సాక్షి, హైదరాబాద్: రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–గువాహటి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ బుధవారం తెలిపారు. సికింద్రాబాద్–గువాహటి (07149/07150) ప్రత్యేక రైలు జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 (శుక్రవారాలు)తేదీల్లో ఉదయం 7.30కు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి ఆదివారం ఉదయం 8.45కు గువాహటి చేరుకుంటుంది. జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో (సోమవారాలు) ఉదయం 5.25కు గువాహటి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 9.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.