
'అంతరాత్మ ప్రకారం ఓటేయండి'
న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని కీలక అంశాలను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోందని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా విమర్శించారు. ఈ అంశంపై మిత్రపక్షాలు అభ్యంతరం చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై మాట్లాడిన సింథియా.. రైతు ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెడుతుందన్నారు. ఈ బిల్లుపై అంతరాత్మం ప్రకారం సభ్యులు ఓటేయాలని ఆయన సూచించారు. దీనిపై అన్నా డీఎంఏకే కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.