యాంటెన్నా విప్పుకొన్న మామ్... | Mum bought unfold the antenna | Sakshi
Sakshi News home page

యాంటెన్నా విప్పుకొన్న మామ్...

Published Fri, Aug 8 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

యాంటెన్నా  విప్పుకొన్న మామ్...

యాంటెన్నా విప్పుకొన్న మామ్...

బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గత నవంబరు 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహం తన ‘మీడియం గెయిన్ యాంటెన్నా’ను విజయవంతంగా విప్పుకొంది. అంగారకుడి కక్ష్యలోకి చేరేటప్పుడు కీలకమైన ఈ యాంటెన్నా ద్వారానే మామ్ భూమికి సమాచారం పంపనుంది.

అలాగే మార్స్ దిశగా మామ్ ప్రయాణం మరో 14 శాతమే మిగిలి ఉందని, మరో 49 రోజుల్లో (సెప్టెంబరు 24న) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలోకి చేరనుందని ఇస్రో ఈ మేరకు గురువారం తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొంది. ప్రస్తుతం ఉపగ్రహం సరైన దిశలోనే ప్రయాణిస్తోందని, మార్గసవరణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement