్లోనే సాధ్యం అని కొందరు సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఈ మందుబాబుపై మండిపడ్డారు. రోడ్డుపై ఇలాంటి న్యూసెన్స్ ఏంటని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
Crime News: దా.. బండెక్కు! అన్నాడు..
క్రైమ్: పొరుగింట్లో ఉంటోంది.. కాస్త చనువు ప్రదర్శిద్దామనుకున్నాడో ఏమో.. వచ్చి బండెక్కు అన్నాడు!. అయితే.. ఆమె ప్రతికూలంగా స్పందించింది. అవమానంగా అనిపించింది కాబోలు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. నడిరోడ్డు మీదే ఆమెపై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రి పాలుకాగా, పరారీలో ఉన్నాడు నిందితుడు. హర్యానా గురుగ్రామ్లో ఓ మహిళపై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వీడియో వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రేస్ చేసి నిందితుడ్ని కమల్ అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ మనోజ్ మీడియాకు వెల్లడించారు. బాధితురాలు కమల్ పక్క ఇంట్లోనే ఉంటోందని విచారణలో తేలింది. ఆటోలో ఆమె కూర్చుని ఉండగా.. బైక్ మీద వచ్చిన కమల్ ఆమెతో మాట్లాడాడు. వచ్చి తన బైక్ ఎక్కాలని ఆమెను కోరాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో.. కోపంతో ఊగిపోతూ ఆమెపై దాడికి దిగాడు. చేతిలో ఉన్న హెల్మెట్తో బాదేశాడు. స్థానికులు కొందరు గుమిగూడి.. కమల్ను నెట్టేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ మనోజ్ పేర్కొన్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి -
శునకాల స్వైర విహారం.. 11 జాతులపై నిషేధం.. ఎక్కడంటే!
న్యూఢిల్లీ: ఇంటి భద్రత కోసం చాలా మంది శునకాలను పెంచుకుంటారు. పెట్స్ ను పెంచుకోవడాన్ని కొంతమంది స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా పెంపుడు జంతువులతో యజమానులకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ శునకాల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో కుక్కలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్లో శునకాల బెడద పెరిగిపోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 11 విదేశీ శునకాల జాతులను నిషేధించాలని, వాటి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. ఆగస్టు 11న సివిల్ లైన్స్లో డోగో అర్జెంటీనో జాతికి చెందిన కుక్క కాటుకు గురై తీవ్ర గాయాలపాలైన మహిళ.. తమను ఆశ్రయించడంతో వినియోగదారుల ఫోరం ఈ మేరకు నవంబర్ 15న ఉత్తర్వులు వెలువరించింది. బాధిత మహిళకు రూ. 2 లక్షలు చెల్లించాలని.. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీని రూపొందించాలని ఎంసీజీని ఫోరం ఆదేశించింది. ఈ 11 జాతులు ప్రమాదకరం.. ప్రమాదకరమైన వాటిగా గుర్తించిన 11 విదేశీ జాతి శునకాలను నిషేధించాలని ఫోరం ఉత్తర్వులిచ్చింది. అమెరికన్ బుల్డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీల్లర్, బోయర్బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిషియన్ మాస్టిఫ్, వోల్ఫ్డాగ్, కేన్ కోర్సో, బాండోగ్, ఫిలా బ్రసిలీరో జాతి శునకాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటి బాధ్యత యజమానులదే పెంపుడు శునకాలకు సంబంధించి అమలు చేయాల్సిన అంశాలపై ఎంసీజీకి ఫోరం స్పష్టమైన సూచనలు చేసింది. ‘ప్రతి నమోదిత శునకానికి కాలర్ను ధరించాలి.. దానికి మెటల్ టోకెన్తో పాటు మెటల్ చైన్ను జతచేయాలి. ఒక కుటుంబం ఒక కుక్కను మాత్రమే పెంచుకునేలా చూడాలి. పెంపుడు శునకాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడల్లా అవి ఎవరినీ కరవకుండా ఉండేందుకు వాటి మూతిని నెట్ క్యాప్ లేదా మరేదైనా వస్త్రంతో కవర్ చేయాలి. బహిరంగ ప్రదేశాలను పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యతను యజమానులదేన’ని 16 పేజీల ఉత్వర్తుల్లో పేర్కొంది. పసిపాపపై కుక్క దాడి.. విషాదం గురుగ్రామ్లో శునకాల స్వైర విహారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెలలో వీధి కుక్క దాడిలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాగా, పిట్ బుల్, రోట్వీలర్, డోగో అర్జెంటినో అనే మూడు జాతుల కుక్కల పెంపకంపై నిషేధం విధించే ప్రతిపాదనను ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్టోబర్లో ఆమోదించింది. జంతు ప్రేమికుల ఆందోళన విదేశీ సంతతికి చెందిన 11 జాతి శునకాలపై నిషేధం విధించడాన్ని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాల్లో ప్రమాదకరమైనవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని.. పరిస్థితులను బట్టి మూగజీవాలు స్పందిస్తాయని నిహారిక కశ్యప్ అనే జంతు పరిరక్షణ కార్యకర్త తెలిపారు. కుక్కలను ఎక్కువసేపు బంధించి ఉండచం, వాటికి సమయానికి ఆహారం పెట్టకపోవడం వంటి కారణాలతోనే అవి అదుపు తప్పుతాయని వివరించారు. సమస్య పరిష్కారానికి కారణాలు గుర్తించకుండా కొన్ని జాతి శునకాలపై నిషేధం విధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విదేశీ శునకాలను అధిక మొత్తానికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (క్లిక్: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు) -
వింత ఘటన: కుక్కలకు ఘనంగా వివాహ తంతు
ఒక జంట పెంపుడు కుక్కలకు ఘనంగా హిందూ సంప్రదాయపద్ధతిలో వివాహ తంతు జరపనున్నారు. ఈ వింత ఘటన గురుగ్రామ్లోని హర్యానాలో జరగనుంది. అచ్చం హిందూ సంప్రదాయరీతిలో నాలుగు రోజులు వివాహ వేడుకను జరిపేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆ కుక్కలకు హల్దీ వేడుకను కూడా నిర్వహించారు. ఆడ కుక్క పేరు స్వీటీ కాగా మగ కుక్క పేరు షేరు. నవంబర్ 14న ఆ కుక్కలకు అట్టహాసంగా పెళ్లి చేయనున్నారు. సుమారు 100 మంది దాక ఈ వివాహ తంతుకు ఆహ్వనించినట్లు కుక్కల యజమాని చెబుతున్నారు. ఈ వివాహ వేడుక హర్యానాలోని పాలం విహార్ ఎక్స్టెన్షన్లో ఉన్న జిల్ సింగ్ కాలనీ స్థానికులను చాలా ఆశ్చర్యపర్చింది. కానీ ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున అతిధులు మాత్రం హాజరవునున్నారు. ఈ మేరకు కుక్కల యజమాని శ్వేత మాట్లాడుతూ...తమకు పిల్లలు లేకపోవడంతో స్వీటీని తమ బిడ్డగా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఒక రోజు తన భర్త గుడికి వెళ్లి అక్కడ కుక్కలకు ఆహారం పెట్టి వచ్చేస్తుండగా స్వీటీ అనే వీధి కుక్క తన భర్త వెంట వచ్చిందని, అప్పటి నుంచి ఆ కుక్కని తమ బిడ్డగా పెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే మీ దంపతులను అరెస్టు చేస్తారంటూ పలువురు చెప్పారని కానీ అందుకు తాము భయపడమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మగ కుక్క షేరు యజమాని మాట్లాడుతూ ...కుక్కల పెళ్లి తంతు అనేది కామెడీగా అనిపించనప్పటికీ వివాహ పనులు మాత్రం అత్యంత సీరియస్గా జరుగుతున్నాయని అన్నారు. ‘Sheru weds Sweety; Neighbourhood comes alive amid ‘furry’ wedding festivities in Gurugram Full Video: https://t.co/gBwuHmmgkj pic.twitter.com/NjODzrG6wg — Take One (@takeonedigital) November 14, 2022 (చదవండి: అరే! ఏం మనషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...) -
భయంకరమైన కారు స్టంట్..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
గురుగ్రామ్: ఎనిమిది మంది యువకుల చేసిన కారు స్టంట్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురగ్రామ్లో సుమారు అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఎనిమిది మంది యువకు మూడు కార్లతో మద్యం దుకాణం వద్ద రాత్రి 2 గంటల సమయంలో కారుతో స్టంట్స్ చేశారు. ఆ ఎనిమిది మంది మారుతి ఎర్టిగా, హ్యుందాయ్ వెన్యూ, హ్యందాయ్ క్రెటా అనే మూడు కార్లతో స్టంట్లు చేశారు. తొలుత సౌరభ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేశాడు. తదనంతరం రెండు స్టంట్లో మద్యం దుకాణం వెలుపల ఉన్న ముగ్గురు వ్యక్తులన ఘోరంగా ఢీ కొట్టాడు. దీంతో 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు నిందితులు సౌరభ్ శర్మ అలియాస్ సాయిబీ, రాహుల్, రవి సింగ్ అలియాస్ రవీందర్, వికాస్ అలియాస్ విక్కీ, మోహిత్, ముకుల్ సోని, లవ్లుగా గుర్తించి అరెస్టు చేయగా, అశోక్ అనే మరో నిందితుడిని సాయంత్రం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సోదరులని, వారంతా మద్యం సేవించి ఈ స్టంట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఉన్న సీసీఫుటేజ్ తనిఖీ చేయగా సుమారు 10 నుంచి 12 మంది యువకులు మద్యం దుకాణం ముందు కార్లతో విన్యాసాలు చేయడం కనిపించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #Gurugram में मौत की स्टंटबाज़ी, Wine Shop के बाहर स्टंट करते हुए तीन लोगों को मारी टक्कर एक बेगुनाह की मौत @gurgaonpolice pic.twitter.com/edZYWDB39e — Sunil K Yadav 🇮🇳 (@SunilYadavRao) November 7, 2022 (చదవండి: గుట్కా తినండి, మందు తాగండి.. సేవ్ వాటర్!: బీజేపీ ఎంపీ కామెంట్ల దుమారం) -
టాయ్స్లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్లో మొదటి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్లెట్లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్కు సంబంధించిన బ్రాండ్గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్లెట్స్తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆందోళన రేపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 12కు పైగా ఫైర్ ఇంజీన్ మంటల్ని అదుపు చేసుందుకు కృషిచేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Haryana | Fire breaks out in an auto parts manufacturing company in Bilaspur Industrial area, Gurugram. Fire tenders are present at the spot. pic.twitter.com/tj0NVMv4Lz — ANI (@ANI) October 15, 2022 -
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ములాయం సింగ్ యాదవ్.. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..
సాధారణ వ్యక్తుల పెద్ద మొత్తంలో మోసపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక వేళ్ల ఎవరైన కాస్త అధికారుల అండదండ ఉన్నాళ్లు అయితే కేసు ముందుకు వెళ్తుంది లేదంటే అంతే పరిస్థితి. సాక్షాత్తు బోర్డర్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ భారీ మొత్తంలో మోసానికి గురయ్యాడు. పాపం ఆయనే ఫిర్యాదు చేసేందుకు తొమ్మిదేళ్లుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. వివరాల్లోకెళ్తే....బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గుప్తాని గురుగ్రామ్కి చెందిన ఒక ఐటీ సంస్థ దాదాపు రూ. 5.5 లక్షల మేర మోసం చేసినట్లు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా తెలిపారు. సదరు ఇన్స్పెక్టర్ ఇండోర్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఆయనకి అక్టోబర్7, 2014న గురుగ్రామ్లో ఐటీపార్కు నుంచి కాల్ వచ్చిందని, ఆ కంపెనీ ఆయనకు కోట్లలో డబ్బు వస్తుందని ఆశ చూపి సుమారు రూ. 5 లక్షల మేర దోచుకున్నట్లు వెల్లడించారు. దీంతో గుప్తా పలుమార్లు సెబీకి ఫిర్యాదు చేసినట్లు శుక్లా తెలిపారు. రెండేళ్లకు పైగా సెబీతో ఉత్తరప్రత్యుత్తరాలు జరపగా... గుప్తా పేర్కొన్న పేరుతో ఏ కంపెనీ రిజస్టర్ కాలేదని తెలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత గుప్తా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేద్దామనకుంటూ అసలు కుదరలేదని, తొమ్మిదేళ్లు పైగా కేసు నమోదు కాలేదని చెప్పారు. చివరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హెల్ప్లైన్ నెంబర్ సాయంతో ఫిర్యాదు చేయగలిగినట్లు శుక్లా వెల్లడించారు. అయితే ఈ కేసు ఆయనకు కంపెనీకి మధ్య జరిగిన ఫోన్, సోషల్ మీడియా చాట్ల సాయంతో దర్యాప్తు చేయనున్నట్లు సంజయ్ శుక్లా పేర్కొన్నారు. (చదవండి: విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ) -
విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
లక్నో: సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం వరకు ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ను పార్టీ వర్గాలు ట్విటర్ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. मेदांता अस्पताल ने जारी किया आदरणीय नेताजी का हेल्थ बुलेटिन। हम सभी आदरणीय नेताजी के जल्द स्वस्थ और दीर्घायु होने की कामना करते हैं। pic.twitter.com/myCZJIzKMY — Samajwadi Party (@samajwadiparty) October 4, 2022 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్ షా -
పాలు ప్రాణాలు తీస్తాయనుకుంటామా?.. కానీ అదే జరిగింది
గురుగ్రాం: పాలు విషయమై దంపతుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం ముదిరి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. జార్ఖండ్కు చెందిన జుహి(22), బెంగాల్లోని రాంపురాకు చెందిన సుశాంత ఘోష్(25) దంపతులు చుమా గ్రామంలోని అద్దెంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి జుహి తనకు పాలు, చపాతి తినాలనుందని చెప్పడంతో ఘోష్ బయటి నుంచి వాటిని తీసుకువచ్చాడు. అనంతరం పాల విషయంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. మనస్తాపంతో ఘోష్ ఏదో విష పదార్థం తీసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించిన రెండు గంటల తర్వాత కన్నుమూశాడు. విషయం తెలిసి జుహి కూడా విషం తాగి, ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. చదవండి: (CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్పై కర్ణాటక సీఎం ఆగ్రహం) -
'సక్కగ ఉద్యోగం చేసుకో.. ఇలాంటి రిస్క్లెందుకు'
శివాంక్ అగర్వాల్కు కవిత్వం వినడం ఇష్టం. అయితే స్టార్టప్ అనేది కవిత్వం విన్నంత ఈజీ కాదని అర్థమైంది. అనీష్ ఖండేల్వాల్కు జోక్స్ వింటూ నవ్వడం ఇష్టం. అయితే స్టార్టప్ అనేది నవ్వినంత కూల్ కాదని అతడికి అర్థమైంది. అంతమాత్రాన వీరు వెనక్కి తగ్గలేదు. నేర్చుకుంటూనే ముందుకు కదిలారు. ‘మిత్రన్’ అనే తమ కలను నెరవేర్చుకున్నారు... ముంబైలోని జవేరిబజార్కు చెందిన నగల వ్యాపారి అమిత్కు టిక్టాక్ లేకుండా పొద్దు గడిచేది కాదు. టిక్టాక్ నిషేధం తరువాత అతడిని బాగా ఆకట్టుకుంది మిత్రన్. 58 సంవత్సరాల అమిత్కు మాత్రమే కాదు ఎంతోమంది కాలేజి విద్యార్థులకు ఈ ఫ్రీ షార్ట్ వీడియా ప్లాట్ఫామ్ బాగా నచ్చేసింది. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయిన అనీష్ ఖండేవాల్, శివాంక్ అగర్వాల్లు గురుగ్రామ్లోని ఒక ఆన్లైన్ ట్రావెల్ కంపెనీలో పనిచేశారు. ఆ సమయంలోనే షార్ట్–ఫామ్ వీడియో యాప్ ఐడియా తట్టింది.రాత్రనకా, పగలనకా రోజుల తరబడి ఈ యాప్ గురించి చర్చలు జరిపారు. విద్వేషం పంచే, హింసప్రేరేపిత కంటెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనుకున్నారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సులభంగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయాలనుకున్నారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించకూడదు అనేది మరో గట్టి నిబంధన. ‘మిత్రన్’ పేరుతో యాప్ లాంచ్ చేశారు. మొదట్లో యూజర్స్ వీడియోలు చూసే విధంగా మాత్రమే దీన్ని డిజైన్ చేశారు. దీనికి కారణం కంటెంట్ క్రియేట్ చేయడానికి వారు ఆసక్తిగా లేరు అనుకోవడమే. అయితే అప్లోడ్ ఫీచర్ను యాడ్ చేయాలంటూ రిక్వెస్ట్లు వెల్లువెత్తడంతో నెక్ట్స్ వెర్షన్లో అప్లోడ్ ఫీచర్ను యాడ్ చేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది! ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో పుట్టి పెరిగిన శివాంక్ అగర్వాల్కు చిన్నప్పటి నుంచి కవిత్వం చదవడం, రాయడం అంటే ఇష్టం. తండ్రి ప్రొఫెసర్. అనిష్ ఝార్ఖండ్లోని చకులియలో పుట్టాడు. అక్కడే ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి చిన్నవ్యాపారి. ‘ఉద్యోగం చేసుకోకుండా రిస్క్ ఎందుకు’ అని వారి తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. పైగా వారి నుంచి ప్రోత్సాహం కూడా లభించింది. ‘బరిలో రకరకాల ఆటగాళ్లు ఉన్నారు. కొందరు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు, కొందరు నాన్–ఎంటర్టైన్మెంట్ వీడియోలపై దృష్టి పెట్టారు. మేము మాత్రం రెండిటినీ మిక్స్ చేశాం. పదిహేను కంటెంట్ విభాగాలను సృష్టించాం.ట్రెండింగ్ టాపిక్ మీద ఒపీనియన్ వీడియోలు క్రియేట్ చేసే అవకాశం ఇచ్చాం’ అంటున్నాడు ‘మిత్రన్’ సీయివో శివాంక్ అగర్వాల్. ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైన ‘మిత్రన్’లో ఇప్పుడు యాభైమందికి పైగా పనిచేస్తున్నారు.టెక్, ప్రాడక్ట్, మార్కెటింగ్, ఆపరేషన్....ఇలా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ‘మిత్రన్’ ఇన్స్టంట్ సక్సెస్ అయింది.అంతమాత్రన నల్లేరు మీద నడకలాంటి విజయమేమీ కాదు. తొలి అడుగులోనే షాక్ తగిలింది! కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘మిత్రన్’ను తొలగించారు. కరెక్ట్ వే ఏమిటో తెలుసుకొని గూగుల్ టీమ్తో టచ్లోకి వచ్చి తప్పు సరిదిద్దుకున్నారు. ఇలాంటివి మరికొన్ని కూడా ఎదురయ్యాయి. అయితే ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. వీరి భవిష్యత్ ప్రణాళిక విషయానికి వస్తే...క్వాలిటీ వీడియో ఎడిటింగ్ టూల్స్ రూపకల్పన, బ్రాండ్స్, క్రియేటర్స్ను ఒకే వేదిక మీదికి తీసుకురావడం...ఇలా ఎన్నో ఉన్నాయి. -
సీఎం సన్నిహితుడు, బీజేపీ నేత దారుణ హత్య
బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నాయకుడు సుఖ్బీర్ ఖతానాను కాల్చి చంపారు. కాగా, ఆయన మర్డర్పై రంగంలోకి దిగిన హర్యానా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. గుర్గావ్లోని ఓ క్లాత్ షోరూమ్లో స్థానిక బీజేపీ నాయకుడు సుఖ్బీర్ ఖతానాను ఐదుగురు వ్యక్తులు కాల్చి చంపారు. షోరూమ్లోని ప్రవేశించిన దుండగులు సుఖ్బీర్పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుఖ్బీర్ ఖతానా ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్టు పోలీసు ఉన్నతాధికారి దీపక్ సహారన్ తెలిపారు. కాగా, సుఖ్బీర్ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్నికల్లో రిథోజ్ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు స్థానిక మీడియాతో ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. సుఖ్బీర్ గుర్గావ్లోని సోహ్నా మార్కెట్ కమిటీకి మాజీ వైస్ చైర్పర్సన్గా కొనసాగారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సుఖ్బీర్ ఖతానా అత్యంత సన్నిహితుడు. BJP worker and former vice chairman of Sohna Market Committee, Sukhbir Khatana gunned down by unknown assailants in broad daylight on Gurudwara Road #Gurugram. pic.twitter.com/tLxm4YqgxM — Nikhil Choudhary (@NikhilCh_) September 1, 2022 -
నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....
గురుగ్రామ్: ఒక వ్యక్తిని ఫ్రాడ్ కేసు విషయమై పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్కి తరలిస్తున్నారు. ఇంతలో ఆ నిందితుడు ఇద్దరు చెల్లెళ్లు, తల్లి, సోదరుడు పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటన గుర్గావ్లో చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు నిందితుడి సోదరుడు తప్పించుకున్నాడని చెప్పారు. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ కరంబీర్ తమ స్టేషన్లో ఒక ఫ్రాడ్ కేసు నమోదైందని తెలిపారు. తాము ఆ కేసు విషయమై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి అనుమానితుడు కరణ్ సమదర్శ అనే వ్యక్తిని విచారించినట్లు చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్లో తండా గ్రామంలో తన కుటుంబంతో కలసి ఉంటున్నాడని పేర్కొన్నారు. ఐతే అతను పోలీసుల విచారణలో నిందితుడిగా తేలడంతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు అతని కుటుంబానికి తెలియజేసి, పోలీస్టేషన్కి తరలిస్తున్నారు. ఇంతలో అతడి తల్లి ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి పోలీసుల పై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సతేందర్ యూనిఫాం చిరిగిపోయింది. దీంతో స్టేషన్ లోపల ఉన్న మిగతా పోలీసులు సదరు నిందితుడి తల్లి, చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతని సోదరుడు వరుణ్ తప్పించుకున్నాడని, తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. (చదవండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త ) -
నైట్క్లబ్ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన..
Nightclub Viral Video.. బౌన్సర్లు ఓ నైట్ క్లబ్ వద్ద హల్చల్ చేశారు. పబ్కు వచ్చిన మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అసభ్యకరంగా తాకడంతో ఇదేంటని అడిగిన పాపానికి బాధితులను బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని ఓ నైట్ క్లబ్కు కొంత మంది ఐటీ ఉద్యోగులు వెళ్లారు. వారిలో కొందరు మహిళ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, వారు క్లబ్లోని ప్రవేశిస్తున్న క్రమంలో ఓ బౌన్సర్ యువతితో అనుచితంగా ప్రవర్తించి.. తాకరాని చోట చేతి తగిలించాడు. ఈ విషయం ఆమె.. తన సహచరులకు చెప్పడంతో వారు.. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. Gurugram -: Bouncers brutally beat up girl and her manager friend for resisting molestation, case registered pic.twitter.com/8ri6FTwiFM — UP Model/பெண்கள் பாதுகாப்பு உபி மாடல் (@UPModel2022) August 10, 2022 ఈ క్రమంలో బౌన్సర్లు వారిపై దాడి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా ఉద్యోగులందర్నీ చితకబాదారు. వారి దాడిలో కొంత మందికి రక్తం కారడంతో ఆపండి అని మహిళలు ఎంతో అరుస్తున్నా బౌన్సర్లు మాత్రం పట్టించుకోలేదు. బౌన్సర్ల దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. దాడి చేస్తున్న సమయంలో బౌన్సర్లు ఓ వ్యక్తి చేతి ఉన్న వాచ్, రూ. 10వేలను తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Visuals from #Gurugram :Bouncers Assaulted Guests Outside Pub pic.twitter.com/C3mOEstwXh — Sonu Kanojia (@NNsonukanojia) August 10, 2022 ఇది కూడా చదవండి: గ్రూప్హౌస్లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి.. -
మందుబాబులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 గంటలపాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ పాలసీని తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఏడాది కాలానికి గాను రిటైల్ లిక్కర్ లైసెన్స్ ఫీజుకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లించిన బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మద్యంపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, రెస్టారెంట్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యాన్ని అమ్మడానికి అనుమతినిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే అవకాశమున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాన్ని బార్లు, రెస్టారెంట్ల యజమానులు స్వాగతించడం గమనార్హం. ఇది కూడా చదవండి: సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు -
Crime News: తాత ఉసురు తీసిన అత్యాచార ఆరోపణలు
ఢిల్లీ: పుట్టిన ఊరును కన్నతల్లిగా భావించిన ఆ పెద్దాయన.. ఊరి జనాల సాక్షిగా పడ్డ నిందను భరించలేకపోయాడు. భయపడొద్దని, నిజం నిగ్గుతేలుతుందని ఇంట్లో వాళ్లు ఎంత ధైర్యం నింపినా ఫలితం లేకుండా పోయింది. పరువు పోయిందని, అరెస్ట్ చేస్తారనే ఆందోళన రెట్టింపు అయ్యింది. ఫలితం.. ఆ తాత ప్రాణం తీసింది. ఢిల్లీ గురుగ్రామ్ పరిధిలోని ఓ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని 88 ఏళ్ల లాల్సింగ్పై అత్యాచార ఆరోపణలు, అదీ ఓ మైనర్పై కావడంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి పోక్సో చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. దీంతో ఆ వృద్ధుడు కలత చెందాడు. రోజంతా పచ్చి మంచి నీళ్లు ముట్టకుండా ఏడుస్తూనే ఉన్నాడు. చివరకు.. పరువు పోయిందనే బాధతో గురవారం మధ్యాహ్నాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదని, కేసు నమోదు అయ్యిందన్న బాధతోనే లాల్సింగ్ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్టేషన్ హెడ్ వినీత్ కుమార్ భావిస్తున్నాడు. ఇక ఈ కేసులో కేసు పెట్టిన మహిళ(మైనర్ తల్లి) పోలీసులకు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తన కూతురిపై లాల్సింగ్ గత కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని, బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ కేసు పెట్టింది ఆమె. అయితే లాల్ సింగ్ గత కొన్నిరోజులు ఆరోగ్యం బాగోలేక కూతురి దగ్గరికి వెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆమెను గట్టిగా నిలదీయగా, లాల్సింగ్ కుటుంబంపై పాత గొడవల దృష్ట్యా కోపంతోనే కేసు పెట్టినట్లు ఒప్పుకుంది. పోయిన ప్రాణం ఎలాగూ తిరిగి రాదు కాబట్టి లాల్సింగ్ కుటుంబం.. ఆ మహిళను క్షమించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
ప్రీతితో మాట్లాడితే చంపేస్తాం.. యువకుడి కిడ్నాప్!
తన సహోద్యోగితో మాట్లాడుతున్నాడని, అది సహించని ఇద్దరు వ్యక్తులు.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో సోమవారం చోటు చేసుకుంది. సదరు యువకుడు సాహిల్ తన ఉద్యోగం ముగించుకొని ఇంటి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై అతన్ని అడ్డుకుని కారులోకి బలవంతంగా ఎక్కించుకుని నిర్మానుష్యంగా ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దారుణంగా హింసించారు. సాహిల్ వద్ద ఉన్న రూ.2వేలు, మొబైల్ ఫోన్ను లాక్కున్నారు. తన సహోద్యోగి ప్రీతితో మాట్లాడితే చంపేస్తామని వారు హెచ్చరించారని సాహిల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తులను స్థానికంగా ఉండే రాహుల్, నరేష్గా పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్గ్రామ్కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు.గుర్గ్రామ్లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్క్రైమ్, ఈవ్టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్గ్రామ్ పోలిస్ కమిషనర్గా పనిచేశారు. -
దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?
నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలోనే అతిపెద్ద 100 పాయింట్ల ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను గురుగ్రామ్లో ఎన్హెచ్ఈవీ అనే సంస్థ ప్రారంభించింది. రానున్న కాలంలో వాహన వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఈ స్టేషన్ సహకరిస్తుందని తెలిపారు. సెక్టార్ 52లోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఫాస్ట్, స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు తెలిపారు. ఒక రోజులో 576 పెద్ద వాహనాలను ఛార్జ్ చేయవచ్చు అని ఆ సంస్థ అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులను చేపట్టడంలో నైపుణ్యం ఉన్న నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్(ఎన్హెచ్ఈవీ) అనే ప్రైవేట్ సంస్థతో కలిసి నీతి అయోగ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి, యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఇలాంటి మరిన్ని స్టేషన్ల ఏర్పాటు చేయడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్ ఒక ప్రోటోటైప్గా పనిచేస్తుందని ఎన్హెచ్ఈవీ అధికారులు తెలిపారు. ఒక స్లో ఛార్జర్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఆరు గంటల వరకు పడుతుందని, ఒక రోజులో నాలుగు వాహనాలను చార్జ్ చేయగలదు అని, అటువంటి 72 ఛార్జర్లు ప్రతిరోజూ 288 వాహనాలను ఛార్జ్ చేయగలవని తెలిపారు. "వేగవంతమైన డీసీ ఛార్జర్లు రెండు గంటల కంటే తక్కువ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయగలవు. ఈ స్టేషన్ వద్ద ప్రతిరోజూ 12 వాహనాలను చార్జ్ చేయవచ్చు. రోజు మొత్తంలో 288 వాహనాలను ఛార్జ్ చేయడానికి మాకు 24 డిసి ౫కెడబ్ల్యు ఛార్జర్లు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. ఎన్ హెచ్ఈవీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అభిజీత్ సిన్హా మాట్లాడుతూ.. రాబోయే అన్ని ఛార్జింగ్ స్టేషన్లకు ఇది ఒక నమూనాగా నిలుస్తుందని తెలిపారు. 100 ఛార్జింగ్ యూనిట్లతో దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇదే అవుతుందని ఆయన అన్నారు. దీనికి ముందు, అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ ముంబైలో ఉంది సిన్హా పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా జైపూర్-ఢిల్లీ హైవే వెంబడి ౧౦ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, హైవేకు ఇరువైపులా నాలుగు & రెండు నగరాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తామని సిన్హా తెలిపారు. ఢిల్లీ - జైపూర్ మధ్య భారతదేశంలోని తొలి విద్యుత్ రహదారిని నిర్మించడానికి మంత్రిత్వ శాఖ విదేశీ కంపెనీలతో చర్చిస్తుందని గత సంవత్సరం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!) -
భారత్లో మొట్టమొదటిసారి.. ఉద్యోగుల మీద దావా!
Urban Company Sues Women Employees: దేశంలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా హక్కుల ఉల్లంఘనల మీద ఉద్యోగులు కంపెనీల మీద కోర్టుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీనే ఉద్యోగులపై దావా వేసిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. గురుగ్రామ్(హర్యానా) నగర వేదికగా హోం అండ్ బ్యూటీ సర్వీసులు అందించే ‘అర్బన్ కంపెనీ’.. మహిళా ఉద్యోగిణులపై కోర్టుకెక్కింది. కంపెనీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమ తమ ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయంటూ.. మహిళా ఉద్యోగిణులు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల నిరసనను వ్యతిరేకిస్తూ unfair labor practices కింద గురుగ్రామ్ జిల్లా కోర్టుకు వెళ్లింది అర్బన్ కంపెనీ. దీంతో ఉద్యోగిణులు ఉన్నపళంగా నిరసనలను విరమించినట్లు సమాచారం. మ్యానిక్యూర్ సేవల నుంచి కార్పెట్ క్లీనింగ్, చిన్న చిన్న రిపేర్లు.. తదితర సేవలను మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది అర్బన్ కంపెనీ. ఇందుకోసం వేల సంఖ్యలో భాగస్వాములతో(ఆడామగా ఉద్యోగులతో) ఒప్పందం చేసుకుంటోంది. అయితే ఆమధ్య కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం.. సబ్స్క్రిప్షన్ స్కీమ్ తోపాటు భాగస్వాములు(ఉద్యోగిణులు) ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి నెలా కనీస సంఖ్యలో ఉద్యోగాలు, కొత్త భాగస్వామ్య వర్గాలు, కస్టమర్ల కోసం తీసుకొచ్చిన తగ్గింపు పథకం పాటించాల్సి వస్తుంది. ఈ పరిమితులన్నింటి వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందన్నది ఉద్యోగిణుల(భాగస్వాముల) అభ్యంతరం. భాగస్వామి పాయింట్తో కొట్టింది! ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కంటే ముందునుంచే.. ‘బెటర్ పే, వర్కింగ్ కండిషన్’ డిమాండ్లతో అక్టోబర్ నుంచే ఉద్యోగిణులు రోడ్డెక్కడం గమనార్హం. సుమారు 50 మంది ఉద్యోగిణులు గురుగ్రామ్లోని కంపెనీ ముందు నినాదాలతో రాత్రింబవలు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో నలుగురు మహిళా ఉద్యోగిణుల పేర్లను చేర్చి మరీ దావా వేసింది అర్బన్ కంపెనీ. వాళ్ల(ఉద్యోగిణుల) చర్యలను అనైతికం, అన్యాయంగా పేర్కొంది కంపెనీ. పైగా వాళ్లను ఉద్యోగిణులుగా కాకుండా ‘భాగస్వాములు’గా దావాలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సదరు భాగస్వాములకు(ఉద్యోగిణులకు) లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు అర్బన్ కంపెనీ ఆఫీస్ ప్రాంగణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళా ఉద్యోగిణులు బుధవారం తమ నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తమ నిరసనలు మాత్రం కొనసాగుతాయని దావాలో పేర్కొనబడిన ఓ ఉద్యోగిణి చెప్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగిణులను భాగస్వామ్యులుగా ప్రకటించుకుంటూ దేశవ్యాప్తంగా 35 వేల మందితో పని చేస్తోంది అర్బన్ కంపెనీ. భారత్తో పాటు అసీస్, సింగపూర్లోనూ సేవలిందిస్తోంది. ఇప్పుడు భాగస్వాములనే కారణాన్ని కోర్టులో పేర్కొంటూ.. వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గిగ్ సెక్టార్లో వణుకు మన దేశంలో యాభై లక్షల మందికి పైగా గిగ్(చిన్న చిన్న పనులు.. ప్రదర్శనలు, ఇతరత్ర సేవలు.. స్టార్టప్ తరహా కంపెనీల్లో) ఎంప్లాయిస్ ఉన్నట్లు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ చెప్తోంది. వీళ్ల వల్ల గిగ్ ఎకానమీ సమర్థవంతంగా నడుస్తోంది. అర్బన్ కంపెనీ వ్యవహారం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తోందని, తద్వారా గిగ్ సెక్టార్కు చాలా మంది దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వీళ్ల హక్కుల రక్షణకు ఎలాంటి చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఫుడ్ డెలివరీ, రైడ్ ఇలాంటి యాప్స్లో పని చేసే ఉద్యోగులకు భద్రత కరువైంది. కరోనా పరిస్థితుల తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంటోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్లో 35వేలమంది గిగ్ ఎంప్లాయిస్తో కూడిన ఓ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉబెర్, ఒలా, జొమాటో, స్వీగ్గీ.. ఇలా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ‘సోషల్ సెక్యూరిటీ చట్టం’ను 2020లోనే ప్రతిపాదించినప్పటికీ.. అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
మెటా మొట్టమొదటి ఆఫీస్ భారత్లోనే..
గురుగ్రామ్: ఆసియాలోనే అతిపెద్ద కేంద్రంగా పరిగణిస్తున్న కార్యాలయాన్ని ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో మెటా (గతంలో ఫేస్బుక్) బుధవారం ప్రారంభించింది. ఫేస్బుక్ కంపెనీ మెటాగా పేరు మార్చేసుకున్న తర్వాత ప్రారంభించిన మొదటి ఆఫీస్ ఇదే కావడం విశేషం. ఇది సీ ఫైన్(C-FINE) కేంద్రానికి వేదిక కానుంది. తద్వారా వచ్చే మూడేళ్లలో భారత్లోని కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది ఆవిష్కర్తలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు మెటా ప్రకటించింది. 1.3 లక్షల చదరపు అడుగులతో, ఆరు ఫ్లోర్ల బిల్డింగ్తో ఈ కార్యాలయం.. అమెరికాలోని మెలానో పార్క్లో సంస్థ ప్రధాన కార్యాలయంను పోలి ఇది ఉండడం గమనార్హం. ఇక మెటా(ఫేస్బుక్ కంపెనీ) 2010లో హైదరాబాద్లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. ‘‘భారత్ ఫేస్బుక్కు మాత్రమే అతిపెద్ద కేంద్రంగా లేదు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్కూ కీలకమైన దేశంగా ఉంది. భారత్లో మా అతిపెద్ద బృందానికే కాకుండా, బయటి ప్రపంచానికీ ఇది కేంద్రంగా ఉంటుంది’’ అని ఫేస్బుక్ (మెటా) వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తెలిపారు. దేశంలో వాట్సాప్ను 53 కోట్ల మంది, ఫేస్బుక్ను 41 కోట్ల మంది, ఇన్స్ట్రాగామ్ను 21 కోట్ల మంది వినియోగిస్తున్నట్టు అంచనా. చదవండి: ఫేస్బుక్కు షాక్.. 10 లక్షల కోట్లకు దావా వేసిన రొహింగ్యాలు -
ఐఏఎస్ ఆఫీసర్నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్కి టోకరా
గురుగ్రామ్: ఇటీవలకాలంలో రకరకాల నేరాలను చూస్తునే ఉన్నాం. పైగా ఈ కేటుగాళ్ల మోసాలకు అంతేలేకుండా పోయింది. ఆఖరికి పోలీస్ననో లేక ఐఏఎస్ ఆఫీసర్ అనో నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలే ఎక్కువ. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఒక ప్రైవేట్ ఉద్యోగిని కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటూ బురిడి కొట్టించాడు. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) అసలు విషయంలోకెళ్లితే... బిహార్కు చెందిన పాండే తాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానంటూ నగరానికి చెందిన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వికేష్ కుమార్ గుప్తాను మోసం చేశాడు. పైగా తన ఐఏఎస్ అధికారంతో తనకు భారత రక్షణ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు గుప్తా ఆ నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ పాండేకి లక్ష రూపాయాలు కూడా ఇచ్చాడు. అంతేకాదు ఎటువంటి అనుమానం రాకుండా తన వాట్సాప్ ఖాతాలో మంత్రిత్వ శాఖ సర్టిఫికేట్తో ఉన్న ఫోటోను ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు. అయితే కొద్ది నెలలు తర్వాత గుప్తా ఆ వాట్సాప్ ఖాతాలోని ఫోటోని నకిలీ ఫోటోగా గుర్తించి తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. పైగా ఆ వ్యక్తి తన సహోద్యోగి ప్రేమ్ ప్రశాద్ ద్వారా పరిచయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమే కాక పాండేని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!)