పాక్‌ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం | Shazia Ilmi Slams Pakisthan Supporters In Seoul | Sakshi

పాక్‌ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం

Aug 18 2019 5:46 PM | Updated on Aug 18 2019 7:29 PM

Shazia Ilmi  Slams Pakisthan Supporters In Seoul - Sakshi

సియోల్‌: పాకిస్తాన్‌ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లారు. అయితే అక్కడ పాక్‌ మద్దతుదారులు కొందరు భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో షాజియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు.

షాజియా నిరసనకారుల భావోద్వేగాలపై స్పందిస్తూ.. ‘ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ, మొత్తం దేశాన్ని నిందించడం సబబు కాదు. ఈ అంశం మాదేశ అంతర్గత సమస్య. దీనిపై మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. కొన్ని దేశాలలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. నిరసన తెలిపే హక్కును ఎవరైనా సక్రమంగా వినియోగించుకోవాలి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తే ఏ పరిణామాన్నైనా నేను  దైర్యంగా ఎదుర్కొంటాన’ని అన్నారు. కాగా నిరసనకారుల తీవ్రత దృష్ట్యా పోలీసులు షాజియాను, ఆమె సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement