ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు | RSS Chief Mohan Bhagwat's Security Upgraded | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు

Published Wed, Aug 28 2024 12:00 PM | Last Updated on Wed, Aug 28 2024 12:04 PM

RSS Chief Mohan Bhagwat's Security Upgraded

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.

హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్‌ ప్లస్‌ నుంచి నుండి ఎఎస్‌ఎల్‌(అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్‌ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

నూతన భద్రతా  ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్‌ఎఫ్‌ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015,  జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా  జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు  మోహన్‌ భగవత్‌ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.

ఏఎస్‌ఎల్‌ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్  ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో  ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement