RSS
-
మహాత్మా గాంధీ మునిమనవడు వివాదాస్పద వ్యాఖ్యలు
తిరువనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అరెస్ట్తో సరిపెట్టడం కాదు. తప్పని సరిగా తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని భీష్మిస్తున్నాయి.తుషార్ గాంధీ ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురంలోని నెయ్యంట్టికరలో గాంధీ సిద్ధాంతవాది పి.గోపీనాథన్ నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ సమాజానికి ప్రమాదకరం, శత్రులని అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ నిలువెల్లా విషం నింపుకుందని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. స్థానిక బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు తుషార్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే,ఇదే అంశంపై తుషార్ గాంధీ ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు చెప్పారు. చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం, క్షమాపణలు చెప్పబోమని అన్నారు. ఈ సంఘటన నా సంకల్పాన్ని మరింత బలపరచిందన్నారు. -
రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీతో రేవంత్ కలిసి పనిచేస్తున్నారని, ఇటీవల సీఎం, మోదీ నడుమ జరిగిన భేటీతో వారి దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారని ఆమె మండిపడ్డారు.‘న్యాయవాది సంజీవరెడ్డి మరణం, భూపాలపల్లిలో భూతగాదాలతో వ్యక్తి హత్య, దుబాయిలో ఓ వ్యక్తి మరణం వంటి ఘటనలను బీఆర్ఎస్కు సీఎం అంటగడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం మినహా సీఎంకు ఇంకో ఆలోచన లేదు’అని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ అప్పులపై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ విపత్తును పక్కన పెట్టి సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, సీఎంకు తెలంగాణ ప్రజలు ముఖ్యమా.. కాంట్రాక్టర్లు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. -
వర్సిటీలపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే కుట్ర
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వర్సిటీలపై రుద్దే కుట్రలో భాగంగానే ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు. రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో ‘యూనివర్సిటీ రెగ్యులేషన్స్ – రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రాం మెల్కొటే, డి.నర్సింహారెడ్డి, తిరుపతిరావు, మురళీ మనోహర్, ఎస్.సత్యనారాయణ, అమీర్ ఉల్లాఖాన్, కె.లక్ష్మీనారాయణ, పద్మాషా, డాక్టర్ చరకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికే: మురళి విశ్వవిద్యాలయాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. బోదన, బోధనేతర సిబ్బంది నియామకాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా నియమించాలంటే పీహెచ్డీ చేసి, పదేళ్లు ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలనే నిబంధనను యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్లో పూర్తిగా మార్చేశారని తెలిపారు. పరిశ్రమలు, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్ , పబ్లిక్ సెక్టార్లో.. ఇలా నచ్చిన వారిని ఎలాంటి నిబంధనలు లేకుండా నియమించుకునే అధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా మార్గదర్శకాలు ఉన్నా యని చెప్పారు. మితిమీరిన జోక్యం: ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాలపై కేంద్రం మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండేలా చూ సేందుకు ఏర్పాటుచేసిన యూజీసీనే ఇప్పుడు రాజకీయం చేయడం దారుణమన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు అన్నివర్గాలు సమైక్యంగా గళమెత్తాలన్నారు. వీసీలను నియమించే అధికారం ఇప్పటికే గవర్నర్ చేతుల్లో ఉందని, ఆ గవర్నర్ను కేంద్రమే తన ప్రతినిధిగా నియమిస్తుందని గుర్తుచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై కూడా ఈ తరహా చర్చలు ఎందుకు పెట్టడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నేత ఆజాద్ సదస్సులో ప్రశ్నించారు. -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్గాంధీపై బీహార్లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్కు వెళ్లి రాహుల్గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ
-
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో హథ్రాస్ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ధర్మం పేరిట అధర్మాచరణ: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: నేటి సమాజంలో ధర్మం పేరిట అధర్మాన్ని అనుసరిస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భాగవత్ అన్నారు. మనిషిలో స్వార్థం పెరిగి.. ధర్మానికి, అధర్మానికి అర్థంలో మార్పులు చేసుకుంటూ అనుసరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన లోక్ మంథన్ ముగింపు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘మానవుడు సంతోషం కోసం అన్వేషిస్తున్నాడు. మన పూర్వీకులు సంతోషం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఇది ఎక్కడో దొరికే వస్తువు కాదు. సంతోషం అనేది మనలోనే దొరుకుతుంది. దాన్ని వదిలేసి వస్తు రూపంలో దొరికే సంతోషానికి సంబరపడిపోతున్నాడు. భారత్ సనాతన దేశం. రుషులు, మునిపుంగవుల ఆలోచనతో ఏర్పడిందే సనాతన ధర్మం. ఎన్నో ప్రాంతాలు పర్యటించి సాధించిన అనుభవాలతో శాస్త్రాలు, ధర్మాలు రాశారు. అలాంటి వాటిని అనుసంచాల్సిన మనం.. కేవలం అనుకూలమైనవాటిని ఆచరిస్తూ అదే ధర్మమార్గం అని భ్రమపడుతున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించిన మంచిని మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని ఆర్జించే ప్రక్రియ ఒక దగ్గర ఆగిపోకూడదు. మనమంతా సంస్కృతి, ధర్మంవైపు అడుగులు వేయాలి. కానీ వికృతి దిశగా వెళ్తూ సృష్టి ధర్మాన్ని విస్మరిస్తున్నాం. విజ్ఞానం ధర్మానికి వ్యతిరేకం కాదు. విజ్ఞానాన్ని ఉపయోగించే తీరులోనే ధర్మం నిలుస్తుంది. సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్లి, దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అందరూ భారతీయులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ముగిసిన ఉత్సవాలు లోక్మంథన్ భాగ్యగనర్–24 ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనే ఆవశ్యకతను వక్తలు వివరించారు. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా 210 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. శిల్పారామంలో మూడు వేదికల్లో 12 దేశాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖులు ఉపన్యాసాలు, బోధనలు అందించారు. సుమారు 1,500 మంది కళాకారులు వివిధ రకాల కళలను ప్రదర్శించారు. లోక్ మంథన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఆహార ధాన్యాలు, ఔషధ మొక్కల స్టాల్స్, గిన్నిస్ రికార్డు అందుకున్న భారీ పెన్ను వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు ఉత్సవాల్లో అభినయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో మహాన్ భారతోహం పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల్లో సుమారు 2.10 లక్షల మందికిపైగా లోక్ మంథన్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. -
యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్ఎస్ఎస్!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ఎస్తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్ హై తో సేఫ్ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్రాజ్లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో నిర్ణయించారు. సమాజ్వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. -
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
శతాబ్ది స్ఫూర్తి కొనసాగించేలా స్మృతి మందిరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను 1925 విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్పంత్ హెడ్గేవార్ ప్రారంభించారు. హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్పూర్కు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్టించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో హెడ్గేవార్ పూరీ్వకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాదికి దీని నిర్మాణం పూర్తి చేస్తారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. శ్రీ కేశవ శిశు విద్యామందిర్లో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ స్మృతిమందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రెంజల్ మండలంలో అక్షరాస్యత పెంచడంలో కేశవ సేవాసమితి కీలకపాత్ర 1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ ప్రారంభం కాగా, 2004లో పాఠశాల నూతన భవనాన్ని శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్ఈడీ టీవీ సౌకర్యం కలి ్పంచారు. ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించి సరి్టఫికెట్లు అందిస్తున్నారు. కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికైన జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికైన శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఇక కేశవ సేవాసమితి పాఠశాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రామాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువుకు బాల సంస్కార కేంద్రాలు, బాలికలకు కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పెద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటి వల్ల రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద కుటుంబాల యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద..... తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నడుమ కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. భిన్న సంస్కృతులకు నిలయంగా ఈ ప్రాంతం మారింది. త్రివేణి సంగమ ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే కందకుర్తి (తెలంగాణ)–బెల్లూర్ (మహారాష్ట్ర)లను అనుసంధానం చేసే వంతెనను 1992లో నిర్మించారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దిగువన బాసర పుణ్యక్షేత్రం ఉంది. కందకుర్తిలో ఉన్న రామాలయానికి సైతం గొప్ప ప్రాశస్త్యం ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, ఆయన గురువు సమర్ధ రామదాసు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ ప్రాచీన స్కంధ (కుమారస్వామి) మందిరం ఉండేది. మూడు నదులు కలిసే కూడలి కావడంతో కూడతి అనేవారు. కాలక్రమంలో కందకుర్తి పేరు వచి్చనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన స్కంధ మందిరం స్థానంలో కొత్త మందిర నిర్మాణం చేస్తున్నారు. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీరాముడు శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. దీన్ని తర్వాత రాణి అహల్యాబాయి మందిరాన్ని పునరుద్ధరించారు. -
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
దేశ ద్రోహులకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు: రాహుల్కు బీజేపీ కౌంటర్
కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. టెక్సాస్లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు.అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ముందు నుంచే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. భారతదేశం పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సివస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోలేరు. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోలేరు. ఆరెస్సెస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.కాగా అంతకముందు రాహుల్ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని మండిపడ్డారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకువెళ్లాలని, భారత్ అంటే భిన్న భావజాలం అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.భారత్లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. మన రాజ్యాంగంపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ప్రజలు గ్రహించారని, మోదీ, బీజేపీకి ఎవరూ భయపడటం లేదని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ విమర్శించారు. -
ప్రజలకు మోదీ భయం పోయింది: రాహుల్ గాంధీ
న్యూయార్క్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ, భారత్ సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. దానిపైనే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. భారతీయ రాజకాల్లో ప్రేమ, గౌరవం తగ్గిపోయాయని అన్నారు.‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీపై భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన భారత దేశ ప్రజలు విజయం. అదేవిధంగా మహిళల పట్ల వైఖరిపై కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు. కానీ మేము అలా కాదు. మహిళలు ఏమి చేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం. భారత్ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఈ సమస్య లేదు. పెరుగు దేశం చైనా కూడా నిరుద్యోగ సమస్య లేదు’ అని అన్నారు.#WATCH | Texas, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The RSS believes that India is one idea and we believe that India is a multiplicity of ideas. We believe that everybody should be allowed to participate, allowed to dream, and should be given space regardless… pic.twitter.com/uHULrGwa6X— ANI (@ANI) September 9, 2024రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో తనకున్న ఒప్పందం వల్ల రాహుల్ చైనా కోసం బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. విభజించు, పాలించడమే రాహుల్ స్ట్రాటజీ. భారత సిద్ధాంతాలుపై విమర్శలు చేయటం రాహుల్కు అలవాటుగా మారింది. ఆయన బెయిల్పై ఉన్నందున భారత న్యాయ వ్యవస్థపై దాడి చేస్తాడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. -
కులగణన సన్నితమైన అంశం, రాజకీయాలకు వాడొద్దు: ఆర్ఎస్ఎస్
దేశంలో కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన సున్నితమైన అంశమని పేర్కొంది. అయితే దీనిని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని తెలిపింది. ఈ మేరకు కేరళలోని పాలక్కడ్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో సంస్థ ప్రతినిధి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. కులగణ జాతీయ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.‘కుల గణన అనేది చాలా సున్నితమైన అంశం. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కొన్నిసార్లు ప్రభుత్వాలు డేటా అవసరం కోసం దీనిని చేపట్టవచ్చు. అయితే ఇదికేవలం ఆ వర్గాలు కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. కానీ.. కుల గణనలను ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు’ అని అన్నారు.ఈ అంశంపై తీవ్రమైన చర్చల మధ్య, కుల గణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో కులగణన అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిని పూర్తిగా సమాజహితానికే వాడతారని భావిస్తున్నాం. వీటిని నిర్వహించే క్రమంలో అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్కుమార్ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సిద్ధాంతానికీ, అధికారానికీ స్పర్థ?
ఏ సంస్థకైనా, పార్టీకైనా స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. అది క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారుతుంది. అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్ఠాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరిస్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీ మధ్య జరుగుతున్నది అదే. స్వాతంత్య్రానంతరం గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూసిందే. మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుద్ధ్యాలు చోటు చేసుకున్నాయి.ఆరెస్సెస్ సైద్ధాంతికతకూ, బీజేపీ అధికార కాంక్షకూ మధ్య ఒక స్పర్థ ఏర్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సూచనలు గతంలోనూ ఉండేవిగానీ, ఇటీవలి ఎన్నికల తర్వాత అందుకు స్పష్టత ఏర్పడుతున్నది. ఎన్నిక లలో బీజేపీ అంతిమంగా అధికారానికి వచ్చినా అనుకోని విధంగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. ఆ వెంటనే ఆరెస్సెస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీపై విమర్శలు చేశారు. ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ కూడా మరికొన్ని విమర్శలతో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా జూన్ ప్రథమార్థంలో జరిగిన విషయం. ఆ విధమైన విమర్శలు బీజేపీ ప్రత్య ర్థుల నుంచి వచ్చి ఉంటే అందులో విశేషం లేదు. కానీ ఆ పని చేసింది బీజేపీ మాతృ సంస్థ కావటం, ఆ విమర్శలు కూడా బహిరంగంగా చేయటం సంచలనాన్ని సృష్టించింది. అటువంటి ఎదురు దెబ్బలు, సంచలనాత్మక విమర్శల దృష్ట్యా మోదీ తీరు, బీజేపీ పద్ధతులు కొంతైనా మారగలవని అనేకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ జూన్ ప్రథమార్థం నుంచి ఇప్పటికి గడిచిన రెండు మాసాల కాలంలో మనకు ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇందుకు రెండు తాజా ఉదాహరణలలో ఒకటి, లవ్ జిహాద్ కేసులలో జీవిత ఖైదు విధించే చట్టం చేయగలమన్న అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటన కాగా, రెండవది మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల బిల్లును ప్రతిపాదించటం.ఈ వివరాలలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఆరెస్సెస్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించ కపోవచ్చుగాక. కానీ వారికి తమ సిద్ధాంతాలు ఉన్నాయి. సంస్థ వయస్సు వందేళ్లు. దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు, ఉప సంస్థలు కలసి కొన్ని డజన్లు ఉన్నాయి. అన్నింటిని కలిపి సంఘ్ పరివార్ అంటున్నారు. వీటిలో భారతీయ జనసంఘ్ (1951) మొదటి రాజకీయ పార్టీ. తర్వాత అది బీజేపీ (1980)గా రూపాంతరం చెందింది. ఆరెస్సెస్ సిద్ధాంతం 1951 వరకు కూడా హిందూ రాజ్య స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో, మతపరంగా కృషి చేయటం తప్ప రాజకీయాలలోకి అసలు ప్రవేశించరాదన్నది! తర్వాత కొన్ని పరిస్థితులలో మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటుకు సమ్మ తించినా, ఆ పార్టీలు పూర్తిగా ఆరెస్సెస్ నిర్దేశాలకు లోబడి పనిచేస్తూ పోయాయి. బీజేపీ అధికారానికి వచ్చిన రాష్ట్రాలలోగానీ, వాజ్పేయి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచినపుడుగానీ, ముఖ్యమైన పరిపాలనా విధానాలకు కూడా ఆరెస్సెస్తో చర్చలు జరుగుతుండేవి. అపుడపుడు భిన్నాభిప్రాయాలు తలెత్తినా చర్చల ద్వారా ఏకాభిప్రా యానికి వచ్చేవారు. ఆరెస్సెస్ను బీజేపీ నాయకత్వం ధిక్కరించటం జరిగేది కాదు. మోదీ నాయకత్వాన అది మొదటిసారిగా జరుగుతుండటమన్నది గమనించవలసిన విశేషం. మోదీ ధిక్కార ధోరణి వాస్తవా నికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన (2001–14) కాలంలోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. జూన్ ప్రథమార్థం నాటి భాగవత్, ఆర్గనైజర్ల బహిరంగ విమర్శలను ఆయన లెక్క చేయక వ్యవహరించటం ఇందుకు కొనసాగింపు మాత్రమే.ఇప్పుడు అసలు చర్చలోకి వెళదాము. ఏ సంస్థకైనా, లేక పార్టీ కైనా వాటిని స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తర్వాత అవి అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. పూర్తి భిన్నం కాకున్నా పరిస్థితులను బట్టి వేర్వేరు స్థాయిలలో ఏర్పడుతాయి. అటువంటపుడు ఆ సిద్ధాంతాలకు, అధి కార లక్ష్యాలకు మధ్యగల భిన్నత్వం క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారు తుంది. లక్ష్యాల స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి వైరుధ్య తీవ్రత ఉంటుంది. మరికొద్ది ఉదాహరణలను కూడా చెప్పు కొని ఆరెస్సెస్, బీజేపీల విషయానికి మళ్లీ వద్దాము.కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. ఆ పార్టీ 1923లో చీలి కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికలలో పాల్గొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాగా, పాల్గొనాలన్నది స్వరాజిస్టుల వాదన. అప్పటినుంచి 1947లో స్వాతంత్య్రం లభించే వరకు, దేశ విభజన విషయంలో సైతం పార్టీలో పలువురు ప్రముఖులు గాంధీజీని వ్యతి రేకిస్తూ పోయారు. బ్రిటిష్ వారి హయాంలోనే ప్రభుత్వాలలోనూ చేరారు. ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్లలేముగానీ, గుర్తించవలసింది సిద్ధాంతానికీ, అధికార కాంక్షలకూ మధ్య వైరుద్ధ్యాలు ఏర్పడటం. ఇక స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ సిద్ధాంతాలు, గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నదే. చివరకు మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి. వారు స్వయంగా అధికారాలు నెరపిన దేశాలలోనూ, భారతదేశంలోని రాష్ట్రాలనూ చూసినపుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. వారి అధికార పతనాలకు గల ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. అధికారం నిజంగానే ప్రజల మేలు కోసం పరిమితమయితే ఈ పరిస్థితి తలెత్తదు. కానీ విషాదకరమైన వాస్తవం ఏమంటే, అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్టాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరి స్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీల మధ్య జరుగుతున్నది అదే.ఇటువంటి పరిస్థితులలో సర్వసాధారణంగా జరిగే క్రమం ఒకటు న్నది. ఒక సైద్ధాంతిక సంస్థకు అనుబంధంగా ఉండే కొందరు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పడమంటే అధికార సాధన కోసం మాత్రమే. అటువంటపుడు ఒకవైపు తమ సిద్ధాంతంతో సంబంధం ఉన్నవారిని, లేనివారిని కూడా వీలైనంత విస్తృతంగా పార్టీలో చేర్చుకోవలసి ఉంటుంది. వారి ప్రయోజనాల కోసం కూడా పని చేయవలసి ఉంటుంది. మరొకవైపు ఆ క్రమంలో తాము అనేక అధికార ప్రయోజ నాల ఆకర్షణకు లోనవుతారు. ఈ రెండింటి ప్రభావం వారిని తమ సైద్ధాంతికతకు దూరం చేస్తుంది. సిద్ధాంతాలు గుర్తు చేసేవారిని ధిక్కరించేట్లు చేస్తుంది. కాంగ్రెస్, సోషలిస్టులు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీల వంటివే కాదు... కమ్యూనిస్టులు, మతవాద పార్టీల వంటి నిష్టాగరిష్ఠత గల సైద్ధాంతిక, కేడర్ పునాది పార్టీలకు సైతం ఈ మాట వర్తిస్తుంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరొక మాటలో చెప్పాలంటే ఇవన్నీ సైద్ధాంతిక పతనాలు. సిద్ధాంతానికీ, అధికారానికీ మధ్య స్పర్థ. మనం చూసినంతవరకు ఇందులో అధికా రానిదే పైచేయి అవుతూ వస్తున్నది. అధికారానికి వచ్చినవారు భరించ లేకుండా తయారై, ప్రజల తీవ్ర ఆగ్రహాలకు గురై, వారి చేత పరా భవం పొంది, తిరిగి ప్రజలు సిద్ధాంతాల వైపు మళ్లితే తప్ప, పరిస్థి తులు ఈ విధంగానే ఉంటాయి.అయితే ఆరెస్సెస్కు సంబంధించిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. పార్టీ ఏర్పాటును 1951 వరకు వ్యతిరేకించిన వారు జన సంఘ్ స్థాపనకు, తర్వాత బీజేపీ అవతరణకు ఎందువల్ల సమ్మతించినట్లు? రాజకీయ శక్తిగా మారి అధికారం కూడా సాధించినట్లయితే దానిని ఉపయోగించుకుని హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవచ్చునన్నది ఆలోచన. యథాతథంగా అది మంచి వ్యూహమే కావచ్చు. కానీ పైన చెప్పుకున్నట్లు, రాజకీయ శక్తులు, వారి ప్రయోజనాల వలలో చిక్కుకుని అది దారి తప్పింది. ఆరెస్సెస్ నాయ కత్వం స్వయంగా బలహీన పడుతుండటంతో రాజకీయ నాయకత్వం బలం పెరిగింది. ఇంతేకాదు, సాక్షాత్తూ సంఘ్ పరివార్లోని కొన్ని వర్గాలు కూడా అధికార ఆకర్షణలకు లోబడటం మొదలైందనే మాటలు కొంత కాలంగా వినవస్తున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య జరిగేదేమిటి? మోదీ, బీజేపీల అధికార ఆయుధానికి పదను పెరుగుతుంది. ఆరెస్సెస్ సైద్ధాంతిక నిష్ఠ క్రమంగా మొద్దుబారుతుంది. ఈ స్పర్థలో మొగ్గు ఎవరిదో కనిపిస్తున్నదే.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిషేధాలే గానీ సేవలు గుర్తుండవా?
58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. సంస్థ భావజాలం, కార్యకలాపాలు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సేవలు అందించింది. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోప ణలన్నీ సత్యదూరమని తేలిపోయింది. అయినాకూడా ఆర్ఎస్ఎస్ను ఇప్పటికీ మహాత్మగాంధీ హత్యతో ముడిపెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి.గోవధను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజల మద్దతును కూడగట్టిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నిలువరించేందుకు 1966 నవంబర్ 30న, అంటే 58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ మీద విధించిన నిషేధాల గురించే తప్ప... ఆ నిషేధాల ఎత్తివేత గురించి గానీ, పాకిస్తాన్, చైనా మన దేశం పైన యుద్ధం చేసిన సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సామాన్య ప్రజలకు స్వయంసేవకులు అందించిన సేవలను మరిచిపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు... మహాత్మా గాంధీ హత్యానంతరం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్పై పటేల్ విధించిన నిషేధాన్ని 18 నెలల తర్వాత ఆయనే హోంమంత్రి హోదాలో ఎత్తివేశారు. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణలన్నీ సత్య దూరమని తేలిపోయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్గా ఉన్న గురూజీ (ఎంఎస్ గోల్వాల్కర్)కి పటేల్ రాసిన లేఖలో సంఘ్ సేవలను ప్రశంసించడమే గాక, స్వయంసేవకులు కాంగ్రెస్లో చేరి సేవలను కొనసాగించాలని ఆహ్వానించారు. 1948 సెప్టెంబర్ 11న సర్దార్ పటేల్ రాసిన ఈ లేఖ ‘జస్టిస్ ఆన్ ట్రయల్’ పుస్తకంలో ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖను మహాత్మా గాంధీ సందర్శించిన సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి. గాంధీజీ 1936లో వార్ధాకు దగ్గరలో జరిగిన సంఘ్ శిబిరాన్ని సందర్శించారు. ఆ తరువాతి రోజు ఆయన్ని కలుసు కోవడానికి డా. హెడ్గేవార్ వారి నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో జరిపిన సుదీర్ఘమైన సంభాషణ వివరాలు పుస్తకరూపంలో లభిస్తు న్నాయి. దేశ విభజన సమయంలో ఢిల్లీలోని తన నివాసానికి దగ్గరగా ఉన్న సంఘ్ శాఖకు గాంధీజీ మరోసారి వచ్చారు. స్వయంసేవకులతో మాట్లాడారు. ఈ వివరాలు 1947 సెప్టెంబర్ 27 నాటి ‘హరిజన్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. స్వయంసేవకుల క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైన వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. 1939 మే 12న పూనా నగరంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిబిరానికి సంఘ్ కార్యకర్తల ఆహ్వానం మేరకు బాబాసాహెబ్ అంబే డ్కర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్సంస్థాపకులు డా.కేశవరావు హెడ్గేవార్, ఇతర ఆర్ఎస్ఎస్ స్థానిక ప్రముఖులు, అంబేడ్కర్ అనుయాయి బాలాసాహెబ్ సాలుంకే ఉన్నారు. వీరు 1957–62 మధ్య లోక్సభ సభ్యులు. వీరి ఆత్మకథలో ఈ ఘటనను పేర్కొన్నారు. 1957 ఏప్రిల్ 1 ఉగాది రోజున పూనాలో జరిగిన ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ను అంబేడ్కర్ ఎక్కడా విమర్శించినసందర్భాలే లేవు.చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ ఎంతో కీలక పాత్ర పోషించింది. అది చూసిన నాటి ప్రధాని నెహ్రూ ఎంతో ప్రభావితం అయ్యారు. ఆర్ఎస్ఎస్లోని ఒక దళం పూర్తి యూనిఫాం, బ్యాండ్తో 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొనేందుకు ఆహ్వానించారు. 1965 నాటి ఇండో–పాక్ యుద్ధ కాలంలో కూడా భారత సైన్యానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను గుర్తించి నాటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి అప్పటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ను ప్రశంసించారు.ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో విధించిన అత్యవసర పరిస్థితి సందర్భంలో ఒకసారి... అనంతరం 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలో మరోసారి ఆర్ఎస్ఎస్పై నిషేధాలు విధించడం... వివిధ ప్రభుత్వ శాఖల దర్యాప్తులు, న్యాయస్థానాల విచారణల అనంతరం ఎత్తివేయడం జరిగింది. సంఘ్ మీద ఏ సందర్భంలో నిషేధం విధించినా అవన్నీ రాజకీయ కారణాల వల్ల అప్పటి ప్రభు త్వాలు విధించినవే తప్ప ఒక్క ఆరోపణ కూడా కోర్టు విచారణల్లో రుజువు కాలేదు. ఇందిర సర్కారు నిషేధం విధించడానికి ముందే ఈ అంశంపై కోర్టు తీర్పులను పరిశీలిస్తే... పంజాబ్ ఉద్యోగి రాంపాల్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదంటూపంజాబ్ – హరియాణా కోర్టు అతని తొలగింపు సమర్థనీయం కాదని తీర్పునిచ్చింది. మరో సంఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు సంబంధించినది. 1966లో అక్కడ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా ఉన్న రంగనటచార్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటు న్నాడనే కారణంతో ఆయన పదోన్నతికి ఆటంకం కలుగగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదనీ, హిందువేతరులకు అది వ్యతిరేకం కాదనీ 1966 జూలై 6న మైసూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో ప్రభుత్వో ద్యోగులపై నిషేధం ఉన్నా, లేకపోయినా.. సంస్థ సిద్ధాంతం, భావ జాలం, కార్యకలాపాలు తమకు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు తప్ప, నిషేధం ఎత్తివేసినంత మాత్రాన దేశంలోని ప్రభుత్వోద్యోగులందరూ మూకుమ్మడిగా ఏసంస్థ కార్యకలాపాల్లోనూ పాల్గొనరు గదా? అందువల్ల ప్రభుత్వోద్యో గులపై ఇన్నేళ్లు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఏదో జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.కాంగ్రెస్లో ఒకప్పటి అగ్రనేత, ఆ పార్టీ సర్కారులో కేంద్రమంత్రి, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల తృతీయ వర్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాటి కాంగ్రెస్ వర్గాలు ఎంత వ్యతిరేకించినా ప్రణబ్ ఈ వేడుకలో భాగస్వామి అయ్యారు. ‘నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతానమైన డా. కేశవ బలిరామ్ హెడ్గేవార్కు అంజలి సమర్పించ డానికి వచ్చాను’ అని రాశారు. అదే ఏడాది కేరళలోని కొట్టాయంలో డిసెంబర్ 31న జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షవర్గ ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారత్లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం,రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ఎస్ఎస్ వల్ల అని జవాబు చెపుతాను’ అన్నారు. వీరేగాక లోకమాన్య జయ ప్రకాశ్ నారాయణ్, శాస్త్రవేత్తలైన జి.మాధవన్ నాయర్, కె. రాధాకృష్ణన్, కె.కస్తూరి రంగన్ వంటి పెద్దలు సైతం సంఘ్ కార్యకలాపాలను ప్రశంసించారు.ఆర్ఎస్ఎస్ పైన నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తరువాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మహాత్మగాంధీ హత్యకు జరి గిన కుట్రపై విచారణ జరిపేందుకు ఒక కొత్త జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జె.జె. కపూర్ను చైర్మన్గా నియమించారు. ఆ కమిషన్ దాదాపు వందకు పైగా సాక్షులను విచా రించి 1969లో నివేదిక సమర్పించింది. ‘నేరస్థులు ఆర్ఎస్ఎస్ సభ్యు లన్న విషయం ఎక్కడా రుజువు కాలేదు. ఆ సంస్థకు హత్యలో భాగం ఉందని నిరూపితం కాలేదు’ అని కపూర్ కమిషన్ (సంపుటి –1, పేజీ–186) స్పష్టీకరించింది. దేశ విదేశాలలో కోట్లాదిమంది స్వయం సేవకులు ప్రతిరోజూ ప్రాతఃస్మరణంలో గాంధీజీ పేరును తలుచుకుంటారు. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ను మహాత్మాగాంధీ హత్యతో ముడి పెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి. ఈ నిరాధారమైన ఆరో పణలు చేసేవారిని శిక్షార్హులుగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. - వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్- చెన్నమనేని విద్యాసాగరరావు -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్పేయి, ఎల్కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్సభా స్థానాలనూ కాంగ్రెస్కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
మణిపూర్లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
ఆ రెండు పార్టీలు విషం లాంటివి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషం లాంటివి. ఆ విషాన్ని రుచి చూస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదనే ఉద్దేశ్యంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజాస్వామ్య పాలన కావాలా? నియంతృత్వ పాలన కావాలా.. మీరే తేల్చుకోవాలి. నియంతృత్వానికి మద్దతిచ్చే బీజేపీ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఖర్గే అన్నారు. సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోరుకునే వారు చేతులెత్తండి.. అనగానే అంతా చేతులెత్తారు. #WATCH | Delhi: Addressing the INDIA alliance rally at Ramlila Maidan, Congress President Mallikarjun Kharge says, "You have to decide if you want democracy or dictatorship... Those who support dictatorship need to be kicked out of the country... BJP and RSS are like poison. You… pic.twitter.com/wdisE7HQpU — ANI (@ANI) March 31, 2024 -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో నాగ్పూర్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం కాంగ్రెస్కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్పూర్లో కాంగ్రెస్కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్పూర్లో బీజేపీ మూడు లోక్సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
నిటాషా వివాదం: ‘అందుకే భారత్లోకి రానివ్వలేదు’
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్ను భారత్లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు. దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తాజాగా నిటాషాను భారత్లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. ‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. తనను భారత్లోకి రానివ్వలేదని..ఎయిర్పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్పోర్టులోనే ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్కి ఇలా జరగలేదని అన్నారు. అయితే ఆమె గతంలో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు. -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్లోని భింద్లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
Rahul Gandhi: ప్రేమ మన డీఎన్ఏలోనే ఉంది
రాయ్గఢ్: మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్గఢ్లో మొదలైంది. రాయ్గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘భారత్లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. -
TS: బీజేపీ నేతలపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై సంఘ్ పరివార్(ఆర్ఎస్ఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంఘ్ పరివార్ నేతలకు వివరించారు. ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలకు బీజేపీ నాయకులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఈసారి పదికిపైగా స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ నేతలు చెప్పారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల మధ్య విభేదాలపై పరివార్ నేతలు గట్టిగానే అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని మొట్టికాయలు వేశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారు. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇదీ.. చదవండి.. కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ -
రాజ్యాంగ విలువలకు తిలోదకాలేనా?
సుప్రసిద్ధ మహాకవి సి. నారాయణ రెడ్డి మూడు దశా బ్దాల నాడే కొందరు భావి పాలకులు దేశ రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి, ‘రాచరిక పాలన’ను అభిలషిస్తూ ప్రవర్తించే అవకాశాలు ఎలా ఉన్నాయో ‘ప్రపంచ పదులు’ కవిత ద్వారా పాఠకులకు అందించారు. ‘నడమంత్రపు బుద్ధి దూకుడు’ ఎలా ఉంటుందో ఆ కవితలో నిరూపించారు: ‘‘గాలిలోన ఎగిరిపడే గడ్డిపరక ఊపిరెంత? ఏటిలోన తుళ్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత? అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతె ఏం లాభం? కడలిలోన మిడిసిపడే కప్పపిల్ల పాకుడెంత? నడమంత్రపు సిరినేర్పిన దుడుకుబుద్ధి దూకుడెంత?’’ పాలకుల ఈ ‘దుడుకు బుద్ధి’ వల్ల దేశానికి రాబో తున్న అనర్థాల గురించి అడుగడుగునా నిశితమైన పరిశీలనలో ఉన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. పదవిని అధిష్ఠించిన రోజు నుంచీ దేశ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు ఎత్తుకున్న ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ నినాదం దేశ ఫెడరల్ వ్యవస్థ స్వరూప, స్వభావాలకు విరుద్ధం. దేశంలో ‘రాచరికం’ ఉంది గాని 75 ఏళ్లలో దేశ ప్రజలు నిర్మించుకున్న సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ లేదని వర్తమాన పరిస్థితులు చెబుతున్నాయి. కనుకనే కాలానికి లొంగిపోని కర్మయోగులు నేడు మేలుకోవలసి ఉంది. ఎందుకంటే: ‘‘కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడుతుంది కదనుతొక్కితే కాలం భయపడుతుంది కనురెప్పలు మూతపడితే కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే కాలం జేకొడుతుంది!’’ కాబట్టి ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధా నాన్ని బుద్ధిజీవులు అందరూ వ్యతిరేకించాలి. పటిష్ఠ మైన ప్రజాస్వామ్య పునాదులను గౌరవించాలనీ, ప్రస్తుత పాలకుల కనుసన్నలలోనే ఎదిగిన మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన ‘ప్రజాస్వామ్య రక్షణ’ పేరిట మరో ‘తైనాతీ’ కమిటీ ఏర్పాటు తగదనీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పాలకుల చేతిలో కోవింద్ కీలు బొమ్మగా వ్యవహరించరాదనీ ఆయన సలహా ఇచ్చారు. అసలు విచిత్రమేమంటే, కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశాని కయ్యే అపారమైన ఖర్చును ఆదా చేయవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం సలహా ఇవ్వబోవడం! ఈ చర్య రాజ్యాంగాన్నీ, పార్లమెంటరీ వ్యవస్థనూ అవ మానపరచడమే! అంతేగాదు, మత విశ్వాసాలను కూడా రాజకీయ లబ్ధి కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు వాడుకోవడం ఓటర్లను దగా చేయడమే! ఈ రాజకీయమే వేల ఏళ్ల నాటి బాబ్రీమసీదు కట్టడాన్ని బలవంతంగా కూల్చి వేసి, దాని స్థానే రామమందిర నిర్మాణానికి కారణ మయ్యింది. నిజానికి సాధారణ ముస్లిం పౌరులు హిందువులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. హిందువులు పవిత్రంగా భావించే రామా యణాన్ని స్థానిక ‘అవధి’ భాషలో రచించి ఖ్యాతి వహించిన తులసీదాస్ను హిందీలో రాయనందుకు శిక్షించడానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో ఆయననూ, ఆయన రామాయణాన్నీ ఓ స్థానిక ముస్లిం కాపాడాడు. ఈ వాస్తవాన్ని ఈ రోజుకీ గుర్తించ నిరాకరిస్తున్న ముఠా... మహాత్మాగాంధీ పేరిట కంటి తుడుపు ఉత్సవాలు చేస్తున్నా రని గమనించాలి. లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా, ముద్దా యిలుగా ఉన్న భగత్సింగ్, సుఖదేవ్లు ఉరిశిక్షను ఎదుర్కొంటున్నప్పుడు భగత్సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘తన కాలంలో మార్క్స్ కొత్త తరహాగా ఆలోచించబట్టే కాల చక్రాన్ని తన పద్ధతుల్లో త్వరిత గతిన ముందుకు నడిపించగలిగారు. అలాగే మన దేశంలో సామ్యవాద సిద్ధాంతాన్ని (సోషలిజం) నేను గాని, నువ్వు గాని (సుఖదేవ్తో సంభాషణ) ఆరంభించలేదు. నిజానికి కాలం, పరిస్థితులు కల్పించిన ప్రభావ ఫలితం అది. ఇంత కష్టమైన బాధ్యతను మనం చేపట్టినప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలే గాని కష్టాలు ఎదురయ్యాయని చెప్పి, ఆత్మహత్య చేసుకుంటే అది ప్రజలకు మార్గదర్శకం కాజాలదు.’’ ఈ మాటలు భగత్సింగ్ ఏ సందర్భంలో అన్నాడు? ఉవ్వెత్తున ప్రజాందోళన వల్ల మన ఉరిశిక్షలు ఆగిపోయి, యావజ్జీవ కారాగార శిక్షగా మారిపోవచ్చు. కానీ, 14 ఏళ్లపాటు ద్వీపాంతరవాస శిక్ష అనుభవించాక మనం జీవచ్ఛవాలుగా మారిపోతాం. అలాంటప్పుడు బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు కదా... ఇలా ఆలోచిస్తూ సుఖదేవ్ తన అభిప్రాయాల్ని భగత్సింగ్కు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి జవాబుగా భగత్సింగ్ రాసిన ఆశావహమైన లేఖే ‘కాలం అవసరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం’ అన్న ప్రత్యుత్తరం. కాగా, నేటి తరం పాలకులకు రాజ్యాంగ విలువలూ తెలియవు. కనుకనే పాలనా వ్యవస్థల నుంచి, విద్యా వ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థల దాకా ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ప్రయత్ని స్తున్నారు. అందుకే బహుశా, ‘ఒడువని ముచ్చట’ అనే కవితలో కందుకూరి అంజయ్య ఆవేదనను మనమూ పంచుకుందాం: శంకరా! ఇప్పుడు మనుషులను కూడగట్టే మానిసి లేడు మంచి చెడ్డలను విప్పిచెప్పే సాత్వికుడూ లేడు అంతా... వడ్లూ – పెరుగూ కలిసినట్టుంది ఈనగాస్తే నక్కలపాలయింది అంతా మొదటికొచ్చింది ఒడువని ముచ్చటై కూసుంది!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బీజేపీది ‘ఢిల్లీ’ పాలన: రాహుల్
నార్త్ లఖీంపూర్ (అసోం): దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆరెస్సెస్ల నరనరాన నిండిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్కు మాత్రం అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం లభించే స్థానిక స్వపరిపాలనే మూలమంత్రమని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శుక్రవారం అసోంలోని గోగాముఖ్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో సమ ప్రాధాన్యముందని చాటేందుకే యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెట్టానని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మోదీకి అక్కడ పర్యటించే తీరిక లేదు’’ అన్నారు. -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
కుల నిర్మూలన ఇలాగేనా?
ఆర్ఎస్ఎస్ నాయకులు కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను కూడా వారు వివరించాలి. ప్రస్తుత మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వ విద్యాలయాల్లో కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకూ దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. జాతీయ స్థాయిలో కుల గణనను డిమాండ్ చేస్తూ, ద్విజ ఆధిపత్యం కలిగిన సమాజంలో తమ చారిత్రక స్థానం పట్ల స్పృహను ప్రదర్శిస్తూ, తమ సంఖ్య గురించి శూద్ర/ఓబీసీలు చైతన్యాన్ని చూపుతున్న నేపథ్యంలో– ఎట్టకేలకు, ఆర్ఎస్ఎస్ బహిరంగ వేదికలపై కుల నిర్మూలన గురించి మాట్లాడుతోంది. కుల నిర్మూలన కోసం దత్తాత్రేయ çహొసబలే, ఇతర నాయకులు దళితులు, శూద్రులకు ఆలయ ప్రవేశాన్ని, నీటి హక్కు లను గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ రెండు అంశాలూ కాలం చెల్లినవి మాత్రమే కాదు, ఇవి సామాజిక వివక్షను తొలగించే అవకాశం లేదు. రెండు సామాజిక వ్యవస్థల శక్తి మాంసాహారం వర్సెస్ శాకాహారం వివాదం కులతత్వంతో కూడుకున్నది. ఇది కుల నిర్మూలనకు సహాయం చేయకపోగా, పౌర సమాజంలో, విశ్వవిద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలలో కుల తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార సాంస్కృతిక ఘర్షణలకు దారి తీస్తుంది. కులాల మధ్య విభజితమైన ఆహార సంస్కృతి కూడా కులాంతర వివాహాలకు అడ్డుగోడగా నిలుస్తో్తంది. వివాహం, గౌరవప్రదమైన కులాంతర భోజనాలు అనే ఈ రెండు సామాజిక వ్యవస్థలు తీవ్రమైన కుల నిర్మూలనా శక్తిని కలిగి ఉన్నాయి. వివాహం, ఆహార సాంస్కృతిక కండిషనింగ్ అనేవి, సామాజిక బృందాలను ఏకం చేయగలవు లేదా విభజించగలవు కాబట్టి వాటిని నేను ఉద్దేశపూర్వకంగానే శక్తి అని పిలుస్తాను. కుల వివాహ వ్యవస్థ, సామా జికంగా వేర్పాటుతో కూడిన ఆహార సాంస్కృతిక పరంపర అనేవి వేయి సంవత్సరాలుగా దేశంలో కుల అంతరాలను కొనసాగించాయి. కుల కేంద్రకమైన వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల డీఎన్ఏను కుల ప్రాతిపదికన విభజించడానికి ఉద్దేశించబడింది. గత వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఉనికిని చూసినట్లయితే, కుల నిర్మూలన కోసం కులాంతర వివాహాలను అది ప్రోత్సహిస్తుందనడానికి వారి రచనల్లో గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ ఎలాంటి ఆధారాలు లేవు. కులాంతర వివాహం వివిధ వృత్తులు కలిగిన రెండు వేరు వేరు వర్గాల మధ్య రక్త సంబంధాలను మార్పిడి చేస్తుందని డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. ఇది ఇద్దరు భాగస్వాముల కులాన్ని బలహీనపరచడమే కాకుండా, వారి సంతానపు మానసిక, శారీరక సామర్థ్యాలను మెరుగు పరుస్తుంది. బహుశా అలాంటి కులాంతర వివాహాన్ని రుజువు చేయడానికి ఆయన సవితా అంబేడ్కర్ను వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. సాధారణంగా పాశ్చాత్య సంస్కృతితో మాంసాహారం తినే దళితుడు, భారతీయ వాతావరణంలో మాత్రమే పెరిగిన బ్రాహ్మణ స్త్రీ తమ వైవాహిక జీవి తంలో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు అనే సమాచారం మన వద్ద లేదు. అంబేడ్కర్, సవిత తమ ఆహారాన్ని పూర్తి శాకాహారంగా గానీ, మిశ్రమ ఆహారంగా గానీ మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎదుటివారి ఆహార ఎంపికను మరొకరు గౌరవించి ఉండొచ్చు. ప్రస్తుత వ్యవస్థలో కులాంతర వివాహం అన్ని కులాలకు చెందిన భారతీయ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున కులాంతర వివాహాల పరిధి పెరుగుతోంది. అవి జరుగుతున్నాయి కూడా. కానీ కులాంతర వివాహాలను సాధారణంగా తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకంటే ఇది సామాజిక కళంకాన్ని తీసుకొస్తుంది. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఒక భాగస్వామి దళి తుడు, మరొకరు దళితేతరులు అయినప్పుడు అలాంటి వివాహితు లను చంపడం ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శకంగానూ, భారతదేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థగానూ ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందో సమాజానికి తెలియదు. ఈ సంస్థ నాయకులు సనా తన ధర్మం లేదా హిందూ సంప్రదాయం గురించి నిరంతరం మాట్లాడుతుంటారు. కులాంతర వివాహాలు సనాతన ధర్మంలో లేక హిందూ సంప్రదాయంలో భాగమేనా అన్నది వాళ్లు స్పష్టం చేయాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కుల నిర్మూలన ఒక క్లిష్టమైన యత్నం. కుల నిర్మూలన గురించి మాట్లాడటం మంచిదే. అదే సమయంలో దానికి గల మార్గాలను, సాధనాలను వివరించాలి. కులాలు, మాంసాహారం, శుద్ధ శాకాహారులు కుల వ్యవస్థ భారతీయుల మధ్య భోజనాన్ని ప్రధాన సమస్యగా మార్చింది. శతాబ్దాలుగా దేశంలోని వివిధ కులాల ప్రజలు పక్క పక్కనే కూర్చుని భోంచేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్ వ్యవస్థలు కుల రహితంగా తినే వీలును కల్పించాయి. కానీ గ్రామాల్లో ఇప్పటికీ ఇది పెద్ద సమస్య. అనేక పాఠశాలల్లో దళితులు వండిన ఆహారాన్ని దళితేతరులు తినడం లేదు. ఈ పరంపరకు వ్యతి రేకంగా ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వైఖరిని తీసుకోలేదు. శాకాహారం, మాంసాహారం అనే సమస్య ప్రస్తుతం చాలా ఐఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో తీవ్రమైన సమస్యగా మారింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ శాకాహార సంస్కృతిలో భాగమయ్యారు. పైగా వారు పూర్తి శాకాహార మెనూని అవలంబించాలని ఆయా సంస్థలను కోరుతున్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో శాకాహారం మాత్రమే అందించాలని ఆదేశాలను పంపిన మొదటి విద్యా మంత్రి స్మృతి ఇరానీ. ముంబై ఐఐటీతో సహా ఇతర ఐఐటీల అధిపతులు శాకాహారం, మాంసాహారం తినేవారికి వేర్వేరు వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నింటికీ కారణం సనాతన ధర్మాచరణకు చెందిన శాకాహార భావజాలమే. ముస్లింలను, క్రైస్తవులను విడిచిపెట్టండి... శూద్రులు, దళితులు, ఆదివాసీలు భారతదేశంలో ప్రధానంగా మాంసాన్ని, లభ్యత ఆధారంగా శాకాహారాన్ని తినడం ద్వారా జీవిస్తున్నారు. కానీ పండుగ సందర్భాలలో వారికి ఇష్టమైనది మాంసాహారమే. ఆహార సాంస్కృతిక పరంపరలో స్పష్టమైన కుల వర్ణ విభజన ఉంది. ఆర్ఎస్ఎస్ తన స్వచ్ఛమైన శాకాహార సంస్కృతిని వదులుకుంటుందా? బహిరంగ, వ్యక్తిగత ప్రదేశాలలో ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినడం గురించి ఏ వైఖరిని తీసుకుంటుంది? హిందూ లేదా హిందూత్వ ఆహార సంస్కృతి ఏమిటి? ఇది స్వచ్ఛమైన శాకాహారమా లేదా వ్యక్తిగత ఎంపిక ఆధారంగా మిశ్రమ ఆహారమా? వ్యక్తిగత ప్రాధాన్యాల ఆధారంగా ఆహార సంస్కృతిని ప్రజా స్వామ్యీకరించడం కుల నిర్మూలన చర్యల్లో ఒకటి. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబాల ఆహార స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసీలందరూ మాంసాహారాన్ని తింటుంటారు. బ్రాహ్మణులు, వైశ్యులు కులపరంగా శాకాహారులు. వారి పిల్లలకు అలాగే తినేలా శిక్షణ ఇస్తారు. ఈ పద్ధతులను ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ కులాన్ని ఎలా నిర్మూలిస్తుంది? కుల నిర్మూలనకు దశలవారీగా ఉపయోగపడే నాలుగు సామాజిక సాధనాలను నేను గుర్తించాను. వాటి గురించి ఈ సంస్థ మౌనంగా ఉంది. 1) తాము హిందువులని ఆర్ఎస్ఎస్ భావించే అన్ని కులాలకు దేవాలయాలలో అర్చకత్వ హక్కులు కల్పించాలి. దళితులు, ఆదివాసీలు, శూద్రులతో సహా అన్ని కులాల కోసం వాటిల్లో ప్రవేశానికి హక్కు కల్పించేలా ధార్మిక పాఠశాలలను, కళాశాలలను తెరవాలి. 2) చర్మశుద్ధి నుండి కుండల తయారీ వరకు అన్ని వృత్తుల గౌరవం పెరిగేలా బోధనా సామగ్రిని రూపొందించాలి. 3) దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంచిదని ప్రచారం చేయడం ద్వారా కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. 4) మాంసాహారం, శాకాహారంతో సంబంధం లేకుండా ఇతరుల ఆహార ఎంపికను గౌరవిస్తూ కలిసి భోంచేసేలా చూడాలి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుతో సహా, శుద్ధ శాకాహారమే హిందూ లేదా భారతీయ ఆహార సంస్కృతిగా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలి. కుల నిర్మూలన గురించి ఆర్ఎస్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాలపై తన వైఖరిని స్పష్టంగా తెలియ జేయాలి. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్పూర్లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే. అందుచేత.. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా ఆరెస్సెస్ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: భారత్ మూలాలపై రిషి సునాక్ భావోద్వేగం -
హింసా సంస్కృతి ఏ సందేశానికి?
డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మన దేశంలో కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మణిపుర్ ఘటనలో లాగా మహిళలను నగ్నంగా ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి రాజకీయ నిర్మాణంలో మూడో ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఒక మూడో ఇంజన్ శక్తిమంతంగా పనిచేస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’ సంపాదకులు వర్ధెల్లి మురళి ‘నా దేశం నగ్న దేహమా?’ శీర్షికతో 2023 జూలై 23న ఘాటైన వ్యాసం రాశారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు డబుల్ ఇంజన్తో, అంటే రెండో ఇంజన్ అయిన కేంద్ర మద్దతుతో నడుస్తున్నాయని ప్రధాని మోదీ నిరంతరం మాట్లాడుతున్నారని మురళి అన్నారు. వాస్తవానికి మణిపుర్లో మూడు ఇంజన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. కుకీ క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన గురించి రాస్తూ, ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ‘ట్రిపుల్ ఇంజన్’ పవర్తో ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. ఆ మూడో ఇంజన్ – ఆరెస్సెస్. మూడవ ఇంజన్ క్రమపద్ధతిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలను మెజారిటీలు, మైనారిటీలుగా విభజిస్తుంది. ఇది ప్రజలను మత పర మైన మార్గాల్లో విభజించడానికి మార్గాలను రూపొందించే అత్యంత క్లిష్టమైన ఇంజన్. 1999లో బీజేపీ, ఆరెస్సెస్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వారు ఎన్నికల ప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రధానంగా ముస్లింలను, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నారు. వ్యవస్థీకృతమైన హిందుత్వ శక్తులు వారిపై దాడి చేసేందుకు అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు లేదా క్రైస్తవేతరులు అనే ప్రాతిపదికన సమూ హాలను విభజించడం చాలా కాలంగా జరుగుతోందని పుకార్లు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత ఆరెస్సెస్–బీజేపీ స్థానిక రాష్ట్ర యంత్రాంగంపై నియంత్రణను సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మణిపుర్లో దాదాపు 53 శాతం జనాభా మైతేయిలు కాగా, మిగిలిన వారిలో కుకీలు, నాగాలు ఉన్నారు. కుకీలు, నాగాలలో దాదాపు 95 శాతం మంది క్రైస్తవులు; మైతేయిలలో 2–3 శాతం మంది క్రైస్తవులు. మైతేయిలలో కూడా క్రైస్తవ ప్రభావం పెరుగుతోందని హిందుత్వ శక్తులు భావించిట్లు కనిపిస్తోంది. కాబట్టి వారు మతపరమైన పరి వర్తనకు అడ్డుకట్ట వేయాలని కోరుకున్నారు. మైతేయిలను బలమైన హిందూ శక్తిగా అవతరింపజేయడం ద్వారా వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలోని కుకీలు, నాగాలు విశ్వాసపాత్రులైన క్రైస్తవులుగా ఉండిపోయారు, లేదా ‘ఘర్ వాపసీ’ అయ్యారు. ఇంకొక ప్రధాన ఆలోచన ఏమిటంటే, హిందూ మైతేయిలను ఎస్టీలుగా గుర్తించడం వలన వారికి భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఈశాన్య ప్రాంతాలను క్రైస్తవీ కరణ నుంచి మార్చే హిందుత్వ ప్యాకేజీ. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. వ్యవస్థీకృత హిందూ మైతేయిలకు ఆ పనిని చేయడానికి అనుమతించే కార్యాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్కు అప్పగించినట్లు కనిపిస్తోంది. రాజకీయ చర్చల నుండి అత్యంత శక్తిమంతమైన మూడో ఇంజ న్ను మినహాయించి, ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏం జరుగు తున్నదో దానికి బాధ్యత వహించాల్సింది మోదీయేనని ప్రతిపక్షాలు మాట్లాడటం తప్పు. వాజ్పేయి కంటే ఎక్కువ అధికారంతో మోదీ రెండో ఇంజన్ ను నడుపుతున్నారనేది వాస్తవం. కానీ మూడో ఇంజన్ అయిన ఆరెస్సెస్ ప్రమేయం లేకుండా... మణిపుర్లో లాగా హిందుత్వ యంత్రాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోలేవు. ముఖ్యమంత్రులకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది థర్డ్ ఇంజన్. స్త్రీలను నగ్నంగా నడిచేలా చేసిన పురుషుల ప్రవర్తన కనికరం లేకుండా ఉండటానికి ఎంతో శిక్షణ అవసరం. వారిలో ఒకరిపై దారు ణంగా అత్యాచారం చేశారు. ఆ దృశ్యానికి సంబంధించిన వీడియోలు ప్రపంచాన్ని కంపింపజేయడంతో ప్రధాని ఈ ఘటనను ఖండించారు. అయితే ఆ క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ఈ సంస్థ గతంలో ఒక సాధారణ ప్రకటన మాత్రం విడుదల చేసింది. అయితే ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘చాలాసార్లు ప్రతికూల చర్చలే వినిపిస్తున్నాయి. అయితే మనం దేశమంతా తిరిగి చూసినప్పుడు, జరుగుతున్న మంచి విషయాల గురించి 40 రెట్లు ఎక్కువ చర్చలు సాగుతున్నాయని మనకు తెలుస్తుంది’’. ఆ ఘటనలోని మహిళా వ్యతిరేక స్వభావాన్ని ఖండించకుండా ‘40 రెట్లు ఎక్కువ మంచి విషయాలు’ అంటూ సర్సంఘ్ చాలక్ మాట్లాడుతున్నారు. మణిపుర్లో మూడు ఇంజన్లు సమన్వయంతో పనిచేశాయి కాబట్టి, ఆ చర్యలో పాల్గొన్న హిందుత్వ శక్తులు ఆ మహిళలను ఘర్ వాపసీ చేయాలనుకుంటున్నాయా? బాధితులకు ఉరిశిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుందని మణిపుర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల వలె వారిని తరువాత విడుదల చేయవచ్చు! నియంతృత్వం ఆసన్నమైందనే భయం కారణంగానే చాలా మంది ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు. ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పూర్తిగా ఆయిల్ నింపిన ఆ ఇంజన్కు రాష్ట్ర స్థాయి నిర్వాహకులు. గట్టి ప్రత్యర్థులను, ముఖ్యంగా యువతీ యువకులను చంపడం, వారిని ప్రమాదకరమైన నక్సలైట్లుగా ముద్ర వేయడం ఆ రోజుల్లో ఆనవా యితీగా ఉండేది. ఏ పోలీసు కూడా అలాంటి వారికి రక్షణ కల్పించ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అధికారీ పతకం సాధించేందుకు, మరింత మందిని చంపేందుకు పోటీ పడ్డారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు మనకు కొత్తవి కావు. 1967 వరకు అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఆనాటి క్రూరమైన ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా మహిళలను ఊరేగించడం ఎప్పుడూ చూడలేదు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఇంజన్కు ఒక మహిళ నాయకత్వం వహిస్తున్నందున, ఆనాడు అలాంటి ఆపరేషన్ ను అనుమతించలేదు. అదృష్టవశాత్తూ దేశం ఆ పీడకల రోజులను అధిగమించింది. బహుశా ఆ రాజకీయ నిర్మాణంలో ఆ కాలంలో థర్డ్ ఇంజన్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మణిపుర్లో కానీ దేశంలో కానీ బహిరంగంగా ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ లేదు. అయినా ఇక్కడ ప్రజలను కేవలం వ్యక్తిగత ఎన్ కౌంటర్లలో చంపడం లేదు. వారి సొంత ఇళ్లల్లో, బయట సజీవ దహనం చేస్తున్నారు. మణిపూర్ ఘటన ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన హింసాత్మక సంస్కృతి తాలూకు చివరి చర్య. ఈ హింసను, ఈ అనాగరక సంస్కృతిని ప్రపంచం ఎలా అర్థం చేసు కోవాలి? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
అమెరికాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు
-
ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక
కర్ణాటకలో ఎన్నికలు ముగిసినా రాజకీయ రగడ మాత్రం చల్లారడం లేదు. తాము అధికారంలో వస్తే ఆర్ఎస్ఎస్, బజ్రంగ్ దళ్ సంస్థలను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ తమ మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ వివాదం నేటీకి కొనసాగుతోంది. నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్రంగ్ దళ్ని బ్యాన్ చేస్తుందా అనే దానిపై.. ఇటీవల కాంగ్రెస్ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే ఏ సంస్థనైనా సహించేది లేదన్నారు. అది పీటీఐ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అయినా సరే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడమన్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దమ్ముంటే కాంగ్రెస్ బజరంగ్ దళ్ను బ్యాన్ చేయాలని సవాల్ విసురుతోంది కాషాయ పార్టీ. తాజాగా ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడితే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ను బూడిద చేసేస్తామని హెచ్చరించారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? "ఆర్ఎస్ బ్యాన్ చేస్తామని ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ప్రధాని నరేంర మోదీ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇప్పుడు ఆయన కేంద్రంలో అత్యున్నత పదవిలో ఉన్నారు. మేమంతా ఆ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన వాళ్లమే. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహరావు ప్రభుత్వాలు కూడా ఆర్ఎస్ఎస్నుని బ్యాన్ చేయాలని చూశాయి. కానీ.. వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అదే ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ని కాల్చి బూడిద చేస్తాం. ప్రియాంక్ ఖర్గే ఈ దేశ చరిత్ర ఏంటో తెలుసుకుంటే మంచిది. తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి" అని నళిన్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | When asked about RSS in the wake of Congress' stand on a ban on PFI and Bajrang Dal in the state, Karnataka Minister Priyank Kharge says, "Any organisation, either religious, political or social, who are going to sow seeds of discontent & disharmony in Karnataka will not… pic.twitter.com/a6H4pDSWIT — ANI (@ANI) May 25, 2023 -
‘పాక్లో హైటెన్షన్.. బీజేపీ, ఆరెస్సెస్ల పనేనంట!’
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్తో పాకిస్తాన్ ఒక్కసారిగా అగ్ని గుండంగా మారింది. ఖాన్ అరెస్ట్ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన.. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు విధ్వంసకాండకు తెగబడ్డారు. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంవైపు అడుగులేస్తోంది పీటీఐ శ్రేణుల ఆందోళన. అయితే ఈ హింసపై పాక్ అధికారిక వర్గాలు మాత్రం వింత వాదనకు దిగాయి. పాక్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులకు.. పీటీఐ కార్యకర్తలు కారణం కాదంట. ఆ కల్లోలం వెనుక భారత్లోని బీజేపీ, ఆరెస్సెస్ ఉందంటూ వాదిస్తోంది. పాక్ ప్రధాని షెహ్బాష్ షరీఫ్ వ్యక్తిగత కార్యదర్శి అట్టా తరార్ ఈ విచిత్రమైన వాదనను లెవనెత్తాడు. పాక్లో విధ్వంసకాండకు, అల్లర్లకు కారణం ఇక్కడి వాళ్లు కారు. భారత్ నుంచి ఆరెస్సెస్, బీజేపీలు అందుకోసం అక్కడి నుంచి కిరాయి మనుషుల్ని పాక్కు పంపారు అంటూ బుధవారం మీడియా ముందు పేర్కొన్నాడు తరార్. నిరసనల పేరిట విధ్వంసానికి దిగిన వాళ్లు బీజేపీ, ఆరెస్సెస్ మనుషులే. అంతెందుకు వాళ్లు నిన్నటి (మంగళవారం ఖాన్ అరెస్ట్.. తదనంతరం అల్లర్లు) పరిణామం తర్వాత భారత్లో సంబురాలు కూడా చేసుకున్నారు. ఇదంతా ఆరెస్సెస్ ఆదేశాలతో జరిగింది’ అని తరార్ పాక్ మీడియా ఎదుట ప్రకటన చేశాడు. ఇదీ చదవండి: బాత్రూంకు కూడా పోనివ్వకుండా టార్చర్ పెట్టారు! -
Defamation Case: రాహుల్కి పరువు నష్టం కేసులో ఉపశమనం!
ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్కి ముడిపెడుతూ.. రాహుల్ పలు ఆరోపణలు చేశారు. దీంతో థానే జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్పై రాజేష్ కుంతే అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్లో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ తేదీల్లో రాహుల్ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. (చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్ గాంధీ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి) -
ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నిబందనలు
సాక్షి, చైన్నె : ఆర్ఎస్ఎస్ ర్యాలీకి 12 రకాల నిబంధనలు విధించారు. రాష్ట్రంలో సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొంది మరో ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈనెల 16న 45 చోట్ల ర్యాలీ నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. ఇందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. చైన్నెలో రెండు చోట్ల ఈ ర్యాలీ జరగనుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనేక నిబంధనలు విధించారు. డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు 12 కట్టుబాట్లు తప్పనిసరిగా అమలయ్యే విధంగా శుక్రవారం ఆదేశాలు వెళ్లాయి. ర్యాలీ, సభలో వ్యక్తిగతం, కులమతాలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దేశ పరువుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ర్యాలీ నిర్వహించాలి. ర్యాలీలో పాల్గొనే వారు ఆయుధాలు, కర్రలు చేతబట్టి ముందుకు వెళ్లేందుకు వీలు లేదు. ర్యాలీలో పాల్గొనే వారి కోసం తాగునీరు, కెమెరాలు, అగ్నినిరోధక పరికరాలు, ఇలా అన్ని రకాల ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకోవాలి. ఎంపిక చేసిన , అనుమతి ఇచ్చిన మార్గాలలో ఎడమ వైపు మాత్రమే ర్యాలీ జరగాలి. అనుమతి ఇచ్చిన రహదారిలోని నాలుగు భాగాలలో ఓ భాగం మాత్రమే ర్యాలీకి ఉపయోగించుకోవాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ర్యాలీలో ఉన్న వారిని పర్యవేక్షించేందుకు స్వచ్ఛంద సేవకులను నియమించుకోవాలని సూచించారు. -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
చరిత్ర పుస్తకాల్లో ‘గాంధీ, ఆరెస్సెస్’ తొలగింపు
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవలు, సయోధ్య కోసం గాంధీ విఫలయత్నం, ఆయన హత్య తర్వాత ఆరెస్సెస్పై నిషేధం, గోధ్రా అల్లర్ల తర్వాత ఘటనలు తదితరాలను పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా ఏయే అంశాలను తొలగించబోతున్నదీ తెలుపుతూ మండలి గత జూన్లో విడుదల చేసిన బుక్లెట్లో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. హిందూ అతివాదంపై గాంధీ అభిప్రాయాలు వంటి అంశాలను తొలగించడం భావితరాలకు వాస్తవాలు తెలియకుండా చేసే కుటిల యత్నమని ఆరోపించింది. బీజేపీ, ఆరెస్సెస్ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చలేవని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విషయ నిపుణుల సూచన మేరకే వాటిని తొలగించినట్టు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ సాక్లానీ చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం అనవసరమని అభిప్రాయపడ్డారు. -
కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజేపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్
బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని ఆర్ఎస్ఎస్ సర్వేలో తేలిందని ఓ వార్త జోరుగా వ్యాప్తి చెందుతోంది. కమలం పార్టీ ఈసారి కేవలం 65-70 సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ 115-120 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని ఈ సర్వే పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆర్టికల్ కర్ణాటక దినపత్రిక కన్నడ ప్రభలో ప్రచురితమైందని, ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఆర్ఎస్ఎస్ నిర్వహించిన అంతర్గత సర్వే అని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే ఇది గతంలో నిర్వహించిన పాత సర్వే అని తెలుస్తోంది. తన సొంత సామాజిక వర్గంలో బీఎస్ యడియూరప్ప పాపులారిటీ పడిపోయిందని ఈ సర్వేలో ఉంది. రెడ్డి సోదరులను బీజేపీలోకి తీసుకురావాలనే యడ్డీ నిర్ణయం బ్యాక్ఫైర్ అయిందని సర్వే పేర్కొంది. దీంతో ఈ సర్వే ఇప్పటిది కాదని స్పష్టమవుతోంది. యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు కన్నడ ప్రభ కూడా ఈ వార్త తాము ఇప్పుడు ప్రచురించలేదని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. ఈ సర్వేలో బీజేపీకి 65-70, కాంగ్రెస్కు 115-120, జేడీఎస్కు 29-34 సీట్లు వస్తాయని ఉంది. కాంగ్రెస్ పనే.. ఈ ఫేక్ సర్వేపై బీజేపీ నేత, కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ సుధాకర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్నమద్దతు చూసి కాంగ్రెసే ఓర్వలేక ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటమి తథ్యం అని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా.. కర్ణాటకలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కాంగ్రెసే విజయం సాధిస్తుందని తేలింది. మొత్తం 224 స్థానాలకు గానూ ఆ పార్టీకి 39-42 శాతం ఓట్లతో 116-122 సీట్లు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. బీజేపీకి 33-36 శాతం ఓట్లతో 77-83 సీట్లు వస్తాయని చెప్పింది. చదవండి: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి కళ్లెదుటే ఎంపీ ఇళ్లు, కారు ధ్వంసం -
దేశ ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం
పేరు ప్రఖ్యాతులు కావాలని ఆరెస్సెస్ పాటుపడదనీ, సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడానికి కావాల్సిన శక్తియుక్తులను అందించడానికి వీలుగా వ్యక్తులను కలిపి పనిచేయించడమే ఆరెస్సెస్ లక్ష్యమనీ ఆ సంస్థ ప్రచార్ ప్రముఖ్ (మీడియా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్) సునీల్ అంబేకర్ అన్నారు. ఆయన ఇంగ్లీషులో రాసిన ‘ద ఆరెస్సెస్: రోడ్మ్యాప్స్ ఫర్ ద 21 సెంచరీ’ పుస్తకానికి తెలుగు అనువాదం ‘అరెస్సెస్ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ ఆవిష్కరణకు ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ. ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దేశంలో చాలామంది ఆకాంక్ష. యువతలో అది ఇంకా బలీయంగా ఉంది. నేను విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తున్న సమ యంలో దేశాభివృద్ధి గురించి యువత ప్రశ్నించేది. కాలక్రమంలో ప్రశ్న అడిగే తీరులో మార్పును గమనించాను. దేశ ప్రగతికి సంబం ధించి యువత నుంచి ప్రతికూల ప్రశ్నలు కాకుండా సానుకూల ప్రశ్నలు రావడం మొదలైంది. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అని విభిన్న కోణాల నుంచి వస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ యజ్ఞంలో భాగమైన సంఘ కార్యంలో(ఆరెస్సెస్ కార్యక్రమాల్లో) అందరికీ భాగస్వామ్యం ఉండాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ఆరెస్సెస్ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, సంఘ పరిచయం లేని వ్యక్తులు కూడా ఆరెస్సెస్ తీరును అవగతం చేసుకోవడానికీ పుస్తకం రాయాలన్న ప్రతిపాదన నా వద్దకు వచ్చింది. దానికి అంగీకరించాను. ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి? 1. దేశం అభివృద్ధి చెందాలని సామాన్యులు కూడా బలంగా ఆకాంక్షిస్తున్నారు. బాధ్యత తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంఘం(ఆరెస్సెస్) విస్తరణకు సామాన్యుల త్యాగాలు, వారి విజయ గాథలే మూలాధారం. ఈ విషయాన్ని ప్రధానంగా చెప్ప దలుచుకున్నాను. సంఘ కార్యంలో అందరి భాగస్వా మ్యాన్ని అభిలషిస్తున్నాం. 2. ఈ దేశ సంస్కృతి, వారసత్వం, హిందుత్వం... మనం గర్వించాల్సిన అంశాలే తప్ప, న్యూనత చెందాల్సిన అంశాలు కాదు. సర్వమానవ హితానికి అవి అత్యంత రమణీయమైన అంశాలు. అయితే ఈ విషయాల పట్ల కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చెయ్యాలి. 3. ప్రజలంతా దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వర్త మానంలో దేశానికి ఉన్న శక్తి ఆధారంగా భవిష్యత్ను నిర్మించుకోవాలి. 4. హిందుత్వం అంటే అందరినీ కలి పేది. అందరి బాగు కోరుకోవడమే హిందుత్వం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపి ఉంచే ‘కనెక్టింగ్ ఫ్యాక్టర్’ హిందుత్వం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లకు సమాధానం బయటి నుంచి లభించదు. మనకు మనమే పరిష్కారాలను అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం కూడా కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టడం కోసమే కాకుండా, స్వపాలన, స్వదేశీ, స్వభాష.. ఇలా ‘స్వ’(సొంత) సాధన లక్ష్యంగా సాగింది. ఇప్పుడు కూడా ‘స్వ’ ఆధారంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రతి నిర్ణయం స్వావలంబన సాధించే దిశగా ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చేయాలి. సంఘం (ఆరెస్సెస్) చెప్పేది ఇదే. ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు? స్వయం సేవకులకా, స్వయం సేవకులు కావాలనుకుంటున్న వారికా? అందరికీనా? అందరికీ ఉద్దేశించింది. ఆరెస్సెస్ను అర్థం చేసుకోవాలనుకొనే వారికి ఉపయుక్తం. స్వయం సేవక్లే కాదు, అందరూ చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఎలాంటి ఫీల్ కలిగినా ఫర్వాలేదు. ఆరెస్సెస్ను వ్యతిరేకించేవారైనా పుస్తకం చదవాలి. 2025 నాటికి ఆరెస్సెస్ ఏర్పాటై వందేళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆరెస్సెస్ పనితీరు, అంతర్గత వ్యవహారాల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వందేళ్ల తర్వాత అయినా ఆరెస్సెస్ అంతర్గత వ్యవహారాలు సామాన్యులకు తెలిసేలా పారదర్శకంగా పనిచేస్తుందా? ఆరెస్సెస్ ఏర్పాటయిన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే. సంఘం యాజమాన్య హక్కులు ఎవరి(వ్యక్తుల) సొంతం కాదు. ఆరెస్సెస్ యాజమాన్యం ప్రజలదే. ప్రజల భాషలో చెప్పాలంటే పబ్లిక్ కంపెనీ. భారతమాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్ పనిచేస్తారు. సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే ‘సంఘ’ లక్ష్యం. ఆరెస్సెస్ను బలోపేతం చేయడం కాదు... సమాజాన్ని, దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తుంది. అందుకే ఎవరైనా ఆరెస్సెస్లో పనిచేయడానికి ‘ఫిట్’ అవుతారు. మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్. సమాజానికి ఉప యోగపడే ఏ పని చేద్దామన్న ఆసక్తి ఉన్నా, ఏ రంగంలో చేయాలనుకున్నా ఆరెస్సెస్ తోడుగా నిలుస్తుంది. అరెస్సెస్ ప్రయాణం తెరిచిన పుస్త కమే... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ! ఇక మీద ఆరెస్సెస్ విస్తరణ మీద దృష్టి పెడతారా? సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారా? పేరు, ప్రఖ్యాతుల కోసం ‘ఆరెస్సెస్’ పని చేయడం లేదు. సిద్ధాంతం ఆధారంగా పనిచేసుకుంటూ ముందడుగు వేస్తుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను ‘నెట్ వర్కింగ్’ చేయడమే సంఘం పని. సామాన్యులను సాధికారత దిశగా నడిపించడానికి నెట్వర్కింగ్ చేస్తుంది. మరింత ఎక్కువ మందిని కలిపి పనిచేయించడం ద్వారా సాధికారత సాధించడమే తప్ప... అది ఆరెస్సెస్ విస్తరణ కాదు. రెండో అంశం, సిద్ధాంతం గురించి అడి గారు... అరెస్సెస్ సిద్ధాంతం చాలా సింపుల్. అందరూ గర్వపడే విధంగా దేశాన్ని తయారు చేయడం, హిందుత్వాన్ని చూసి గర్వ పడటం, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కోరుకోవడం... ఇది కేవలం ఆరెస్సెస్ లైన్ మాత్రమే కాదు... వేల సంవత్సరాలుగా ఈ దేశ అంతరాత్మ ఇదే. దేశానికి సేవ సేయడమే ఆరెస్సెస్ సిద్ధాంతం. యాంటీ–నేషనల్స్ అని పదాన్ని ఆరెస్సెస్ ఈ మధ్య ఎక్కువగా ఉప యోగిస్తోంది. మీ దృష్టిలో దీని నిర్వచనం ఏమిటి? స్వయం సేవక్లు నడిపే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు ‘యాంటీ–నేషనల్స్’ అనా? ఎంతమాత్రం కాదు. ప్రభుత్వాలను విమర్శించడం, వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. పార్లమెంట్లోనే విమర్శిస్తున్నారు కదా! వారిని యాంటీ–నేషనల్స్ అని ఎవరూ అనడం లేదు. ఆ పదంలోనే దాని అర్థం ఉంది, దేశానికి వ్యతిరేకం అని. దేశ హితాన్ని కాంక్షించని వారంతా యాంటీ–నేషనల్స్. ఇది ఆరెస్సెస్ సృష్టించిన పదం కాదు. చరిత్రను చూసే దృష్టికోణం మారాలంటున్నారు కదా! ఎందుకు మారాలి? దేశాన్ని చాలా శతాబ్దాల పాటు విదేశీయులు పాలించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్ర తయారయింది. వారి ప్రయో జనాల పరిరక్షణకు వీలుగా చరిత్రను రూపొందించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మహాపురుషులు, రుషులు, సమర్థ పాల కుల చరిత్ర మరుగున పడిపోయింది. మన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేశారు. ఒక కుటుంబ చరిత్ర, ఒక వంశ పాలన చరిత్ర కాదు. ఈ దేశ నిర్మాణంలో గ్రామీణులు, కొండకోనల్లో నివసించేవారు, పేదలు, ధనికులు, పాలకులు... అందరి పాత్రా ఉంది. దాన్ని విస్మరించారు. ఆర్యులు వెలుపలి నుంచి వచ్చారనే సిద్ధాంతం తప్పని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా చెప్పారు. విదేశీ దృష్టి కోణం మారాలి. మన దేశం దృష్టి కోణం నుంచి చరిత్రను చూడాలి. సరికొత్త కోణంలో చరిత్రను ఆవిష్కరించి ప్రజల ముందు ఉంచాలి. – ఎం. విశ్వనాథ రెడ్డి -
‘నా శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో వెళ్లదు’
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేడీఎస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. ఏది ఏమైనా తాను కాషాయం పార్టీతో కలిసే ప్రసక్తే ఉండబోదని తేల్చేశారు. బీజేపీ, జేడీఎస్లకు సిద్ధాంతాలు లేవు. హేతుబద్ధత లేదు. ఒకవేళ బీజేపీ వాళ్లు నన్ను రాష్ట్రపతిని చేసినా.. ప్రధానిని చేసినా.. వాళ్లతో కలిసే వెళ్లే ప్రసక్తే ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్లకు నేను దూరం. కనీసం నా శవం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్తో వెళ్లదు అని పేర్కొన్నారు. సోమవారం రామనగర జిల్లా మగడిలో జరిగిన ఓ పార్టీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనతా దళ్(సెక్యులర్), ఇతరులు.. అధికారం కోసం బీజేపీతో కలిసి వెళ్తారన్న సిద్ధారామయ్య.. జేడీఎస్ కూడా సిద్ధాంతాలు లేని పార్టీనే అని తేల్చేశారు. అధికారం కోసం వాళ్లు ఎవరితో అయినా అంటకాగుతారని విమర్శించారు. అలాంటి వాళ్లకు ఆత్మ గౌరవం అనేది ఉంటుందా? అని నిలదీశారాయన. ‘‘బీజేపీ నేను హిందూ వ్యతిరేకినంటూ ప్రచారం చేస్తోంది. బీజేపీ నేత రవి నన్ను సిద్ధారాముల్లా ఖాన్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. కానీ, గాంధీజీనే నిజమైన హిందువు. అలాంటి గాంధీని చంపిన గాడ్సేను ఆరాధించే హిందువులు వాళ్లు’’ అంటూ వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఆహార భద్రత ఉండేదని, కానీ, బీజేపీ పాలనలో అది కనిపించడం లేదని ఆరోపించారాయన. -
ఆరెస్సెస్ వారి నేతాజీ జయంతి వేడుకలు
కోల్కతా: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరెస్సెస్ సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో.. నేతాజీ కూతురు అనితా బోస్(80) స్పందించారు. జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. కోల్కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్లో జయంతి వేడుకల నిర్వహణకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. అయితే.. ఈ పరిణామంపై నేతాజీ కూతురు అనిత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. తన తండ్రి పేరును ఆరెస్సెస్, బీజేపీలు పాక్షికంగా వాడుకోవాలని యత్నిస్తున్నాయేమో అని అన్నారామె. ఆర్ఎస్ఎస్ భావజాలం.. జాతీయవాద నాయకుడైన తన తండ్రి(నేతాజీ) లౌకికవాదం, సమగ్రత ఆలోచనలు.. పరస్పర విజాతి ధృవాలను, అవి ఏనాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికొస్తే.. దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి, నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారామె. అన్నింటికి మించి ఆయన లెఫ్టిస్ట్ అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరెస్సెస్, బీజేపీలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం అని ఫోన్ ద్వారా జర్మనీ నుంచి ఇక్కడి మీడియాతో ఆమె మాట్లాడారు. విభిన్న సమూహాలు నేతాజీ జన్మదినాన్ని వివిధ మార్గాల్లో జరుపుకోవాలని కోరుకుంటాయి. వారిలో చాలా మంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. అయితే.. నేతాజీ ఆశయాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తే అది ఖచ్చితంగా బాగుంటుంది అని అనిత బోస్ వెల్లడించారు. నేతాజీ.. ఆరెస్సెస్ విమర్శకుడా? అనే ప్రశ్నకు.. ఆ విషయంపై తనకు స్పష్టత లేదని ఆమె బదులిచ్చారు. అయితే.. ఆరెస్సెస్ గురించి, నేతాజీ భావజాలం గురించి మాత్రం తనకు స్పష్టత ఉందని, ఈ రెండు పొసగని విషయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆరెస్సెస్కు సరిపోని అంశమని పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. 2021లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీలు నేతాజీ 125వ జయంతి వేడుకల కోసం పోటాపోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే ఆ రెండు పార్టీలు అలాంటి చర్యలకు దిగడం గమనార్హం. -
‘సంతోష్ను ఇరికించి సర్కార్ ఆరెస్సెస్తో పెట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ఒక యుద్ధవాతా వరణం మాదిరి పరిస్థితుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని ఆరెస్సెస్ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కార్యరంగంలోకి దిగాలి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి (ఆరెస్సెస్ నేత) బీఎల్ సంతోష్ను ఇరికించి, నోటీసులివ్వడం ద్వారా కేసీఆర్ సర్కార్ ఆరెస్సెస్తో పెట్టుకుంది. ఇందుకు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలి..’ అని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్ పరివార్ పిలుపునిచ్చింది. తెలంగాణ సెంటిమెంట్, ప్రత్యేక రాష్ట్ర వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏర్పాటుతో బలహీనపడడంతో పాటు ప్రజలెవరూ విశ్వసించని స్థితికి చేరుకున్నందున ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చెప్పినట్టు తెలిసింది. ఆదివారం నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాలి్సన వ్యూహంపై సంఘ్ పరివార్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్ జాతీయ నేతలు సమాలోచనలు జరిపారు. అధికారమే లక్ష్యంగా కృషి చేయాలి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ఆరెస్సెస్ జాతీయ సర్ కార్యవాహ (జాయింట్ జనరల్ సెక్రటరీ) ముకుంద్ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా తొలుత వీహేచ్పీ, భజరంగ్దళ్, బీఎంఎస్, ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఇతర క్షేత్రాల సమన్వయ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి దాకా ఆరెస్సెస్ ముఖ్యులు, సంఘ్పరివార్ అనుబంధ విభాగాల ముఖ్యులతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, జాతీయ కార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రయత్నాలు గట్టిగా ఎదుర్కోవాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘కేవలం మైనారిటీ వర్గ సంతుష్టీకర విధానాలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నందున, అలాంటి వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినందున దానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. వామపక్షాల ముఖ్యనేతలు అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాలతో ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల వాటికి మద్దతు తెలిపే కార్యకర్తలు, వర్గాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి..’అని సమావేశం సూచించింది. -
అమృతోత్సవ దీక్షకు ఫలితం?!
కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది. కాగా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్ స్టాన్ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ కంపెనీ ‘ఆర్సెనల్ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగసస్’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది. అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్వన్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్ పెగసస్ స్పైవేర్ ట్యాంపర్ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు. ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్ పాలకుల ‘బోఫోర్స్’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల రఫేల్ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్ ఇండియాలో భాగంగా కార్పొరేట్ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది. ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్ వాదిగా భావికా కపూర్ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్ గుల్ట్రమ్ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్ మోదీజీ.. వావ్!’’ (30 డిసెంబర్ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం: ‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’ ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్’(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బీజేపీ, RSS నా గురువులు: రాహుల్ గాంధీ
-
బీజేపీని ఓడిస్తేనే.. దేశం భద్రం
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించకపోతే దేశానికి భద్రత లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడా నికి ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో విద్యార్థులు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. వినాశకరమైన నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బలీయమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించి కొత్త విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహా సభలు మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ మాట్లాడారు. అన్ని రంగాలూ దుర్భర స్థితిలోనే..: ‘దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, దిగజారుతున్న దశలో ఉంది. విద్య సహా అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నియంతృత్వ కూటమి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్రం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రైవేటుపరం చేస్తోంది. పేద, మధ్య తరగతిని దెబ్బతీసేలా జాతీయ విద్యా విధానాన్ని తెచ్చింది. జాతీయ విద్యా విధానం బలహీన వర్గా లు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. సంపన్న వర్గాల చేతుల్లోకి పోతుంది. మంగళవారం నెక్లెస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ర్యాలీ పేదలకు దూరం అవుతుంది. అలాగే పాఠ్యాంశాలను, సిలబస్ను మార్పు చేయాలని బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోంది. విద్య మౌలిక లక్ష్యం కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటునివ్వడం, శాస్త్రీయ థృక్పథాన్ని తీసుకురావడం. అందుకు విరుద్ధంగా విద్యా విధానం తెస్తున్నారు. నూతన విద్యా విధానంలో విభజన తత్వాన్ని నూరిపోస్తున్నారు. మూఢ నమ్మకాలను, సనాతనత్వాన్ని, సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠ్యాంశాలను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటాలను వక్రీకరిస్తున్నారు..’అని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ‘దేశంలో కోట్లాదిమంది ఉద్యోగాల కోసం పరితపిస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014లో వాగ్దానం చేశారు. అలా ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. కొత్తవి సృష్టించకపోగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. నియామకాల పద్ధతినే మార్చేశారు. తాత్కాలికంగా నియమిస్తున్నారు. దీనితో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగింది. సైన్యంలోనూ తాత్కాలిక పద్ధతిలో అగ్నిపథ్ను తీసుకొచ్చారు. నాలుగేళ్లు వాడుకొని వదిలేసేలా మార్చారు. దాన్ని వ్యతిరేకించాలి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలూ అలానే ఉన్నాయి. కార్మికులకు జీతాలు, హక్కులు లేవు. కార్మికుల 42 హక్కులను కాలరాశారు..’అని చెప్పారు. మతాల మధ్య చిచ్చు... ‘బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తోంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వ్యవస్థను భగ్నం చేసే కుట్రకు పాల్పడుతోంది. ప్రజల మీద దాడులు చేస్తోంది. రాజ్యాంగాన్ని, న్యాయవ్యస్థను, ఎన్నికల కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే దేశాన్ని కాపాడుకోవాలి..’మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం విద్యార్థులు పోరాడాలన్నారు. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో ఈ అంశాలపై చర్చించాలని సూచించారు. -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
లవ్ జిహాద్ను వ్యతిరేకిస్తూ వీహెచ్పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్పీ ఉపయోగించుకోనుంది. -
RSS March: ఆరెస్సెస్కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్కోయిల్తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్ఎస్ఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!) -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
వామపక్ష ఐక్యతే తక్షణ కర్తవ్యం
సాక్షి, అమరావతి: దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం తీవ్రమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతే తక్షణ కర్తవ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం గురుదాస్ దాస్గుప్తా నగర్(ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ‘విజయవాడలో జరుగుతున్న జాతీయ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు, భారతదేశంలోని వామపక్ష పార్టీల నాయకులు, దేశం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావడం మన ఐక్యతను చాటుతోంది. దేశంలోనే మూడోసారి సీపీఐ జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం విజయవాడ కావడం గర్వకారణం. అటువంటి మహత్తర గడ్డపై జరుగుతున్న మహాసభలు. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను సాధించేందుకు వేదికగా నిలుస్తాయని భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం, మత ఛాందసవాదం, విద్వేషం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో అంతర్జాతీయంగా లోతైన బంధాలను పెంపొందించుకోవడం ద్వారా మానవాళికి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగుదాం’ అని పిలుపునిచ్చారు. మెరుగైన భారతదేశం కోసం ముందుకు సాగుదాం.. సీపీఐ జాతీయ మహాసభలకు సౌహార్థ్ర ప్రతినిధులుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు దేవరాజన్ హాజరై సందేశాలు ఇచ్చారు. ఏచూరి మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు మేలు చేసే మెరుగైన భారతదేశం కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల ఫాసిస్ట్ చర్యలను తిప్పికొట్టేందుకు కార్మికులు, రైతులు, కూలీలను సమన్వయం చేసుకుని ఐక్య ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక విపత్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు శక్తివంతమైన, లోతైన ప్రజాస్వామ్య పునాదుల ఆధారంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. దేవరాజన్ మాట్లాడుతూ దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల పునరేకీకరణ బాధ్యతను సీపీఐ, సీపీఎం తీసుకోవాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆహ్వాన సంఘం తరఫున ప్రతినిధులకు స్వాగతం పలికి సందేశం ఇచ్చారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నేతలు పి.మధు, వి.శ్రీనివాసరావు, వివిధ రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని సురవరం సుధాకర్రెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాన్ని సీపీఐ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోంది
బెంగళూరు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ భళ్లారిలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్దాంతం దేశాన్ని విడదీస్తోందని వేల మంది భావిస్తున్నారని, అందుకే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయత్రకు భారత్ జోడో(దేశాన్ని ఏకం చేయడం) పేరు పెట్టినట్లు రాహుల్ చెప్పారు. భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 3500కిలోమీటర్లకు పైగా 150 రోజులపాటు సాగనున్న ఈ యాత్ర కశ్మీర్లో ముగియనుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ ఈ యాత్రకు నడుం బిగించారు. ప్రస్తుతం 1,000 కిలోమీటర్లు పూర్తయింది. కర్ణాటక బళ్లారిలో కొనసాగుతోంది. చదవండి: ‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ -
Bharat Jodo Yatra: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం
సాక్షి, బళ్లారి/చిత్రదుర్గ: కర్ణాటక ప్రజలపై, కన్నడ భాషపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన గురువారం కర్నాటకలోని మొళకాల్మూరులో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల్లో భాగంగానే కన్నడ భాషపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. కన్నడ ప్రజల, భాష జోలికి రావొద్దన్నారు. అవి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. రాహుల్ యాత్ర శుక్రవారం ఉదయం బళ్లారి జిల్లాలోకి ప్రవేశించనుంది. -
RSS చీఫ్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు : ఎంపీ లక్ష్మణ్
-
ఆరెస్సెస్ చరిత్రలోనే తొలిసారిగా.. ఎవరామె?
నాగ్పూర్: తన సంప్రదాయంలో మార్పును సూచిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ పని చేసింది. పర్వతారోహ దిగ్గజం సంతోష్ యాదవ్ రూపంలో ఒక మహిళను బుధవారం జరిగిన RSS విజయదశమి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో నాగ్పూర్లో ఈ ఈవెంట్ జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన ప్రపంచంలోనే తొలి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు సంతోష్ యాదవ్. ఈ సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడుతూ.. అన్ని ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని సూచించారు. ‘‘స్త్రీని తల్లిగా భావించడం మంచిది. కానీ, తలుపులు బంధించి వాళ్లను పరిమితం చేయడం మంచిది కాదు. అన్ని చోట్లా నిర్ణయాలు తీసుకునేలా మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారాయన. ఒక మగవాడు చేయలేని పనులను చేయగలిగే సామర్థ్యం స్త్రీ శక్తికి ఉంది. అందువల్ల వాళ్లకు సాధికారత కల్పించడం, పని చేసే స్వేచ్ఛను ఇవ్వడం, పనిలో సమాన భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం” అని ఆయన అన్నారు. శాంతికి పునాది శక్తి. మహిళా ముఖ్య అతిథి హాజరు గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నాం అని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తెలిపారు. ఆరెస్సెస్ సీనియర్ కార్యకర్త దత్తాత్రేయ హోసబలే సంఘీ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడంపై ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆరెస్సెస్ అంటే మగవాళ్లకు మాత్రమే అని ముద్ర చెరిపేయాలని ఆయన కోరారట. ఈ తరుణంలో ఆయన అభ్యర్థనను పరిశీలనలకు తీసుకుని.. ఇప్పుడు సంతోష్ యాదవ్ను ఇలా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సంతోష్ యాదవ్.. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించారు. పర్వతారోహణలో ఆమె ఒక దిగ్గజం. ఎవరెస్ట్ పర్వతాన్ని రెండుసార్లు (1992, 1993లో) అధిరోహించిన తొలి మహిళగా ఈమె పేరిట ఒక రికార్డు ఉంది. అంతేకాదు కఠినమైన కాంగ్షుంగ్ ముఖం నుండి ఈమె ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఆమె పోరాటం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె ధైర్యసాహసాలు, ఇతరులకు సహాయం చేసే ఆమె మంచి మనసు కూడా చర్చించుకునే అంశమే. డిగ్రీ చదివే రోజుల్లో తన హాస్టల్ రూం నుంచి ఆరావళి పర్వతాలను అధిరోహిస్తున్న పర్వతారోహకులను చూసి ఆమె స్ఫూర్తిని పొందారు. 1992లో.. తన తోటి పర్వతారోహకుడైన మోహన్ సింగ్తో ఆక్సిజన్ను పంచుకోవడం ద్వారా ఆమె ఆయన ప్రాణాలను కాపాడగలిగారు. ఎవరెస్ట్ను అధిరోహించేనాటికి ఆమె వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతిచిన్న వయసులో ఎవరెస్ట్ సాహసం చేసిన ఘనత కూడా ఆమెదే. 2013లో మాలవత్ పూర్ణ పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్ను అధిరోహించే వరకు ఆ రికార్డు సంతోష్ యాదవ్ పేరిట పదిలంగా ఉండిపోయింది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం సంతోష్ యాదవ్ను పద్మ శ్రీ పురస్కారం అందించి గౌరవించింది. -
నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీ
-
Bharat Jodo Yatra: మహిళలను వస్తువుల్లా... చూస్తున్న బీజేపీ
మలప్పురం: మహిళలను ఒక వస్తువుగా చూసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల భావజాలం ఉత్తరాఖండ్లో రిసెప్షనిస్ట్ హత్య ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర 20వ రోజు మంగళవారం మలప్పురం జిల్లాలో ప్రవేశించింది. తచ్చింగనాదం హైస్కూల్ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అంకితకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్యోదంతంతో బీజేపీ నేత కుమారుడికి సంబంధముందన్న ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘చెప్పినట్లు వినలేదనే అంకితను చంపేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవమిదే. ఆర్ఎస్ఎస్, బీజేపీ మహిళలను వస్తువులుగా రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. మహిళలను గౌరవించని, సాధికారిత కల్పించని దేశం ఏమీ సాధించలేదు’ అని ఆయన అన్నారు. ‘బీజేపీ నాయకులకు కావాల్సింది అధికారం. అధికారం దక్కాక, దానిని నిలుపుకునేందుకు ఏదైనా చేస్తారు. ఆ క్రమంలోనే అంకిత హత్యకు గురైంది’అని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళలను చిన్నచూపు చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమనే హెచ్చరికను బీజేపీకి పంపాలని కోరారు. ‘జస్టిస్ ఫర్ అంకిత, జస్టిస్ ఫర్ ఇండియన్ ఉమెన్, బీజేపీ సే బేటీ బచావో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. -
ఢిల్లీలో మసీదును సందర్శించిన RSS చీఫ్
-
లైట్ తీసుకుందాం! మనం నిక్కర్ నుండి ప్యాంటులోకి వచ్చి చాలా కాలమయింది!
లైట్ తీసుకుందాం! మనం నిక్కర్ నుండి ప్యాంటులోకి వచ్చి చాలా కాలమయింది! -
కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్ఎస్ఎస్-బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్ను జత చేసింది. To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS. Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2 — Congress (@INCIndia) September 12, 2022 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. మీరు దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు. బెంగళూరు ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వీ సూర్య.. ఈ ఫోటో కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ రాజేసిన నిప్పు 1984లో ఢిల్లీని తగలబెట్టింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవదహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసనే ప్రేరెేపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... రాజ్యాంగంపై నమ్మకంతో కాంగ్రెస్ రాజకీయపార్టీగా నిలిచిపోయింది. గతంలో కాంగ్రెస్ రాజేసిన అగ్గి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయేలా చేసింది. ఇక అధికారం మిగిలున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది' అని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,570కిలోమీటర్లు సాగనుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు -
కచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం
న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు. పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు. తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు. (చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్) -
ఆరెస్సెస్కు సపోర్టుగా దీదీ వ్యాఖ్యలు.. ఒవైసీ గరం!
బెంగాల్ రాజకీయాలు అనగానే బీజేపీ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో సీఎం మమత.. ఆరెస్సెస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మమతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఆరెస్సెస్పై మాట్లాడుతూ గతంలో ఉన్నంత చెడ్డగా లేదని అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసద్ స్పందిస్తూ.. ఆరెస్సెస్ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందన్నారు. ఆరెస్సెస్ చరిత్రంతా ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తుందన్నారు. ఆరెస్సెస్పై వ్యాఖ్యలపై మమతా బెనర్జీ నిజాయితీని, నిలకడ ధోరణిని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమత 2003లో ఆరెస్సెస్పై చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. 2003లో ఆరెస్సెస్ను దేశభక్తులుగా కీర్తించారని, ఆరెస్సెస్లో ఇప్పటికీ చాలా మంది మంచివారున్నారని, వారు బీజేపీకి మద్దతివ్వబోరని మమత చెప్పినట్టు ఒవైసీ తెలిపారు. దీంతో, ఆరెస్సెస్ మమతా బెనర్జీని దుర్గగా అభివర్ణించారని చెప్పుకొచ్చారు. ఇక, మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేషనన్ చీఫ్ మహ్మద్ యాహ్య కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మమతా బెనర్జీని సెక్యులర్ నేతగా భావిస్తున్నరని తెలిపారు. కానీ, అనూహ్యంగా ఆమె ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. In 2003 too Mamata had called RSS “patriots”. In turn RSS had called her “Durga”. RSS wants Hindu Rashtra. Its history is full of anti-Muslim hate crime. She’d defended BJP govt in Parliament after Gujarat pogrom. Hope TMC’s “Muslim faces” praise her for her honesty & consistency https://t.co/45LKZ7aI4s — Asaduddin Owaisi (@asadowaisi) September 1, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ హై కమాండ్కు రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే? -
కర్ణాటక సీఎం అసమర్థుడు.. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసమర్థుడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఎన్నుకోలేదని ఆరోపించారు. మైసూరులో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన లేవని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ మంత్రి మధుస్వామే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం 40శాతం కమీషన్ అడుగుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సమాఖ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. మంత్రి మధుస్వామి టెలిఫోనిక్ సంభాషణ ఇటీవలే లీకైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఏదో తామే అలా నెట్టుకొట్టుస్తున్నామని ఆయన అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చదవండి: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ -
ఆరెస్సెస్పై త్వరలో సినిమా: విజయేంద్ర ప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్మాధవ్ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్’ పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో మంగళవారం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్ఎస్ఎస్పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు. ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్ -
భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!
నేటితో భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్ స్వరాజ్’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. భారత్ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది. కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. డా. మోహన్ భాగవత్ వ్యాసకర్త సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్లో జాతీయ జెండాను ఉంచింది. -
అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు అది ఒక జ్ఞాపకమేనన్నారు. భారత్లో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని స్వతంత్ర సంస్థలను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దీనికి ముందు ఢిల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. భారత్ నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్దంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు. చదవండి: జుమ్లానామిక్స్ను దాచలేరు.. నిర్మలవి అసత్యాలు.. -
ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై బాంబు దాడి.. లైవ్ వీడియో
కన్నూర్: కేరళ పయ్యనూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది. #WATCH केरल: कन्नूर जिले के पय्यानुर में RSS कार्यालय पर बम फेंका गया। पय्यान्नूर पुलिस के अनुसार घटना आज सुबह हुई है। घटना में इमारत की खिड़की के शीशे टूटे। pic.twitter.com/Ii2uQRDif1 — ANI_HindiNews (@AHindinews) July 12, 2022 బాంబు దాడి జరిగిన సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మూసి ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. 'కన్నూర్ జిల్లా, పయ్యనూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి.' అని పయ్యనూర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. దాడి జరిగిన ఆర్ఎస్ఎస్ ఆఫీసు స్థానిక పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉండటం గమనార్హం. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత పెంచారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దాడి వెనుక సీపీఎం: బీజేపీ బాంబు దాడి వెనుక సీపీఎం పాత్ర ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. 'ఈ దాడిలో సీపీఎం పాత్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బహిర్గతమైన తర్వాత అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తోంది.' అని బీజేపీ కన్నూర్ జిల్లా అధ్యక్షుడు ఎన్ హరిస్దాసన్ పేర్కొన్నారు. ఇదీ చూడండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు. హింస ద్వారా సత్యం మరణించలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే పెద్ద ఆనందం, గర్వం ఏముంటుందని అన్నారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని భగవత్ పేర్కొన్నారు. ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్ చవాన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్రెడ్డి, శేఖర్, రాజేందర్రెడ్డి, శంకర్, నిధి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. -
సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపితమై నూరేళ్లకు చేరువవుతోంది. అప్పటి నుంచీ అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తూనే ఉంది. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. ‘దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో స్వయంసేవక్ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపన జరిగి 100 సంవత్సరా లకు చేరువ అవుతున్నది. 1925లో నాగపూర్లో సంఘ్ స్థాపన జరిగింది. ఈ సంవత్సరం విజయదశమి నాటికి సంఘ్ ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. కార్యకర్తల కృషి, త్యాగం, బలి దానాల ఫలితంగా... అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్ గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్ తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది. నిజానికి సంఘ్ శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచన లేదు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దృష్టి చాలా స్పష్టమైనది. సంఘ్ సమాజంలో ఒక సంస్థ మాత్రమే కాదు, యావత్ సమాజాన్ని సంఘటితం చేసేది. సంఘ్ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్ సాధనను సమాజమంతటా విస్తరింపజేయడం లక్ష్యంగా ఉండాలి. సంఘ్ రజ తోత్సవం సైతం జరుపుకోరాదని హెడ్గేవార్ చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తి యుక్తులతో నిమగ్నమయ్యారు. కానీ వారికి కేవలం 15 సంవత్సరాల సమయం మాత్రమే లభించింది. కనుక శతాబ్ది సంవత్సరానికి ముందే సంఘ్ కార్యాన్ని పూర్తి చేయడమే లక్ష్యమై ఉండాలి. సంఘ్ కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్ స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశగా భావిం చాలి. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో కేవలం ‘సంఘటన’పై మాత్రమే దృష్టి పెట్టింది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటి తమవుతుంది; ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్ గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదు గొల్పడం అప్పుడు ముఖ్యం. అందుకనే ఆ లక్ష్యం కోసమే యావత్ కార్యం సాగింది. ‘స్వ’ ప్రేరణగా కొనసాగిన స్వరాజ్య ఉద్యమం ఆధారంగా... విద్య, విద్యార్థి, రాజకీయం, కార్మికులు, వనవాసీ సమాజం, వ్యవసాయం తదితర రంగాల్లో భారతదేశపు శాశ్వతమైన జాతీయ దృక్పథానికి ప్రభావితమై వివిధ సంస్థలు ఆవిర్భవించాయి. నేడు సంఘ్ కార్యకలాపాలు ‘శాఖ’ రూపంలో 90 శాతం బ్లాకులకు చేరుకున్నాయి. 35కు పైగా సంస్థలు సమాజ జీవనానికి చెందిన వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నాయి. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్ హెడ్గేవార్ జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభ మైంది. యావత్ సమాజం ఆత్మీయత, ప్రేమ ప్రాతిపదికన సంఘ టితం కావాలి. అందుకు సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించాలి; వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో ‘సేవా విభాగ్’ ఆరంభమయ్యింది. ‘దేశపు సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో స్వయంసేవక్ను అయ్యాను’ అనే ప్రతిజ్ఞను స్వయంసేవక్ చేస్తారు. ఈ సర్వతోముఖాభివృద్ధి కార్యాన్ని కేవలం స్వయంసేవక్లు మాత్రమే చేయడం లేదు; వారితో మాత్రమే అది సాధ్యం కాదు; సమాజంలోని అనేక మంది ప్రభావశీలురు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించేవారు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. సమా జంలో అలాంటి ప్రభావశీలుర లక్షణాలు, వారి క్రియాశీలత లాంటి సమాచార సేకరణకు... సంఘ్ భావజాలం, కార్య కలాపాల గురిం చిన సమాచారాన్ని వారికి చేరవేసే దిశగా 1994లో ‘సంపర్క్ విభాగ్’ ఆరంభమైంది. సంఘ్లో సభ్యులు కాకున్నా కొన్ని విషయాల్లోనైనా మాతో సారూప్యం ఉన్నవారిని కలిసి ఆలోచనలను పంచుకుంటాం. 2008–09 మధ్యకాలంలో ‘గో–గ్రామ యాత్ర’ మొదలైనప్పుడు అనేక ప్రాంతాల్లోని సర్వోదయ కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. అన్ని విషయాల్లోనూ సంఘ్ భావజాలం, దృక్పథంతో ఏకీభవించక పోయినా అంశాలవారీగా సంఘ్ కార్యకలాపాల్లో పాలుపంచు కుంటున్నారు. అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్ జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం, సంఘ్కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, సంఘ్ సత్ కార్యాలను సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో 1994లో ‘ప్రచార్ విభాగ్’ ఆరంభమయ్యింది. సంఘ్కు చెందిన ఈ మూడు విభాగాలూ (సేవ, సంపర్క్, ప్రచార్) సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్ను చేర్చడం ద్వారా సమాజాన్ని మేల్కొ లిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో ‘ధర్మజాగరణ్ విభాగ్’ ద్వారా హిందూ సమాజాన్ని వేరే మతంలోకి మార్చడాన్ని అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి తీసుకు రావడానికీ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా తమ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ‘గ్రామ్–వికాస్’ కార్యక్రమం కూడా ఆరంభమైంది. ఏకత్వంతో కూడుకున్న హిందూ సమాజం వివిధ కులాలుగా మనుగడ సాగిస్తున్నందున... వారిలో అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశ్యంతో ‘సామాజిక్ సద్భావ్’ పేరిట వరుస సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ తిరస్కరణకు గురయ్యాయి. ఇది చాలా అన్యాయమైనది. ఈ అన్యాయాన్ని నివారించి, అందరినీ కలిసి కట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘సామాజిక్ సమరసత’ పని మొదలైంది. భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్ధనతోపాటూ ఆవు పేడ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతుల శిక్షణ, పర్యవేక్షణ కోసం ‘గోసేవ–గోసంవర్ధన్’ కార్యక్రమం కూడా విజయ వంతంగా సాగుతున్నది. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ‘నేను నుంచి మనం వరకు సాగించే ప్రయాణంలో’ కుటుంబానిది తొలి అడుగు అవుతుంది. వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సంస్కృతి వారత్వాలు, సామాజిక పరిస్థితులను జాతీయ దృక్కోణంలో విశ్లేషించుకుని... తమ కర్తవ్యాన్ని నిర్ణయిం చుకోవడానికి సహకరించే ‘కుటుంబ్ ప్రబోధన్‘ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రజల భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడం ద్వారా దెబ్బ తిన్న ప్రకృతి సంతులతను పునరుద్ధరించడానికి ‘పర్యావరణ్ సంర క్షణ్’ కార్యక్రమం ప్రారంభమైంది. స్వయంసేవక్లు ఈ పనులన్నిం టినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం. ప్రస్తుతం సంఘ్ కార్యకలాపాల అభివృద్ధి యాత్ర నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయం సేవక్... సంఘ్ కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్ సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించడమైనది. ప్రస్తుతం ప్రతి ఒక్క స్వయంసేవక్ సమాజ పరివర్తనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి. వీటన్నింటి ద్వారా సంఘ్ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతూ సంఘ్ కార్యాన్ని సంపూర్ణత్వం వైపుకు తీసుకువెళ్ళడమే శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఉపకరించే ఉత్తమ మార్గం అవుతుంది. వ్యాసకర్త సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్ -
ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా: గడ్కరీ
పుణే: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన ఓ ఘటనను మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ఆరెస్సెస్పై వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతి సమాధానం ఇచ్చి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నా. ఔరంగాబాద్లో ఆరెస్సెస్ చీఫ్, దివంగత కేబీ హెగ్డేవార్ పేరు మీద ఓ ఆస్పత్రిని ప్రారంభించాం. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించాం. సంతోషంగా ఆయన వచ్చారు. అయితే కార్యక్రమం మొదలయ్యే టైంలో.. ఈ ఆస్పత్రి కేవలం హిందూ కమ్యూనిటీ కోసమేనా? అని అడిగారు, ఎందుకలా అడిగారు? అని నేను అన్నాను. దానికి ఆయన.. ఇది ఆరెస్సెస్ వాళ్లకు చెందింది కదా అన్నారు. అప్పుడు నేను ఇది అన్నీ కమ్యూనిటీలకు చెందిన ఆస్పత్రి అని, ఆరెస్సెస్కు అలాంటి వివక్ష ఏం ఉండదని చెప్పారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఈ విషయమై చాలాసేపు సంభాషణ జరిగింది. చివరికి నా వివరణతో ఆయన సంతోషించారు అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆరెస్సెస్ ఇప్పటికీ అలాంటి వివక్షకు దూరంగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం పుణేలో అప్లా ఘర్ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గడ్కరీ పై ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపైనా సంఘీభావం వ్యక్తం చేసిన ఆయన.. ఆరోగ్య, విద్యా రంగాల్లో వాళ్లకు అందుతున్న వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గడ్కరీ. -
టాటా గ్రూప్కి షాక్ ! ఊహించని మలుపు తీసుకున్న సీఈవో నియామకం
టాటా గ్రూపుకి ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది, సుమారు డెబ్బై ఏళ్ల తర్వాత సొంతం చేసుకున్న ఎయిండియాను గాడిన పెట్టే క్రమంలో తీసుకున్న తొలి పెద్ద నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయ ఎత్తుడగల కారణంగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎయిండియాను ఇటీవల సొంతం చేసుకుంది టాటా గ్రూపు. ఎయిరిండియాను తిరిగి గాడిన పెట్టేందుకు టర్కీష్ ఎయిర్లైన్స్కి సీఈవోగా పని చేస్తున్న టర్కీ జాతీయుడు ఇల్కర్ ఆయ్సీని సీఈవోగా నియమించాలని నిర్ణయించింది. 2014లో టర్కీష్ ఎయిర్లైన్స్లో చేరిన ఆయ్సీ 2022 జనవరి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఏప్రిల్ 1 నుంచి ఎయిరిండియా సీఈవోగా పదవీ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. ఎయిరిండియా లాంటి సంస్థకు విదేశీ వ్యక్తిని సీఈవోగా నియమించడంపై ఆర్ఎస్ఎస్కి చెందిన సద్వేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నియమకాన్ని తప్పు పడుతూ విమర్శలు ఎక్కుపెట్టింది. దీంతో ఒక్కసారిగా టాటా సీఈవో నియామకం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కంగుతున్న ఇల్కర్ ఆయ్సీ టాటా సీఈవో పదవిని చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్టు ప్రకటించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కి సన్నిహితుడిగా పేరుంది. మరోవైపు మన కంపెనీలకు విదేశీ వ్యక్తులను సీఈవోగా నియమించే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేసన్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఐయ్సీని నియమించబోతున్న వార్తలు వెలువడగానే రాజకీయ దుమారం రేగడంతో మిగిలిన ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా ఈ అంశంపై టాటాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చదవండి: ఎయిర్ ఇండియా సీఈఓను వెంటనే తొలిగించాలి: ఆర్ఎస్ఎస్ -
ఎయిర్ ఇండియా సీఈఓను వెంటనే తొలిగించాలి: ఆర్ఎస్ఎస్
గత కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్'గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఉన్న ఇల్కర్ ఐసీని తన బ్యాగ్ గ్రౌండ్ చెకింగ్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా సీఈఓగా ఐసీని నియమించింది. ఆర్ఎస్ఎస్ ప్రకటనపై టాటా గ్రూప్ కూడా స్పందించలేదు. స్వదేశీ జాగరణ్ మంచ్ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ మాట్లాడుతూ.. టర్కీ భారత ప్రత్యర్థి పాకిస్తాన్ పట్ల సానుభూతితో ఉన్నందున ఐసీ నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించరాదని అన్నారు. భారతదేశంలో ఒక విమానయాన సంస్థకు సీఈఓగా విదేశీ జాతీయుడి నియమించడానికి ముందు ప్రభుత్వ క్లియరెన్స్ అవసరం అని ఆయన అన్నారు. (చదవండి: ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!) -
కేంద్ర పథకాలకు మార్గదర్శి
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు. దీనదయాళ్ ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖలో చేరారు, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేరణతో 1951లో రాజకీయ క్షేత్రం భారతీయ జనసంఘ్లో ప్రచారకులుగా చేరారు. ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. అఖిలభారత అధ్యక్షులుగా పట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన దయాళ్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద శవమై పడి ఉన్నారు. ఆయన మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు. దీనదయాళ్ అందించిన ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్ హ్యూమనిజం) అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని బీజేపీ తన రాజకీయ తాత్విక సిద్ధాంతంగా పేర్కొంటుంది. దీన దయాళ్ తన ఏకాత్మ మానవ దర్శనంలో ఈ దేశం అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక ఏదైనా... అది దేశానుగుణం, కాలానుగుణమై ఉండాలని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీ కరణను; ప్రభుత్వ రంగంతో పాటు ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం ప్రాధాన్యం కూడా గుర్తించాలనీ, దేశంలో ప్రతి వ్యక్తీ ఉపాధి పొందాలనీ, తద్వారా ఉత్పత్తికి దోహదపడాలనీ వారు కోరుకున్నారు. భారీ పరిశ్రమలు వద్దన్నారు. కుటీర పరిశ్రమలే కావాలన్నారు. లోటు బడ్జెట్, ద్రవ్యోల్బణాలకు ప్రభుత్వం చేసే అధిక ఖర్చు కారణమని చెప్పి... పొదు పును ప్రోత్సహించారు. ఆర్థిక అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేయకూడదనీ, ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలనీ అన్నారు. (చదవండి: శతవసంత స్వరమాధురి) ఈ సిద్ధాంతం ఆధారంగానే... దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, ప్రధాని ఆవాస్ యోజన, గ్రామ జ్యోతి యోజన, కౌశల్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, ఆత్మనిర్బర్ భారత్ వంటి అనేక పథకాలతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ వంటి నినాదాలతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనదయాళ్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి! – శ్రీశైలం వీరమల్ల, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు (ఫిబ్రవరి 11న దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి) -
విద్వేష ప్రసంగాలను ఖండించాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఇటీవల జరిగిన ఓ ధర్మ సంసద్లో మైనారిటీలపై జరిగాయంటున్న విద్వేష ప్రసంగాలను ఆరెస్సెస్ ఖండించింది. అలాంటి విడదీసే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని ఆరెస్సెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇంద్రేశ్ కుమార్ బుధవారం అన్నారు. మహాత్మాగాంధీని ఓ హిందూత్వవాది కాల్చి చంపాడన్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కామెంట్లూ విద్వేష ప్రసంగం కిందకే వస్తాయన్నారు. సంఘ్ అనుబంధ సంస్థలైన ముస్లిం, క్రిస్టియన్ రాష్ట్రీయ మంచ్లకు ఇంద్రేశే వ్యవస్థాపకుడు. -
యోగి కోసం.. రంగంలోకి ఫుల్టైమ్ సంఘ్ కార్యకర్తలు
కంచర్ల యాదగిరిరెడ్డి (ముజఫర్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): యోగి ఆదిత్యనాథ్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమొక్కటే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉత్తరప్రదేశ్లో తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సాగిస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర బహిరంగంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కాకమునుపు సంఘ్ ఫుల్ టైమర్ అయిన యోగి కోసం దాదాపు 2,500 మంది ఆర్ఎస్ఎస్ ఫుల్టైమ్ కార్యకర్తలు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం నిర్విరామంగా పని చేస్తున్నారు. ముగ్గరు ప్రచారక్లు శివ ప్రకాశ్, కీలకనేత బిఎల్ సంతోష్ (సంఘ్ నుంచి డిప్యుటేషన్పై బీజేపీకి వచ్చి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు) విష్ణుదత్ శర్మ బీజేపీ విజయం కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. (చదవండి: మాయవతి మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!) వీరిలో శివప్రకాశ్కు పశ్చిమ యూపీపై మంచి పట్టు ఉంది. గడచిన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనే ఆయన ఈ ప్రాంతంలో బీజేపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. గతంలో చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోయే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇప్పుడు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తూ యోగి ఆదిత్యనాధ్ సర్కారు గడచిన ఐదేళ్లలో సాగించిన అభివృద్ధిని వివరిస్తున్నాయి. కరడుగట్టిన కాషాయనేత మధుర, ఇటావా, మెయిన్పురి, ఆగ్రా, ఫిరోజాబాద్, హాత్రస్, మీరట్, ముజఫర్నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్కు తోడు దాని ఉప శాఖ అయిన థర్మ్ జాగరణ్ సమితి వంటివి బీజేపీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. ‘మేము బీజేపీ విజయాన్ని మాత్రమే కోరుకోవడం లేదు. ఈ దేశహితాన్ని కోరుకుని ముందుకు వెడుతున్నాము’అని ప్రచారక్ మహేంద్ర కుమార్ ఈ ప్రతినిధితో అన్నారు. పశ్చిమ యూపీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. ఘర్ వాపసీ పేరుతో రాజేశ్వర్ సింగ్ కొన్ని సంవత్సరాల పాటు రీ కన్వర్షన్ (తిరిగి మతంలోకి రావడం) వంటి కార్యకలాపాలు చేపట్టారు. ఘర్ వాపసీ సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల వల్ల చివరకు ప్రధానమంత్రి మోడి, ముఖ్యమంత్రి యోగి సైతం రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. (చదవండి: కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!) ఒక దశలో ఆర్ఎస్ఎస్ నాయకత్వం రాజేశ్వర్ సింగ్ ను బలవంతంగా అజ్ఞాతంలోకి పంపించాల్సి వచ్చింది. అయినా ఇక్కడి కరుడుగట్టిన హిందూత్వ వాదులు రాజేశ్వర్ సింగ్ ను గట్టిగా సమర్థిస్తున్నారు. ‘ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయన చర్యలు ఒకరకంగా బీజేపీకి బాగా తోడ్పడుతున్నాయి’ అని ఘజియాబాద్కు చెందిన మోటార్ మెకానిక్ సుందర్ సింగ్ తివారీ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ చర్యలు ముస్లింలకు మరింత కోపాన్ని తెస్తున్నాయని, వారు గంప గుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలన్న నిర్ణయానికి వచ్చేలా చేస్తున్నాయని మండిపడుతున్న బీజేపీ నేతలూ ఉన్నారు. (చదవండి: యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ) -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రతీది పక్కాగా
రాజకీయ పార్టీలు అన్నాక... రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అధినేత/ అధినాయకురాలి చరిష్మా పైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దానికి భిన్నం. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి అంకితభావంతో పనిచేయడం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో టచ్లో ఉండటం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అండదండలు... మొత్తం మీద బీజేపీ ఓ బడా కార్పొరేట్ కంపెనీలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తుంది. అమిత్ షా అధ్యక్షుడిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలో (జులై 9, 2014 నుంచి జనవరి 20, 2020 వరకు) ఈ కార్పొరేటీకరణను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ పార్టీ నిర్మాణం... వారి బలాలేమిటో చూద్దాం. సోషల్ మీడియానే ఆయుధం 18 కోట్ల పైచిలుకు సభ్యులతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధానిగా మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి... తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో కాషాయదళం సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్ ఉంది. వృత్తులు, ఆసక్తుల ఆధారంగా వీరిని విభజించింది. దీని కోసం సాఫ్ట్వేర్ను వాడింది. క్షేత్రస్థాయిలో వీరిని క్రియాశీలం చేసింది. బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వారికి దిశానిర్దేశం జరుగుతుంది. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలను... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పైకి తెలుస్తుంటాయి. దాంతో ఆ బూత్ స్థాయిలో దిద్దుబాటు చర్యలు, అదనపు శ్రమ పెట్టడం... వంటివి స్థానిక బాధ్యులు చేస్తుంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు... ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును మానవవనరుల విభాగం (హెచ్ఆర్ డిపార్ట్మెంట్) అంచనా వేసినట్లే... చాలా పక్కాగా ఈ ఏర్పాటు ఉంటుంది. 8,000 మంది చురుకైన పూర్తి సమయపు కార్యకర్తలను... ‘పూర్ణకాలిక్ విస్తారక్స్ (పూర్తి సమయం కేటాయించి పార్టీని విస్తరించడం వీరి ముఖ్య విధి)’ను కమలదళం నియమించింది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని... 800 విస్తారక్లను ఒక్క ఉత్తరప్రదేశ్లోనే మోహరించింది. ఉత్తరాఖండ్కు 120 మందిని, గోవా, పంజాబ్లకు వందేసి మంది విస్తారక్లను పంపింది. ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ. ప్రతి పేజీకో... పన్నా ప్రముఖ్ దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్ బూత్లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జి (పన్నా ప్రముఖ్)ను నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా ప్రముఖ్ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున ‘పన్నా సమితు’లను వేయాలని బీజేపీ నిర్ణయించింది. సంక్షేమ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్, నోట్ల రద్దు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, కోవిడ్ కాలంలో అదనపు రేషన్, ఆయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం... తదితర అంశాలను ప్రజల్లోకి ఈ పన్నా సమితులు, పన్నా ప్రముఖ్లు తీసుకెళతారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా... దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను చేపట్టింది. అలాగే సీఎం, పీఎంగా మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘సేవా హి సంఘటన్’ క్యాంపెయిన్ను చేపట్టింది. అలాగే ఎన్నికలు సమీపించిన తరుణంలో కొద్దిరోజుల కిందట జన ఆశీర్వాద్ యాత్రలు చేపట్టింది. ఎన్నికలు వచ్చినపుడే ఇతర రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్ మీడియాలో భావజాల వ్యాప్తి, బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ... నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్, అమలు పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి అబ్బాయి. సంస్థ కోసం సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలిగతిరిగే నాయకులు, ప్రచారక్లు ఎందరో బీజేపీకి ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ... భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
దేశ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ అసలైన దేశ వ్యతిరేకి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కేంద్రం రిమోట్ కంట్రోల్ తమ చేతిలో లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారని, కానీ రిమోట్ అవసరం లేకుండా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మతరాజ్యంగా మార్చే ప్రమాదముందని హెచ్చరించారు. బీజేపీ రాజ్ నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు యువత భగత్సింగ్, చేగువేరా లాంటి విప్లవ కిశోరాల్లాగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 16వ జాతీయ మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్లో జరిగిన బహిరంగ సభకు రాజా ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమంలో ఎక్కడున్నాయ్? బ్రిటిష్ పాలనను కూలదోసేందుకు స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాడారని రాజా గుర్తు చేశారు. ఇప్పుడు గొప్ప దేశభక్తులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీలు నాటి స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బ్రిటిష్ వారితో చేతులు కలిపిన ఆర్ఎస్ఎస్కు అసలు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాత్రే లేదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని.. అచ్చే దిన్ అదానీ, అంబానీలకే వచ్చాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వారికే కట్టబెడుతున్నారని.. దేశ సంపద, ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఏం మిగలుతుందని ప్రశ్నించారు. సభలో సీపీఐ రాజ్యసభ సభ్యులు బినొయ్ విశ్వం, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. -
క్రిప్టో కరెన్సీపై ఆర్ఎస్ఎస్ శాఖ కీలక వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుండగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంఛ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అసెట్ క్లాస్ క్రిప్టో కరెన్సీని చట్ట బద్దంగా గుర్తించాలంటూ స్వదేశీ జాగరణ్ మంఛ్ కో కన్వీనర్ అశ్వినీ మహాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీపై ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తోన్న క్రిప్టో ఎక్సేంజీలలో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిపై ప్రభుత్వాల నిర్వాహణ ఉండటం లేదు. ఇందులో పెట్టుబడిగా వస్తున్న కరెన్సీ ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఇలా జరగడం ఎవరికీ మంచింది కాదు. కాబట్టి ప్రభుత్వాలు అస్సెట్ క్లాస్గా క్రిప్టో కరెన్సీని గుర్తించాలి. ఆ తర్వాత నియంత్రణను చట్టపరమైన విధానాలు రూపొందించాలి’ అని పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.బంగారంతో సమానం కాదు క్రిప్టో కరెన్సీని అసెట్ క్లాస్గా గుర్తించాలని చెప్పిన మహాజన్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసెట్ క్లాస్తో ఉన్న బంగారంతో క్రిప్టో కరెన్సీ సమానం కాదన్నారు. బంగారం తరహాలో క్రిప్టో కరెన్సీకి ఇంట్రిన్సిక్ వ్యాల్యూ (అంతర్గత విలువ) లేదన్నారు. క్రిప్టో కరెన్సీలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, వాటిని ఎవరూ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు. అలా కొన్నవారు ఆ కరెన్నీతో ఏం చేస్తున్నారో తెలియక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తలోమాట క్రిప్టో కరెన్సీకి చట్ట బద్దత కల్పించే విషయంపై ఇటీవల జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఇందులో అధికార పక్షం క్రిప్టోకు మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్ క్రిప్టోను నిషేధించాలని కోరింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ సైతం క్రిప్టోతో ఇబ్బందులు వస్తాయన్నట్టుగా మాట్లాడారు. కాగా తాజాగా స్వదేశీ జాగరణ్ మంఛ్ తరఫున అభిప్రాయం వ్యక్తం అయ్యింది. చదవండి:క్రిప్టోలతో మనీలాండరింగ్ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆందోళన -
Mohan Bhagwat: 80 శాతం నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవి
నాగ్పూర్: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్కు కేటాయించిన నిధుల్లో 80 శాతం రాజకీయ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, కాశ్మీర్ లోయ కోసం కేటాయించిన 80 శాతం నిధులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. కేటాయించిన నిధులు ప్రజలకు చేరలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా పొందుతున్నారని తెలిపారు. తాను జమ్మూ కాశ్మీర్ను సందర్శించి ప్రస్తుత అక్కడ ఉన్న పరిస్థితిని చూశానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. గతంలో జమ్మూ, లడఖ్పై తీవ్రమైన వివక్ష ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి వివక్ష లేదని పేర్కొన్నారు. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను అందించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
భారత్లో ‘కుట్ర’ ఆరోపణలు.. అమెజాన్ రియాక్షన్ ఇది
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాల ద్వారా భారత్లో విదేశీ కుట్రకు పాల్పడుతోందన్న ఆరోపణలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరెస్సెస్కు చెందిన ‘పాంచ్జన్య’లో అమెజాన్ను ‘ఈస్టిండియా కంపెనీ 2.0’తో పోలుస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ కథనానికి అమెజాన్ కౌంటర్ ఇచ్చింది. ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ అనే హెడ్డింగ్తో అమెజాన్కు వ్యతిరేకంగా ఈమధ్య ఓ కథనాన్ని ప్రచురించింది పాంచ్జన్య. అందులో.. ‘‘భారత మార్కెట్లో పైచేయి కోసం అమెజాన్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నిరకాలు స్వేచ్ఛలను, భారతీయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. తమ అనుకూలత కోసం ఓ మెట్టుదిగజారి అవినీతికి సైతం పాల్పడుతోంది. వీటికి తోడు ప్రైమ్ వీడియోల ద్వారా సంప్రదాయాల్ని నాశనం చేస్తోంది. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ ఎలాగైతే భారత్ను దోచుకుందో.. ఇప్పుడు అదేవిధంగా జాతి సంపదను కొల్లగొడుతూ అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీని తలపిస్తోంది’’ అని ఆరోపించింది పాంచ్జన్య. అయితే ఈ కథనానికి స్పందించిన అమెజాన్.. తమ విక్రయదారుల్లో భారత ఎగుమతిదారులూ ఉన్నారని, వాళ్ల ద్వారా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులనే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నామని తెలిపింది. లెక్కలతో సహా.. 200 దేశాల్లో భారత ఉత్పత్తులను అందిస్తున్నామని స్పష్టం చేసింది అమెజాన్. అంతేకాదు భారత అమ్మకందారులకు అమెజాన్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తుందో వివరించింది. ‘‘కరోనా టైంలో మూడు లక్షల మంది కొత్త అమ్మకందారులు చేరారు. అందులో 45 ఫ్లస్ నగరాల నుంచి 75 వేలమంది స్థానిక దుకాణదారులే ఉన్నారు. మెట్రోనగరాలు, టైర్-2, టైర్-3, టైర్- స్థాయి పట్టణాల నుంచి కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్టులను సేకరించి.. 200 దేశాల్లో మా సర్వీసుల ద్వారా అందిస్తున్నాం. పైగా అమెజాన్ ఎక్స్పోర్ట్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది భారత్కు చెందిన ఎగుమతిదారులే ఉన్నారని, వాళ్లంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే అమ్ముతున్నారని స్పష్టం చేసింది. చదవండి: భారత్లో అమెజాన్ ‘ధన’బలం! చదవండి: అమెజాన్ లీగల్ ప్రతినిధుల రాంగ్రూట్?! ఇదిలా ఉంటే పాంచ్జన్య.. గత కొన్నిరోజులుగా అమెజాన్ మీద ఫోకస్ పెట్టి వరుస కథనాలు ప్రచురిస్తోంది. హిందీ వీక్లీ, ఆరెస్సెస్ అనుబంధ పత్రికా విభాగం అయిన పాంచ్జన్య ఇంతకు ముందు ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ను ‘జాతి వ్యతిరేక శక్తులతో కలిసి పని చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే కదా!. అయితే ఈ కథనంపై ఆరెస్సెస్ ఆల్ఇండియా పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందించారు. పాంచ్జన్య కథనం రాసినవాళ్ల సొంత అభిప్రాయమని, ఆరెస్సెస్తో ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. Panchjanya is not mouthpiece of the RSS and the said article or opinions expressed in it should not be linked with the RSS. @editorvskbharat — Sunil Ambekar (@SunilAmbekarM) September 5, 2021 సంఘ్కు అవసరమా? ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ జోక్యానికి కారణమైంది. ఆరెస్సెస్ పాంచ్జన్య కథనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్రస్తుతమని పేర్కొంది. అవసరం లేని వ్యవహారాల్లో ఆరెస్సెస్ జోక్యం ఎక్కువైందని, అమెజాన్ మీద పాంచ్జన్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని, ఉపేక్షించదగినవి కావని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ప్రయోజనాలకే తప్ప.. దేశ ప్రయోజనాలకు ఆ విభాగం(ఆరెస్సెస్) పని చేయదంటూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: అమెజాన్కి చెక్ పెట్టే పనిలో టాటా గ్రూపు -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నకిలీ హిందువులు
సాక్షి , న్యూఢిల్లీ: హిందూ పారీ్టగా చెప్పుకొనే బీజేపీ, దేశంలో హిందుత్వాన్ని వాడుకుంటుందే తప్ప వారు ఎప్పటికీ హిందువులు కారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్లు తమ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించుకొనే నకిలీ హిందువులు అని ఆయన ఆరోపించారు. అంతేగాక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మహిళా శక్తిని అణచివేసి, దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అయితే కాంగ్రెస్ మాత్రం మహిళా శక్తికి సమాన వేదికను ఇస్తుందని ఆయన తెలిపారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ 38వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రాహుల్ మహిళా కాంగ్రెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ తన గదిలో కూర్చొని భయంతో వణికిపోతున్నందున సమాజంలోని ప్రతి విభాగంలోనూ భయాన్ని సృష్టించారని అన్నారు. చైనా అంశాన్ని ఉదహరించిన రాహుల్గాం«దీ, ఇటీవల చైనా వేల కిలోమీటర్ల భూమిని లాక్కుందని, అయితే నరేంద్ర మోదీ చైనాపై ఉన్న భయంతో అంతా బాగానే ఉందని చెప్పారని ఎద్దేవా చేశారు. ఇది ప్రధాని మోదీ భయానికి సంకేతమని రాహుల్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ జీవితమంతా అబద్ధాలపై ఆధారపడి ఉన్నందునే ఆయన భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ద్వేషంతో కాదు.. ప్రేమతో పోరాడుదాం కాంగ్రెస్ సిద్ధాంతం.. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమని, రెండు సిద్ధాంతాలలో ఒకటి మాత్రమే దేశాన్ని పాలించగలదని అన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నాయకులు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేశారని, ప్రస్తుతం రైతులు, మహిళలు భయపడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో జీఎస్టీని అమలు చేసినప్పుడే, చిన్న చిన్న దుకాణదారుల ఇంట్లో లక్ష్మీదేవిని బీజేపీ తీసేసిందని ఆయన మోదీ ప్రభుత్వాన్ని నిందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఐని అమలు చేయడం ద్వారా దుర్గా శక్తిని కోట్లాది మంది ప్రజల చేతుల్లో అస్త్రంగా ఉంచామని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తమను తాము హిందూ పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ, దేశవ్యాప్తంగా లక్షి్మ, దుర్గలపై దాడి చేశారని దుయ్యబట్టారు. హిందూమతం పునాది అహింస. మహాత్మా గాంధీ తన జీవితమంతా హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో గడిపితే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఆ హిందువు ఛాతిపై మూడు బుల్లెట్లను ఎందుకు కాల్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మనం వారిపై ప్రేమతో పోరాడాలి తప్ప ద్వేషంతో పోరాడలేమని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ఒక మహిళా ప్రధానిని ఎప్పటికీ ఇవ్వలేవని, కాంగ్రెస్ పార్టీ మహిళను ప్రధానిని చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎవరికీ భయపడదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, ప్రధాన కార్యదర్శులు సీతక్క, సౌమ్యారెడ్డి, అప్సరా రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమీలమ్మ సహా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200మంది కార్యకర్తలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన సుమారు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్పై వీహెచ్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్లతో భారత్కు ప్రమాదం -
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
-
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తాలిబన్ల పేరు భారతదేశంలో మార్మోగుతోంది. తాలిబన్లకు ముడిపెట్టి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్ననే పెట్రోల్ ధరల పెరుగుదలకు తాలిబన్లే కారణమని ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్ ప్రముఖ రచయిత స్కీన్ రైటర్ జావేద్ అక్తర్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దేశంలో కూడా తాలిబన్ల మాదిరి ఆర్ఎస్ఎస్ తయారైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జావేద్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జావేద్ అక్తర్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదాం స్పందించారు. ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం ‘జావేద్ అక్తర్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్, విశ్వ హిందూ పరిషత్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి. సంఘ్కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భరత గడ్డపై విడుదల చేయనీయం’ అని రామ్ కదాం తెలిపారు. ట్విటర్లో ఈ వీడియోను విడుదల చేశారు. జావేద్ అక్తర్ మాజీ ఎంపీ. ప్రముఖ నటి షబానా అజ్మీ భర్త. ఆయన పిల్లలు ఫర్మాన్ అక్తర్ ప్రముఖ నటుడు కాగా, కుమార్తె ప్రముఖ నిర్మాత జోయ అక్తర్. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. -
బీజేపీ, ఆరెస్సెస్లతో భారత్కు ప్రమాదం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే) శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్ల విధానం మొత్తం భారత్కే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ల సైద్ధాంతిక విధానంతో మొత్తం భారత్కే ముప్పు కలుగుతుంది. వారు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోరు. వారు క్రిస్టియన్లను, సిఖ్లను, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కూడా తమ వేధింపులకు లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్గాలను వారు తమతో సమానులుగా భావించరు’ అని ఇమ్రాన్ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్లో కశ్మీరీలపై వేధింపులు మరింత పెరిగాయన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై తాను కశ్మీరీల తరఫున బ్రాండ్ అంబాసడర్గా వ్యవహరిస్తున్నానన్నారు. కశ్మీరీల న్యాయమైన పోరాటంలో పాకిస్తాన్ వారికి తోడుగా ఉంటుందన్నారు. జులై 25న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. -
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ముస్లింలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషం హిందుత్వ నుంచి వచ్చిందని, తీవ్రమైన భావాజాలం ఉన్న కొంతమంది వల్ల వ్యాపిస్తోందని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది నేరస్తులకు హిందుత్వ ప్రభుత్వం మద్ధతు పలుకుతోందని ట్విటర్లో విమర్శలు గుప్పించారు. ఆదివారం యూపీలోని ఘజియాబాద్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న వారు హిందుత్వ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఒవైసీ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్తులకు అధికారపార్టీ అండగా ఉంటోందని తీవ్రంగా ఆరోపించారు. భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని, భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం కార్యక్రమంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఆర్ఎస్ఎస్ చీఫ్కు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు పుంజు కుంటున్నాయి. కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అనేకమంది వైద్యులు, ఇతర సెలబ్రిటీలు కోవిడ్-19 వైరస్ సోకుతోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. అయితే తేలికపాటి లక్షణాలతో నాగ్పూర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ భగవత్ ఆరోగ్యంపై సమాచారాన్ని పోస్ట్ చేసింది. మార్చి 7న ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. కాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల నమోదు భారీగా ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం తాజాగా1,45,384 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మరో 794 మంది మరణించారు. RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat today tested Corona positive. He has normal symptoms and admitted to Kigsway hospital Nagpur. — RSS (@RSSorg) April 9, 2021 -
ప్రజల్ని మతం పేరుతో విభజిస్తున్నారు
కొట్టాయం: దేశ ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ–ఆరెస్సెస్ విభజిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పరమత సహనానికి బాటలు వేసే ఈ రహదారిని తవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ తమ జీవిత మంతా ప్రయత్నిస్తూ ఉంటారని ఆరోపించారు. నిరంతరాయంగా ప్రజల్లో విద్వేషాన్ని, ఆగ్రహావేశాల్ని నింపుతున్నారని నిందించారు. కేరళలో శబరిమల యాత్రకు వెళ్లడానికి ముందు కొట్టాయం జిల్లాలోని ఎరుమెలి ప్రాంతంలో ఆలయం, మసీదు ఒకే చోట ఉంటాయి. ఆ రెండు పవిత్ర క్షేత్రాల మధ్య ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో రాహుల్ పాల్గొన్నారు. ఎరుమెలిలోని అయ్యప్ప సన్నిధిలో పూజలు చేశారు. దాని పక్కనే వవర్స్వామికి అంకితమిచ్చిన మసీదులో కూడా ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతానికి చెందిన వవర్తో అయ్యప్ప స్వామి స్నేహం చేశారని భక్తుల నమ్మకం. అందుకే శబరిమల యాత్రకి వెళ్లడానికి ముందు కొట్టాయం జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని, వవర్ మసీదుని భక్తులు తప్పనిసరిగా సందర్శిస్తారు. ఇలా రెండు మతాలకు చెందిన క్షేత్రాలను సందర్శించడం చాలా గొప్ప విషయమని రాహుల్ పేర్కొన్నారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు పరస్పర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఆనందంగా జీవించాలని, ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో దీనికి మించిన కానుక ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు. -
కేరళలో ఘర్షణ: ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్ఎస్ఎస్, ఎస్డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్ఎస్ఎస్కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్డీపీఐ ఆర్గనైజేషన్ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బంద్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు. కాజర్గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ దాడి చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందని ఎస్డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్డీపీఐ కర్యకర్తలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది. చదవండి: మందేశాడు.. ఎస్సైని ఢీకొట్టాడు -
ప్రముఖ నటుడి నివాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగాల్కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: 2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! -
‘లష్కరే ఉగ్రవాదులను పిలిచే దాకా తేకండి’
బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..) ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్లో ప్రవేశించిన ముష్కరులు తాజ్మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. -
తొలగిన మచ్చ.. దక్కిన ఊరట
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఎల్కే అడ్వాణీ: బాబ్రీ మసీదు స్థలంలోనే రామాలయాన్ని నిర్మించాలనే డిమాండ్తో అడ్వాణీ దేశవ్యాప్తంగా 1990లో రథయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో దేశంలో బీజేపీ బలం ఎన్నో రెట్లు పెరిగిందని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అడ్వాణీ పై బాబ్రీ మసీదు కూల్చివేత అంశం ఇన్నాళ్లూ ఒక మచ్చగా ఉండేది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆ మచ్చ తొలగిపోయినట్లే. మురళీ మనోహర్ జోషీ: బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోషీ వ్యవహరించారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. వాజ్పేయి, అడ్వాణీ సమకాలీనుడైన జోషీ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. 86 ఏళ్ల జోషీ ఉత్తరప్రదేశ్ నుంచి పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు. కల్యాణ్ సింగ్: ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కల్యాణ్సింగ్ ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదు నేలమట్టమైంది. వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. మసీదు కూల్చివేతకు కల్యాణ్ సింగ్ సంపూర్ణంగా సహకరించారని అభియోగాలు ఉన్నప్పటికీ కేసు నుంచి బయటపడ్డారు. 88 ఏళ్ల కల్యాణ్సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఉమా భారతి: బాబ్రీ మసీదు వ్యవహారంలో ప్రముఖంగా వినిపించే మహిళ పేరు ఉమాభారతి. జనాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించడంలో ఆమె దిట్ట. మసీదు కూల్చివేత అనేది అప్పటికప్పుడు జరిగిన ఘటన అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని ఉమా భారతి పలు సందర్భాల్లో చెప్పారు. మసీదు కూల్చివేతపై క్షమాపణ చెప్పడానికి ఏనాడూ ఇష్టపడలేదు. వినయ్ కతియార్: హిందూత్వ ఫైర్బ్రాండ్ నాయకుడు వినయ్ కతియార్(66). ఆయన బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా, విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. కల్యాణ్ సింగ్, ఉమా భారతి లాగా బీజేపీలో ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. పలుమార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాను. 1526 నుంచి 2020 దాకా.. 1526: 1526లో బాబర్ సైనికాధికారి మీర్ బాకీ అయోధ్యలో∙మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట. 1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది. హషీమ్ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది. 1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్కే అడ్వాణీ ఈ బృందానికి నేతృత్వం వహించారు. 1986: ఫైజాబాద్ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు. 1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది. 1992: డిసెంబర్ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు. 1993: కేసుల సత్వర విచారణకు లలిత్పూర్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్ బన్సల్, ధరమ్ దాస్, నృత్య గోపాల్దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి. 1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్షీట్ ఆధారంగా ఎల్కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్కే అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ తదితరులు కేసు గెలిచారు. 2003: రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం. 2005: అలహాబాద్ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది. 2010: అలహాబాద్ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. 2012: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ. 2015: బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు 2017: అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు. 2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు. 2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే.యాదవ్ తీర్పు. -
ఫేస్బుక్ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని పుట్టించింది. ‘విద్వేషపూరిత ప్రసంగాల నిబంధనల విషయంలో భారత రాజకీయ నాయకులతో ఫేస్బుక్ రాజీపడుతోంది. వివాదాస్పద రాజకీయ నాయకుడిపై నిషేధం విధించడానికి ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ నిరాకరించారు. బీజేపీ నేతల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. వారిపై చర్యలకు దిగితే భారత్లో కంపెనీ వ్యాపారావకాశాలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. బీజేపీవైపు ఫేస్బుక్ మొగ్గుచూపుతోంది’అని ఈ సామాజిక మాధ్యమ సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో రాసింది. ఈ కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ధ్వజమెత్తారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్లో ఫేస్బుక్, వాట్సాప్లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విదేష్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. చివరకు అమెరికా మీడియా నిజాన్ని బయటపెట్టింది’అని రాహుల్ ట్వీట్ చేశారు. విద్వేష ప్రసంగాల విషయంలో ఏం చేయదలచుకున్నారో ఫేస్బుక్ చెప్పాలన్నారు. -
శ్రీరాముడికి కొత్త నిర్వచనం
అయోధ్యలో రామాలయ భూమిపూజ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం శ్రీరాముడి గురించి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. శత్రుసంహారం చేసే ధనుద్ధారిగా రాముడిని గత 30 ఏళ్లుగా ఆరెస్సెస్/బీజేపీ చిత్రిస్తూ వచ్చిన దృక్కోణానికి పూర్తిగా భిన్నమైన రాముడిని మోదీ ఆవిష్కరించారు. దాని ప్రకారం శ్రీరాముడు అందరివాడు. ప్రజలను సమానంగా ప్రేమించాడు. పేదలు ఉండకూడదన్నాడు. దుఃఖం ఉండకూడదన్నాడు. స్త్రీలు, పురుషులు, రైతులు, పశుపాలకులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాలంతోపాటు ముందుకెళ్లాలని మోదీ రాముడు బోధిస్తున్నాడు. ఆధునిక భారతదేశంలో ఇవన్నీ సాధ్యం కావాలంటే మొట్టమొదటగా పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపొందించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, 130 కోట్లమంది భారతీయుల ప్రధానమంత్రిగా కూడా శ్రీరాముడిని పునర్విచించారు. ఇది 1989 నుంచి గత ముప్ఫై ఏళ్లుగా ఆరెస్సెస్/బీజేపీ శ్రీరాముడి గురించి ఇస్తూ వస్తున్న నిర్వచనానికి పూర్తిగా భిన్నమైంది కావడం విశేషం. అయోధ్యలో, రామజన్మభూమి ఆలయంలో భూమి పూజ సందర్భంగా 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొత్త శ్రీరాముడిని ఆవిష్కరించారు. అందుచేత ఆయన ప్రసంగానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రామాలయ భూమిపూజ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానకి నేను మొదట ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. ‘‘దళితులు, అధోజగత్ సహోదరులు, ఆదివాసీలు.. సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీకి సహకారం అందించినట్లే, రామాలయ నిర్మాణానికి చెందిన బృహత్ కార్యక్రమం భారతదేశ ప్రజలందరి సహకారంతో ఈరోజు ప్రారంభమైంది. రాముడికి తన ప్రజలపై సమానమైన ప్రేమ ఉండేది. అయితే పేదలు, పీడితుల పట్ల రాముడు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వివిధ రామాయణాల్లో శ్రీరాముడి వివిధ రూపాలను మీరు కనుగొనవచ్చు.. కానీ రాముడు ప్రతిచోటా ఉన్నాడు. (ఒకే బాణము, ఒకటే పార్టీ!) రాముడు అందరివాడు. అందుకే భారతీయ భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు అనుసంధాన కర్తగా ఉంటున్నాడు. ‘ఎవరూ విచారంగా ఉండకూడదు, ఎవరూ పేదవారిగా ఉండకూడదు’ అని రాముడు బోధించాడు. పైగా ‘స్త్రీలు పురుషులతో సహా ప్రజలందరూ సరిసమానంగా సంతోషంగా ఉండాల’ని శ్రీరాముడు సామాజిక సందేశం ఇచ్చాడు. ‘రైతులు, పశుపాలకులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని కూడా సందేశమిచ్చాడు. అలాగే ‘వృద్ధులను, పిల్లలను, వైద్యులను ఎల్లప్పుడు పరిరక్షించాలి’ అని రాముడు ఆదేశమిచ్చాడు. ఆశ్రయం కోరుకున్న వారికి ఆశ్రయమివ్వడం అందరి బాధ్యతగా ఉండాలని రాముడు పిలుపిచ్చాడు. స్థల, కాల, సమయ పరిస్థితులకు అనుగుణంగా రాముడు మాట్లాడేవాడు, ఆలోచించేవాడు, వ్యవహరించేవాడు. కాలంతోపాటు ఎదుగుతూ, ముందుకెలా వెళ్లాలో రాముడు మనకు బోధించాడు. రాముడు మార్పు, ఆధునికతా ప్రబోధకుడు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, జ్ఞానాన్ని ఎలా సాధించాలో కూడా రాముడు మనకు బోధించాడు. అందరి మనోభావాలను మనం గౌరవించాలి. మనందరం కలిసి ఉండాలి. కలిసి ముందుకెళ్లాలి, పరస్పరం విశ్వసించాలి’’. ప్రధాని మోదీ రామాలయ భూమి పూజానంతరం చేసిన ప్రసంగం ప్రకారం రాముడు ఆధునికవాది. దారిద్య్ర నిర్మూలన, స్త్రీ, పురుషుల మధ్య భేదం, కులం, మానవ దోపిడీకి కారణమవుతున్న దారిద్య్రం ఇలా అన్ని రకాల అసమానతలను రాముడు వ్యతిరేకించాడు. వైవిధ్యతకు మద్దతిచ్చాడు. తనకోసం కాకుండా అనేకమంది రోగులకు చికిత్స చేసే వైద్యుడి భద్రత గురించి రాముడు మాట్లాడాడు. ఈ దేశం స్వర్గం కంటే మిన్నగా మారాలని రాముడు విశ్వసించి ఉంటాడు. రథ యాత్ర సమయంలో ప్రధానంగా ఎల్కే అద్వానీ రూపంలో ఆరెస్సెస్/బీజేపీ కూటమి ప్రబోధించిన రాముడితో పోల్చి చూస్తే మోదీ రాముడు పూర్తిగా భిన్నమైన వాడు. రాముడంటే విల్లుబాణాలు ధరించి శత్రువులను దునుమాడే పరమ శక్తిమంతుడు అనే ముద్రను గత మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్/బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ ప్రవచిస్తూ వచ్చిన రాముడితో పోలిస్తే ఇప్పుడు శ్రీరాముడు అందరివాడు. రాజ్యంలో ఏ ఒక్కరూ దుఃఖంతో ఉండరాదు, పేదవారిగా ఉండరాదు అని రాముడు బోధించినట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. రామాయణ పురాగాథ, రాముడి గురించిన పాత అవగాహనకు పూర్తిగా ఇవి భిన్నమైనవి. రాజ్యాంగంలో పొందుపర్చిన లౌకికవాద స్వరూపాన్ని ఏ ప్రధాని కూడా ధిక్కరించి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనరాదు అని గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన సూత్రీకరణను మోదీ ఉల్లంఘించారనడంలో సందేహమే లేదు. కానీ శ్రీరాముడికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా మోదీ ఇప్పుడు రాముడినే లౌకికవాదిని చేసి పడేశారు. (భారత్ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన) రామమందిరం గురించి మోదీ చేసిన ప్రసంగం ముస్లిం మైనారిటీలు, ఇకనుంచి భారత్లో వారి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంతో కూడుకుంది. అయితే దీనికంటే మించిన మౌలిక సమస్య ఇక్కడ ఉంది. అదేమిటంటే వాల్మీకి రామాయణం రచించిన రోజుల నుంచి కుల పీడన, స్త్రీల అణచివేత. కుల పీడన గురించి, స్త్రీల అసమానత్వం గురించి రామాయణం ఏ సందర్భంలోనూ పేర్కొనలేదు. పైగా వర్ణధర్మం, బ్రాహ్మణ పితృస్వామ్యంలో భాగంగా కులం, స్త్రీల అణచివేతకు సంబంధించిన వివిధ అంశాలను రామాయణంలో చొప్పించారు. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో వ్యాప్తిలో ఉంటున్న వివిధ రామాయణాల గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావిం చారు. కానీ రామానుజన్ రాసిన ‘మూడు వందల రామాయణాలు’ (త్రీ హండ్రెడ్ రామాయణాస్) అనే రచనను ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ నుంచి హిందూత్వ అనుకూలవాదులు కొన్నేళ్ల క్రితం బలవంతంగా తొలగించారు. కానీ ప్రధాని మోదీ ప్రసంగం రాముడి గురించిన ఆయన సూత్రీకరణలకు కట్టుబడింది. భారత ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ రాముడిని ఒక ఆధునికుడిగా నిర్వచించినందున రాముడిపై ఈ సరికొత్త నిర్వచనాన్ని మేధో చర్చలనుంచి తొలగించలేం. మోదీ నిర్వచనంతో ఏకీభవిం చినా, ఏకీభవించకపోయినా సరే ఈ కొత్త నిర్వచనం గురించి ఎవరైనా చర్చించాల్సిందే. ముస్లిం మైనారిటీని చావుదెబ్బతీసి, హిందూ ఆలయాన్ని నిర్మించాలనే తమ ఎజెండాలో భాగంగా అద్వానీ, ఆరెస్సెస్/బీజేపీ నాయకులు ఇంతకుముందు రాముడి గురించి ఏ నిర్వచనం ఇచ్చారో మళ్లీ ప్రస్తావించాలని నేను భావించడం లేదు. ఎందుకంటే ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. అయితే ఇకపై రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ జీవితాలపై ప్రధాని మోదీ ప్రసంగం సానుకూల ప్రభావం వేయనుందా లేక ప్రతికూల ప్రభావం వేయనుందా అనే చర్చను, రామ వర్సెస్ ముస్లిం సమస్యపై చర్చను ముస్లిం పండితులకే వదిలివేస్తాను. అయోధ్యలో రామాలయం రోమ్లోని వాటికన్ కంటే, సౌదీ అరేబి యాలోని మక్కాకంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుందని అనేకమంది ఆరెస్సెస్/బీజేపీ నేతలు గతంలో చెప్పి ఉన్నారు కూడా. మతాలను తులనాత్మకంగా పరిశీలించడంలో నిష్ణాతులైన క్రిస్టియన్, ముస్లిం పండితులు ఈ అంశాన్ని కూడా మత చర్చలో భాగం చేయవలసి ఉంది. మహిళా సమస్యను అన్ని కులాలకు చెందిన మహిళా రచయితలు, చింతనాపరులు చేపట్టి చర్చిస్తారు. ఇక్కడ నా అందోళన అంతా కుల ఎజెండాను రద్దు చేయడానికి సంబంధించే ఉంటుంది. అయోధ్యలో ప్రధాని ప్రసంగం.. రిజర్వేషన్ చట్టాలను మించి పార్లమెం టులో తగిన చట్టం ద్వారా కులాన్ని, అంటరానితనాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఒక బలమైన ప్రాతిపదికను అందిస్తోంది. ఆరెస్సెస్/బీజేపీల ద్వారా ఆగమశాస్త్రాలు విధించిన ఆధ్యాత్మిక వివక్షాపూరితమైన చట్టాల నిర్మాణానికి, హిందూయిజంకి సంబంధించి ఆధునిక ఆధ్యాత్మిక సమానత్వాన్ని ప్రబోధిస్తున్న వారికి మధ్య ఉన్న సంఘర్షణను ఈ కొత్త చట్టం పరిష్కరించాల్సి ఉంది. హిందూయిజాన్ని ఒక జీవన విధానంగా మాత్రమే కాకుండా ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాం, బుద్ధిజం వంటి మతాల సరసన నిలిపే అంశంలో ఇదే ప్రధాన సమస్య అవుతుంది. భారత పార్లమెంటు కుల నిర్మూలనను పూర్తిగా పరిష్కరించాల్సి ఉంది. ఆధునిక రాముడిపై తన అవగాహనను నొక్కి చెబుతున్న మోదీ ఈ అంశాన్ని చిత్తశుద్ధితో స్వీకరించాల్సి ఉంది. 2014, 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ తనను తాను ఇతర వెనుకబడిన కులానికి చెందిన ప్రధానిగా అభివర్ణించుకుని ప్రచారం చేసుకున్న వైనాన్ని మనం మర్చిపోకూడదు. దళితులను అలా పక్కనపెట్టండి.. చివరకు శూద్రులు, ఓబీసీలకు కూడా రామాలయంలో పూజారులుగా ఉండే హక్కు లేదు. మోదీ చెబుతున్న రాముడు అందరికీ సామాజిక న్యాయం పక్షాన నిలబడ్డాడు మరి. పైగా మోదీ ప్రకారం రాముడు మార్పుకు ప్రతినిధి. భూమి పూజ అనంతరం ప్రధాని చేసిన ప్రసంగం ప్రకారం రాముడు కాలాన్ని బట్టి మారుతూ, ఆధునికతను చాటిన పాలకుడు కదా. అందుకే అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, జరగాలంటే పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపకల్పన తప్పనిసరి అవసరంగా ఉంటుంది. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఆ పరిస్థితులు మారాయి: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ అంటే అర్థం పూర్తిగా విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం అన్నారు. ‘మేం మాకు కావాల్సినవి పరిస్థితులకు తగినట్టుగా కొంటాం’ అని తెలిపారు. ఒక వర్చవల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడతాం. స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదు. మంచి విషయాలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో లభించే వస్తువులను ఉపయోగిస్తాం. స్వదేశీ అర్థం దేశీయ ఉత్పత్తులను ప్రోతహించడం. విదేశీ పెట్టుబడులపై పరిమితులను విధించడం. స్వయం ఆధారిత దేశాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవాలి. ప్రపంచం అంటే ఒకే కుటుంబంలా ఉండాలి కానీ ఒకే మార్కెట్లా కాదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం విదేశీ ఉత్పత్తులపై చాలా రోజులు ఆధారపడ్డాం. స్వదేశీ వస్తువులను, టెక్నాలజీని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి’ అని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ లభ్యం కానీ టెక్నాలజీలను, వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి అని కోరారు. చదవండి: ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు -
ఈ పాలసీ కాగితం మీదే ఆగిపోతుంది..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానంపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కొత్త విద్యా విధానంలో ప్రాథమిక మానవాభివృద్ధి లక్ష్యం లోపించిందని, జ్ఞాన విస్తరణ లేదని వ్యాఖ్యానించింది. ఈ నివేదికలో మాటలే తప్ప స్పష్టమైన రోడ్ మ్యాప్ గానీ, ఆర్థిక వనరులుగానీ లేవని విమర్శించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ నేతలు ఎంఎం పల్లంరాజు, రాజీవ్ గౌడ, రణదీప్ సూర్జేవాలాలు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును మార్చబోయే నిర్ణయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయాలు తీసుకోకుండా, నిపుణుల సలహాలు లేకుండా కేవలం ఆర్ఎస్ఎస్ సలహాలు తీసుకొని తయారు చేశారని ఎద్దేవా చేశారు. ఈ పాలసీ మధ్యతరగతి కుటుంబాలకు అందదని, సమాజానికి నిరుపయోగమని పేర్కొన్నారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) కోవిడ్ కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థలు అన్నీ మూసి ఉన్నప్పుడు కేంద్రం ఈ విధానాన్ని ప్రకటించిందని, అసలు ప్రశ్న ఇక్కడే ప్రారంభమవుతోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రభుత్వం విద్య మీద జీడీపీలో 6 శాతం ఖర్చుపెడతామని చెప్పి ఇప్పుడు 3.2 శాతానికి ఎందుకు దిగి వచ్చిందని ప్రశ్నించారు. దీని వల్ల భవిష్యత్తులో తప్పకుండా సమస్యలు వస్తాయని మాజీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి పల్లం రాజు చెప్పారు. ఈ విధానానికి రోడ్ మ్యాప్ ఏమిటని, నిధులు ఎక్కడ నుంచి తెస్తారని వారు ప్రశ్నించారు. నిధులను ప్రజల జేబుల నుంచి లాగుతారా అంటూ ఐఐఎం మాజీ ఫాకల్టీ రాజీవ్ గౌడ ప్రశ్నించారు. నిధులు లేకుండా ఈ పాలసీ కాగితం మీదే ఆగిపోతుందని, ఖాళీగా ఉన్న 12 లక్షల టీచర్ల పోస్టులను ఎలా నింపుతుందో, ప్రభుత్వం చెప్పాలని రణదీప్ సూర్జేవాలా అడిగారు. దేశంలో 10 శాతం స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్, అందులోనూ 4 శాతం స్కూళ్లకు మాత్రమే నెట్ కనెక్టివిటీ ఉందని చెప్పారు. చదవండి: ఉద్యోగ సృష్టికర్తలొస్తారు.. -
నా చావుకు ఎమ్మెల్యేనే కారణం
కాజీపేట అర్బన్ /నెక్కొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కారణం అంటూ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు రామరాజు నర్సంపేటలోని ఓడీసీఎంఎస్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో విధు లు నిర్వర్తిస్తున్నాడు. లాక్డౌన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కనబెట్టారు. ఈ క్రమంలో తన కుమారుడికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని నెక్కొండకు వచ్చిన సందర్భంగా వెంకటేశ్వర్లు కోరాడు. మంగళవారం కూడా హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలసి విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న వెంకటేశ్వర్లు చాకుతో గొంతు కోసుకున్నాడు. ఈ సందర్భంగా ‘నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి.. కేసీఆర్ సార్ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దు’అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టా్ట డు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, వెంకటేశ్వర్లు పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విచారణ జరిపిస్తా అలంకానిపేట గ్రామ ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మాసం వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్లో నా పేరు ప్రస్తావించడంపై విచారణ జరిపిస్తా. గతంలో ఆయన కొడుకు ఉద్యోగం విషయంలో నన్ను కలిశాడు. దీంతో నేను సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. -పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే -
వివక్ష వద్దు.. 130 కోట్ల జనం మనోళ్లే!
నాగ్పూర్: దేశం యావత్తూ మహమ్మారి కరోనాతో పోడుతుంటే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి వివక్షా లేకుండా బాధితులందరికీ సహాయం చేయాలని ఆర్ఎస్ఎస్ శ్రేణులను కోరారు. అదేవిధంగా దేశం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగ్పూర్ నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్లైన్లో తన సందేశం వినిపించారు. (చదవండి: ఆ రైలు అదే.. కిమ్ అక్కడే ఉండొచ్చు!) దేశంలో ఉన్న 130 కోట్ల మంది భరతమాత బిడ్డలేనని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భరతమాతను ముక్కలు చేస్తున్నామంటూ కొందరు ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తారని, వాటిల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చేసే తప్పిదాలకు మొత్తం సమాజాన్నే నిందించడం మంచిది కాదని తబ్లిగీ ప్రార్థనలను ఉద్దేశించి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. (చదవండి: బుసలు కొడుతున్న కరోనా) -
ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్
నాగ్పూర్ : దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి స్పందించారు. ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని నిర్ధారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జోషి మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికి లేదని తెలిపారు. ఢిల్లీ హింసాత్మక ఘటనలు చెలరేగిన ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పాలన్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో దాదాపు 34 మంది మృతిచెందగా, 200 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాలను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రామ్నాథ్ కోవింద్కు విజ్ఞప్తి చేశారు. చదవండి : ఢిల్లీ అల్లర్లు: ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’ ఢిల్లీ హింస: అమిత్ షాపై మండిపడ్డ సోనియా -
ఆర్ఎస్ఎస్ ఎజెండాతో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రాననంతరం గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలు భయం లేకుండా జీవించారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. గత 6 ఏళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే నేడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడంలో భాగంగా ఆ రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం సామాజిక న్యాయాన్ని అందించింది కాంగ్రెస్సే అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు హక్కు కాదని సుప్రీం చెప్పడం పట్ల దేశంలోని దళిత, గిరిజన మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని, ఇందుకు బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరే కారణమన్నారు. ఆ వర్గాలకు భరోసా కల్పించేందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్లో అలాంటి పరిస్థితి ఉందా? కాంగ్రెస్ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమని, తాము ఓట్ల కోసం ధర్నా చేయడం లేదని, ఇప్పట్లో ఎన్నికలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటోందని, ఒక దళితుడైన దామోదరం సంజీవయ్యను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. అదే టీఆర్ఎస్లో అలాంటి పరిస్థితి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. దళిత సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మాదిగ నాయకుడికి కూడా స్థానం ఇవ్వలేదని, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల గురించి పార్లమెంటులో ఒక్క రోజు కూడా మాట్లాడలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఏకీభవించబోదని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీలేని పోరాటం చేస్తామని, చట్టసభల్లో కూడా పోరాడతామని చెప్పారు. బలహీన వర్గాలను అణచివేసే యత్నం: భట్టి బీజేపీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఎత్తివేతకు జరుగుతున్న కుట్ర చాలా ప్రమాదకరమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజానీకాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, కాం గ్రెస్ అధికారంలో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ ఎ.రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అం శాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కేసీఆర్ గిరిజన, మైనార్టీల వ్యతిరేకి అని, అందుకే హామీ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్లు ఎత్తేయాలనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు ట్రలను అమలు కానీయబోమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా వ్యాఖ్యానించారు. ఈ కుట్రను ఎదుర్కొనేందు కు రాహుల్, సోనియాల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. ధర్నాలో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, గీతారెడ్డి ,షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, సంపత్కుమార్, బలరాం నాయక్, రాములు నాయక్, మల్లు రవి, జెట్టి కుసుమకుమార్, దాసోజు శ్రవణ్ కుమార్, కోదండరెడ్డిలతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
'పార్టీ ఎజెండాను నితీశ్ అపహాస్యం చేశారు'
పట్నా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, దౌత్యవేత్త పవన్ వర్మ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ 'వార్ రూమ్' ను విజయవంతంగా నడిపించారు. రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి), జనతాదళ్ (యునైటెడ్)లతో కూడిన గ్రాండ్ అలయన్స్ కూటమి తరపున నితీశ్ ముఖ్యమంత్రి అవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా వీరిద్దరు నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా మారారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు నితీశ్ మద్దతు ఇవ్వడంపై వీరిద్దరు విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జేడియూ బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టార్(ఎన్పీఆర్), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లపై కూడా నితీశ్ స్పందించడం లేదు. దీంతో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై నితీశ్ నుంచి తాను కేవలం సైద్దాంతిక స్పష్టతను కోరుతున్నట్లు పవన్ వర్మ వెల్లడించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పవన్ వర్మ గుర్తుచేస్తూ.. ఆర్ఎస్ఎస్ ధరించే కాషాయ దుస్తులు దేశానికి "అత్యంత ప్రమాదకరమైనదని' అభివర్ణించారని వెల్లడించారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీ ఎజెండాను నితీశ్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. కాషాయ ఎజెండాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, సోషలిస్టు శక్తులు తిరిగి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పవన్ వర్మ పేర్కొన్నారు.(ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!) సీఏఏకు నితీశ్ మద్దతివ్వడంపై జేడియూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నసంగతి తెలిసిందే. కాగా మంగళవారం, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశాంత్ కిషోర్పై ' ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు' అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ నాయకుడు అమిత్ షా ఆదేశాల మేరకే తనను పార్టీలోకి తీసుకున్నానని నితీశ్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ప్రశాంత్ కొట్టిపారేశారు.(అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్యూ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్పై దాడిచేశారని చెప్పింది. -
దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ
న్యూఢిల్లీ: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాలనే నిర్ణయం దేశాన్ని విభజించాలనే దుష్ట ఆలోచనలో భాగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం దుయ్యబట్టారు. హిందూ రాష్ట్ర విభజన ఎజెండాను ముందుకు తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్–బీజేపీ ప్రణాళికలో భాగంగానే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అమలు నిర్ణయమని ఆరోపించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే వారు భారత ముస్లింలు మాత్రమేనని అన్నారు. వేరే మతాలను ఎన్నార్సీ కింద మినహాయించి సీఏఏలో చేర్చారని, అయితే ఎన్నార్సీ కింద అక్రమ వలసదారులుగా గుర్తించే ముస్లింలను మాత్రం సీఏఏ నుంచి మినహాయించారని విమర్శించారు. దీంతో భారతీయ ముస్లింలలో భయం, ఆందోళన నెలకొని ఉన్నాయని అన్నారు. ఎన్పీఆర్–2010కి ఎన్పీఆర్–2020కి అసలు పొంతనే లేదని, దీనిని వ్యతిరేకించాలని వ్యాఖ్యానించారు. -
భారతీయులందరూ హిందువులేనా?
ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తమ తమ దేవుళ్లతోపాటు, భారతమాతను పూజిస్తే చాలు.. వీరంతా హిందువులే అవుతారని ఆరెస్సెస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్ సదస్సులో ప్రకటించారు. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అంటూ సూత్రీకరించారు. ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని కోరుకోరని చెప్పడం ద్వారా ఆయన కౌటిల్యుడిని, మనువును, సావర్కార్ని, హెగ్డేవార్ని, గోల్వాల్కర్ని కూడా దాటి ముందుకు వచ్చేశారు. అయితే రాజ్యాధికారం కోసం కాకపోతే బీజేపీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్న మోహన్ భగవత్ కొత్త సిద్ధాంతంపై చర్చ జరగాల్సి ఉంది. శాంతి, అహింసల ప్రబోధకుడిగా ప్రపంచమంతటా గుర్తించిన జీసస్ క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25న ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్లో ప్రసంగిస్తూ, హిందువులు, హిందూయిజం పూర్తిగా భిన్నమైనవని నిర్వచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని 130 కోట్లమంది ప్రజలు హిందువులేనట. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అన్నారు. అంటే తమ తమ విశ్వాసాల మేరకు తమ దేవుడిని పూజించే, ప్రార్థించే భారతీయులందరూ ఇకనుంచి ఆర్ఎస్ఎస్ సృష్టించి, ప్రచారం చేస్తున్న భారతమాతను కూడా తమ దేవతగా తప్పకుండా పూజించాలన్నమాట. ఆయన చెప్పిందాన్ని బట్టి, ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తదితరులందరూ రెండు శక్తులను (ఒకరు తమ దేవుడు, మరొకరు దేవత అయిన భారతమాత) పూజించాల్సి ఉంటుంది. జాతీయ పౌర పట్టికలో కానీ, పాఠశాలలో కానీ, మరే ఇతర రికార్డులో కానీ మతం అనే కాలమ్లో భారతీయులు తప్పనిసరిగా ఇకనుంచి ముస్లిం–హిందూ, బుద్ధిస్టు–హిందూ, క్రిస్టియన్–హిందూ, సిక్కు–హిందూ, పార్శీ–హిందూ అని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు తమ పవిత్ర గ్రంథం, తమదైన ఆహార సంస్కృతిని, తమ వివాహ వ్యవస్థను అనుసరించవచ్చు. అయితే ఈసారి మాత్రం మోహన్ భగవత్ దేశపౌరులందరూ ఆవును పూజిం చాలని, గొడ్డు మాంసం తినడం ఆపివేయాలని తన ప్రసంగంలో చెప్పలేదు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇస్లాం లేక క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం లేక సిక్కిజం మరే ఇతర మతంలో అయినా చేరినా లేదా చేరాలని తలుస్తున్నవారు తప్పకుండా తమ మతంలో విడదీయరాని విధంగా హిందూ అనే పదాన్ని చేర్చాలన్నది ఆయన ప్రసంగ సారాంశం. సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్ తదితరులు హిందుత్వకు ఇచ్చిన గత నిర్వచనాల నుంచి మోహన్ భగవత్ వేరుపడ్డారు. గతంలో హిందుత్వ లేక హిందూయిజం కాస్త విభిన్నార్థంలో కని పించేది. కాని ఇప్పుడు ఆయన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించేశారు. ఈ క్రమంలో రాజకీయ సైద్ధాంతిక విషయాన్ని సైతం ఆయన తీసివేశారు. ఇది ముస్లింలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులను కలుపుకోవడానికి అవకాశమిస్తుందని ఆయన అభిప్రాయం. ఇది పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. వలస వచ్చిన ముస్లింలు లేక శరణార్థులు తమ పేర్లకు ముస్లిం–హిందూ అని చేర్చుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు అరబిక్ భాషలో అల్లా అని ప్రార్థించవచ్చు. కానీ ప్రార్థన ముగింపులో మాత్రం తప్పకుండా భారత్ మాతా కీ జై అని చెప్పాల్సి ఉంటుంది. కౌటిల్యుడు, మనువు తర్వాత హిందూ తత్వశాస్త్రానికి సంబంధించిన అతి గొప్ప సిద్ధాంతవేత్తగా మోహన్ భగవత్ ఆవిర్భవించారు. కౌటిల్యుడు, మనువు తమ సొంత సైద్ధాంతిక రచనలైన అర్థ శాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించడం ద్వారా మౌర్య చంద్రగుప్త, పుష్యమిత్ర శుంగ సామ్రాజ్యాలను స్థాపించారు. తమ సిద్ధాంతాలతో చంద్రగుప్తుడిని, పుష్యమిత్రుడిని అధికారంలోకి తెచ్చిన కౌటిల్యుడు, మనువు లాగే మోహన్ భగవత్ కూడా నరేంద్రమోదీని అధికారంలోకి తెచ్చారు. నరేంద్రమోదీ తర్వాత తాను జీవించి ఉన్న కాలంలోనే అమిత్ షా కూడా దేశ ప్రధాని కావచ్చు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీ సాధించిన మెజారిటీ కానీ, కేంద్రంలో రెండు దఫాల పాలన కానీ మోహన్ భగవత్ తాత్విక వ్యూహాత్మక చేర్పుగానే చెప్పాలి. హైదరాబాద్ సదస్సులో తన నూతన సిద్ధాంతాన్ని విస్తరించి చెప్పినట్లుగా మోహన్ భగవత్ అభిప్రాయం మేరకు, ప్రపంచంలోని మానవులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరందరికీ మూడు రకాలైన లక్షణాలు ఉంటాయి. అవి ‘తమో, రజో, సత్వ’ గుణాలు. తమోగుణం కలిగినవారు తాము విషాదంలో ఉంటూ ఇతరులనూ విషాదంలో ముంచెత్తుతుంటారు. వీరు హింసను ప్రేరేపించినప్పటికీ విజయం సాధించలేరు. అంతిమంగా వీరు ప్రతి ఒక్క అంశాన్నీ విధ్వంసం చేస్తారు. ఇక రజోగుణానికి చెందినవారు తమ ప్రయోజనాలకు చెందిన పనులను మాత్రమే చేపడుతుంటారు. తాము సంపన్నులు కావడానికి, తమ సొంత ప్రతిష్టలకు వీరు ఇతరులను ఉపయోగించుకుంటుంటారు. కాగా సంఘ్ పరివార్, భారతదేశం ధర్మ విజయాన్ని (సత్వ గుణాన్ని) నమ్ముతుంటాయి. ఈ ధర్మపాలనలో ప్రజలు ఇతరుల సంతోషం కోసం, శ్రేయస్సు కోసమే వీరు జీవి స్తుంటారు తప్ప స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని లేక మరి దేన్ని కూడా తమకోసం కోరుకోరు’’ (ది హిందూ 2019 డిసెంబర్ 28) ఇది ఎంత అత్యున్నతమైన సృజనాత్మక సిద్ధాంతం అంటే.. స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని రెండింటినీ సాధించడానికి నేరాలకు, హింసలకు పాల్పడుతూనే స్వర్గంపై, రాజ్యాధికారంపై విశ్వాసం నుంచి విశ్వాసులను కాపాడుతూ వస్తోంది. ఈ రెండు వ్యవస్థలూ మారణకాండకు దారితీసిన హింసను ప్రేరేపిస్తూ వచ్చాయి. ఇంతవరకు పవిత్ర ముస్లింలుగా, పవిత్ర క్రిస్టియన్లుగా, పవిత్ర బౌద్ధులుగా, పవిత్ర సిక్కులుగా చెప్పుకుంటూ జీవిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఈ జీవితంలో మరణం తర్వాత, రాజకీయాధికారం పొందిన తర్వాత స్వర్గాన్ని కోరుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్లందరూ హింసకు పాల్పడుతూనే వచ్చారు. అయితే తొలిసారిగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాన్నీ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. పైగా ఆరెస్సెస్/బీజేపీ కార్యకర్తలకుమల్లే స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలనే కోరిక నుంచి బయటపడాలనే వారు తమ తమ మత చిహ్నాలతో పాటు హిందూ ట్యాగ్ను కూడా చేతపట్టాల్సి ఉంటుంది. హిందూయిజంలోకి మారాలని కానీ లేక తన హిందూ మతం నుంచి వేరొక మతంలోకి మారిన వారు ఘర్వాపసీలో భాగంగా మళ్లీ హిందూమతంలోకి మారాలని కానీ మోహన్ భగవత్ ఇప్పుడు ఎవరినీ కోరలేదు. దీనికి బదులుగా వీరందరూ తమ మతానికి అదనంగా హిందూ ట్యాగ్ను చేర్చుకుంటే చాలు. అయితే ఇక్కడ మనకు తట్టే ప్రశ్నల్లా ఏమిటంటే.. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాకపోతే భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్ ఎందుకు స్థాపించినట్లు? పాపకార్యాలుగా తాను భావిస్తున్న లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజ కీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? ఆరెస్సెస్ తన 95 ఏళ్ల జీవితకాలంలో తమో, రజోగుణ కార్యాచరణలో ఎన్నడూ పాల్గొనలేదని ప్రపంచానికి మోహన్ భగవత్ నొక్కి చెబుతున్నారు. లేక ధర్మ కాలంలోలాగా 2014కి ముందు ఆరెస్సెస్ ఘర్షణల చరిత్రను ఆయన గుర్తిం చడం లేదు. హిందువులకు స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలోనే మోహన్ భగవత్ ధర్మంలోని మౌలిక సారాంశం దాగి ఉంది. అందుచేత ఆయన ప్రస్తుత మాటలు గౌతమబుద్ధుడి కంటే మించిన రాడికల్ స్వభావంతో ఉంటున్నాయి. ప్రాచీన హిందూ పురాణాలు మనకు చెబుతూ వచ్చినట్లుగా తమో, రజో గుణం కలిగినవారు భారతదేశంలో లేరని భగవత్ నూతన హిందూ సిద్ధాంతం చెబుతోంది. వారు భారతదేశంలోని దిగువ కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు చెందినవారు కారనీ వారంతా భారత్ బయటే ఉంటున్నారని ఈ సిద్ధాంత భావన. అయితే భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోనట్లయితే అప్పుడు వారిని తమో, రజో, గుణ సంపన్నులుగా గుర్తించవచ్చు. ఈ రకమైన వరివర్తనకు మోహన్ భగవత్ తగినంత పరిధిని ఇచ్చారు. ఇదీ మోహన్ భగవత్ నూతన భారతదేశం. ఈ జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక భారీ డిజైన్ని సూచిస్తున్నారు. ఆయన హైదరాబాద్లో ప్రవచించిన సిద్ధాంతాన్ని పలురకాలుగా వ్యాఖ్యానించవచ్చు, పునర్ వ్యాఖ్యానించవచ్చు కూడా. ఇప్పటికే మీడియా ఆయన సిద్ధాం తాన్ని చాలా ప్రముఖంగా నివేదించింది. టీవీ చానల్స్ ఆయన ప్రసంగాన్ని విస్తృతంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర మతాలకు చెందిన మేధావులు, లౌకిక మే«థావులు, పాశ్చాత్య విద్యా పండితులు ఆయన సిద్ధాంతం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్యషెపర్డ్; డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఆర్ఎస్ఎస్ చెడ్డీగ్యాంగ్ అవమానకరం: రాహుల్
-
ఆర్ఎస్ఎస్ చెడ్డీగ్యాంగ్ అవమానకరం: రాహుల్
గువాహటి : దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత, ప్రజల సమస్యలు పట్టని మోదీ.. మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మరోసారి విభజించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం అస్సాంలో పర్యటించిన రాహుల్.. అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలో ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు ఉండేదని.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కొంతమంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఈశాన్య ప్రాంతమైన అస్సాంపై ఆర్ఎస్ఎస్ పెత్తనం కొనసాగించాలని ప్రత్నిస్తోందని, నాగపూర్ పాలన ఇక్కడ సాగదని రాహుల్ హెచ్చరించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న చెడ్డీగ్యాంగ్ ఆగడాలు ఇక్కడి ప్రజలు తిప్పికొడతారని రాహుల్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ధరించే చెడ్డీలు ఖాకీ రంగుకు అవమానకరమని వ్యాఖ్యానించారు. -
ముగిసిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
-
దుర్జనులకు భయం సజ్జనులకు ప్రేమ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ‘మన శక్తిని చూస్తే దుర్జనులకు భయం కలుగుతోంది. సమాజ శ్రేయస్సు కోరే సజ్జనుల్లో ప్రేమ పుడుతుంది’అని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో దేశ భక్తి పెంపొందించేలా పని చేయాలని కరసేవకు లకు పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల మున్సి పాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లా డుతూ.. సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వమే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. ప్రవర్తన, భాష, సమాజహితం కోరే ఆలోచ నలు స్వయం సేవకులకు ముఖ్యమని, వాటి ని తెలియజేసే విధానం కార్య విస్తర ణలో కీలకమని, వీటిని ఎప్పుడూ విస్మరించ కూడ దని చెప్పారు. శిబిరం, సార్వజనికోత్స వం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిం చారు. ఇదే స్ఫూర్తితో స్వయం సేవకులు తమ కార్య క్షేత్రాల్లో పని చేయాలని ఆకాంక్షించారు. నేను చీఫ్ను కాదు..: ‘బయట నన్ను అందరూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు. నేను మీకు చీఫ్ను కాదు. మీరు నియమించుకున్న వ్యక్తిని’అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దండాలు పెట్టడం, దండలు వేయడం, ఫొటో ఫ్లెక్సీలు పెట్టడం హిందూ సమాజ సంస్కృతి కాదని చెప్పారు. ఇతర సంఘాలకు, ఆర్ఎస్ఎస్కు తేడా ఉందని, మనకంటూ ప్రత్యేకత ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, హిందు సమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారతీయ సహసర్ కార్యవాహ్ ముకుందా, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యామ్కుమార్, దూసి రామకృష్ణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డీకే ఆరుణ, విజయ రామారావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి భోజనం.. మోహన్ భాగవత్తో పాటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులకు కూడా ఒకే రకమైన భోజనం వడ్డించారు. అందరూ సాధారణ కార్యకర్తలతో కలిసే భోజనం చేశారు. ఆహార పదార్థాలు వృథా కాకుండా ప్రతి ఒక్కరు భుజించడం ప్రత్యేకంగా కన్పించింది. కాగా, శిబిరం ముగింపు కార్యక్రమం వేదికపై మోహన్ భాగవత్తో పాటు దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి ఉన్నారు. అయితే మోహన్ భాగవత్ ఒక్కరే ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా.. మూడు రోజుల పాటు భారత్ కళాశాలలో సంఘ్ కార్యకర్తలు వసతి పొందారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన 7,940 స్వయం సేవకులు, మరో వెయ్యి మంది ప్రబంధకులు కలసిమెలసి ఉన్నారు. శిబిరం ముగియడంతో వారంతా తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ ప్రాంగణంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు చక్కటి నడవడిక, సమయ పాలన పాటించడాన్ని చూసి ఆహూతులు మంత్రముగ్ధులయ్యారు. విజయ సంకల్ప శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు -
మనసంతా భరతమాత
-
నిందలను లెక్క చేయం... ఉండేది ప్రేమ భావమే
ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. – మోహన్ భాగవత్ సాక్షి, హైదరాబాద్ : ‘పేరు కోసం పాకులాడం, స్వార్థం కనిపించదు. ధన్యవాదాలను కూడా ఆశించం. ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. ఈ ప్రయాణంలో మాపై ఎన్ని నిందలు వచ్చినా.. ఎన్ని విమర్శలు ఎగసిపడ్డా లెక్క చేయం. అప్పుడప్పుడూ వాటికి స్పందిస్తూ మేం కొన్ని మాటలు అనొచ్చు.. కానీ మనసులో మాత్రం ప్రేమ భావమే ఉంటుంది. అందులో భరతమాతే కన్పిస్తుంది’అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్, సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమస్త హిందూ సమాజాన్ని బాగు చేసే లక్ష్యంతో సంఘ్ ముందుకు సాగుతోందని, ఇందులో ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా కాగడాను తలకిందులు చేసినా, అందులోని మంట ఊర్ధ్యముఖంగా ఉన్నట్లే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజులపాటు జరిగే విజయ సంకల్ప శిబిరంలో భాగంగా రెండో రోజైన బుధవారం సరూర్నగర్ మైదానంలో నిర్వహించిన సార్వజనీన సమ్మేళనంలో ఆయన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను స్పృశిస్తూ సంఘ్ మూల సూత్రాన్ని వివరిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. సార్వజనీన సమ్మేళనానికి భారీగా హాజరైన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్య, శాఖల విస్తరణే లక్ష్యంగా పాతికేళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ సభ నిర్వహించింది. ఈ సభకు పద్మశ్రీ బీవీఆర్ మోహన్రెడ్డి, వివిధ శాఖల ముఖ్య ప్రచారక్లు దక్షిణామూర్తి, రామకృష్ణారావు, సుందరయ్య, పానగిరి సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, మంగేశ్, సుహాసన్రావు, తిప్పే స్వామిజీ, సుధీర్జీ, శ్యామ్ప్రసాద్, సీఆర్ ముకుంద్జీలు హాజరయ్యారు. మనసు నిండా భరతమాతే.. తన కంటే సమాజమే ముఖ్యమని, దాన్ని ప్రగతి పథంలో ఉండాలని కోరుకునే వారి అవసరం ఇప్పుడు ఉందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. స్వాభిమానంతో సంఘటితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే హిందూ సమాజాన్ని నిర్మించటమే సంఘ్ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పయనంలో సత్ఫలితం సాధించినప్పుడే ఆర్ఎస్ఎస్ విజయం సాధించినట్టని చెప్పారు. ‘ఈ భూమి నాది.. దాని శ్రేయస్సే నా శ్రేయస్సు అన్న భావనతో.. ఎలాంటి భేదభావం లేకుండా సమస్త ప్రజలు నావాళ్లు అన్న అభిప్రాయంతో.. భరతమాతనే ఆరాధ్య దైవంగా భావించే వారు హిందువులు’అని తేల్చిచెప్పారు. చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు ఎవరినైనా ఆదర్శంగా తీర్చిదిద్దటమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. నిత్యం ఓ గంట పాటు సంఘ్ కార్యకలాపాల్లో ఉండటమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని సమాజం కోసం అర్పిస్తూ స్వయం సేవకులు ముందుకు సాగుతున్నారని కితాబిచ్చారు. దేవీదేవతల పూజలు పక్కన పెట్టి కేవలం భరతమాత ఆరాధనతో మాతృభూమి కోసం పనిచేస్తేనే మన దేశం విశ్వగురువు స్థానంలో నిలుస్తుందన్న వివేకానంద మాటలను తు.చ. తప్పకుండా పాటించేందుకు, ఆ మార్గంలో తాము పయనిస్తున్నామని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలు కీచులాడుకుని నాశనమవుతారని దేశం విడిచి వెళ్లేటప్పుడు ఆంగ్లేయులు భావించారని, కానీ అలా ఎన్నటికీ జరగదని, ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఏకత్వం వైపు సాగే ఉపాయాన్ని కనిపెడతారని ఆ ఉపాయం పేరే హిందుత్వమని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటలను గుర్తుచేశారు. భారత్ను గొప్ప దేశంగా తీర్చిదిద్దటం ఏ రాజకీయ శక్తి వల్లో.. మరే శక్తి వల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. సమాజాన్ని ఏకత వైపు నడిపించేలా చేసినప్పుడే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఆ శక్తులకు చోటులేదు సమాజంలో తామే సర్వం అనుకుంటూ ఇతరులను హింసిస్తూ, అప్పుడప్పుడూ తాము కష్టపడుతూ, తోటివారిని కష్టపెడుతూ సాధించే రాక్షస విజయాలు అవసరం లేదని పేర్కొన్నారు. అన్నీ తమకే కావాలంటూ ఇతరులను కష్టపెడుతూ తమ విజయం కోసం విధ్వంసాలకు తెగించే వారి ధన విజయాలూ తమకొద్దని, ఈ రెండు శక్తులకు హిందూధర్మంలో చోటు లేదని పేర్కొన్నారు. తమ కోసం కాకుండా ఇతరుల సౌఖ్యం కోసం పనిచేసే వారు సాధించే ధర్మ విజయాలు తమకు ముఖ్యమని, అలాంటి విజయాల కోసమే ఆర్ఎస్ఎస్ కష్టపడుతోందని స్పష్టం చేశారు. మనసులో తమోరజ గుణాల ప్రభావం ఉన్నా, ధర్మ భావంతో వాటిని జయిస్తున్నట్లు వెల్లడించారు. సమాజానికి ఈ లక్షణం చాలా అవసరమన్నారు. సమ్మేళనంలో కిషన్రెడ్డి, రాంమాధవ్, డీకే అరుణ తదితరులు రాజకీయాల ప్రస్తావనే లేకుండా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ వేల మంది సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే ఏవో రాజకీయపరమైన ఘాటు విమర్శలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. జాతీయ జనాభా జాబితా, జాతీయ పౌరుల జాబితా లాంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మోహన్ భాగవత్ మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధగా గమనించటం సహజం. కానీ వేలమందితో ఉన్న సభా వేదికమీదుగా దాదాపు అరగంట పాటు ప్రసంగించినా ఒక్కటంటే ఒక్క పదం కూడా రాజకీయ పార్టీలపై లేకపోవటం గమనార్హం. పరోక్షంగా కూడా ఏ పార్టీ వ్యవహారాన్ని ఎత్తిచూపకుండా కేవలం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలపైనే మాట్లాడటం విశేషం. సరిగ్గా ఆయన ప్రసంగ సమయానికే మత పెద్దల సమక్షంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్తో మంతనాలు జరిపారు. బహిరంగ సభలో పాల్గొన్న వారిలో ఈ అంశం ప్రస్తావన కూడా వినిపించింది. కానీ మోహన్ భాగవత్ మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తప్ప మరో అంశం జోలికే వెళ్లలేదు. ఆర్ఎస్ఎస్ పైన వచ్చే విమర్శలను కూడా రేఖా మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం విశేషం. సమ్మేళనంలో పాల్గొన్న విజయరామారావు, పెద్దిరెడ్డి, మురళీధర్రావు, లక్ష్మణ్, చింతల తదితరులు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి: బీవీఆర్ మోహన్రెడ్డి విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నిజాయితీ, క్షమాగుణం ఇలా అన్ని తన తల్లి వద్దే నేర్చుకున్నానని ప్రముఖ వ్యాపారవేత్త బీవీఆర్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. విలువలు మాత్రమే మనిషిని విజయపథం వైపు నడిపిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఏది మంచో, ఏది చెడో తెలపాలని సూచించారు. మన ప్రవర్తనే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఏదో ఒకటి చదవాలని, పరిస్థితిని బట్టి, అర్థం చేసుకుని, అందుకనుగుణంగా నడుచుకుం టేనే విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే పెద్ద ఎన్జీవో అని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు దేశ ప్రజల ఐక్యతను పెంపొందిస్తోందని పేర్కొన్నారు. సంఘ్సేవకులతో భాగవత్.. ఇబ్రహీంపట్నం రూరల్: సమాజం సంఘటితానికి సంఘ్ కార్యకర్తలు పనిచేయాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ స్వయం సేవకులకు సూచించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లి భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం బుధవారం మధ్యాహ్నం వరకు జరిగింది. మంగళవారం రాత్రి శిబిరానికి చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భారత్ కాలేజీలోనే బస చేశారు. ఉదయం 4 గంటలకు సాధారణ కార్యకర్తలతో పాటే కరసేవ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు శిబిరంలో 2 వేల మంది కార్యకర్తలతో సమావేశమయ్యారు. 10 గంటల నుంచి 11.30 గంటల వరకు యాదాద్రి శిబిరంలో మరో 2 వేల మంది సంఘ్ సేవకులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సాధారణ కార్యకర్తలతో భాగ్యలక్ష్మినగర్ శిబిరంలో భోజనం చేశారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని సభకు మంగళ్పల్లి శిబిరం నుంచి 196 బస్సుల్లో కార్యకర్తలు తరలిపోయారు. భారత్ కళాశాల నుంచి మోహన్ భాగవత్ 2.45 గంటలకు బయల్దేరారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బ్లాక్ క్యాట్ కమాండోలతో పటిష్టమైన బందోబస్తు మధ్య సరూర్నగర్ స్టేడియానికి వెళ్లారు. కదం కదం కదుపుతూ.. స్వయం సేవకుల భారీ కవాతు.. సాక్షి, హైదరాబాద్/మీర్పేట: తెలుపు.. ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో స్వయం సేవకులు భారీ కవాతు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కిసాన్ సంఘ్, ఏబీవీపీలకు చెందిన 7705 మంది స్వయం సేవకులు హస్తినాపూర్, వనస్థలిపురం, సరూర్నగర్, ఇబ్ర ïహీంపట్నం ప్రధాన రహదారులపై కవాతు నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ చేరుకున్నారు. అటు నుంచి 5 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ఈ సభకు తెలం గాణ జిల్లాల నుంచి స్వయం సేవకులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిసిపోయింది. స్వయం సేవకులు ప్రదర్శించిన దండవ్యాయామం, వీరవజ్రాసనం, ఉపనిష్ట వ్యాయామాలు సభలో హైలెట్గా నిలిచాయి. వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, ఝాన్సీలక్ష్మీభాయ్, బీఆర్ అంబేడ్కర్ల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
హిందూ సమాజం శక్తిమంతం కావాలి
ఇబ్రహీంపట్నం రూరల్: హిందూ సమాజం శక్తిమంతం కావాలని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలె శ్యాంకుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చే యడానికి సేవక్లు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్) విజయ సంకల్ప శిబిరం మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆ దిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లి భా రత్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. శిబిరానికి 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్యాంకుమార్ మాట్లాడుతూ.. హిందూ సమా జం వెయ్యేళ్లు బానిసత్వంలో గడపడానికి ప్రధాన కారణం హిందువుల అనైక్యతే అన్నారు. ప్రతి హిందువు ఈ భూమిని రక్షిస్తూ.. దర్మాన్ని కాపాడుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ స హ్ కార్యవాహ్ ముకుందా, క్షేత్ర సహ సంఘ చాలక్ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘ చాలక్ దక్షిణామూర్తి, ఎంపీలు బండి సంజయ్, అరి్వంద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ హాజరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం సాయంత్రం శిబిరానికి హాజరయ్యారు. బుధవారం ఉదయం 5 గంటలకు స్వయం సేవక్ల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ కార్యక్రమం
-
ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలతో రాష్ట్రంలో 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిం చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఉనికి కనిపిస్తున్నా మొత్తంగా చూస్తే మాత్రం నామ మాత్రంగానే ఉంది. హిందుత్వ భావ జాలాన్ని గ్రామస్థాయి వరకు తీసు కెళ్లేందుకు తెలంగాణ అను వైన ప్రాంత మే అయినా ఇప్పటిదాకా తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావనతో ఇప్పుడు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. 2025కి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని ఘనంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ శివార్లలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగ ణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ హాజరు కానున్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే దాదాపు ఏడున్నర వేల మంది కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి.... రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం దాని ప్రత్యేకత. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆర్ఎస్ఎస్ తాజా ఆలోచన. దీనిపై మోహన్ భగవత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు లక్షల సభ్యత్వాల్లో సగం విద్యార్థులవి ఉండేలా చూడనున్నారు. ఇందుకోసం వారిని ఆకట్టుకునే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. సామాజిక అంశాలకు సంబంధించి పర్యావరణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విరివిగా మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సమ రసత కార్యక్రమం పేరుతో గ్రామాల్లో అన్ని కులాల వారు ఆలయ పూజల్లో పాల్గొనేలా చేయడంతోపాటు ఊరంతటికీ ఒకే శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఇక గ్రామ వికాస కార్యక్రమాల పేరిట మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి రక్షణగా ఉండటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోవుల వృద్ధిపై ముమ్మర ప్రచారం చేయనుంది. స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహించనుంది. కుటుంబాల్లో కలతల నివారణ, వృద్ధుల ఆదరణ, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించే కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. సోషల్ మీడియా అనర్ధాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. తద్వారా ప్రజలకు చేరవయ్యేలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత... ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ స్థానికంగా ముఖ్య శిక్షక్, ఆపై కార్యకర్తలకు శిబిరాలు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్లలో వాటిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. 2017లో కరీంనగర్లో సాధారణ శిబిరం, ఘట్కేసర్ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా రాష్ట్రవ్యాప్త శిబిరం మాత్రం ఇప్పుడే జరగనుంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు 2,500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,200కు పెరిగింది. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యం. శిబిరంలో భద్రాద్రి నగరం, యాదాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, జోగులాంబ నగరం, భాగ్యలక్ష్మి నగరం పేరుతో ఐదు విభాగాలు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే కార్యకర్తలకు బస ఏర్పాటు చేశారు. 24న ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశాలు ఉంటాయి. 25న ఉదయం సమావేశం తర్వాత కార్యకర్తలు నాలుగు మార్గాల్లో ఎల్బీ నగర్కు, అక్కడి నుంచి కవాతు ద్వారా సరూర్నగర్ మైదానానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు కూడా ఆయన ప్రధాన వేదిక మీదుగా మరోసారి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు శ్యామ్కుమార్, నాగరాజు, దూసి రామకృష్ణ, తిప్పేస్వామి, దక్షిణామూర్తి, కాచం రమేశ్, దేవేందర్ తదితరులు హాజరుకానున్నారు. -
పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు. కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే విభజించబడిందని పేర్కొన్నారు. మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. नागरिकता संशोधन कानून का प्रस्ताव लोकसभा और राज्यसभा में रखा गया और वह बहुमत से पारित हुआ। इस पहल के लिए, इस साहसिक कदम के लिए, हम केंद्र सरकार का और विशेषतः प्रधानमंत्री और गृहमंत्री जी का हृदय से अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं। - सरकार्यवाहhttps://t.co/UfcVpZLDID pic.twitter.com/dUgs9Kvu12 — RSS (@RSSorg) December 12, 2019 ‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు. -
మహా రగడపై ఆరెస్సెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు ఏ అంశంపై కీచులాటలకు దిగినా అది ఇరు పార్టీలకు నష్టమని బీజేపీ, శివసేనల విభేదాలను ప్రస్తావిస్తూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. స్వార్ధం అనేది చేటని ప్రతిఒక్కరికీ తెలిసినా చాలా కొద్ది మందే తమ స్వార్ధాన్ని విడనాడతారని నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అధికార పంపకంపై బీజేపీ, శివసేనల ఘర్షణతో ఇరు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువులోగా ఏ ఒక్క పార్టీ ముందుకురాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ వ్యతిరేకించడంతో ఇరు పార్టీలతో కూడిన కూటమికి తూట్లు పడగా, తాజాగా ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ఆయన ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి: ప్రియాంక
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న నాయకుడు లేడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. భారత మాజీ హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. పటేల్ జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాలను గౌరవించేవాడని పేర్కొన్నారు. కాగా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను బీజేపీ పాటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు పటేల్కు సన్నిహితుడైన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించేవారని తెలిపింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పటేల్ను కాంగ్రెస్ విస్మరించిందంటూ బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. -
‘మహా’నేత ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు (49) అసంతృప్తి లేనప్పటికీ... పూర్తి సంతృప్తిగా లేరని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 102 స్థానాలకే పరిమితమైంది. కాకపోతే మిత్రపక్షం శివసేనతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. నాగపూర్ సౌత్వెస్టు స్థానం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ గెలుపొందారు. మహారాష్ట్రలో రెండోసారి గెలిచిన తొలి కాంగ్రెసేతేర ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. రాష్ట్రంలో పూర్తికాలం పదవిలో కొనసాగిన రెండో ముఖ్యమంత్రి కూడా ఆయనే!!. కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో (ఆర్ఎస్ఎస్) సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో 1970 జూలై 22న జన్మించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ ఫడ్నవీస్ స్వస్థలం. ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. దాంతో సహజంగానే దేవేంద్ర కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చదివారు. 1990వ దశకంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1992, 1997లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. నాగపూర్లో అత్యంత పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు సృష్టించారు. 1999, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ సౌత్వెస్టు స్థానం నుంచి నెగ్గారు. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు ఆయన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడ్డాయి. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదవిలో కొనసాగారు. అనేక సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ దేవేంద్ర ఫడ్నవీస్ సొంతం. ఫడ్నవీస్ భార్య అమృత బ్యాంకర్గా పనిచేస్తున్నారు. -
‘మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి?’
సర్వేజనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ!.. సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖ మాప్నియా!! లోకః సమస్తా సుఖినో భవంతు... అంటే సర్వజనులు ఎలాంటి బాధలు లేకుండా సుఖశాంతులతో జీవించాలని హిందుత్వం అభిలాషిస్తుంది. అంటే భారతీయులో, హిందువులో మాత్రమే సుఖ శాంతులతో జీవించాలని హిందుత్వం కోరుకోవడం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే విశాల దృక్పథాన్ని ప్రబోధించేది హిందుత్వం. కాబట్టే 1983లో చికాగో (అమెరికా)లో జరిగిన సర్వమత సమ్మే ళనంలో స్వామి వివేకానంద హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెప్పిన తర్వాత ఎంతోమంది క్రైస్తవ మత ప్రబో ధకులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘మరి మతం మారితే అభ్యంతరమేల?’ అనే వ్యాసం (అక్టోబర్ 10, 2019) చదివిన తర్వాత ఆయన వైఖరి సమాజంలో భేద భావాలు పెంచే విధంగా ఉండటంతో నేను కొన్ని వాస్త వాలు తెలియజేయాలని ఈ వ్యాసం రాస్తున్నాను. విదేశీయులెందరో ముఖ్యంగా పాశ్చాత్యులు హిందు త్వంలోకి మారి హిందూ ఆరాధనా పద్ధతులు ఆచరిం చడం, హిందూ దేవుళ్లను పూజించడం సాధారణమైంది. అందుకే ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, ఇస్కాన్ లాంటి సంస్థలెన్నో విదేశాల్లో ప్రాచుర్యం, ప్రజాదరణ పొందుతు న్నాయి. ఎంతోమంది విదేశీయులు భారతీయ విధానంలో వివాహాలు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా ఆచరిస్తున్న వారెవ్వరినీ ఇంకెవరో ప్రలోభపెట్టో, మోసం చేసో, మరే విధంగానైనా ఒత్తిడి చేసో హిందుత్వ విధానాలు ఆచరింప జేయట్లేదనేది అక్షర సత్యం. ఇక కంచ ఐలయ్య పేర్కొన్న ఆరెస్సెస్ పుస్తకం విష యానికి వస్తే అందులో అలాంటి విషయాలెన్నో ఉన్నా కేవలం క్రైస్తవ మహిళల అక్షరాస్యత అంశాన్ని మాత్రమే తీసుకొని తన భావాలకు అనుగుణంగా వక్రీకరించి రాయ డం ఆయన హ్రస్వ దృష్టిని సూచిస్తోంది. హిందుత్వం ఎక్కడ మంచి ఉన్నా తనలో ఇనుమడింపజేసుకుంటుంది. అలాగే ఆరెస్సెస్ కూడా. అందుకే 1925లో విజయదశమి రోజు కేవలం 10–18 మంది చిన్నపిల్లలతో కలిసి డా. హెడ్గేవార్ నాటిన విత్తు క్రమపద్ధతిలో పెరిగి మొక్క అయి, వృక్షమై, ప్రస్తుతం వట వృక్షమై విశ్వవ్యాప్తమైంది. అలాంటి ఆరెస్సెస్ గతంలో కూడా ఎన్నో మంచి విషయాలను లోకానికి తెలియజేసింది. వాటిని కూడా ఆయన పేర్కొంటే బాగుండేది. క్రిస్టియానిటీ స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది అని రాశారు. అందులో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. తప్పులేదు. కానీ హిందుత్వంలో స్త్రీ పురుష అసమానత్వం అనే ఆలో చనే లేదు. కాబట్టే ‘యత్ర నార్యన్తు పూజ్యతే రమంతే తత్రదేవతా’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడ తారో అక్కడే దేవతలు విహరిస్తారు అని హిందుత్వం స్పష్టంగా ప్రబోధిస్తుంది. త్రిమూర్తులే కాదు. భారతీయు లంతా భూమిని భూదేవిగా, భారతమాతగా, గంగానదిని గంగామాతగా, ప్రకృతిని ప్రకృతి మాతగా పిలుస్తారు. అంటే స్త్రీని తల్లిగా భావించి గౌరవించడం, పూజించడం ఒక్క హిందుత్వంలోనే ఉంది. అంటే పురుషుడికంటే ఉన్న తమైన స్థానంలో అనాదిగా మహిళలు గౌరవింపబడుతు న్నది భారతదేశంలోనే. అంతేకాదు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఒక సంద ర్భంలో భారత దేశంలో మహిళల పరిస్థితిని గురించి వివ రిస్తూ, పురుషుల కంటే ఉన్నత స్థానంలో ఉన్నారని, కాబట్టి స్త్రీ పురుష అసమానత్వం అనేది భారతదేశంలోని మహి ళలకు వర్తించదనడం భారత్లో మహిళలకు ఉన్న గౌరవ ప్రతిష్టలను తెలియజేస్తుంది. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం భారత్లో అక్షరాస్యత అధికంగా ఉండేది. ప్రతి ఒక్కరికి గురుకులాలు అందుబాటులో ఉండేవి. బ్రిటిష్వారు ఇక్కడి విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. వేద విజ్ఞానాన్ని నాశనం చేశారు. గణితంలో కీలకమైన ‘0’ (సున్నా)ని కను గొన్నది భారతీయుడే. ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది శుశ్రూతుడు కాగా, ఆర్యభట్ట పేరు గడించిన ఖగోళ శాస్త్ర వేత్త అనే విషయం మనకు తెలిసిందే. బ్రిటిష్ వారి కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మత మార్పి డులకు పాల్పడ్డారు. వారి పాపకార్యం ఇప్పటికీ కొనసాగు తోంది. నిరక్షరాస్యులైన, అమాయకులైన దళితులను, గిరి జనులను, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కష్టాల్లో ఉన్న వారిని వివిధ రకాలుగా ప్రలోభపెట్టి, మోస పూరిత విధానాలతో వారిని క్రైస్తవులుగా మారుస్తున్నది నిజం కాదా? భారత రాజ్యాంగంలో ప్రతిపౌరుడూ తనకి ష్టమైన మతాన్ని, పూజా విధానాన్ని ఆచరించే అవకాశం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొంది. క్రైస్తవుల్లో అక్షరాస్యత ఎక్కువుంటే అందరూ క్రైస్తవులుగా మారితే తప్పేంటి? ఆరెస్సెస్ ఇందుకు అంగీకరించాలి. దేశంలో ఉన్న మత మార్పిడుల నిషేధ చట్టాలన్నీ తొలగించాలంటున్నారు. మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి. ఆరెస్సెస్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు స్పష్టమైన, భారతదేశానికి అవసరమైన విధానాలనే ఆచరిస్తుంది, తెలి యజేస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ సంపదను దోచుకుతింటూ విదేశాలకు జైకొట్టే, విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దేశ వ్యతిరేకులెవరైనా, వారు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా చివరికి హిందువు లైనా ఆరెస్సెస్సే కాదు దేశభక్తులెవరూ సహించరు. ప్రతి వ్యక్తిలో, ప్రతి మతంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి విషయంలో మంచి చెడులుండటం సహజం. అలాగే క్రైస్తవంలో ఉన్న ఒకే ఒక మంచి విషయాన్ని పట్టుకొని మిగిలిన మతాలవారు క్రైస్తవంలోకి రావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లకు లోనై కూడా ఇప్పటికీ అజరామరంగా విరాజిల్లుతున్న, అత్యున్నతమైన జీవన విధానాన్ని అందిస్తున్న హిందుత్వం లోకే క్రైస్తవులు (గతంలో వీరంతా హిందువులే) తిరిగి వస్తే తప్పేంటి? కంచ ఐలయ్య లాంటి వారు మతం మారినంత మాత్రాన హిందువులుగా మరణించిన వారి పూర్వీకుల ఆత్మలు ఘోషించవా? ఇప్పటికైనా మతం మారాలనుకునే ప్రతి ఒక్కరూ వారి పూర్వీకుల మతం పరిస్థితి ఏంటి? అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (ప్రొఫెసర్ కంచ ఐలయ్య 10–10–2019(గురువారం) సాక్షి సంచికలో రాసిన వ్యాసానికి స్పందన) వ్యాసకర్త: శ్యాంసుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్ట్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్ చదవండి: మరి మతం మారితే అభ్యంతరమేల? -
సంక్షోభాల పరిష్కర్త ఎక్కడ?
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి నాడు నాగ్పూర్లో చేసిన ప్రసంగంలో దత్తోపంత్ తెంగడిని గురునానక్, మహాత్మాగాంధీలతో సమస్థాయినిచ్చి ప్రస్తావించారు. తెంగడి ఎవరో కాదు. వాజ్పేయి ఆరేళ్ల పదవీకాలంలో ఆయన ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన బలమైన ఆరెస్సెస్ నేత. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై తెంగడి నాడే ధ్వజమెత్తారు. కానీ నేడు నరేంద్రమోదీ వాజ్పేయి కంటే మించిన వేగంతో ప్రైవేటీకరణకు, పీఎస్యూల వేగంవైపుగా అడుగులేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉంది. తెంగడి వారసుడిగా స్వదేశీని బలంగా ప్రస్తావిస్తున్న భాగవత్.. మోదీతో తలపడతారా అన్నది ప్రశ్నార్థకమే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత, సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ నాగ్పూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆరెస్సెస్ విజయదశమి ఉత్సవాల్లో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగానికి సాధారణంగానే ప్రాచుర్యం ఉంటుంది. కానీ బీజేపీ రెండో దఫా కూడా భారీ మెజారిటీ సాధించి అధికారంలో ఉంటున్నప్పుడు ఆయన చేసే ప్రసంగానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆరెస్సెస్ కీలక వ్యవహారాలుగా భావిస్తున్నవాటిని ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నప్పుడు ఆయన ప్రసంగానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్యలో రామమందిరం వీటిలో కొన్ని. దశాబ్దకాలంగా ఆరెస్సెస్ అధినేతగా ఉంటున్న మోహన్ భాగవత్ మూకదాడుల సమస్య, హిందూ ఎవరు అనే ప్రశ్నకు నిర్వచనం ఇవ్వడం, భారతీయుడు ఎవరు వంటి అంశాలను తడిమినందున ఈ సంవత్సరం విజయ దశమి ప్రసంగంతో మరింతగా వార్తల్లోకి ఎక్కారు. వీటిపై ఆయన వాదనలు వివాదాస్పదమైనవి, అందుకే అవి మరీ ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ఒక ముఖ్య అంశంపై ఆయన సుదీర్ఘంగా నొక్కి చెప్పిన అంశం మరుగున పడిపోయింది. ఆయన చేసిన ఆ 63 నిమిషాల ప్రసంగంలోని కొన్ని భాగాలను మీరు విన్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన ప్రసంగ వీడియోలోని తొలి నిమిషం, తర్వాత 28 నుంచి 42 నిమిషాల వరకు గల ప్రసంగ పాఠంలో తనదైన ఆర్థిక తత్వశాస్త్రాన్ని మీరు చూడవచ్చు. వీడియో ప్రారంభ క్షణాల్లోనే కీలకమైన అంశం ఉంది. ఇద్దరు ప్రముఖ, సుప్రసిద్ధ భారతీయుల వార్షికోత్సవాలను పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అవి గురునానక్ 550 జయంతి, మహాత్మాగాంధీ 150వ జయంతి. ఆరెస్సెస్–బీజేపీ వ్యవస్థకు అవతల ఉన్నవారికి లేదా భారత రాజకీయాలను సన్నిహితంగా అధ్యయనం చేస్తూ అనుసరిస్తూ ఉన్నవారికి భాగవత్ పేర్కొన్న మూడో ప్రముఖ వ్యక్తి అయిన దత్తోపంత్ తెంగడి గురించి తెలుసంటే నేను నమ్మలేను. దత్తోపంత్ శత జయంతి త్వరలో అంటే నవంబర్ 10న ప్రారంభమవుతుందని భాగవత్ పేర్కొన్నారు. ఈ పేరు పెద్దగా పరిచితమైన పేరు కాదు. పైగా గురు నానక్, గాంధీల తరహా లీగ్లో ఆయన లేరు. కానీ ఈ ఇద్దరి పక్కన ఆయన్ను ప్రస్తావించాల్సినంత ప్రాముఖ్యత మాత్రం ఆయనకుంది. ఆ వీడియోలో ఆ 14 నిమిషాల్లోని రెండో భాగాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఆయన ప్రస్తావన అప్రాధాన్యమైనది కాదని, మాటవరుసకు చెప్పింది కాదని అర్థమవుతుంది. నాగ్పూర్కు ఏమంత దూరంలో లేని వార్ధాలో 1920లో జన్మించిన తెంగడి ఆధునిక (స్వాతంత్య్రానంతర) ఆరెస్సెస్ వ్యవస్థాపక నిర్మాతల్లో ఒకరు. ఆరెస్సెస్ రెండు రాజకీయ అవతారాలైన భారతీయ జన సంఘ్, భారతీయ జనతా పార్టీ రెండింటి భావజాలానికి కూడా ఆయనను ప్రతినిధిగా చెప్పవచ్చు. అర్థశాస్త్రం ఆయనకు ఇష్టమైన అంశం. ప్రత్యేకించి భారత్ తన ఆర్థిక వ్యవస్థ తలుపులను తెరిచి వేసిన గత 30 ఏళ్లలో మరే ఇతర దృక్పథాల కంటే ఆయన ఆలోచనాధారే ఆరెస్సెస్ ఆర్థిక ప్రపంచ దృక్పథాన్ని నిర్వచించింది. తెంగడి, అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి ప్రయాణించారు. ఇద్దరూ కలిసి 1955లో భారతీయ మజ్దూర్ సంఘ్ని భోపాల్లో నెలకొల్పారు. కానీ, వాజ్పేయి ఆరేళ్ల పాలనలో వీరిరువురు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, దిగుమతి సుంకాల తగ్గింపు, ఎఫ్డీఐలకు తలుపులు తెరవడం వంటి అంశాల్లో వాజ్పేయి తీసుకున్న ప్రతినిర్ణయాన్నీ తెంగడి వ్యతిరేకించారు. ఒక దశలో ఆయన యశ్వంత్ సిన్హాను మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ ఇదే సిన్హా తర్వాత ఆర్థిక మంత్రిగా సంస్కరణలను ముందుకు తీసుకుపోయారు. తెంగడి డిమాండును వాజ్పేయి సంవత్సరం పాటు ప్రతిఘటించారు కానీ తర్వాత వెనక్కు తగ్గారు. ఆరెస్సెస్లో తెంగడికి చాలా బలం ఉండేది. ఆయ నకు అరుణ్ శౌరీ అంటే కూడా గిట్టేది కాదు. సుప్రీంకోర్టు ఒక తీర్పులో పాత సోషలిస్టు ఆలోచనలను ఎత్తిపట్టినప్పుడు తెంగడి నిజంగానే పండగ చేసుకున్నారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా అమ్మదలిచినప్పుడు పార్లమెంటరీ ఆమోదం పొందాలని సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది. వాజ్పేయి ప్రభుత్వం రెండు అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్ను పక్కన పెట్టినప్పుడే ఇది జరిగిందని మనం గుర్తించాలి. తెంగడిది ఒంటరి వాణి కాదు. ఆయన తొలి బిడ్డ అయిన భారతీయ మజ్జూర్ సంఘ్ వాజ్పేయి సంస్కరణల శకాన్ని వామపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ కంటే గట్టిగా నిరసించింది. ఈలోగా ఆయన మరోరెండు శక్తివంతమైన ప్రెషర్ గ్రూప్లను ఏర్పర్చారు. ఒకటి, 1979లో రైతుల కోసం స్థాపించిన భారతీయ కిసాన్ సంగ్. మరొకటి 1991లో స్థాపించిన స్వదేశీ జాగరణ్ మంచ్. ఈ సంస్థ ఇవాళ మనకు బాగా పరిచయమే. 1991 అంటేనే నాటిప్రధాని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు ప్రారంభించిన సంవత్సరం అని గుర్తుండే ఉంటుంది. వెనువెంటనే స్వదేశీ జాగరణ్ మంచ్ డంకెల్ డ్రాఫ్ట్తో మొదలైన వాణిజ్య ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ స్వరాన్ని నిర్మించడం మొదలెట్టింది. వాజ్పేయి హయాం ముగిసేనాటికి ఇరువురి సంబంధాలు స్పష్టంగా దిగజారిపోయాయి. ఏదైనా కొత్త భావనను ప్రస్తావించదల్చినప్పుడల్లా, వాజ్పేయి ఇప్పుడు తెంగడిని ఆపేదెవరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. అంత తీవ్రమైన పోరు కొనసాగినప్పటికీ వాజ్పేయి బీటీ పత్తి విత్తనాలకు అనుమతి మంజూరు చేశేసారు. 2004లో ఇరువురి మధ్య పోరాటం ముగిసింది. ఆ ఏడు మే నెలలో వాజ్పేయి అధికారం కోల్పోయారు. అక్టోబర్ 14న తెంగడి కన్ను మూశారు. బహుశా వామపక్షాల నియంత్రణలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ప్రయివేటీకరణను తుంగలో తొక్కుతుందని, తాను కోరుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందన్న విశ్వా సంతోటే తెంగడి నిష్క్రమించి ఉంటారు. ఆర్థిక వ్యవస్థపై భాగవత్ 14 నిమిషాల వార్షిక ప్రసంగం గురించి ఇప్పుడు కాస్త మెరుగుగానే అర్థం చేసుకోగలం కూడా. భాగవత్ ప్రసంగం సారాంశం ఇంది. ఆర్థిక సంక్షోభం ఉంది కానీ దానికి మరీ ఎక్కువ విలువ ఇవ్వవద్దు. వృద్ధికి జీడీపీనే కొలబద్ద కాదు. అవినీతిపై కొరడా ఝళిపించండి కానీ అమాయకులను బలి చేయవద్దు. మనం స్వదేశీని నమ్ముతాం. అలాగని మనం ప్రపంచం నుంచి వేరుగా ఉండలేం. వాణిజ్యం గ్లోబల్ కావచ్చు కానీ మనం తయారు చేయలేని, మనకు అవసరమైన సరుకులను మాత్రమే కొనాలి. భారతీయ గోజాతి నుంచి వృద్ధి చేసిన బ్రెజిల్ హైబ్రిడ్ గోవు వీర్యాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? స్వదేశీ వీర్యాన్నే ఉపయోగించండి. ఇదీ భగవతి ప్రసంగ సారం. తర్వాత ఆయన ఎగుమతులు మంచివని, దిగుమతులు చెడ్డవని కూడా మాట్లాడారు. భాగవత్ మాట్లాడిన మాటల సారాంశం మొత్తంగా ప్రామాణికమైన తెంగడినమిక్స్ (తెంగడి ప్రతిపాదించిన ఆర్థిక శాస్త్రం)లో భాగమే. 2008 తర్వాత తీవ్రస్థాయిలో కొనసాగుతున్న భారతీయ ఆర్థిక పతనంతో మోదీ ప్రభుత్వం సాగిస్తున్న సమరాలు, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, చేసిన వాగ్దానాలతో భాగవత్ ప్రసంగం విభేదిం చింది. మోదీ ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో ఎఫ్డీఐలను ఆహ్వానించింది. ప్రత్యేకించి అమెరికాతో పలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. వాణిజ్య ఒప్పందాలు, పీఎస్యూల అమ్మకాలను స్వదేశీ జాగరణ్ మంచ్ వ్యతిరేకించింది. కానీ, ప్రతి రంగంలోనూ మోదీ ప్రభుత్వం భాగవత్ ప్రసంగానికి వ్యతిరేక దశలోనే చర్యలు తీసుకుంది. వాజ్పేయికి నవ్వు తెప్పించి ఉండేది, తెంగడికి కోపం తెప్పించి ఉండేది ఇదే కదా. వాజ్పేయి 2003లో చేయలేకపోయిన దాన్ని మోదీ ఇప్పుడు సులభంగా చేస్తూ అతిపెద్ద చమురు సంస్థ అయిన బీపీసీఎల్ను అమ్మకానికి పెట్టేశారు. స్వదేశీ ఆర్థికశాస్త్రాన్ని అంత వివరంగా ముందుకు తీసుకురావడం ద్వారా భాగవత్ కేంద్రప్రభుత్వంతో తలపడటానికి ఆసక్తి చూపుతున్నారని మనం చెప్పలేం. వాజ్పేయి, మోదీ మధ్య అధికారానికి సంబంధించిన వ్యత్యాసాల రీత్యా ఇది సాధ్యపడదేమో కానీ అసాధ్యం కాకపోవచ్చు కూడా. మన ఆశ ఏమిటంటే.. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనం చెందుతున్న తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఉత్తమంగా దేశాన్ని, మనల్నీ గట్టెక్కించే తరహా సిద్ధాంతాన్ని ఇంకా కనుగొనవలసి ఉందన్నదే. శేఖర్గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
నాగపూర్లో ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలు
-
కోటాపై మళ్లీ దుమారం
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మళ్లీ ‘కోటా’ తుట్టె కదిలించారు. రిజర్వేషన్లపై సమాజంలో సామరస్యపూర్వకమైన చర్చ జరగాలంటూ ప్రతిపాదించారు. దీని పై వెంటనే చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగడంతో ఆరెస్సెస్ వివరణ ఇచ్చింది. సంక్లిష్టమైన అంశాలను సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవాలన్నదే ఆయన ఉద్దేశమని చెప్పింది. వివిధ వర్గాలకు ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లను తాము సంపూర్ణంగా సమర్థిస్తున్నామని ప్రకటించింది. నాలుగేళ్లక్రితం కూడా మోహన్ భాగవత్ ఇటువంటి వివాదాన్నే రేపారు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పట్లో బీజేపీ నేతలు ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని ఆదరాబాదరాగా ప్రకటించగా, ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశం వేరని ఆరెస్సెస్ వివరించింది. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రిజర్వేషన్ల విషయంలో దాని అనుకూలురు, వ్యతిరేకులమధ్య చర్చ జరుగుతున్నదని, అది సామరస్యపూర్వకంగా లేదని భాగవత్కు ఎందుకు అనిపించిందో తెలియదు. నిజానికి ఈ అంశంపై గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా చర్చలేదు. పోటాపోటీ ఉద్యమాలు, వాగ్యుద్ధాలు జరగటం లేదు. పైపెచ్చు ఒకప్పుడు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు తమకూ ఆ మాదిరి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాయి. గుజరాత్లో ఒకప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన పటేళ్లు తమకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిపత్య కులాలవారు తమకు కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుండటం వర్తమాన పరిస్థితి. అలాగే బీసీ కులాల జాబితాల్లో ఉన్న కొన్ని కులాలు తమను షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంటే, కొందరు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లను వర్గీకరించాలని, ఆ ఫలాలు తమకు కూడా దక్కేందుకు చర్యలు తీసుకోవాలని అట్టడుగు కులాల్లో బాగా దిగువన ఉండిపోయిన కొన్ని కులాలు కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రిజర్వేషన్లు ఆశిస్తున్నవారే ఎక్కువ. అందుకోసం పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు సాగుతున్నాయి. ఇలా కొత్తగా వస్తున్న డిమాండ్లను గమనించి కొన్ని రాష్ట్రాలు కోటాకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని గతంలో కోరాయి. ఈ ఏడాది మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. పర్యవసానంగా రిజర్వేషన్ల శాతం సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొన్న జూన్లో బొంబాయి హైకోర్టు ఆమోదిస్తూనే స్వల్పంగా సవరించింది. పర్యవసానంగా అక్కడి కోటా 65శాతానికి చేరింది. మన దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలవారు సామాజికంగా నిరాదరణకు లోనవుతున్నారని, అటువంటి వర్గాలను ఆదుకోవడానికి, ఉద్ధరించడానికి తగిన చర్యలు అవసరమని బ్రిటిష్ పాలన సమయంలోనే గుర్తించారు. అప్పట్లోనే కొన్ని అట్టడుగు కులాలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాలను తగ్గించడానికి ఇది తప్పనిసరనుకున్నారు. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ విధంగానే భావించారు. కనుకనే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. నిజానికి అప్పట్లోనే సామాజికంగా వెనకబడి ఉన్న కులాలకు కూడా ఈ సదుపాయం కల్పించి ఉంటే వేరుగా ఉండేది. కానీ అది జరగడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం కుల వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అది చాలా చురుగ్గా పనిచేసి ఆ మరుసటి ఏడాదికల్లా సమగ్రమైన నివేదిక సమర్పించింది. దాదాపు మరో పదేళ్ళకు గానీ మండల్ కమిషన్ నివేదికకు మోక్షం కలగలేదు. 1989లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల హింస చెలరేగింది. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చిత్రమేమంటే అప్పట్లో ఆందోళన చేసిన కులాలే దాదాపు అన్నిచోట్లా తమకూ కోటా కల్పించాలని కోరుతున్నాయి. ఏతావాతా రిజర్వేషన్ల విషయంలో వ్యక్తులుగా ఎవరికెలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చుగానీ... వాటిని రద్దు చేయాలని కోరే కులాలు, సంస్థలూ, పార్టీలూ ఇప్పుడు దాదాపు లేవు. కనుకనే మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సామరస్యపూర్వక చర్చ జరగాలనే ముందు సంస్థగా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరేమిటో భాగవత్ చెప్పివుంటే సరిపోయేది. ఆయన అస్పష్టంగా ఏదో ఒకటి అనడం, అనంతరం దానిపై దుమారం రేగడం, ఆ తర్వాత సంస్థ తరఫున ఒక వివరణ రావడం సహజంగానే సంశయాలను రేకెత్తిస్తుంది. విపక్షాల సంగతలా ఉంచి, బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సైతం రిజర్వేషన్లపై చర్చ వృథా అంటున్నారు. రిజర్వేషన్లు అవసరమా, కాదా అనే అంశం చర్చనీయాంశమే కాదంటున్నారు. రిజర్వేషన్ల ఆలోచనకు మూలమైన కుల వివక్ష, అసమానతలు మన దేశంలో పూర్తిగా అంతరించాయా లేదా అన్న అంశంపై చర్చ జరగాలి. అప్పుడు ఈ రిజర్వేషన్లను కొనసాగించాలో లేదో నిర్ణయించుకోవడం పెద్ద కష్టం కాదు. -
పాక్ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం
సియోల్: పాకిస్తాన్ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం దక్షిణకొరియా రాజధాని సియోల్లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లారు. అయితే అక్కడ పాక్ మద్దతుదారులు కొందరు భారత్కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో షాజియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు. షాజియా నిరసనకారుల భావోద్వేగాలపై స్పందిస్తూ.. ‘ఆర్టికల్ 370 రద్దు చేయడంపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు కానీ, మొత్తం దేశాన్ని నిందించడం సబబు కాదు. ఈ అంశం మాదేశ అంతర్గత సమస్య. దీనిపై మాట్లాడే హక్కు కూడా వారికి లేదు. కొన్ని దేశాలలో కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. నిరసన తెలిపే హక్కును ఎవరైనా సక్రమంగా వినియోగించుకోవాలి. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తే ఏ పరిణామాన్నైనా నేను దైర్యంగా ఎదుర్కొంటాన’ని అన్నారు. కాగా నిరసనకారుల తీవ్రత దృష్ట్యా పోలీసులు షాజియాను, ఆమె సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. -
కశ్మీర్పై మళ్లీ చెలరేగిన ఇమ్రాన్
ఇస్లామాబాద్ : ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ భారత్పై బౌన్సర్ల ధాటి కొనసాగిస్తూనే ఉన్నారు. కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చే క్రమంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఆరెస్సెస్ను నాజీతో పోల్చిన ఇమ్రాన్ హిందూ ఆధిపత్య ధోరణి కలిగిన ఆరెస్సెస్ కనుసన్నల్లో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. "నాజీ ఆర్యన్ ఆధిపత్యం వలె హిందూ ఆధిపత్యంతో కూడిన ఆరెస్సెస్ భావజాలంపై తాను కలత చెందుతున్నానని వరుస ట్వీట్లలో ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇది భారత్లో ముస్లింలను అణచివేయడానికి దారితీసి చివరికి పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జమ్మూ కశ్మీర్ పరిణామాలు భారత అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంతో పాటు తాము తీసుకున్న నిర్ణయాలతో ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం కనుమరుగై ప్రగతి సాధ్యమవుతుందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. -
నిరంకుశ పోకడకు ఇది నిదర్శనం
లోక్సభలో తాజాగా ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. ఎమర్జెన్సీలో అకారణంగా అరెస్టుల పాలై నాటి జనసంఘ్, ఆరెస్సెస్లకు చెందిన వేలాది కార్యకర్తల జీవితాలు ఛిద్రమైన చరిత్ర మరవకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపా పేరిట నిరంకుశ చట్టానికి మరిన్ని కోరలు తొడిగి బిల్లుకు ఆమోదం పొందటం గర్హనీయం. వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఈ సవరణ చట్టం అవకాశం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం భారతదేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్య. ఇంత నిరంకుశ చట్టాన్ని తీసుకొచ్చినా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అసాధ్యం. టెర్రరిజం, నక్సలిజం మూలాలను పట్టించుకోకుండా క్రూర చట్టాలతో వాటిని అంతం చేయడం అసంభవం, అసాధ్యం. అది 1975. ఎమర్జెన్సీ ప్రకటించిన కాలం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో నూకల రామచంద్రరావు హిందీ లెక్చరర్. ఆయన స్వతహాగా మంచి వ్యక్తి. తన పని తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకొనేవాడు కాదు. కాలేజీలో జరిగే సామాజిక, రాజకీయ అంశాల్లో కనీసం చర్చల్లో కూడా పాల్గొనే తత్వం కాదాయనది. అయితే అదే కళాశాలలో కొంత మంది లెక్చరర్లు సామాజిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. అందులో ఘనశ్యాంప్రసాద్, నిట్టల రామ దాస్లతో పాటు మరికొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఎస్.కే.బీ.ఆర్ కళాశాల మీద పోలీసులు నిఘా వేయడానికి అదే కారణం. ఇందులో ఘనశ్యాం ప్రసాద్, నేటి బీజేపీ కీలక నేత రాం మాధవ్కు గురువులాంటి వారని చెపుతుంటారు. అలాగే అమలాపురంలో నూకల రామచంద్రమూర్తి అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవారు. అయితే ఆయన లెక్చరర్ కాదు. నూకల రామచంద్రమూర్తి పేరు పోలీసుల లిస్టులో ప్రముఖంగా ఉంది. నూకల రామచంద్రమూర్తి, ఎస్.కే.బీ.ఆర్ కళాశాలలో హిందీ లెక్చరర్గా పనిచేస్తోన్న నూకల రామచంద్రరావు ఒక్కరే అని పోలీసులు పొరపాటు పడ్డారు. హిందీ లెక్చరర్ నూకల రామచంద్రరావును ఆనాటికే అమ లులో ఉన్న ‘మీసా’ (ఆంతరంగిక భద్రతా చట్టం) కింద అరెస్టు చేశారు. ఆయనా, ఈయనా ఒకరు కాదని, ఎవ్వరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు పది నెలలకు పైగా ఆ అమాయకుడైన హిందీ లెక్చరర్ని ఆరెస్సెస్ కార్యకర్త స్థానంలో జైల్లో పెట్టారు. ఆయనకు ఆరెస్సెస్తోగానీ, మరే ఇతర సంస్థలతోగానీ సంబంధంలేదు. పది నెలలు ఏ నేరం చేయకుండా, ఎటువంటి రాజ కీయాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్బంధంలో ఉన్న రామచం ద్రరావు జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఆయన కంటి చూపు పూర్తిగా మందగించింది. అరెస్టుతో పరువు పోయిందని భావించిన రామచంద్రరావు ఆ దిగులుతోనే కన్నుమూ శారు. ఎమర్జెన్సీలో నిర్బంధ చట్టాల ద్వారా అక్రమ నిర్బంధాలకు గురైన వేల మంది అమాయకుల్లో రామచంద్రరావు ఒకరు. అది కేరళ రాష్ట్రం. కాలికట్ పట్టణం. అక్కడి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రాజన్ను 1976, మార్చి, 1వ తేదీన కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు నక్సలైట్లు పోలీసు స్టేషన్ మీద దాడి చేశారని, అందులో రాజన్ పాల్గొన్నాడని పోలీసుల అభియోగం. నిజానికి ఫిబ్రవరి 28వ తేదీన కాలికట్ ఇంజ నీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ కళాశాల ఉత్సవాల్లో ఉన్నారు. అంతే కాకుండా, నక్సలైట్ ఉద్యమంతోగానీ, ఆ దాడితోగానీ రాజన్కు ఎటు వంటి సంబంధమూ లేదు. కానీ పోలీసులు మాత్రం రాజన్ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేశారు. శవం కూడా దొరకకుండా మాయం చేశారు. ఆ తర్వాత రాజన్ తండ్రి ఎచ్చరవారియర్ హెబియస్కార్పస్ పిటిషన్ వేశారు. రాజన్తో పాటు అరెస్టయి, ఆయనతో పాటు చిత్ర హింసలు అనుభవించిన చంద్రన్ అనే వ్యక్తి ఆ తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత కేసు విచారణకు వచ్చింది. రాజ న్ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపినట్టు రుజువైంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంత మంది పోలీసులు నేరస్తులని చివరకు తేలింది. అయితే రాజన్ ప్రాణం మాత్రం తిరిగిరాలేదు. పై రెండు ఘటనలు 1975 నుంచి 1977 వరకు 19 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎటువంటి విచారణ లేకుండా అమాయకులను పట్టుకెళ్ళి జైళ్ళలో నిర్బంధించి పౌర హక్కులను కాలరాసిన ఆ దుర్భర రాత్రులను ఎవ్వరూ మరచిపోలేరు. ఆ రోజున అమలు జరిపిన నిర్బంధ చట్టాల వల్ల, పోలీసులకూ, భద్రతా బలగాలకూ ఇచ్చిన అపరిమితమైన అధి కారాల వల్లా జరిగిన ఘోరాలివి. ఎమర్జెన్సీలో దాదాపు లక్షమందికి పైగా జైళ్ళలో అక్రమ నిర్బంధాన్ని అనుభవించారు. అందులో ఈ రోజు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఎల్.కే. అద్వానీ, వాజ్ పేయి, ప్రకాశ్ జవ్దేకర్, బంగారు లక్ష్మణ్, ప్రమోద్ మహాజన్, సిహెచ్ విద్యాసాగర్రావు, జంగారెడ్డిలు ఉన్నారు. అనేక మంది ఇతర పార్టీల నాయకులు సైతం జైళ్ళలో మగ్గారు. ఎమర్జెన్సీలో నిర్బంధానికి గురైన వేలాది మంది నాయకులు ఈ రోజు ఇంకా బతికే ఉన్నారు. నిర్బంధ చట్టాలు దుర్వినియోగం జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఎమర్జెన్సీ లాంటి నిర్బంధపాలన వస్తే ప్రతిపక్షాలూ, ఇతర సంఘాలు, సంస్థలు మాత్రమే కాదు. అధికార పార్టీవారు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. వారం రోజుల క్రితం లోక్సభలో ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. పౌరులను అభద్రతాభావంలోకి నెడుతోంది. టెర్రరిజం, హింస ద్వారా హత్యాకాండ చేస్తున్న వ్యక్తులు, సంస్థలూ చట్టం ప్రకారం శిక్షార్హులే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రజాస్వా మ్యాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళు, రక్త పాతంతో, హింసాకాండలతో ఎటువంటి సంబంధమూ లేనివాళ్లు రక్త పాతాన్ని సమర్థించేవాళ్ళూ, సమర్థించని వాళ్ళూ, కొన్ని భావజాలా లను సమర్థిస్తున్నవారు ఈ సమాజంలో ఉన్నారు. అయితే టెర్రరిజాన్ని అణచివేయడానికి ప్రభు త్వాలు తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలకు మరిన్ని సవరణలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువ లను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ‘ఉపా’ చట్ట సవరణలలో ముఖ్యమైనవి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ)కు విస్తృతమైన అధికారాలివ్వడం. అందులో రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం. ఇది భారత దేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ హక్కులను కోల్పోక తప్పని పరిస్థితి. వ్యక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రప్రభుత్వాల మనుగడను సైతం ఇది ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. అంతేకాకుండా, గతంలో కొన్ని సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రక టించేవారు. ఇప్పుడు దానితో పాటు, వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే ప్రమాదకర అవకాశాన్ని ఈ సవరణ ఇస్తున్నది. ఏ విచారణా జరగకుండానే, ఆ వ్యక్తి ఉగ్రవాది అనే విషయాన్ని చట్టపరంగా న్యాయ స్థానాలు నిర్ధారించక ముందే ఆస్తులను జప్తు చేయడం, ఇతర రకాలైన పౌరహక్కులన్నింటినీ లాగేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇది పూర్తిగా రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవు తుంది. వాక్స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ హక్కు సహా చివరకు జీవించే హక్కునే ఆ వ్యక్తి కోల్పోయే దారుణమైన పరిస్థితి. చాలావరకు అమాయకులు, రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక నాయకులతో శతృత్వం ఉన్న వాళ్ళు అందరూ ఈ చట్టం వల్ల ఇబ్బంది పాలవుతారు. ఎమర్జెన్సీలో బాధితులుగా ఉన్న పార్టీ, సంస్థలు ఇలాంటి చట్టం తేవడం బాధాకరం. ఆ రోజుల్లో ఎన్నివేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు ఇబ్బం దులు పడ్డారో ఇటీవల ఎమర్జెన్సీ దురాగతాల గురించి మాట్లాడిన బీజేపీ నేతలు వెల్లడించారు. ఆ అనుభవాలను గుణపాఠాలుగా తీసు కోవడానికి ఆనాటి బాధిత పక్షం, ఈనాటి అధికార పక్షం సిద్ధంగా లేదు. టెర్రరిజం, నక్సలిజం అనే కార్యకలాపాలను అంతమొందించాలనే ఉద్దేశ్యం కోసమే ఈ చట్టం అవసరమైతే, ఇది సమగ్ర ఫలితాలను ఇవ్వదు. టెర్రరిజం దానికిగల కారణాలకు తగ్గట్టుగా చర్యలు తీసు కోవాలి. అందులో చట్టాలు కూడా భాగమే. కానీ అవి మాత్రమే సమ స్యను పరిష్కరించలేవు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇంతకన్నా ఘోరమైన నిర్బంధాన్ని అమలు జరిపారు. కానీ ఫలితం రాలేదు. అక్కడి ప్రజల అభిప్రాయాలకూ, వారి విశ్వాసాలకూ ప్రాధాన్యతనివ్వ కుండా, కశ్మీర్ని భౌగోళికంగా మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఈనాటికీ అక్కడి ప్రజల మనసులను ఏ ప్రభుత్వం గెలుచుకోలేక పోయింది. అడుగడుగునా నిర్బంధం విధించి సైనిక పాలన చేస్తే సమస్య పరిష్కారమవుతుందా? లేక మరింత చిక్కనై, జటిలం అవుతుందా? అనే విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి. నక్సలైట్ సమ స్యను కూడా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నంత కాలం దానికి పరిష్కారం ఉండదు. ఈ రోజు భారతదేశంలో నక్సలైట్ సమస్య ఆయు ధాలు, బాంబుల సమస్యకాదు. అది అడవిలో ఆదివాసీల సమస్య. అక్కడి ఆదివాసులను భారతదేశంలో పౌరులుగానే మనం గుర్తించడం లేదు. వారి విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సౌకర్యాలు మనకు ఏ మాత్రం పట్టవు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వమే ఉనికిలో లేదు. ఇన్ని విషయాలను వదిలేసి, కేవలం చట్టాలు, పోలీసులు, సైన్యం, నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు మాత్రమే టెర్రరిజానికీ, నక్సలిజానికీ పరి ష్కారంగా భావిస్తే, గతంలో లాగానే మరో నిర్బంధ చీకటి భారతాన్ని ప్రభుత్వం కలగంటోందని భావించాల్సి వస్తుంది. పిల్లిని సైతం నిర్బంధంలో ఉంచి హింసిస్తే చావడం కన్నా తిరగబడటమే మేలనుకొంటుం దన్న విషయాన్ని మనం మరువకూడదు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే సంవత్సరం ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజకీయ లబ్ధి కోసమే ఆరెస్సెస్ ఆర్మీ పాఠశాలను ఏర్పాటు చేయాలనుకుంటుందని, ఆ పాఠశాలలో సామరస్యాన్ని దెబ్బతీయడం, మూక దాడులు చేయడమే నేర్పిస్తుందని దుయ్యబట్టింది. ఆరెస్సెస్ సమాజాన్ని విభజించే భావజాలాన్ని అనుసరిస్తోందని, స్వాతంత్ర్య పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదని, ఇప్పటికీ కూడా స్వాతంత్ర్య పోరాట ఆశయాలను ఆ సంస్థ పట్టించుకోవడం లేదని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరెస్సెస్ ఆర్మీ స్కూల్ ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తోందని, జాతీయస్థాయిలో కుట్రగా ఇది కనిపిస్తోందని, ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఎస్పీ ధ్వజమెత్తింది. యూపీ బులంద్షహర్ జిల్లాలోని శిఖర్పూర్లో ఆర్మీ స్కూల్ ఏర్పాటుచేయాలని ఆరెస్సెస్ భావిస్తోందని, ‘సైనిక్’ స్కూల్ తరహాలో ఈ పాఠశాలలో పిల్లలకు భారత సైన్యానికి పనికొచ్చేవిధంగా శిక్షణ ఇవ్వనున్నారని, దీంతోపాటు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో బోధన ఉంటుందని కథనాలు వచ్చాయి. -
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆరెస్సెస్లపై మజ్లిస్ పార్టీ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో హిందూ గాళ్ల రాజ్యం నడుస్తోందని, బొందు గాళ్ల రాజ్యం కాదన్నారు. హిందువుల యాత్రలపైన ఎంఐఎం కార్యకర్తలు దాడులకు పాల్పడేవారని, క్రికెట్లో టీమిండియా గెలిస్తే నల్లజెండా ఎగర వేసేవారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తా అన్న పార్టీతో టీఆర్ఎస్ దోస్తీ కట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఎంఐఎం ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే వారి బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ని చట్ట బద్దం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారు కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఎంఐఎం నేతలను ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 మీ ఇలాఖలో ఏం జరిగిందో గుర్తుకు లేదా అక్బరుద్దీన్? మీ వాళ్లు నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు, అవయవాలు అన్నీ డీలా అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? మా హిందువులను ఏం చేస్తావ్. నీ బొంద చేస్తావ్. ముస్లిం పేరుతో మీ అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెర తీస్తోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండు.. లేదంటే నీ చికిత్స ఫెయిలై ఉన్న జీవితం పోగొట్టుకుంటావ్’అంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రెండో స్వాతంత్య్ర పోరాటమా?
‘‘దేశంలో నిజమైన సెక్యులర్ (లౌకిక సమ భావన) వ్యవస్థను నెలకొల్పగల అవకాశాలను కాంగ్రెస్ పోగొట్టుకుంది. సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలి.’’ – ప్రధాని నరేంద్రమోదీ నూతన లోక్సభలో చేసిన ప్రకటన ‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారత్లో ఒక ప్రజా ఉద్యమ సంస్థ. భారత బహుముఖీన చిత్ర పటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే నాగ్పూర్లోని ఆరెస్సెస్ కేంద్రకార్యాలయాన్ని దర్శించుకుని నాయకులతో చర్చలు జరిపాను. 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ చరిత్ర నిరంతరం వివాదాలతో కూడుకున్నదైనప్పటికీ, అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వచ్చంద సంస్థగానే పేర్కొనాలి. జర్మనీ దేశస్తునిగా నాకు 1930– 40లలో ఆరెస్సెస్ చరిత్ర గురించి అవగాహన ఉంది. ఆరెస్సెస్ నాయకుల్లో కొందరు జర్మనీ నాజీ (హిట్లర్) ఉద్యమం నుంచి ఉత్తేజం పొందారని నాకు తెలుసు. కొందరికి ఇష్టమున్నా లేకున్నా ఇది వాస్తవం.’’ – జర్మనీ రాయబారి లిందర్న్. ది హిందూ : 21–07–2019 దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 72 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘‘సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలని’’ ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రకటన చేయడంలో అర్థం ఏమై ఉంటుంది? ఆయన చెప్పే కల ఇంత వరకు సాకారం కాకపోవడానికి ఎవరు కారకులు? దీనికి సమాధానం.. స్వాతంత్య్రానంతరం తొలి 20 ఏళ్లు మినహాయిస్తే మిగతా దశాబ్దాలన్నింటా, స్వాతంత్య్రోద్యమంలో అశేష త్యాగాలతో భారతీయులు సాధించుకున్న స్వేచ్ఛను, విమోచనను ఒక వైపు నుంచి కాంగ్రెస్ అనంతర నాయకత్వం, ఆ పిమ్మట కాంగ్రెస్ స్థానంలో అదే స్వార్థ ప్రయోజనాలతో అధికార స్థానాలు ఆక్రమించిన ఆర్ఎస్ఎస్–బీజేపీ– ఎన్డీయే కూటమి నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ స్వతంత్ర ఆర్థిక విధాన నిర్ణయాల గురించిన తొలి ప్రకటనలకు, ప్రజలకు చేసిన వాగ్దానాలకు, స్వతంత్ర విదేశాంగ విధానానికి, అలీన విధానంతోనే దేశాన్ని అభ్యుదయమార్గం పట్టించడానికి చేసిన తొలి ప్రయత్నాలన్నీ నేడు బుగ్గిపాలు కావడానికి ఈ రెండు శక్తులే కారణం. తొల్లింటి సమష్టి భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాలకే ఎసరు పెట్టి, కుల, మత, వర్గ, వర్ణ సంఘర్షణలకు తావులేని సర్వమత సమభావన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చిన దాని ఫలితమే– కేవల ‘హిందూ రిపబ్లిక్’ రాజ్యాంగానికి ప్రాణ ప్రతిష్ట చేసే ప్రయత్నానికి పాలకులు ఉద్యుక్తులవుతున్నట్లు ఉంది. బహుశా అందుకనే క్రాంతదర్శి అయిన భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1946లోనే, దేశ పరిస్థితులపై అవగాహనతో, దూరాలోచనతో ఇలా ప్రకటించారు: ‘హిందూరాజ్’ పేరిట దేశాన్ని ప్రకటించడమంటే భారతదేశానికి అంత కన్నా పెద్ద విషాదకర సంఘటన మరొకటి ఉండదు. ఎట్టి పరిస్థితు ల్లోనూ ‘హిందూ రాజ్’ నిర్ణయాన్ని, ప్రకటనను అడ్డుకుని తీరాల్సిందే. (‘ఇండియా పార్టిషన్’ గ్రంథం : పే. 354–5) మోదీ నాయకత్వంలో ఆరెస్సెస్–బీజేపీ కాశ్మీరం నుంచి కన్యా కుమారి దాకా, అసోం, మణిపూర్ నుంచి ఉత్తర ప్రదేశ్, బీహార్, హరియాణా, పంజాబ్, త్రిపుర, కర్ణాటక, కేరళ, ఒరిస్సాల వరకు దళిత, మైనారిటీలు వందలాదిమందిపై జరిగిన అత్యాచారాలు, హత్యలూ, వేధింపులకూ లెక్కలేదు. ప్రజాసమస్యలను గొంతెత్తి చాటే సామాజిక కార్యకర్తలను ప్రజలపట్ల వకాల్తా వహించి ఉద్యమించిన పలువురు చరిత్రకారులను, పాత్రికేయులను, అధ్యాపకులను, ఆర్థిక వేత్తలను వేధించి, అరెస్టు చేయడమో, దొంగచాటుగా హతమార్చడమో, లేదా విచారణ తతంగం చాటున, హంతకులకు శిక్షలు లేకుండా కేసులు మూసివేయడమో జరుగుతూ ఉంది. ఈ రోజుకీ కల్బుర్గి, పన్సారీ, లంకేష్లను హత్య గావించిన హంతకుల ఆచూకీ (తెలిసికూడా) ప్రకటించి, శిక్షించడం జరగలేదు. గతంలో దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, ప్రాణాలు, పుస్తెలు సహా త్యాగం చేసిన కోట్లాదిమంది స్త్రీ, పురుష యోధుల జ్ఞాపకాలు వెన్నంటుతుండగా, నేడు స్వతంత్ర భారతంలో గాడితప్పిన పాలనా వ్యవస్థలు ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పైన, పత్రికా ప్రసార మాధ్యమాలపైన ఉక్కుపాదం మోపి, కొన్ని సంస్థలను బెదిరించి తమకు అనుకూల బాకాలుగా మార్చుకున్న వైనం కాదనలేని ఒక నగ్న సత్యం. అందుకే దేశం రాజ్యాంగ వ్యవస్థల్ని మరింతగా ప్రజానుకూల వ్యవస్థలుగా తీర్చి దిద్దుకోవాల్సిన తరుణంలో రాజ్యాంగం హామీపడగా ‘మేముగా రచించుకుని మాకు మేముగా అంకితం చేసుకుంటున్నామని’ రాజ్యాంగంపరంగా ప్రజలు ప్రకటించుకున్న సంగతిని రాజకీయ నాయకులు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. దేశానికి, ప్రజలకూ అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, హేతువాదాన్ని పెంచి, పోషించడాన్ని పౌర బాధ్యతల అధ్యాయంలో రాజ్యాంగం ఆదేశిస్తున్నా– దాన్ని తోసిరాజని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థాయి నుంచి విశ్వవిద్యా లయ, కేంద్రీయ విద్యాలయాల స్థాయి వరకూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు, శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన మానవ ప్రపంచ పరిణామ చరిత్రకు వక్రభాష్యాలు పాలకులు నూరి పోసేందుకు వెరవటం లేదు, వైదిక విజ్ఞానం మీద నమ్మకాలు, పూజలు పునస్కారాలమీద వ్యక్తిగత విశ్వాసాలు వేరు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిరూపణను కాదనడం అజ్ఞానం. డార్విన్ పరిణామవాదాన్ని నిరూపణలతో విశ్వసించిన ప్రపంచ వైజ్ఞానిక శాస్త్రాన్ని కాదని మొండి వాదనలతో మానవ పరిణామవాద నిరూపణలను కాలదన్నే వారిని అన్నీ ‘కోతి చేష్టలే’నంటే బాధపడిపోయి, తాము మాత్రం డార్విన్ వానర సంతతికి వారసులం కాము, కేవలం రుషుల నుంచి జాలువారిన బిడ్డలమేనని, డార్విన్ సిద్ధాంతం అబద్ధమనీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్సింగ్ మానవ హక్కుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంలో చెప్పారు. దానికి దీటైన సమాధానమిస్తూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ‘దురదృష్టవశాత్తు నా పూర్వీకులు ఋషులు కారు, కేవలం మానవమాత్రులు, విజ్ఞానశాస్త్ర నిరూపణ ప్రకారం నా తల్లిదండ్రులు శూద్రులు. వీరెవరూ దేవుడి బిడ్డలు కారు, దేవుడిలో ఏ భాగానికీ చెందిన వారు కారు. కానీ ఈరోజుకీ వీరందరూ మానవహక్కుల కోసమే పోరాడుతూ వచ్చారు, ఇంకా ఈ రోజుకీ పోరాడుతూనే ఉన్నారని’ నషాళానికి అంటే జవాబిచ్చారు సింగ్కి. ఎందుకంటే, తమది ‘సాంస్కృతిక జాతీయవాదం’ అని ఆరెస్సెస్–బీజేపీ కలయిక నమ్మించజూస్తోంది. మరి ఆ జాతీయ స్రవంతిలోనే, ఆ సంస్కృ తిలోనే అంతర్భాగంగా పెరుగుతూ వచ్చిన విభిన్న మతాలకు, కులాలకు, వృత్తులకు, వివిధ జాతులకు, విభిన్న భాషలకు చెందినవారు వెరసి ‘ఉమ్మడి సంస్కృతిలో, జాతీయ వాదంలో భాగస్వాములు కారా? అందుకు ఆరెస్సెస్–బీజేపీయులు అవుననీ చెప్పరు, కాదనీ చెప్పరు. ముంగిగా మౌనం వహిస్తారు. ఆ మౌనమే ‘హిందూ రిపబ్లిక్’ ఆశయాన్ని వారు సాధించే క్రమంలో ముందుకు సాగడానికి ఆస్కారమవుతుంది. బహుశా బీజేపీ (ఆరెస్సెస్) ఎంపీ సాక్షీ మహరాజ్ 2019 ఎన్నికల తర్వాత ఇండియాలో ఇక ఎన్నికలుండవని ప్రకటించడానికి పార్టీ లోలోపల అంతర్మథనానికి పునాది అయి ఉండాలి. పార్టీ నాయక స్థానంలో ఉన్నవారిలో ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ ధోరణుల ఫలితంగానే, రెండో అభిప్రాయాన్ని గౌరవించకపోతేమానె, కనీసం స్వీకరించగల ప్రజాస్వామిక నైజం కొరవడినందువల్లనే అర్ధంతరంగా, అనాలోచితంగా, నిరంకుశంగా మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి పేద, మధ్యతరగతి, చిన్న పారిశ్రామిక వర్గాలకు బ్యాంకులలో నగదు లావా దేవీలు జరుపుకొనకుండా నానా ఇబ్బందులకు గురిచేసినప్పుడు– ముందు రిజర్వ్బ్యాంక్ గవర్నర్ రాజన్, ఆ పిమ్మట వచ్చిన ఊర్జిత్ పటేల్, ఆ తర్వాత క్రమంగా మరి ఇద్దరు గవర్నర్లు పదవులకు రాజీ నామాలిచ్చి మౌనంగా నిరసన తెలపాల్సి వచ్చింది, అలాగే బీజేపీ– ఆరె స్సెస్ సర్కార్ ప్రవేశపెట్టించిన విద్యా సంస్కరణలకు నిరసనగా కనీసం ఇరువురు ప్రముఖ విద్యావేత్తలు తమ వైస్ ఛాన్స్లర్ పదవులను అర్ధంతరంగా విడిచిపెట్టి పోవలసివచ్చింది. ఇంతటి పరిణామాలు దేశ ప్రజలు అంతకుముందు అంత ఆకస్మిక నిర్ణయాలుగా ఎరుగరు. చివరికి ప్రపంచ ప్రసిద్ధ భారత ఆర్థికవేత్తలలో ఒకరు, నోబెల్ బహుమాన గ్రహీత, నలందా (బౌద్ధ) విశ్వవిద్యాలయాల వైస్–ఛాన్స్లర్గా ఉంటున్న ప్రొఫెసర్ అమర్త్యసేన్, బీజేపీ పాలకుల ఒత్తిడి వల్లనే మోదీ తొలి పాలనలోనే వైదొలగవలసి వచ్చింది. పైగా– స్వామి వివేకానందను గౌరవిస్తున్నట్లు కనబడుతూనే ఆయన చికాగో (అమెరికా) ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో చేసిన మహా నైతిక బోధను, దాని ప్రాశ స్త్యాన్ని బీజేపీ–పరివార్ పాలకులు ఆచరణలో పాటించడం మానేశారు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకే నేత’ అనే సరికొత్త పాలనా నినాదం లేదా విధానంవల్ల దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం ద్వారానే బహుశా మోదీ ఆశిస్తున్న నిజమైన ‘సురక్ష ఆధునిక సర్వజన దేశం’ ఆవిర్భవిస్తుందేమో కళ్లు వత్తులు చేసు కుని చూద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆరా తీయండి
పట్నా: బిహార్ పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 28న బిహార్ స్పెషల్ బ్రాంచ్ సూపరిండెంట్.. డీఎస్పీలను ఆదేశిస్తూ ఈ లేఖను జారీ చేశారు. దానిలో ఆర్ఎస్ఎస్, దాని 18 అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ఖజానా, జాయింట్ సెక్రటరీ మరియు ఇతర కార్యకర్తల పేర్లు, వారి చిరునామాలను సేకరించాల్సిందిగా లేఖలో ఆదేశించారు. వారం రోజుల్లోగా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలపాల గురించి ఆరా తీయమనడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. అయితే ఈ వివరాలు సేకరణ వెనక ఉన్న కారణం మాత్రం తెలియడం లేదు. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్ భగవత్
విజయవాడ: నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఆరెస్సెస్స్ ఛీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, అమ్మవారి చీర ప్రసాదం, చిత్రపటం మోహన్ భగవత్కు అందచేశారు. విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు. -
పదింతలై పోరాడుతాం
సాక్షి, ముంబై: బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పది రెట్లు బలంగా పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. పరువు నష్టం కేసులో గురువారం ముంబైలోని మజ్గావ్–శివ్డీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు, ఉపాధి, యువత సమస్యలు తదితరాలపై మా పోరాటం కొనసాగుతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సైద్ధాంతికపరమైన పోరు కొనసాగిస్తా. ఐదేళ్లుగా సాగిస్తున్న దాని కంటే పది రెట్లు గట్టిగా పోరాడుతా’ అని ప్రకటించారు. నిర్దోషులమన్న రాహుల్, ఏచూరి పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మజ్గావ్–శివ్డీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. మేజిస్ట్రేట్ పీఐ మొకాషి కోర్టులో ఇద్దరు నేతల పేర్లను పిలవగానే వారు సాక్షుల బోనులోకి వెళ్లి నిలబడ్డారు. వారిపై వచ్చిన ఫిర్యాదును ఆయన చదివి వినిపించి.. నేరాన్ని అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించగా నిర్దోషులమని వారు బదులిచ్చారు. దీంతో ఈ కేసుకు సంబంధించి వారిద్దరితోపాటు ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. రాహుల్, సీతారాం ఏచూరికి కోర్టు రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు హాజరు కానవసరం లేకుండా వారికి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 21వ తేదీన జరగనుంది. అవసరమైన పత్రాలపై సంతకాలు చేసిన ఇద్దరు నేతలు అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందంటూ రాహుల్, ఏచూరి ఆరోపించడంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది ధ్రుతిమన్ జోషి 2017లో కేసు వేశారు. కాంగ్రెస్, సీపీఎంలపైనా కేసులు నమోదు చేయాలని ధ్రుతిమన్ కోరారు. కానీ, వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు పార్టీలను బాధ్యులుగా చేయడం తగదంటూ కోర్టు తిరస్కరించింది. ఆ మేరకు ఫిబ్రవరిలో ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. అంతకుముందు రాహుల్ కోర్టు గేట్ వద్దకు రాగానే అక్కడ వేచి ఉన్న దాదాపు 250 మంది పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ చీఫ్ పదవికి చేసిన రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాహుల్ మాత్రం వారికి అభివాదం చేస్తూ కోర్టు ఆవరణలోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పించారు. అంతకుముందు ముంబై ఎయిర్పోర్టు వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇవే నినాదాలు చేశాయి. కాగా, ఇది మహారాష్ట్రలో రాహుల్పై దాఖలైన రెండో పరువు నష్టం కేసు. మహాత్మాగాంధీ హత్య కేసుతో ఆర్ఎస్ఎస్కు సంబంధముందని ఆరోపించారంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు భివండీలో వేసిన కేసు ఇప్పటికే నడుస్తోంది. ఆ ధైర్యం కొందరికే ఉంటుంది: ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్ రాజీనామా నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆమె.. అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ వీడియో ఆర్ఎస్ఎస్ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ నిమిషం నిడివి ఉన్న ఒక వీడియోను ట్విట్టర్లో గురువారం విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ ఫర్ డమ్మీస్ పేరుతో ఉన్న ఆ వీడియోలో... ‘ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలుసని అనుకోండి, మరోసారి ఆలోచించండి. బ్రిటిష్ పాలకులకు విధేయత ప్రకటించడం, మహాత్మాగాంధీని చంపడం వంటి హింసాత్మక చర్యల ద్వారా ఆర్ఎస్ఎస్ ఆది నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది’అని ‘ఆర్ఎస్ఎస్ వెర్సెస్ ఇండియా’అనే హ్యాష్ట్యాగ్తో కాంగ్రెస్ పేర్కొంది. కోర్టు కేసులతో రాహుల్ బిజీ! ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో సతమతమైన రాహుల్ గాంధీ ఇక నుంచి కోర్టు కేసులతో బిజీ కానున్నారు. ఆరెస్సెస్ కార్యకర్త దాఖలు చేసిన ఒక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ గురువారం ఇక్కడి మజ్గావ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో నేరాన్ని అంగీకరించకపోవడంతో కేసు విచారణ కొనసాగనుంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసిన మేజిస్ట్రేట్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని రాహుల్కు మినహాయింపు ఇచ్చారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకు ఆరెస్సెస్కు సంబంధం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యపై ఆరెస్సెస్ ఈ కేసు దాఖలు చేసింది. కాగా, థానే జిల్లా భివండీలో రాహుల్ మరో పరువునష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కూడా ఆరెస్సెస్ వేసిందే.ఈ కేసు విచారణ ఇంకా ప్రారంభం కావలసి ఉంది. గాంధీ హత్యకు సంఘ్పరివార్ బాధ్యులని రాహుల్ ఆరోపించడంతో ఆయనపై ఈ కేసు దాఖలయింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘ఈ దొంగలందరికీ మోదీ అన్న పేరెందుకుందో’అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత సుశీల్ కుమార్ కేసు పెట్టారు. ఈ పరువునష్టం కేసులో రాహుల్ ఈ నెల 6వ తేదీన బిహార్లోని పాట్నా కోర్టులో హాజరు కావలసి ఉంది. అహ్మదాబాద్, సూరత్ కోర్టుల్లో కూడా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. -
కార్యకర్తలారా..మీరు ఏం చేస్తున్నారు.?
ముంబయి : ముంబయి నగరం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి ఏం చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. గతంలో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన రాహుల్గాంధీపై ముంబయి లోకల్ కోర్టులో పరువునష్టం దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు నుంచి సమన్లు అందుకోవడానికి రాహుల్ గురువారం ముంబయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ట్విటర్లో పేర్కొన్న మర్నాడే రాహుల్ ముంబయికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరైన రాహుల్ అటు నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గె, పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. మహరాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల విషయం పక్కనబెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి కాదని వెల్లడించారు. -
ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్గాంధీకి బెయిల్
-
విచారణకు హాజరైన రాహుల్గాంధీ
-
‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు
కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. లోక్సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి మోదీ గత వారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెజారీటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ ఆ సమావేశం నిర్ణయించింది. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే బీజేపీ–ఆరెస్సెస్లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి. అటల్ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అప్పటి లా కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 70వ దశకం వరకు .... మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్సభ, శాసన సభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది.1970వ దశకం నుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే, 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీఆర్ఎస్ జమిలి ఎన్నికలను సమర్థిస్తోంటే, సీపీఐ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. 2017 నుంచి మోదీ జమిలి ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాలని ఈ ఏడాది జనవరిలో మోదీ సూచించారు. ఇవీ అవరోధాలు జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం లోక్సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా త్వరలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు ఉండవని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనయినా ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినా, ప్రభుత్వం కూలిపోయినా గడువు వరకు వాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉండదంటున్నారు. ఈ విధానంతో ఖర్చు తగ్గుతుందని, రాజకీయ కక్షలు తగ్గుతాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటున్నారు. -
రామమందిర అంశాన్ని మోదీకి గుర్తుచేసిన ఆర్ఎస్స్