వేలూరు: తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పైప్లైన్ పేలింది. ఈ ధాటికి అక్కడున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.