మహిళా లెక్చరర్పై లా స్టూడెంట్ దౌర్జన్యం | Law student held for thrashing woman lecturer | Sakshi
Sakshi News home page

మహిళా లెక్చరర్పై లా స్టూడెంట్ దౌర్జన్యం

Published Sat, Dec 7 2013 7:38 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Law student held for thrashing woman lecturer

కాలేజీలో పరీక్ష గదిలోనే మహిళా లెక్చరర్పై లా స్టూడెంట్ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడటంతో పాటు ఏకంగా దాడి చేశాడు. పరీక్ష రాసేందుకు ఆలస్యంగా వచ్చినందుకు అనుమతించకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గుర్గావ్లోని లా కాలేజీలో ఈ సంఘటన జరిగింది.
 
శనివారం ఉదయం 9:30 గంటలకు లా ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ఆరంభమయ్యాయి. అజయ్ చౌదరి అనే విద్యార్థి అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రలోకి వచ్చాడు. అక్క్డడ విధులు నిర్వహిస్తున్న మహిళా లెక్చరర్ అతన్ని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అయితే అతను లెక్చరర్పై దాడి చేసి ఆన్సర్ షీట్ తీసుకున్నాడు. పరీక్ష ముగిసిన అనంతరం నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement