black mail
-
మహా కంత్రీ కిరణ్ రాయల్! ఏకంగా పవన్నే..
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గప్చుప్గా ఉండిపోయారు. అయితే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్ కల్యాణ్ అండ చూసుకునే కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్ కల్యాణ్ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. -
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!
పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్ చేశాడా ఘనుడు.ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్ షోరూంలో ఐఫోన్ కొనిచ్చింది. ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పేయండి.This nithalla boy stopped eating food and was demanding iPhone from her mother.His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.Too much love will always destroy children. Parents should know where to draw the line.This is… pic.twitter.com/govTiTKRAF— Incognito (@Incognito_qfs) August 18, 2024 -
ఆమె వయసు 60.. భర్తకు అనుమానం, నిత్యం వేధింపులు, పక్కా ప్లాన్తో..
సిరిసిల్లక్రైం: వృద్ధాప్యంలోనూ కట్టుకున్న భార్యను అనుమానించాడు. భర్త పదేపదే కొట్టడంతో విసిగిపోయింది. ఎలాగైనా తన భర్తను హతమార్చాలని రూ.రెండు లక్షలకు సుపారీ ఇచి్చంది. గత నెల 13వ తేదీన హత్య జరగ్గా, బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ (60), కాశయ్య (65) బతుకుదెరువుకు సిరిసిల్లకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు జరగగా, కొడుకు మానసికస్థితి సరిగ్గా లేదు. వృద్ధ దంపతులిద్దరూ సిరిసిల్ల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే భార్యపై భర్తకు అనుమానం కలిగింది. పలుమార్లు కనకవ్వను కొట్టాడు. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది. వరుసకు తమ్మునిగా పిలిచే ఒకరికి విషయాన్ని చెప్పింది. భర్తను చంపితే రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. గత నెల 13న మద్యం మత్తులో కాశయ్య నిద్రిస్తుండగా, అనుకున్న పథకం ప్రకారం తను సంప్రదించిన వారికి సమాచారం ఇచి్చంది. వారు ఇంటికి చేరుకొని నిద్రలో ఉన్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో వేసుకొని సిరిసిల్లలోని మానేరువాగు చెక్డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చంపడానికి చేసుకున్న ఒప్పందంతోపాటు హత్య చేసిన విధానాన్ని నిందితుల్లో ఒకరు వీడియో తీసినట్టు తెలిసింది. హత్య చేసిన తర్వాత వచి్చన రూ.2లక్షలతో జల్సాలు చేసే సమయంలో మరో రూ.లక్ష కావాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే హత్యకు సంబంధించిన వీడియో బయటపెడతామని బెదిరించసాగారు. ఈ తతంగమంతా బయటకు పొక్కింది. దీనిపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ విచారణ చేపట్టారు. కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టి అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. చివరికి వృద్ధుడి హత్య చేయడానికి సుపారీ తీసుకున్న ఇద్దరు నిందితులతోపాటు మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బొందలగడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో బయటకు తీయించారు. ఈ విషయంపై సిరిసిల్లటౌన్ సీఐ ఉపేందర్ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందని, వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడిస్తామని తెలిపారు. -
ఫోన్లో ఎక్సైజ్ కానిస్టేబుల్కు వేధింపులు..
మహబూబ్నగర్: ఓ యాప్ను ఉపయోగించి సెల్ నంబర్ కనిపించకుండా ఎవరికై నా ఫోన్ చేసే అవకాశం ఉంది. ఆ యాప్ను ఉపయోగించి ఉద్యోగినిని తరుచుగా ఫోన్లో వేధిస్తున్న యువకుడిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని మద్యం డిపోలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తన ఫోన్కు ఓ గుర్తు తెలియని ఫోన్ నంబర్తో ఓ వ్యక్తి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన ప్రతి సారీ విదేశాల మాదిరిగా కొత్త నంబర్ రావడంతో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియని పరిస్థితి. 5 నెలలుగా ఫోన్లో వేధింపులు భరించిన యువతి అపరిచిత వ్యక్తిని ఎలా గుర్తించాలో తెలియని సంకటస్థితిలో మానసిక వేదనకు గురైంది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్న విషయం ఫోన్లో వివరిస్తుండడంతో ఆశ్చర్యం, అయోమయం ఏర్పడింది. అసభ్యంగా మాట్లాడడంతో పాటు తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఈ విషయాన్ని ఆమె భర్తకు వివరించింది. ఓ సారి భర్త కూడా ఫోన్ వచ్చిన సమయంలో అతనితో మాట్లాడినా అతనిలో మార్పు రాలేదు. ఫోన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం డిపోలో పనిచేస్తున్న కూలీలను, ఉద్యోగులను అనుమానించినా గుర్తించే పరిస్థితి లేకపోయింది. చివరకు సదరు వ్యక్తికి అనుమానం రాకుండా తాను కూడా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది. పెళ్లి చేసుకుందామని నమ్మించి అతనిని గుర్తించి ఒక్కసారిగా అవాక్కైంది. ఇన్నాళ్లు తనను ఫోన్లో వేధించిన వ్యక్తి తాను పనిచేసే మద్యం డిపోలో హమాలీ నాగరాజుగా గుర్తించడంతో వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి తిమ్మాజీపేటకు బదిలీ చేశామని సీఐ తెలిపారు. -
ఇన్స్టాలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. చివరికి బాలిక తల్లిదండ్రులు వెళ్లి
తిరువొత్తియూరు(చెన్నై): ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ బాలిక వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్పేట ఉలుందాండవర్ ఆలయం వీధికి చెందిన సతీష్ కుమార్ (21)కు తేని జిల్లాకు చెందిన బాలిక (17)తో ఇన్స్ట్రాగామ్లో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఊలందూరుపేటకు రమ్మని పిలిచాడు. దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి తిరిగినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మే 5వ తేదీ ఊలందూరుపేటకు వెళ్లి సతీష్ కుమార్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలిక బంధువులతో మాట్లాడిన సతీష్ కుమార్ రూ.70 వేలు ఇవ్వాలని.. లేకపోతే వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తానని బెదిరించాడు. దీనిపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు పెరియకులం మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ కుమార్ను గురువారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి కారు పార్కింగ్ వివాదం.. కర్రతో చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు.. -
షాకింగ్: నటి బ్లాక్మెయిల్.. భరించలేక సూసైడ్ యత్నం
డబ్బు కోసం తమపై ఓ ఎయిర్హోస్టెస్ కమ్ నటి వేధింపులకు పాల్పడటాన్ని భరించలేక.. ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ పోర్న్ స్టార్ తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బద్నాం చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్ అనే వ్యక్తి(ఆ వీడియోలో ఉంది) ఆరోపించాడు. ఈ మేరకు తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు. నా పేరు అషి ఖాన్, ఉజ్జయినిలోని లోహె పుల్లో ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్జిమ్ అనే పోర్న్స్టార్ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్ ఇచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిపిస్తోంది. ఏం చేయాలో తెలియక.. నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్ అందులో పేర్కొన్నాడు. బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం. ఇక నిందితురాలు రిమ్జిమ్ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్హోస్టెస్గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్ యాప్ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బు గుంజుతోందని తెలుస్తోంది. ఘటన జరిగాక.. బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
వాట్సాప్లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన న్యాయవాది మంగేష్కుమార్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ న్యూడ్ కాల్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్ వచ్చింది. మొదట వాట్సాప్లో హాయ్.. హయమ్ శివాని అంటూ చాటింగ్ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరో అని లిఫ్ట్ చేస్తే న్యూడ్కాల్ రావడంతో వెంటనే ఆయన కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు. చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్ హత్యకు ప్రతీకారంగానే?) -
తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...
మైసూరు: మహిళ స్నానం చేస్తుండగా చాటుగా వీడియోలు తీసి తద్వారా బెదిరింపులకు పాల్పడతున్న తండ్రీ కొడుకుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెబ్బాలలో సదరు మహిళ ఇంటి పక్కన ఉండే ప్రమోద్, అతని తండ్రి గోవిందరాజు నిందితులు. బాధితురాలి భర్త పనికి వెళ్ళిన సమయంలో ఇంటి ముందు బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో తండ్రీ కొడుకు కలిసి గుట్టుగా మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. దానిని ఆమె మొబైల్ఫోన్కు పంపి లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో బాధితురాలు, ఆమె భర్త హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
ఫోన్ నెంబర్ ఇచ్చింది.. ఇంటికి రమ్మంది!
అందంగా ఉంది. పైగా చనువుగా మాట్లాడుతోంది. ఇంకేం.. అనుకున్న ఆ యువకుడు ఫోన్ నెంబర్ అడిగాడు. నెంబర్ ఇవ్వడమే కాదు.. రొమాంటిక్ మెసేజ్లతో మత్తులో ముంచెత్తిన ఆమె, ఓ రోజు అతగాడిని ఇంటికి ఆహ్వానించింది. గాల్లో తేలుతూ వెళ్లిన ఆ యువకుడికి షాక్ తగలగడమే కాదు.. పైప్రాణాలు పైనేపోయినంత పని అయ్యింది. కేరళ తిరువనంతపురం అదిమలతురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న బాధితుడు.. ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. ఓ అమ్మాయి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేది. ఆ పరిచయంతో నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఆ ఇద్దరూ వాట్సాప్లో ఛాటింగ్తో గడిపారు. ఈ క్రమంలో.. ఓరోజు అతన్ని ఇంటికి ఆహ్వానించింది ఆమె. తీరా ఆమె బెడ్రూమ్ దాకా వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆమె భర్త ఆ కుర్రాడిని కట్టిపడేశాడు. అంతేకాదు.. ఆమెలా వాట్సాప్లో ఛాటింగ్ చేసింది కూడా ఆ భర్తే అని తెలిసి సదరు యువకుడు కంగుతిన్నాడు. విషయం అర్థమయ్యే సరికి తనని వదిలిపెట్టాలని బతిమాలాడాడు ఆ కుర్రాడు. చివరకు.. లక్ష రూపాయల డబ్బు, అతని కారు ఇస్తే వదిలేస్తామని.. ఆఫర్ ఇచ్చాడు ఆమె భర్త. అయితే తన దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయని, మిగతా డబ్బు కోసం కజకుట్టమ్లో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్లాలని కోరాడు ఆ కుర్రాడు. ఆ వ్యక్తి, అతని స్నేహితురాలు సోని(18), మరో వ్యక్తి.. ఆ కుర్రాడి కారులో బయలుదేరారు. తీరా విలింజమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు చేరుకోగానే.. సడన్ బ్రేక్ వేసి నేరుగా పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు బాధితుడు. పోలీసులకు తన గోడు వెల్లబోసుకోగా.. సిబ్బంది బయటకు వచ్చేలోపు నిందితులంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...
సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య) -
ఆమె అందంతో మిస్టర్ పర్ఫెక్ట్కే వలేసింది.. ఐదేళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత..
జైపూర్: ఆమె అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుంది. చివరకు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ విన్నర్ కూడా ఆమె చేతికి చిక్కి ఇబ్బందులకు గురయ్యాడు. అతడిని హనీ ట్రాప్ చేసిన సదరు యువతి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ ఉందతం రాజస్థాన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన రాధ.. కొన్నేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి రాజస్థాన్లోని జైపూర్లో నివాసం ఉంటోంది. తనకు పెళ్లి అయిన్పప్పటికీ భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, జైపూర్లో రాధ.. కొద్ది రోజులు బ్యూటీ పార్లర్ నిర్వహించింది. అనంతరం జైపూర్ మెట్రో పనిచేస్తుండగా.. ఆరేళ్ల క్రితం ఆమె స్నేహితురాలి ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరూ డీప్ లవ్లో మునిగిపోయి దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రాధ ఆ యువకుడికి దూరమైంది. ఈ క్రమంలో సదరు యువకుడు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నాడు. గతేడాది ఏప్రిల్లో యువకుడికి వివాహం కూడా జరిగింది. మరోవైపు రాధ.. ఓ డ్యాన్స్ గ్రూప్లో చేరి అస్సాం వెళ్లింది. సదరు యువకుడిని విడిచిపెట్టి ఆమె మరికొంత మంది యువకులతో కలిసి జీవించడం ప్రారంభించింది. కాగా, గతేడాది మే నెలలో రాధ మళ్లీ జైపూర్కు చేరుకుంది. తన ప్రియుడికి(మిస్టర్ రాజస్థాన్) వివాహం జరిగిందన్న విషయం తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తమ సంబంధం గురించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి కొద్ది నెలలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాధ అతడిని రూ. 20 లక్షలు డిమాండ్ చేయగా.. తన వద్ద లేవని చెప్పడంతో.. రాధ ఆ వ్యక్తిని అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులు భరించలేక అతను పోలీసులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం.. సదరు వ్యక్తి ఓ హోటల్లో బ్లాక్ మెయిలర్ రాధకు రూ.50 వేల నగదు, మూడు చెక్కులను ఇస్తుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం రాధను సంజయ్ సర్కిల్ పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
అలాంటి వీడియో కాల్స్తో జాగ్రత్త!
వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో తెలియని ఏదో అకౌంట్ నుంచి వీడియో కాల్స్ వస్తుంటాయి. లిఫ్ట్ చేయగానే.. షాక్. అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. కాసేపటికి అన్నోన్ నెంబర్ లేదంటే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్ కాల్స్ లేదంటే మెసేజ్లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్ చేస్తూ.. ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వ్యవహారాలను కొందరు లైట్ తీస్కుంటే.. చాలామంది భయంతో కంగారులో ఏం చేయాలో పాలుపోక వణికిపోతారు. సదరు అకౌంట్లను బ్లాక్ చేయడమో లేదంటే యాప్లను అన్ఇన్స్టాల్ చేయడమో చేస్తుంటారు. అయినా బెదిరింపులు ఆగిపోతాయనుకోవడం పొరపాటే!. చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు.. దేశంలో ఆన్లైన్ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే సైబర్ నేరాల్లో భారత్ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్టార్షన్’ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం మేవాత్ (హర్యానా), భరత్పూర్ (రాజస్థాన్) నుంచి 36 బ్యాచ్లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి ఆపై వాటిని బూచిగా చూపించి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాయి ఈ ముఠాలు. నిజానికి సెక్స్టార్షన్.. నేరాలు కొత్తేం కాదు. కాకపోతే లాక్డౌన్ నుంచి ఈ తరహా నేరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని లక్క్ష్యంగా, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు ఈమధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మీకు తెలుసా?.. డిలీటైన వాట్సాప్ డేటాను సింపుల్గా ఇలా బ్యాకప్ చేయొచ్చు ఏం చేయాలంటే.. సెక్స్టార్షన్లు చాలా సీరియస్ నేరాలు. ఫేస్బుక్ మెసేంజర్లోగానీ, వాట్సాప్లోగానీ, ఇతర ఏ యాప్లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కంగారులో లిఫ్ట్ చేసినా కెమెరాను కవర్ చేయాలి. కాల్స్ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలి. బ్లాక్మెయిలింగ్ కాల్స్, మెసేజ్లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..
బనశంకరి: స్మార్ట్ ఫోన్ వినియోగదారులనే టార్గెట్గా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్, లోకాంటో వెబ్ లింక్లు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట మొబైల్ ఫోన్కు మోసపూరిత వెబ్సైట్ లింక్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు. లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్పై క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే చాలు.. వీడియో కాల్లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, ఫోన్నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్చేస్తామని, వాట్సప్కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్ పోలీస్స్టేషన్లో నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్కు, వెబ్ లింక్లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. -
వీళ్లు మామూలు లేడీలు కాదు.. పెద్ద కేడీలు
జగిత్యాల: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు మహిళలు ప్రముఖులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫొన్లలో పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా మెదులుతూ ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాయలేడీ ముఠాల బ్లాక్మెయిల్స్కు బెదిరిన పలువురు ప్రముఖులు, డబ్బున్న యువకులు పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ముఠాల బాగోతం జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి. వరుసగా ఇదే తరహా ఘటనలు ► జిల్లాలోని ధర్మపురికి చెందిన జమున అనే మహిళ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగుచూసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పరిచయం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెదులుతూ వారిని రహస్య ప్రాంతాలకు రప్పించేది. అక్కడికొచ్చాక ఆ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులతో బెదిరించి వారి వద్ద గల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకున్నారు. ► జగిత్యాల హనుమాన్వాడకు చెందిన కూకట్ రాజ్కుమార్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తిలక్, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కోలపాక దినేశ్, ధర్మపురి పట్టణం మామిడివాడకు చెందిన మామిడి జమునతోపాటు రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 20 ఏళ్ల యువతితో కలిసి గత అక్టోబర్ నుంచి జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు డబ్బు ఉన్న వ్యక్తులను పరిచయం చేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో సదరు ముగ్గురు వీడియోలు చిత్రీకరించే వారు. వీటిని సోషల్మీడియా, వాట్సాప్లలో పోస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు దోపిడీకి పాల్పడ్డారు. ► డిసెంబర్ 22న జగిత్యాల విద్యానగర్కు చెందిన ఒకరిని ఓ మహిళ మేడిపల్లి మండలం వల్లంపల్లికి పిలిపించి బెదిరింపులకు పాల్పడింది. నాలుగు తులాల బంగారం, సెల్ఫోన్ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ► సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన ఓ మహిళ ముఠాగా ఏర్పడి జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన ఒకరిని నాలుగు నెలల క్రితం పరిచయం చేసుకున్నారు. తన వద్ద పలువురు యువతులున్నారని, సన్నిహితంగా ఉంచేందుకు వారిని ఒప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి దశలవారీగా రూ.26 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించింది. ఈ డబ్బులను సుమారు రూ.18 లక్షలు బుగ్గారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లాయి. సదరు వ్యక్తి డబ్బుల కోసం మహిళను నిలదీయడంతో తనను, తన కూతురును వాడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజయం తెలియడంతో వారే అవాక్కయ్యారు. ► ఇదే మహిళ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఒకరిని, కోరుట్లకు చెందిన వ్యక్తిని, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. సదరు మహిళపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటి జగిత్యాల ఇన్చార్జి ఎస్పీ కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డిపై బుగ్గారం మండలానికి చెందిన రాజకీయ నాయకుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ► నాలుగు రోజుల క్రితం వేములవాడలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన మహిళ కుంట సుమిత అలియాస్ నందు అక్కడి పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సదరు మహిళ సైతం పలువురు యువతులు తన వద్ద ఉన్నారని, సెల్ఫోన్లో మాట్లాడిస్తూ వారితో సన్నిహిత్యం ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచే రూ.15 లక్షలు నరెండ్ల గంగారెడ్డి అనే వ్యక్తి ఖాతాలో వేయించి మోసానికి పాల్పడింది. వెలుగుచూడని నిజాలెన్నో.. జిల్లాలో ప్రముఖులు, డబ్బున్న వారిని ఈ కిలేడీ ముఠాలు పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ అందినంత డబ్బు వసూలు చేస్తున్నాయి. వీరి బారిన పడిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నప్పటికీ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరికొంత మంది మాత్రం డబ్బులు తీసుకుని పలువురు యువతులను వారి వద్దకు పంపి వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తెప్పించుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. పరువు పోతుందనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ( చదవండి: ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ) -
ఆ దారుణం వెనుక ముగ్గురు మహిళలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయటమే కాకుండా.. వీడియో తీసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు కొందరు. పాల్వంచలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న పాల్వంచకు చెందిన ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. వీరికి ముగ్గురు మహిళలు సహాయం చేశారు. అత్యాచార దృశ్యాలను వీడియో తీసిన కళావతి అనే మహిళ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయసాగింది. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి : కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది -
హోటల్ గదిలో అత్యాచారం.. వీడియో తీసి..
భోపాల్ : మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్ మేనేజర్ దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్ మేనేజర్తో పరిచయమైంది. అతడు మైనర్ను అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనంతా వీడియో తీశాడు. ( దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..) ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్ మేనేజర్పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. -
25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!
భోపాల్: లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపట్ల ఓ మహిళ అపర కాళికలా మారింది. అతనిపై తిరబడి కత్తితో 25 పోట్లు పొడిచింది. నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈఘటన మధ్యప్రదేశ్లోని గుణలో గత సోమవారం జరిగింది. మృతున్ని బ్రిజ్భూషన్ శర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అశోక్ నగర్లో నివాసముండే శర్మ తనపై గత 15 ఏళ్లుగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శర్మ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దాంతోపాటు ఆ వీడియోలు తీసి ఇన్నేళ్లుగా బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. (చదవండి: ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం) పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకున్నా విడిచిపెట్టలేదని వాపోయింది. ఆనాటి వీడియోతో నిత్యం వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు కూడా అతని తీరు మారలేదని తెలిపింది. పని నిమిత్తం తన భర్త బయట వెళ్లాడని, అదే సమయంలో తప్పతాగి వచ్చిన శర్మ తనపై అఘాయిత్యానికి పూనుకున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశానని వెల్లడించింది. ఆ కామాంధుడి వల్ల తన జీవితం నాశనమైందని, తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, నిందితురాలిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు. (చదవండి: కన్నేసి... కాటేసి..) -
శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’
అమీర్పేట(హైదరాబాద్): టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మధురానగర్లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రావణి ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి పాపులర్ సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్మెంట్లో శ్రావణి కుటుంబం ఉంటోంది. టిక్ టాక్ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డి అలియాస్ సన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దేవరాజ్ వారి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో యువతిని మోసం చేయడంతో.. శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. శ్రావణి వద్ద నుండి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్.. ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. రెండు రోజుల అనంతరం ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తరువాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్ 22న ఎస్ఆర్నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. నాకేం సంబంధం లేదు.. తన కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్రెడ్డి దీనిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, కుటుంబ సభ్యులు కొట్టారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. డబ్బుల కోసం తానేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ అన్నాడు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని తెలిపాడు. దేవరాజ్వల్లే..: సాయి ఇదిలా ఉండగా.. దేవరాజ్రెడ్డి శ్రావణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపించాడు. శ్రావణి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి సమాచారం రాగానే వెంటనే వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తానే ఆసుపత్రికి తీసుకువెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రావణిని దేవరాజ్రెడ్డి ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడినట్టు చెబుతు న్న ఆడియోను విడుదల చేశాడు. ప్రతి పండుగకు గొల్లప్రోలుకు వచ్చేది.. పిఠాపురం: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదా వరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన టీవీ సీరి యల్ నటి శ్రావణి ఆత్మహత్యతో ఆమె కు టుంబంలో విషాదం నెలకొంది. తమ తం డ్రి కొండపల్లి భాస్కరావు వ్యవసాయ కూలీ అని, చిన్ననాటి నుంచి సెలబ్రిటీగా ఎదగా లని శ్రావణి తపన పడేదని మృతురాలి అక్క విమల తెలిపారు. మృతురాలికి విమ ల, మహేశ్వరి అనే ఇద్దరు అక్కలు, శివ అనే సోదరుడు ఉన్నారు. తమ చెల్లి శ్రావణి ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లి తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్లో నటించే అవకాశం సంపాదించిందని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని విమల తెలిపారు. సీరియల్స్లోనే కాకుండా ఆర్ఎక్స్ 100తోపాటు 30 సినిమాల్లో కూడా శ్రావణి నటించిందని ఆమె వెల్లడించారు. ఇటీవలే గొల్లప్రోలులో శ్రావణి సొంతంగా ఇల్లు కొనుగోలు చేసిందని, మూడేళ్ల కిందట తమ తల్లిదండ్రులను గొల్లప్రోలు నుంచి హైదరాబాద్లో తన వద్దకు తీసుకువెళ్లడంతో అక్కడే ఉంటున్నారని విమల చెప్పారు. ప్రతి పండుగకు గొల్లప్రోలు వచ్చి తమతో ఆనందంగా గడిపి వెళ్లేదని, ఇటీవల వరలక్ష్మి వ్రతానికి కూడా వచ్చిందని.. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె విలపించారు. -
మేనకోడలితో సంబంధం.. ప్రైవేట్ వీడియో లీక్
సూరత్ : మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్ మెయిల్కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్లోని సూరల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపిన సందర్భాలను అతగాడు వీడియో తీశాడు. ( చదవండి : నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్) నో చెప్పి, దూరం పెట్టిందని.. ఇదిలా ఉంటే యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : భార్యను హత్య చేసిన కొద్దిసేపటికే..) -
నిజ జీవితంలోనూ విలనే !
యశవంతపుర : తనకు మత్తమందు ఇచ్చి అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నటుడు ధర్మపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని బేగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు... పలు సినిమాలలో విలన్ క్యారెక్టర్లలో నటించిన ధర్మ నిజ జీవితంలో కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. మూడు నెలల క్రితం ధర్మ తన కారు డ్రైవర్ నవీన్ ద్వారా ఓ ఒక మహిళను పిలిపించుకున్నాడు. ఆ రోజు షూటింగ్ రద్దు చేసినట్లు చెప్పి హోటల్ గదికి సదరు మహిళను తీసుకెళ్లాడు. అనంతరం కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ మహిళకు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోవటంతో ఆమెను వివస్త్రను చేసి అశ్లీల వీడియో తీశాడు. అనంతరం ధర్మ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే నీ భర్తకు ఈ వీడియోను పంపుతానని చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 14 లక్షల దాకా వసూలు చేశాడు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె గతనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నటుడు ధర్మను అరెస్ట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని సదరు బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాల్క సుమన్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్పై దాడికి యత్నించారు. ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు: బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్ ఎంపీ సుమన్పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన -
ఎంపీ సుమన్పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్పై రెండు రోజులుగా వైరల్ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్ సునీల్ పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్బుక్లలో ‘బాల్క సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. -
ఎంపీ బాల్కసుమన్పై లైంగిక ఆరోపణలు అవాస్తవం
-
డబ్బులిస్తావా.. వీడియో నీ భర్తకు పంపమంటావా..?
బంజారాహిల్స్ : వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా, చౌటుప్పల్కు చెందిన వివాహిత, దిల్షుక్నగర్ పీ అండ్ టీ కాలనీలో భర్తతో కలిసి ఉంటోంది. అయిదు నెలల క్రితం ఇందిరానగర్కు చెందిన ఏవీ.సుబ్బారావు అనే వ్యక్తితో ఆమెకు ఫోన్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఆమె వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా, మరోసారి అడిగితే నగ్న వీడియోలు బయట పెడతానని బెదిరించాడు. అంతేగాక మరింత డబ్బు కావాలంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో వీడియోలను నీ భర్తకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎన్బీ స్కాం: గోకుల్నాథ్ సంచలన విషయాలు
సాక్షి,ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో కీలక వివరాలను ఈడీ సాధించింది. విచారణలో పీఎన్బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి సంచలన విషయాలను వెల్లడించాడు. బ్యాంకు జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకే తానే ఎల్వోయూల (లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీచేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు మెహుల్ చోక్సీ తనను బ్లాక్ మెయిల్ చేశారని ఈడీ విచారణలో అంగీకరించాడు. అయితే ఇందుకు తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం పొందలేదని వివరించాడు. 2010లో నీరవ్మోదీకి మోడీకి మొట్టమొదటి ఎల్వోయూను జారీ చేసినట్టుగా గోకుల్నాథ్ శెట్టి ఈడీ ముందు ఒప్పుకున్నాడు. దీంతో మొదటి దుర్వినియోగంపై ఇద్దరు వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడడంతో 2017 వరకు జారీ చేస్తూ వచ్చానని తెలిపాడు. ఇలా మొత్తం 13,700 కోట్ల రూపాయల విలువైన ఎల్వోయూలను జారీ చేశానని తెలిపాడు. అయితే 2010 ఆగస్టు నుంచి 2017వరకు పీఎన్బీ బ్రాడీహౌస్ బ్రాంచ్కు జీఎంగా ఉన్న రాజీవ్ జిందాల్ ఆదేశాల మేరకు వీటిని విడుదల చేసినట్టు చెప్పాడు. ఎలాంటి సెక్యూరిటీలు, హామీలు లేకుండానే వీటిని జారీ చేయాలని తనను జీఎం ఆదేశించినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగం ఊడిపోతుందంటూ చోక్సీ, మోదీ బెదిరించారని ఈడీ అధికారులకు చెప్పాడు. బ్యాంకింగ్ నియమాల ఉల్లంఘనపై పూర్తి బాధ్యతను తనపై వేసుకున్న శెట్టి... తన కింది ఉద్యోగులు ఎవరికీ ఈ మోసం గురించి తెలియదని పేర్కొన్నాడు. దీంతో విచారణలో శెట్టి తెలిపిన వివరాలపై ఈడీ మరితంగా ఆరా తీస్తోంది. కాగా ఇప్పటికే రాజీవ్ జిందాల్ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీ స్కాంలో పీఎంఏల్ఏ చట్టం కింద మార్చి 3న, అదుపులోకి తీసుకున్న గోకుల్ నాథ్ శెట్టి జ్యుడీషియల్ కస్టడీ ఈ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీ గడువును కోరే అవకాశం ఉంది. -
చిట్టీవ్యాపారి ఇంటి ఎదుట దంపతుల ఆందోళన
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన బిజిగిరి ప్రభాకర్ భార్య కవితతో కలిసి జమ్మికుంట పట్టణంలోని చిట్టీ వ్యాపారి రమేశ్ ఇంటి ఎదుట మంగళవారం బైఠాయించాడు. చిట్టీ పాడుకుని ష్యూరిటీగా ఇచ్చిన బ్లాంక్ చెక్కును చిట్టీ డబ్బులు మొత్తం చెల్లించన తర్వాత కూడా రమేశ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెక్కు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుడు ప్రభాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలో ప్రభాకర్ గతంలో సెలూన్ షాపు నిర్వహించేవాడు. ఇతడి వద్దనే కటింగ్ చేయించుకునే చిట్టీ వ్యాపారి రమేశ్ తన వద్ద చిట్టీ వేయాలని ఒత్తిడి చేయడంతో ప్రభాకర్ రూ.9 లక్షల చిట్టీ వేశాడు. ప్రారంభమైన మొదటి నెలలోనే చిట్టీని యాక్షన్లో రూ.4.50 లక్షలకు పాడిన ప్రభాకర్ ష్యూరిటీగా రమేశ్కు బ్లాంక్ చెక్కు ఇచ్చాడు. అయితే రమేశ్ చిట్టీ డబ్బులు రూ.4.50 లక్షల కు బదులు రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఈక్రమంలో ప్రతి నెల చిట్టీ డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రభాకర్ సుమారు రూ.3.60 లక్షలు కట్టాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చిట్టీ కట్టలేనని చెప్పాడు. తనకు రావాల్సి డబ్బులు, బ్లాంక్ చెక్కు ఇవ్వాలని రమేశ్ను కోరాడు. చిట్టి వ్యాపారి మాత్రం చెక్కును కోర్టులో వేసి ప్రభాకర్కే నోటీసులు పంపించాడు. దీనిపై జమ్మికుంట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరి మధ్య పంచాయతీ జరిగిందని, అందులో రూ.2 లక్షలు చిట్టి వ్యాపారికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రభాకర్ ముట్టజెప్పాడు. అయినా చెక్కు ఇవ్వకపోవడంతో భార్యతో కలిసి ఆందోళనకు దిగాడు. తన వెంట సూపర్వాస్మ తెచ్చుకుని చెక్కు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని దంపతులు హెచ్చరించారు. ఇంటో రమేశ్ లేకపోవడంతో పరిస్థితిని ఆయన భార్యకు వారు వివరించారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఉదయం 9 నుంచి రాత్రి7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి న్యాయం చేస్తామంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. -
ఓ మంచి సినిమా కొత్తవాళ్లకు పోరాటమే
సాక్షి, ముంబై : కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో కొత్తవాళ్లకు అవకాశాలు వస్తున్నా.. ప్రధానమైన హిందీ సినిమాలలో కీలకపాత్రను దక్కించుకోవడం వారికి ఒక పోరాటమేనని బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి అన్నారు. ఆదివారం బ్లాక్ మెయిల్ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించారామె. హిందీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చిందన్నారు. అయినా కొత్త వాళ్లు తాము గుర్తింపు తెచ్చుకోవడం కష్టమైన పనిగా భావిస్తున్నారాని తెలిపారు. హీరోల పిల్లలకు ఇది చాలా సులభమైన పని పెద్ద నిర్మాణ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్లకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. వారి పిల్లలను పెట్టి సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు సాహసం లాంటిదే కాబట్టి ఎంపిక విషయంలో ఆలోచించి అడుగు వేస్తారని అన్నారు. కొత్త వాళ్లకు ఇది చక్కటి అవకాశం పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం దక్కించుకోవడంతోనే మీరు సగం గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మీ సినిమా ఎంత బాగా ఉన్నా అది బాక్సాఫీస్ వద్ద ఎంత బాగా ఆడిందన్న దాని మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కీర్తి కుల్హరి, ఇర్ఫాన్ ఖాన్ జంటగా నటించిన బ్లాక్ మెయిల్ సినిమా ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘రంగీలా’ సెకండ్ ఇన్నింగ్స్
యాయిరే...యాయిరే...వారెవా ఇది ఏం జోరే... ఈ సాంగ్ అందరికి గుర్తుంటుంది. అప్పట్లో ఈ పాట ఒక సెన్సేషన్. ఏఆర్ రెహమాన్ బీట్కు ఊర్మిళ స్టెప్స్ అదిరిపోయాయి. ఊర్మిళ అనగానే అందరికి మొదట గుర్తొచ్చేది ఈ సాంగే . అంతగా పాపులర్ అయింది ఈ సాంగ్. అయితే ఊర్మిళ సినిమాలు మానేసి చాలా ఏళ్లు అవుతోంది. దాదాపు పది సంవత్సరాల తరువాత ఊర్మిళ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘బ్లాక్మెయిల్’ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో ఊర్మిళ నర్తిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ విడుదల కాబోతోంది. దీంతో ఊర్మిళ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఊర్మిళ మ్యాజిక్ చేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. అభినయ్ డియో దర్శకత్వం వహించిన బ్లాక్ మెయిల్ సినిమా ఏప్రిల్ 6న విడుదల కాబోతోంది. ఊర్మిళ 2008 వరకు సినిమాలు చేసింది. 2014లో మొహసిన్ అక్తర్ మీర్ ను పెళ్లి చేసుకుని సినిమా కెరీర్ నుంచి విరామం తీసుకుంది. మళ్లీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది రంగీలా బ్యూటీ. ఈ సాంగ్పై వర్మ ట్వీట్ చేశాడు. రంగీలా బ్యూటీ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అంటూ ట్వీట్ చేశాడు. Wowwwww👍👍👍 The Rangeela girl is as Rangeeli as ever ..Watch the Forever Green Urmila in https://t.co/p9CKHDRbM8 — Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2018 -
పచ్చటి నంద్యాలకు.. రక్తపు మరకలు
♦ ప్రశాంతతకు నెలవైన ప్రాంతంలో అలజడి ♦ మూడేళ్లుగా అదుపు తప్పిన శాంతిభద్రతలు ♦ ‘ఆళ్లగడ్డ రాజకీయం’ అరువొస్తోందా? ♦ భయాందోళన చెందుతున్న ప్రజలు నంద్యాల: నంద్యాల.. ప్రశాంతతకు మారుపేరు. పచ్చదనానికి చిరునామా. కోనసీమను తలపించే వాతావరణం. పైరుగాలులతో పరవశించే పల్లెలు..వ్యాపారాలు, విద్యాసంస్థలతో కళకళలాడే పట్టణం. ఇదంతా 2014 ఎన్నికలకు ముందు మాట. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నంద్యాలలో అలజడి రేగుతోంది. గొడవలు, బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు రాజకీయాలు, హత్యాయత్నాలు క్రమేణా పెరిగిపోతున్నాయి. ఇలాంటివి నంద్యాల ప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఎరుగరు. ఆళ్లగడ్డ నాయకులు నంద్యాల వాకిట్లో అడుగుపెట్టడంతో ఇక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయని ప్రజలు అంటున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఓటు కూడా లేని ఆళ్లగడ్డకు చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తన అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో నియోజకవర్గంలో అలజడి ఎక్కువైంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర కీలక నేతలను నంద్యాలలోనే తిష్ట వేయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గతంలో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్నారు. అయినా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారే తప్ప ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అధికార దుర్వినియోగం వంటివి లేవు. ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీడీపీ నాయకులు పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని ఓటర్లను భయపెట్టి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రలోభాలకు తెరలేపారు. నోటిఫికేషన్ వచ్చాక బెదిరింపులూ మొదలుపెట్టారు. ప్రశాంత జీవనం సాగిస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, నాయకుల ఇళ్లలో అర్ధరాత్రి సమయాల్లో పోలీసులతో సోదాలు చేయించారు. ఇళ్లలో మారణాయుధాలు, డబ్బులు ఉన్నాయంటూ పోలీసులు హల్చల్ చేసి..వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇంతటితో ఆగకుండా కేసులు పెట్టించడం, తలలు పగలగొట్టడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడకపోవడం వంటి సంఘటనలతో నంద్యాల ఉలిక్కి పడుతోంది. పట్టణంలో 40వేల మంది ఆర్యవైశ్యులు, 68వేల మంది ముస్లింలు కేవలం వ్యాపారాలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో సైతం ప్రస్తుతం భయాందోళనలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోతే ‘మీ అంతు చూస్తామం’టూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆళ్లగడ్డ నాయకులు నంద్యాలకు ఎందుకు వచ్చార్రా బాబూ.. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారం’టూ వారు వాపోతున్నారు. -
దంపతులపై డ్రగ్స్ ‘యోగా’!
తిరువణ్ణామలై (తమిళనాడు): యోగా శిక్షణ పేరుతో మత్తు మందులకు బానిసలు చేసి.. డబ్బు దోచుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ధనికులను టార్గెట్ చేసి.. బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు దండుకుంటున్న ఘరానా దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని హిసాద్ నగర్కు చెందిన జగదీశ్ కేండీ, ఆయన భార్య కిరణ్మయి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. హిసాద్నగర్కే చెందిన ఉషశ్రీ అనే మహిళ నడిపిస్తున్న యోగా శిక్షణ కేంద్రం గురించి వెబ్సైట్లో ప్రచురించిన ప్రకటనను చూసి గత నెలలో కిరణ్మయి, జగదీశ్ చేరారు. ఈ నేపథ్యంలో యోగా శిక్షణ పేరుతో ఉషశ్రీ వారిద్దరికీ మత్తు మందు ఇచ్చింది. అలా భార్యాభర్తలను మత్తు మందులకు బానిసలుగా చేసి.. వారి వద్ద నుంచి 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదును ఉషశ్రీ దోచుకుంది. అనంతరం వారి వద్దనున్న మరో రూ.10 లక్షల నగదును తీసుకునేందుకు ప్రణాళిక వేసింది. ఇందుకోసం భక్తి ప్రయాణం పేరుతో తీసుకెళ్లి కుండలిని అనే యోగా నేర్పిస్తామని వారికి చెప్పింది. భర్త శ్రీకాంత్ రెడ్డితో కలసి ఉషశ్రీ.. కిరణ్మయి, జగదీశ్లకు «అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి వారిని ఈనెల 3వ తేదీన తమిళనాడుకు తీసుకెళ్లింది. 4న శ్రీరంగం ఆలయం వద్ద అద్దె భవనంలో మూడు రోజులు ఉంచారు. అనంతరం గత శుక్రవారం ఉదయం తిరువణ్ణామలైలోని మాడవీధుల్లోగల ఓ లాడ్జిలో ఉంచారు. బంధువుల ఫిర్యాదుతో.. 3వ తేదీన కిరణ్మయి, జగదీశ్లకు బంధువులు ఫోన్ చేశారు. ఆ సమయంలో వారిద్దరూ తడబడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణలో ఉషశ్రీ వీరిద్దరినీ కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా పరిశీలించగా తిరువణ్ణామలైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్నికి హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో వారు లాడ్జిలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ధనికులను గుర్తించి.. యోగా శిక్షణ పేరుతో ధనికులను గుర్తించి వారిని మత్తుకు బానిస చేయడం, వారి వద్ద నుంచి నగదు దోచుకోవడం తరచూ చేస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. బాధితులు మత్తులో ఉన్న సమయంలో వారిని నగ్నంగా చేసి వీడియో తీసి.. దానితో బ్లాక్ మెయిల్చేసి నగదు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి మత్తుకు ఉపయోగించే వస్తువులు, క్రెడిట్, డెబిట్, ఆధార్, రేషన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. -
బ్లాక్ మెయిల్ చేస్తున్న ముద్దుకృష్ణనాయుడు
-
వీడియో తీసి బెదిరిస్తున్నాడు..
రూరల్ ఎస్పీ గ్రీవెన్స్లో ఓ మహిళ ఫిర్యాదు గుంటూరు ఈస్ట్: బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని సోమవారం ఓ మహిళ అడిషనల్ ఎస్పీకి మొరపెట్టుకుంది. జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడుకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. సత్తెనపల్లి నుంచి వృత్తిరీత్యా నరసరావుపేటకు వచ్చి ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు, పక్క పోర్షన్లో ఉండే వ్యక్తి తాను బాత్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ ఆమెకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ఫేస్బుక్ పరిచయంతో బ్లాక్ మెయిల్ చేసి..
నాగోలు: ఫేస్బుక్ పరిచయంతో ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి రూ.14 లక్షలు తీసుకుని విదేశాలకు వెళ్లిన నిందితున్ని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడ మండలం మారుతీనగర్కు చెందిన ఒట్టి జైపాల్రెడ్డి కుమారుడు రాజ్గోపాల్రెడ్డి ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్సలో ఎంఎస్ చేశాడు. 2010 నుంచి 2012 వరకు లండన్లో ఉద్యోగం చేశాడు. అప్పుడే అతనికి ఎల్బీనగర్ శివగంగకాలనీలో నివాసముండే జి. సతీష్రెడ్డి భార్య సుష్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ముసుగులో రాజ్గోపాల్రెడ్డి సుష్మతో చనువుగా మాట్లాడేవాడు. రాజ్గోపాల్రెడ్డి 2012 అక్టోబరులో నగరానికి వచ్చి కేపీహెచ్బీ కాలనీలో కొంత కాలం ఉన్నాడు. ఈ క్రమంలో రాజ్గోపాల్రెడ్డి, సుష్మ తరచూ ఫోన్లో మాట్లాడుతూ మరింత చనువు పెంచుకున్నాడు. సుష్మ మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసిన రాజ్గోపాల్రెడ్డి భర్తకు చెబుతానని బెదిరించాడు. రాజ్గోపాల్రెడ్డి తల్లి క్లెమెనా, సోదరి తుమ్మరాజు ప్రియాంక ఖాతాలలో సుష్మ ద్వారా డబ్బులను వేయించుకున్నాడు. 2014 డిసెంబరు 14న సుష్మ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో భర్త ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కొద్ది గంటలలో ఆమె తిరిగి ఇంటికి వచ్చి తనను రాజ్గోపాల్రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమై, మాయమాటలు చెప్పి తన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బెదిరిస్తున్నాడని తెలిపింది. తన వద్ద నుంచి, బంధువుల నుంచి రూ.14 లక్షల వరకు రాజ్గోపాల్రెడ్డికి పంపానని పేర్కొంది. ఆ డబ్బులు తిరిగి ఎలాగైనా రాబట్టాలని భర్తను కోరింది. గత ఏడాది ఎల్బీనగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్గోపాల్రెడ్డి పాస్పోర్టు, వీసా సంబంధిత వివరాలనుఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించారు. శనివారం సాయంత్రం రాజ్గోపాల్రెడ్డి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఎస్ఐ శ్రీనివాస్ ఎయిర్పోర్టులో అతన్ని అరెస్ట్ చేసి పాస్పోర్టు, వీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
టీఆర్ఎస్లో చేరేందుకు యత్నించలేదా..?
ప్రమాణం చేసి చెప్పాలి పార్టీలోకి రానివ్వడం లేదనే దయాకర్రావు ఆక్రోశం ఎంపీని నేను కోన్ కిస్కా అయితే నీవు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేవా.. ఎంపీ కడియం శ్రీహరి హన్మకొండ సిటీ : టీఆర్ఎస్లోకి రానివ్వనందుకే టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు తనపైన, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై ఆక్రో శం వెళ్లగక్కుతున్నారని వరంగల్ ఎంపీ కడి యం శ్రీహరి అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. టీడీపీకీ చెందిన నలుగులు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడానికి సంసిద్ధంగా ఉంటే వారిని అడ్డుపెట్టుకుని తనకు మంత్రి పదవి ఇస్తే మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నించలేదని, అర్థరాత్రి కేసీఆర్ను కలవలేదని దేవునిపై కాని, నీవు నమ్మే చిన్నజీయర్స్వామిపై కాని ప్రమా ణం చేయాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారన్నారు. వరంగల్ ఎంపీనైన తనను కోన్ కిస్కా అంటే నిన్ను ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే అనాలా అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఇతర ఎమ్మెల్యేలకు అన్వయించుకోవద్దన్నారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను రాకుండా ఏపీ సీఎం అడ్డంకులు సృష్టిస్తున్నారని శ్రీహరి ఆరోపించారు. ఏపీలోని వివిధ పవర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు రావా ల్సిన 1900 మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేలా టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఒప్పించాలన్నారు. ఢిల్లీకి వెళ్లి సాధించేదేమీ లేదని, ముందుగా విశాఖపట్నం వెళ్లి ఏపీ సీఎంను కలిసి తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలని కోరాలని సూచించారు. తెలంగాణను దోపిడీ చేసినందుకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. తక్కళ్లపల్లి రవీందర్రావు, రాజయ్య యాదవ్, భరత్కుమార్రెడ్డి, సకినాల శోభన్, ఇండ్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నీలి చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్!
-
నీలి చిత్రాలతో బ్లాక్ మెయిలింగ్!
విజయవాడ: నగరంలోని కాలేజి విద్యార్థినీలను ట్రాప్ చేస్తున్న ముఠాలోని కొంతమంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడి కాలేజి విద్యార్థినీలను ప్రేమ పేరిట మోసం చేస్తున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఉన్నత వర్గాలకు చెందిన కాలేజీ అమ్మాయిలను స్నేహాం పేరిట నమ్మించి హోటళ్ళు, పార్టీలు అంటూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతున్నారు. ఆ తర్వాత నిర్జీవ ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ వారితో అసభ్యంగా ప్రవర్తించి సెల్ ఫోన్ లలో ఫోటోలు తీయడం వారి నైజం. ఒకవేళ అడిగినంత డబ్బు, బంగారం ఇవ్వకపోతే తమతో కలిసి వున్న ఫోటోలను ఫేస్బుక్, యూట్యూబ్లో పెడతామని బెదిరిస్తూ అమ్మాయిల దగ్గర నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటికే ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠాను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రేమ పేరుతో యువతులకు మత్తు మందు ఇచ్చినీలి చిత్రాలు తీస్తున్నట్లు నగర కమీషనర్ తెలిపారు. అందుకోసం ఒక రూమ్ లో సెటప్ చేసుకుని.. ఆపై యువతలకు మత్తు మందులు ఇచ్చి నీలి చిత్రాలు తీస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెడు స్నేహాలతో అబ్బాయిలు, అమ్మాయిలు మోసపోతున్నారన్నారు. ఈ ముఠానే కాకుండా ఇంకా నగరంలో ఇలాంటివి ఎన్ని ముఠాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ప్రధానంగా దృష్టి సారించామన్నారు. -
అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి రాలేదు
- బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వం ఎమ్మెల్యే సంజీవయ్యకు లేదు - వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం సూళ్లూరుపేట: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను బ్లాక్ మొయిల్ చేశారని, అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని టీడీపీ మండల అధ్యక్షుడు, న్యాయకోవిదులు తిరుమూరు సుధాకర్రెడ్డి విమర్శించడం గురువింద సామెతను తలపింపజేస్తుందని వైఎస్సార్సీపీ నేత దబ్బల రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కిలివేటిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ప్రజావిశ్వాసం కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పరసా వెంకటరత్నయ్య జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా విధులకు డుమ్మాకొట్టి పాల్గొనడం ఏ రాజ్యాంగంలో ఉందో? న్యాయకోవిదులైన సుధాకర్రెడ్డి చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఉందని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రొటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, నలుబోయిన రాజసులోచనమ్మ, గండవరం సురేష్రెడ్డి, సుల్తాన్బాషా, రఘు, మురుగన్, గోగుల తిరుపాలు, వార్డు కౌన్సిలర్లు నలుబోయిన చిట్టిబాబు, ఉమ్మిటి జానకీరామ్, ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. దళిత వ్యతిరేకి పరసానే: సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా 15ఏళ్ల పాటు పని చేసిన పరసా ఏనాడైనా దళితులకు మేలు చేశారా అని వైఎస్సార్సీపీ దళిత నాయకుడు, మండల ఉపాధ్యక్షు డు శ్రీహరికోట చెంగయ్య, కౌన్సిలర్ పాలా మురళి ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కిలివేటి దళితులందరినీ కలుపుకుని పోతుంటే ఆయనను దళిత వ్యతిరేకి అని ఎలా అంటారని ప్రశ్నించారు. సుధాకర్రెడ్డి లాంటి వ్యక్తులు లేనిపోని ఆరోపణలతో విమర్శలు చేస్తే తగిన రీతిలో ఆయనకు సమాధానం చెబుతామని హెచ్చరించారు. కౌన్సిలర్లు ముత్తుకూరు లక్ష్మమ్మ, పేర్నాటి దశయ్య, తొప్పాని మధు, గునిశెట్టి చిరంజీవి, వాటంబేటి నాగయ్య, ముత్తుకూరు రవి పాల్గొన్నారు. -
మాజీ ప్రియుడి బ్లాక్మెయిల్తో పెళ్లి కాన్సిల్
-
నిర్వేదంలో బీద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నా దగ్గరే కోవర్టులు తయారయ్యారు. చూస్తూ ఉంటే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పోయారు. ఎలక్షన్ కదా అని ఎవరికి వారు వారి శక్తికి మించిన కోర్కెలు కోరితే తీర్చాలా. ఒకసారి ఓడిపోయాను. ఇంకోసారి ఓడిపోతే ఏమౌతుంది.’ కావలి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్రావు పార్టీ మండల, గ్రామ స్థాయి నేతల నుంచి ఎదురవుతున్న డిమాండ్లతో పాటు, పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలతో తలబొప్పి కట్టి తన నిర్వేదాన్ని ఇలా బయటపెడుతున్నారు. ఇంతకీ ఆయన నిర్వేదానికి కారణమేమంటే... తెలుగుదేశం పార్టీకి కావలి నియోజకవర్గం తప్పకుండా గెలిచే స్థానమని ఆ పార్టీ జిల్లా నాయకులు, పార్టీ నాయకత్వం కూడా గట్టిగా నమ్ముతూ వచ్చింది. ఎన్నికల హడావుడి ప్రారంభమైన తొలినాళ్లలో ఆ పార్టీ కేడర్, లీడర్లలో కూడా ఇదే ధీమా కనిపిస్తూ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి క్రమంగా సీన్ మారుతూ వచ్చింది. బీద మస్తాన్రావు కంచుకోటలైన గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీ దూసుకుపోవడం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి లాంటి ముఖ్యులతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చేరికలు ఒక వైపు ఆయనకు గుబులు పుట్టిస్తుంటే, సొంత పార్టీ నుంచే కొందరు తనను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారా అనే భయం ఆవహించినట్లు కావలి టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ కొన్ని రోజుల ముందు వరకు బీద మస్తాన్రావుకు పెట్టని కోట. టీడీపీతో సంబంధం లేకుండా ఆయన ఈ గ్రామంలో తన సొంత బలం పెంచుకున్నారు. ఏ ఎన్నికల్లో అయినా ఈ పంచాయతీలో దాదాపు 90 శాతం ఓట్లు బీదకు అనుకూలంగా ఓట్లు పడేవి. ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఈ పంచాయతీలో తన పట్టు సడలిందనే విషయం బీద మస్తాన్రావు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఆ పంచాయతీలో ఎక్కువ భా గం కేడర్ వైఎస్సార్సీపీలో చేరింది. ఆ మండల టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలోకి వలసలను పసిగట్టి నిలువరించలేక పోయారని బీద ఆ మండల నేతలపై పరోక్షంగా అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తనకు అత్యంత ఆప్తులైన కొం దరి వద్ద ఆఫ్ది రికార్డుగా తన బాధను వెళ్లగక్కుతున్నట్లు తెలిసింది. అల్లూరు మండలానికి చెందిన పార్టీ నాయకులు కొందరు ఎన్నికల ప్యాకేజీల విషయమై ఇటీవల మస్తాన్రావు మీద ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంలోనే మస్తాన్రావు గతంలో ఒకసారి ఓడాను.. మరొకసారి ఓడుతానేమో.. అయినా ఏమవుతుంది అంటూ వారిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కావలి పట్టణంలో పార్టీ పరిస్థితిపై బీద మస్తాన్ ఆందోళన చెందుతున్నారు. ఆదాల ఓట్లపై అనుమానం అల్లూరు మండలానికి చెందిన ఆదాల ప్రభాకర్రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు పడే ఓట్లు తనకు పడుతాయా, క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే అనుమానం బీదలో నెలకొన్నట్లు తెలిసింది. ఆదాల వర్గీయుల ప్రవర్తనపై బీద విచారణ చేయిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఆదాల వర్గీయులు ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా బీద తన సొంత అనుచరులను పంపి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కోవర్టుల భయం పార్టీ కార్యక్రమాల్లో బీద మస్తాన్రావు మాట్లాడే సమయంలో ఎవరిదైనా ఫోన్ మోగితే వెంటనే ప్రసంగాన్ని ఆపేస్తుండడం కనిపిస్తోంది. తన మాటలను కొంతమంది పక్క పార్టీ నేతలకు చేరవేస్తున్నట్లు బీదలో అనుమానం నెల కొంది. ఇటీవల టీడీపీలో చేరిన కచ్చేరిమిట్టకు చెందిన ఓ నాయకుడిపై అనుమానం రావడంతో ఆయన ప్రవర్తనపై దృష్టి పెట్టమని బీద తన అనుచరులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కోవర్టులు ఎంతో మంది ఉన్నారని, దీంతో అల్లూరు మండలంలో తాను ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని, కోవర్టులను గుర్తించాలని కోరుతున్నట్టు సమాచారం. నేతల అసహనం బీద మస్తాన్రావు ప్రవర్తనపై స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కావలిరూరల్కు చెందిన ఓ ముఖ్య నేత అయితే బీద ప్రవర్తన తనను అవమానించేలా ఉందని పలువురు నేతల వద్ద వాపోయినట్లు ప్రచా రం జరుగుతోంది. కావలికి చెందిన ఓ నేత అయితే ఎమ్మెల్యేగా ఉండగా బీద సక్రమంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నట్టు సమాచారం. ఆయన ఎప్పు డు ఎలా ఉంటారో చూసుకుని మాట్లాడాలని ఆ నాయకుడు చోటా నేతలు, కార్యకర్తలకు చెబుతున్నట్లు తెలిసింది. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
పెదకాకాని, న్యూస్లైన్: హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తూ విటులను నగ్నంగా ఫోటోలు తీసి.. వారిస్థాయిని బట్టి బ్లాక్మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకునే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. పెదకాకాని పోలీస్స్టేషన్లో సోమవారం గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన గోపు కృష్ణ అలియాస్ కృష్ణయ్య, పోకూరి లక్ష్మణాచారి అలియాస్ లక్ష్మణ్, గోపు ఉమలు ముఠాగా ఏర్పడి హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణ తేలిగ్గా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వ్యభిచార వృత్తిని ఎంచుకొని కొనసాగిస్తున్నాడు. మహిళలతో పరిచయం పెంచుకుని తనకు తెలిసిన విటుల వద్దకు పంపింస్తుంటాడు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడొకరు కృష్ణకు పరిచయమయ్యాడు. ఆ వైద్యునికి అమ్మాయి ఉందని చెప్పి రూ.20 వేలు తీసుకున్నాడు. కృష్ణ పెదకాకాని సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఉంటున్న తన రెండో భార్య ఉమ వద్దకు ఆ వైద్యుడ్ని పంపించాడు. ఇద్దరూ లోపల ఉన్న సమయంలో ముందస్తు పథకంలో భాగంగా కృష్ణ, లక్ష్మణాచారిలు తలుపుకొట్టి లోపలకు వెళ్లారు. నగ్నంగా ఉన్న ఇద్దరి ఫొటోలు తీసి.. నా భార్య వద్దకు ఎందుకు వచ్చావంటూ లక్ష్మణాచారి బెదిరింపులకు దిగాడు. నగ్నంగా ఉన్న ఫొటోలను నీ భార్యకు పంపిస్తామని ఆ వైద్యుడ్ని బ్లాక్మెయిల్ చేసి రెండు విడతలుగా రూ.2.30 లక్షలు వసూలు చేశారు. ఈ నెల ఒకటో తేదీ మళ్లీ ఆ వైద్యుడ్ని బెదిరించి రూ.22.70 లక్షలకు చెక్కులు రాయించుకున్నారు. దీంతో బాధిత వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం.. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.2.30 లక్షల నగదు, రూ.22.70లక్షలకు చెక్కులు, హుందాయ్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంతో చొరవచూపిన సిబ్బంది హెడ్కానిస్టేబుల్ ఏడీ కోటేశ్వరరావు, బెల్లంకొండ గురవయ్య, బుల్లిబాబు, కృష్ణ, శ్రీనులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ డి.సూర్యశ్రావణ్, సీఐ కె శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన కృష్ణపై ఇదే వ్యవహారంలో గుంటూరు, విజయవాడ, వినుకొండ పోలీసుస్టేషన్లలో పెండింగ్ కేసులు ఉన్నాయి. బాధిత వైద్యుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. -
శృంగారం చేయాలంటూ బలవంతం
మంగళూరు: శృంగారం చేయాల్సిందిగా ఇద్దరు వైద్యవిద్యార్థులను బలవంతం చేయడమే కాకుండా, వారి చర్యను వీడియో తీసి, బ్లాక్మెయిల్కు పాల్పడిన ఎనిమిది మంది దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరు శివార్లలో డేరాలకట్ట ప్రాంతంలో డిసెంబర్ 18న జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వైద్య విద్యార్థులైన ఇద్దరు యువతీ యువకులు కారులో వెళుతుండగా, ఎనిమిది మంది దుండగులు వారిని అడ్డగించి, బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేశారు. చేయకుంటే, చంపేస్తామని బెదిరించారు. యువతీ యువకుల శృంగారాన్ని వీడియో తీసి, రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. లేకుంటే, వీడియోలోని దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. చివరకు రూ.3 లక్షలు చెల్లించేందుకు వారు అంగీకరించడంతో, డబ్బు తీసుకువచ్చేందుకు జంటలో యువతిని విడిచిపెట్టి, యువకుడిని బందీగా ఉంచుకున్నారు. ఆమె ఒక న్యాయవాది సహాయంతో జరిగిన సంఘటనపై కొనాజే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి, శనివారం 8 మంది దుండగులనూ అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు పాత నేరస్తులేనని పోలీసులు చెప్పారు -
డంపులు.. డబ్బులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక దందా ఇపుడో ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులతో చేతులు కలిపి వందలాది లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఇదే అదునుగా ఇసుక లారీలు, ట్రాక్టర్లను ఆపి వసూళ్లకు తెగబడుతున్న పోకిరీలు పెరిగిపోయారు. రాత్రిపూట కాపుగాసి బండ్లు పట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తోటలు, రోడ్డు పక్క ఖాళీస్థలాలు ఇసుక డంపులుగా మారాయి. వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా డంపులకు ఇసుక చేర్చి, ఆ తర్వాత లారీలకు ఎత్తి నగరాలకు తరలిస్తున్నారు. శనివారం వేములపల్లి మండలంలో ఒకే చోట 50ట్రాక్టర్ లోడులకు సరిపోయే ఇసుక డంపును స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇసుక క్వారీలకు అనుమతి లేదు. జరుగుతున్నదంతా అక్రమ వ్యాపారమే. గ్రామాల్లో స్థానిక అవసరాల పేర ఇసుక తవ్వేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఏకంగా జేసీబీలు పెట్టి మరీ తవ్వుతున్నారు. లారీల్లో నింపి దానికి ఎస్కార్టుగా కొందరు ముందుండి ప్రధాన రహదారుల దాకా కాపలా కాస్తూ వెళుతున్నారు. వేములపల్లి మండలంలోని పాలేరు వాగు నుంచి ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఒక్కో లారీకి రూ.20 వేల చొప్పున తీసుకొని రాత్రి వేళ దందా నడుపుతున్నారు. ఉదయం పూట పాలేరు వాగు నుంచి డంపులకు చేరవేసి రాత్రి వేళ లారీలలో తరలిస్తున్నారు. కామేపల్లి, రావులపెంట, సల్కునూరు, బొమ్మకల్లు, భీమనపల్లి, ఆగామోత్కూర్, చిరుమర్తి, కల్వెలపాలెం గ్రామాలతో పాటు మిర్యాలగూడ మండలం తడకమళ్ల నుంచి లారీల కొద్దీ ఇసుక బయటకు తరలిపోతోంది. ఒక్క సల్కునూరు క్రాస్ రోడ్డు వద్దనే తొమ్మిది చోట్ల డంపులు నిర్వహిస్తున్నారు. సల్కునూరు క్రాస్ రోడ్డు పరిసర ప్రాంతాలు రాత్రి వేళ పట్టపగలును తలపించే స్థాయిలో ఇసుక వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రెవెన్యూ అధికారులకు మామూళ్లు.. ఇసుక దందా నిర్వాహకులు రెవెన్యూ అధికారుల్లో కొందరిని తమ గుంపులో కలిపేసుకుంటున్నారు. మరికొందరికి మామూళ్లు ముట్టజెప్పి తమ దందాకు అడ్డుపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక్కో లారీకి కనీసం రూ.1500 ముట్టజెబుతున్నారు. రాత్రి వేళ తరలిస్తున్న ఇసుక లారీలకు సంబంధించి డబ్బులు ఉదయమే అందిస్తున్నారు. కొంతమంది డంప్నకు రూ.20 వేల నుంచి 30 వేల రూపాయలు నెలసరి మామూళ్లు అం దిస్తున్నారు. ట్రాక్టర్లు నడిపేవారు ఒక్కో ట్రాక్టర్కు నెలకు రూ.2 వేల చొప్పున మామూళ్లు ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వారి లారీలను మాత్రమే పట్టుకుంటున్నారన్న ఆరోపణలు రెవెన్యూ శాఖ అధికారులపై ఉన్నాయి. ఇటీవల మిర్యాలగూడ మండలం తడకమళ్లలోని సాగర్ ఎడమ కాలువ వద్ద ఉన్న డంపుల నుంచి వెళుతున్న 9 లారీలను సీజ్ చేశారు. ఇక, సల్కునూరు వద్ద ఉన్న డంపుల జోలికి వెళ్లని వేములపల్లి రెవెన్యూ అధికారులు శనివారం కామేపల్లి గ్రామానికి వెళ్లి నిల్వ ఉన్న డంపులను సీజ్ చేశారు. పట్టుకుంటే భారీగా వసూళ్లు.. పట్టుబడిన లారీల నుంచి కొందరు అధికారులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో లారీకి రూ.30 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా రాత్రి వేళలో తిరుగుతూ లారీలు పట్టుకొని డబ్బులు ముడితే వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మిర్యాలగూడ మండల అధికారి ఒకరు రెండు లారీలు పట్టుకొని రూ.85 వేలు వసూలు చేసినట్లు సమాచారం. వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించిన ఈ ఉదంతాలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో హాలియా వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక నల్లగొండ రూరల్ పోలీసు స్టేషన్ మీదుగానే మునుగోడు రోడ్డు నుంచి జాతీయ రహదారికి చేరుకుంటోంది. నల్లగొండ-నాగార్జునసాగర్ బీటీ రోడ్డు ఇసుక లారీల పుణ్యమాని రూపం కోల్పోతోంది. మునుగోడు, కనగల్ వాగుల్లోనూ ఇసుక తోడేస్తున్నారు. కేవలం ఇసుక వ్యాపారం నడపడానికి కొందరు ట్రాక్టర్లు, లారీలు, జేసీబీలు కొనుగోలు చేశారంటే ఆశ్చర్యం లేదు. ఇక, మూసీ పరీవాహక ప్రాంతంలోనూ ఇసుక వ్యాపారానికి బ్రేకులు పడలేదు. ఎవరి స్థాయిలో వారికి అదనపు ఆదాయం ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి కళ్లెం వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. -
మోసం చేశాడు.. కాదు బ్లాక్మెయిల్ చేస్తోంది!
=స్నేహితుడి ఇంటి ముందు స్నేహితురాలి ధర్నా =బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ స్నేహితుడి ఆత్మహత్యాయత్నం మదనపల్లెక్రైం, న్యూస్లైన్ : ప్రేమపేరుతో నమ్మించి, ఇప్పుడే మో తనకు సంబంధం లేదని తప్పించుకుంటున్నాడంటూ స్నేహితురాలు అత ని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆ మె బ్లాక్మెయిల్ చేస్తోందంటూ స్నేహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మదనపల్లెలో కలకలం రేపింది. స్నేహితురాలి కథనం మేరకు.. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన ఇమాంసాహెబ్, మెహతాజ్ దంపతులు 8 నెలల క్రితం రామారావుకాలనీలోని అన్వర్ ఇంటిలో అద్దెకు దిగారు. ఆరునెలల క్రితం అన్వర్ కుమారుడు మహ్మద్(25) ఇమాం సాహెబ్ కుమార్తె షబీనా(20)ను ప్రేమిస్తున్నానంటూ వెంట ప డ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటాడు క దా అని షబీనా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఇదిలావుండగా రెండునెలల క్రి తం ఇమాంసాహెబ్ కుటుంబం చంద్రాకాలనీకి మారిపోయింది. షబీనాకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటుండగా తాను మహ్మద్ను ప్రేమిస్తున్న ట్లు ఇంట్లో చెప్పింది. దీంతో వారు మహ్మద్ ఇంటికి వెళ్లి పెళ్లి సంబం ధం మాట్లాడారు. వారు లక్షల్లో కట్నం డిమాండ్ చేయడంతో మిన్నకుండిపోయారు. తిరిగి రెండు రోజులక్రితం షబీనాకు పెళ్లి సంబంధాలు చూశారు. దీంతో ఆమె గురువారం తల్లిదండ్రుల తో గొడవపెట్టుకుంది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని పట్టుబట్టింది. షబీనాను తల్లిదండ్రులు ఇం ట్లోంచి గెంటేశారు. దీంతో ఆమె స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లింది. మహ్మద్ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇక చేసేది లేక ఆమె అక్కడే ధర్నా కు దిగింది. ఏమి చేయాలో పాలుపోని అన్వర్ కుటుంబసభ్యులు మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసుకుని సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. షబీనా అ క్కడే కూర్చొండిపోవడంతో విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి కవరేజి చేశారు. మహ్మద్ ఆత్మహత్యాయత్నం షబీనా తన ఇంటిముందు ధర్నా చేస్తూ తనపై లేనిపోనివి మీడియాకు చెబుతోందని మనస్తాపం చెందిన మహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకెలాంటి సం బంధం లేదని, షబీనా కావాలనే తనను బ్లాక్మెయిల్ చేస్తోం దంటూ పోలీసులకు వాగ్మూలం ఇచ్చా డు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. టుటౌన్ సీఐ సీఎం.గంగయ్య బాధితున్ని పరామర్శించారు. షబీనా వాగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. అనంతరం ధర్నా చేస్తున్న షబీనాను స్టేషన్కు పిలిపిం చారు. ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్కు పిలిపించి విచారించారు. -
బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్పై లైంగిక దాడి కేసు
సాక్షి, బెంగళూరు : చిక్కమగళూరు జిల్లా శృంగేరి నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు జీవరాజ్పై లైంగిక దాడి కేసు నమోదైంది. అయితే రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. వివరాలు... శృంగేరి నియోజకవర్గం పరిధిలోని కసకిమడబూరు గ్రామ శివారులోని ఓ తోటలో 2010 మేలో తనపై అప్పుడు మంత్రిగా ఉన్న జీవరాజ్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ యువతి ఎన్.ఆర్ పురం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసు అధికారులు జీవరాజ్పై ఐపీసీ 366, 354, 376, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై జీవరాజ్ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీకి చెందిన ఓ నేత మరదలే ఆ యువతి అని, తనకు భారీ మొత్తం డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తోందని చెప్పారు. లేదంటే లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు పెట్టి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని తాను పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 20న విధానసౌధ పోలీస్స్టేషన్లో ఆమెపై బ్లాక్మెయిల్ కేసు కూడా నమోదు చేశారన్నారు. ఇటీవల ఆమె నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిజానిజాలు త్వరలోనే వెలుగు చూస్తాని ధీమా వ్యక్తం చేశారు.