ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి! | Teen Spoke In School About Grandma Account Led To 80 Lakh Loss | Sakshi
Sakshi News home page

ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!

Published Wed, Mar 5 2025 3:43 PM | Last Updated on Wed, Mar 5 2025 5:10 PM

Teen Spoke In School About Grandma Account Led To 80 Lakh Loss

మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని  కొన్ని ఆర్థిక విషయాలు షేర్‌ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  స్టోరీ ఏంటంటే.. 

గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక  గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని  ఫ్రెండ్స్‌కి చెప్పింది.  పోలీసులు అందించిన వివరాల ప్రకారం  బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది.  ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్‌ కూడా తనకుందని   తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి  ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్‌ చేశారు.  ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్‌మెయిల్ చేసి, వాటిని  సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు.  దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది.  ఇలా అమ్మమ్మ ఖాతాలోని  మొత్తం  డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి  స్వాహా అయిపోయాయి.

అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని  స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది.  అలా అసలు  సంగతి కుటుంబానికి  చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర  కుటుంబ సభ్యులు  పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు  చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్‌ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా,  డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు  పార్టీలకు ఖర్చు చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో నమోదైన ఈ కేసులో పోలీసులు  ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.  ప్రధాన నిందితుడు నవీన్ కుమార్‌ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు  చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి  రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement