
ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి (90)గురువారం కోల్ కతాలో కన్నుమూశారు.
ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి (90) గురువారం కోల్ కతా నగరంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆమెకు కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మిషన్ల ఆధారంగా ఇన్నాళ్లు ప్రాణాలు నిలబెట్టగలిగినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
ఆమెకు పలు రకాల ఇబ్బందులు తలెత్తాయి. గత రెండు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 1996లో మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ బహుమతి దక్కింది.