Guwahati
-
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?! ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి. ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు. సాయంగా మారిన ప్రేమరాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.సాయంగా ఉండాలనుకున్నాం.. అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది. – మూర్తి, రాములమ్మమనసులో మాట పంచుకోవడానికి...మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు -
కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ తండవానికి ముల్లోకాలూ వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటున్నాయి. ఇందులో 18 ముఖ్యమైనవాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య.ఇక్కడ అమ్మవారు మహిళల జననాంగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు సంబంధించి సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఆలయాన్ని ఏటా నాలుగు రోజులపాటు మూసి ఉంచుతారు.ఏటా ఆషాఢ మాసంలో ఏడో రోజు నుంచి పదోరోజు వరకు అమ్మవారు ఋతుస్రావం లో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ 2025లో జూన్ 22 నుంచి 25 వరకు ఆలయం తలుపులు మూసేసి ఉంచుతారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబుబాచీ మేళా పేరిట భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నాలుగు రోజులు ఆలయ గర్భ గుడిని తెల్లని వస్త్రాలతో .. అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రాలతో కప్పి ఉంచుతారు. నాలుగో రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రాలు కాస్తా ఎర్రబారతాయి..అంతేకాకుండా. అమ్మవారి ప్రతిరూపం ( జననాంగం) వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది.ఎర్రని వస్త్రం మహా ప్రసాదంఆ రోజుల్లో ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో.. పూజా మందిరంలోనుంచుకుంటే శుభాలు కలుగుతాయని.. మహిళల ఆరోగ్యం బాగుంటుందని భక్తుల విశ్వాసం.పాంచ్ బలిఅమ్మవారి ఆలయంలో ఇంకో విశిష్టమైన బలి పూజ. జరుగుతుంది. పాంచ్ బలి.. అంటే కామాఖ్యకు ఐదు రకాల పదార్థాలను అర్పిస్తారు. ఎనుబోతు.. మేక.. బాతు ఈ మూడింటిని ఆలయంలో బలి ఇస్తారు..వీటితోబాటు బూడిద గుమ్మడి కాయను. చెరుకు గడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఐదింటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభీష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచలం.. వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకుని స్వామికి దూడలు సమర్పించినట్లు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకలు సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతుంటాయి. ఉచిత దర్శనం కోసం కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. లేదా పరిమిత సంఖ్యలో ఇచ్చే రూ.500 టికెట్ల కోసం వేకువజామున లైన్లో ఉంటే తెల్లవారేసరికి ఆ టిక్కెట్ తీసుకుని రెండు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. దీంతోబాటు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే కొండపై ఉండే ఉమానంద శివాలయాన్ని లాంచీలో వెళ్ళి చూసి రావడం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. గౌహతికి దేశంలోని అన్ని మూలల నుంచి రైళ్లు.. విమాన సౌకర్యాలు ఉన్నాయి. హోటళ్లు.. లాడ్జిలు.. టాక్సీలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.-కామాఖ్య నుంచి సిమ్మాదిరప్పన్న -
తరుణ్ సంచలనం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శ్రియాన్షి మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. -
తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఒక ఇంట్లో ఉంటూ..
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది. జైదీప్ దేవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్ పైనుంచి పడి యువకుడు మృతి -
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
లక్నో: యూపీలోని లక్నోలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్ప్రెస్లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నిందితుడు జాహిద్ను ఎన్కౌంటర్ చేశారు. ఘాజీపూర్లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి. STF यूनिट नोएडा कोतवाली गहमर व GRP दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा आरपीएफ जवानों की हत्या में शामिल 100000/- रुपये के इनामिया बदमाश के साथ थाना दिलदारनगर क्षेत्रान्तर्गत हुई मुठभेड़ के संबंध में #spgzr महोदय की बाइट(1)@Uppolice @IgRangeVaranasi @adgzonevaranasi pic.twitter.com/lCHVw8Z1In— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. -
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
ఐపీఎల్-2024లో గౌహతి వేదికగా చివరి లీగ్ మ్యాచ్లో తలపడేందుకు రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బర్సపరా క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. రాజస్తాన్ 16 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్పై తమ చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్తాన్- కేకేఆర్ మ్యాచ్ రద్దవ్వాలని సన్రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దు అయితే రాజస్తాన్, కేకేఆర్కు తలో పాయింట్ లభిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 17 పాయింట్లతో తమ రెండో స్ధానాన్ని పదిలం చేసుకుంటుంది. కాగా మ్యాచ్ రద్దు అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్తాన్ జట్టు కంటే ఎస్ఆర్హెచ్ రన్రేట్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకెండ్ ప్లేస్కు ఎటువంటి ఢోకా లేదు. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
‘‘ఐసిస్లో చేరతా’’.. ఐఐటీ విద్యార్థి అరెస్టు
గువహతి: ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్ జిల్లాలో అతడిని పట్టుకున్నారు. ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ ఫరూకీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆజూకీని పోలీసులు కనుగొనడం గమనార్హం. ‘ విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమైనవేనని ధృవీకరించుకుని దర్యాప్తు ప్రారంభించాం. ట్రావెలింగ్లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నాం. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించాం. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం. ఐసిస్ నల్ల జెండాతో పాటు ఐసిస్ మనుస్క్రిప్ట్ విద్యార్థి హాస్టల్ రూమ్లో దొరికింది. విద్యార్థి డిల్లీలోని ఓక్లాకు చెందినవాడు’అని అస్సాం పోలీసులు తెలిపారు. Reference @IITGuwahati student pledging allegiance to ISIS - the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia — GP Singh (@gpsinghips) March 23, 2024 ఇదీ చదవండి.. ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు -
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా
-
ఆధ్యాత్మిక సేవలో తమన్నా: ట్రెడిషనల్ లుక్ పిక్స్ వైరల్
#TamannabhatiavisitsKamakhyaTemple సౌత్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు, సేవపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అందం, ఆకర్షణతో మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా పర్సనల్ లైఫ్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రెండు రోజుల క్రితం రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న తమన్నా కుటుంబ సమేతంగా కామాఖ్య ఆలయానికి వెళ్లింది. తాజాగా తల్లి దండ్రులతో కలిసి తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. మాతా రాణి ఆశీస్సులు తీసుకుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. ఈ సందర్భంగా తమన్నా లుక్, గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) పసుపు కాషాయ రంగు మేళవింపుతో కూడిన సాంప్రదాయ దుస్తులు, నుదుటిన తిలకం, మెడలో పూమాల, దేవుడి శాలువ ఇలా ప్రత్యేకంగాట్రెడిషనల్ లుక్లో అదరగొట్టేస్తోంది. శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం నీలాచల్ కొండపై ఉంది. -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్ను లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
రాహుల్ భద్రతపై అమిత్షాకు ఖర్గే లేఖ
అస్సాం ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. గువాహటిలో రాష్ట్ర పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్ ఎదుర్కొన్న భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు భద్రతా విషయంపై అమిత్ షా జోక్యం చేసుకోవాలనికోరారు. అస్సాంలో మంగళవారం చోటు చేసుకున్న పలు ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం జరిగింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు రాహుల్ , కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Shri @RahulGandhi and the #BharatJodoNyayYatra has faced serious security issues in Assam in the last few days. My letter to Home Minister, Shri @AmitShah underlining the same. pic.twitter.com/FHLG5pg5Bz — Mallikarjun Kharge (@kharge) January 24, 2024 అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని కేంద్ర హోంమత్రికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు. కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. చదవండి: తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు వీటన్నింటి విషయాల్లో అస్సాం పోలీసులు బీజేపీ కార్యకర్తలవైపు పక్షాన నిలిచారని ఆరోపించారు. అంతేగాక కాషాయ శ్రేణులకు రాహుల్ కాన్వాయ్ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. రాహుల్, ఆయన సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. న్యాయ యాత్ర కొనసాగుతున్న కొద్దీ రాహుల్కు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ఇకనైన అమిత్షా జోక్యం చేసుకొని రాహుల్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లను ఆదేశించాలని కోరారు. ఇదిలా ఉండగా భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అస్సాం పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
క్వార్టర్స్లో అచ్యుతాదిత్య–హర్షవర్ధన్ జోడీ
గువాహటి: హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కీలకదశలో పాయింట్లు గెలిచిన దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) జోడీ... గువాహటి ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన అచ్యుతాదిత్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన హర్షవర్ధన్ ద్వయం 24–22, 23–21తో నాలుగో సీడ్ వె చున్ వె–వు గువాన్ జున్ (చైనీస్ తైపీ) జంటను బోల్తా కొట్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 15–21, 21–18, 13–21తో రెండో సీడ్ వెన్ చి సు (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 21–13, 19–21, 17–21తో చూంగ్ హోన్ జియాన్–గో పె కీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
IND vs AUS: మాక్స్వెల్ విధ్వంసకర సెంచరీ.. భారత్పై ఆసీస్ విజయం
గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అద్బుత విజయం సాధించింది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఖరి బంతికి 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో గ్లెన్ మాక్స్వెల్ మెరుపు సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిని ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వెడ్ ఫోర్ బాదాడు. అనంతరం రెండో బంతికి సింగిల్ తీసి మాక్స్వెల్కు స్ట్రైక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన నేపథ్యంలో వరుసగా ఒక సిక్స్, మూడు ఫోర్లు బాది తన జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 104 పరుగులు చేసి మాక్సీ ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ విజయంతో సిరీస్ అధిక్యాన్ని 2-1కు ఆసీస్ తగ్గించింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో అదరగొట్టాడు. 57 బంతులు ఎదుర్కొన్న రుత్రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్లతో 123 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 19 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 202 /5 19 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 180/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 43 పరుగులు కావాలి. 16 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 174/5 గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.16 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 49 పరుగులు కావాలి. మాక్స్వెల్ హాఫ్ సెంచరీ.. మాక్స్వెల్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో మాక్సీ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఐదో వికెట్ డౌన్.. భారత బౌలర్లు తిరిగి కమ్బ్యాక్ ఇచ్చారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. టిమ్ డేవిడ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 136/5 నాలుగో వికెట్ డౌన్.. 128 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మార్క్స్ స్టోయినిష్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 9 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 99/3 9 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్వెల్(26), స్టోయినిష్(5) పరుగులతోఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. జోష్ ఇంగ్లీష్(10) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లీష్ను బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్ డౌన్.. 66 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఆరోన్ హార్డీ.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 56/1. క్రీజులో ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్(10) పరుగులతో ఉన్నారు. రుత్రాజ్ విధ్వంసకర సెంచరీ.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ రుతురాజ్ బౌలర్లను ఊచ కోశాడు. ఈ మ్యాచ్లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్రాజ్ 13 ఫోర్లు, 7 సిక్స్లతో 123 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా రుత్రాజ్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(39), తిలక్ వర్మ(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ.. ఆసీస్తో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్తో సెంచరీతో సత్తాచాటాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో రుతురాజ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 155/3 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో రుత్రాజ్ గైక్వాడ్(71), తిలక్ వర్మ(21) పరుగులతో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లతో రుతు తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.15 ఓవర్లకు టీమిండియా స్కోర్: 143/3. క్రీజులో గైక్వాడ్(63), తిలక్ వర్మ(17) పరుగులతో ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 81 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఆరోన్ హార్డీ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 101/3 దూకుడుగా ఆడుతున్న సూర్య.. 8ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాట్ను ఝుళిపిస్తున్నాడు. 33 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు క్రీజులో రుత్రాజ్ గైక్వాడ్(12) ఉన్నాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్: 39/2 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(13), రుత్రాజ్ గైక్వాడ్(6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్ ఔట్ 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అదిలోకి బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ జైశ్వాల్(6) తొలి వికెట్గా పెవిలియన్కు చేరాడు. బెహ్రెన్డార్ఫ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 18/1 గౌహతి వేదికగా మూడో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్కు టీమిండియా ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో అవేష్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్డార్ఫ్ వచ్చారు. తుది జట్లు ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్సన్ భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ -
India vs Australia 3rd T20I: సిరీస్ విజయమే లక్ష్యంగా...
గువాహటి: టి20ల్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో ఇక్కడే కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో టి20 మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ఆతిథ్య జట్టుకు సిరీస్ విజయం ఏమంత కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచ్ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్ మళ్లీ గువాహటి ప్రేక్షకులకు అలాంటి మజానే అందించేందుకు సిద్ధమైంది. పైగా ఆల్రౌండ్ సామర్థ్యంతో జట్టు సమరోత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం సిరీస్లో నిలవాలంటే కచి్చతంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. పరాజయాల ‘హ్యాట్రిక్’ అయితే మాత్రం సిరీస్ చేజార్చుకుంటుంది. బ్యాటర్స్ను ఆపతరమా... టాపార్డర్ బ్యాటర్స్ అసాధారణ ఫామ్లో ఉన్నారు. యశస్వి దూకుడు ఆసీస్ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటగా, రుతురాజ్ కూడా ఫిఫ్టీతో తొలిమ్యాచ్ డకౌట్ను మరచిపోయేలా చేశాడు. రింకూ సింగ్ డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మే! ఎందుకంటే విశ్రాంతిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ తదుపరి రెండు మ్యాచ్లకు వైస్ కెపె్టన్గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తుది జట్టులో ఆడటం ఖాయం కావడంతో బెంచ్కు పరిమితమయ్యే పరిస్థితి తిలక్కే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తే... ప్రస్తుతానికి పక్కన పెట్టినా టచ్లోకి వచి్చన బ్యాటర్గా జట్టు ఎంపికలో ఉంటాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా గత మ్యాచ్లో మెరుగైంది. కీలకమైన వికెట్లను వరుస విరామాల్లో తీసి మ్యాచ్లో పట్టు సాధించింది. ప్రసి«ద్కృష్ణ, అర్‡్షదీప్లతో పాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆసీస్ రేసులోకొచ్చేనా... ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడింది. తర్వాతి మ్యాచ్లో 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఆ్రస్టేలియా గెలిచి నిలవడం సాధ్యమవుతుందా అనేది నేటి మ్యాచ్తో తేలుతుంది. గత మ్యాచ్లో అనుభవజు్ఞలైన డాషింగ్ బ్యాటర్ మ్యాక్స్వెల్, ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాలను కూడా బరిలోకి దించినా కంగారూ జట్టుకైతే ఒరిగిందేమీ లేదు. నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), స్టీవ్ స్మిత్, షార్ట్, జోష్ ఇన్గ్లిస్, మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, నాథన్ ఎలిస్, తనీ్వర్ సంఘా. -
WC- Ind vs Eng: టీమిండియా అభిమానులకు బ్యాడ్న్యూస్!
ICC Cricket World Cup Warm-up Matches 2023- India vs England: వన్డే ప్రపంచకప్-2023 సన్నాహక మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు వరణుడు షాకిచ్చాడు. గువాహటిలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇంగ్లండ్తో శనివారం జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దైపోయింది. కాగా అసోంలోని బర్సపరా స్టేడియంలో రోహిత్ సేన.. జోస్ బట్లర్ బృందంతో తమ తొలి వామప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, టాస్ అనంతరం వర్షం మొదలుకావడంతో ఆలస్యంగానైనా ఆట మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ వరణుడు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు టీమిండియా- ఇంగ్లండ్ వామప్ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2023 వామప్ మ్యాచ్ టీమిండియా (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. ఇంగ్లండ్ (బ్యాటింగ్ ఎలెవన్, ఫీల్డింగ్ ఎలెవన్): డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కరన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్ -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
‘బాయ్’ ఎక్స్లెన్స్ సెంటర్ కోచ్గా ముల్యో హండోయో
అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గువాహటిలో కొత్తగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (ఎన్సీఈ)ను అధునాతన సొబగులు, క్రీడా సదుపాయాలతో తీర్చిదిద్దింది. దీనికి హెడ్ కోచ్గా ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత కోచ్ ముల్యో హండోయోను ‘బాయ్’ నియమించింది. హండోయోకు భారత షట్లర్లతో విజయవంతమైన అనుబంధముంది. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్ తదితరుల ప్రతిభకు మెరుగులు దిద్ది... చైనా షట్లర్లకు ఎదురునిలిచే నైపుణ్యాన్ని ముల్యోనే నేర్పారు. ఆయన కోచింగ్ హయాంలోనే శ్రీకాంత్ ప్రపంచ నంబర్వన్గా ఎదిగాడు. అలాగే మరో ఇద్దరు విదేశీ కోచ్లను కూడా ఎన్సీఈకి నియమించారు. మాజీ ఆల్ఇంగ్లండ్ చాంపియన్ ఇవాన్ సొజొనొవ్ (రష్యా) డబుల్స్ కోచ్గా, కొరియాకు చెందిన సింధు మాజీ కోచ్ పార్క్ తే సంగ్ కోచ్గా వ్యవహరిస్తారు. అస్సాం, బాయ్ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఎన్సీఈలో 24 కోర్టులున్నాయి. 3000 మంది ప్రేక్షకులు వీక్షించవచ్చు. శిక్షణపొందే షట్లర్లు, సిబ్బంది కోసం సౌకర్యవంతమైన వసతి గదులు, కసరత్తుకు జిమ్, ఇతరత్రా అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ సెంటర్ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. -
మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి
గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వ్యాన్ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. గువాహటిలోని జలూక్బరీ ప్రాంతంలో ఓ కారు(01 GC 8829) ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కారు.. వ్యాన్ను ఢీకొనే ముందు డివైడర్ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు.. - అరిందమ్ భల్లాల్ - నియోర్ దేకా - కౌశిక్ మోహన్ - ఉపాంగ్షు శర్మ - రాజ్కిరణ్ భుయాన్ - ఎమోన్ గయాన్ - కౌశిక్ బారుహ్ తీవ్రంగా గాయపడిన వారు.. - అర్పాన్ భుయాన్ - అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్ - మృన్మోయ్ బోరా. ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం.. -
సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
గువాహటి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (ఏప్రిల్6-8) మూడు రోజులపాటు అస్సాంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె ఏప్రిల్ 8వ తేదీని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 MKI విమానంలో ప్రయాణించనున్నారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఏప్రిల్ 7న రాష్ట్రపతి కాజిరంగా నేషనల్ పార్క్లో గజ్ ఉత్సవ్-2023 వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం గువాహటిలో మౌంట్ కాంచనగంగా సాహసయాత్ర-2023ను జెండా ఊపి ప్రారంభిస్తారు. దీంతోపాటు గౌవాహటి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ముర్ము ప్రయాణించనున్నారు. చదవండి: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత.. -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్లో మిగిలిన మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్తో మ్యాచ్లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్రైజర్స్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్పై కూడా చెలరేగితే రాజస్తాన్కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్మెయిర్ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
Vandana Kalita: భర్త, అత్తలను ఫ్రిడ్జ్లో..
ఆమె నేరం చేసినట్లయితే ఆమెను కాల్చివేయండయ్యా. అలాంటి కూతురు నాకు వద్దు. వివాహేతర సంబంధంతో భర్త, అత్తలను చంపడం ఏంటయ్యా?. ఒకవేళ నిజంగా ఆమె తన భర్తను, అత్తగారిని చంపి ఉంటే నాకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు.. తన కన్నకూతురిని ఉద్దేశించి ఓ తండ్రి చెప్తున్న మాటలివి. గువాహతి: దేశంలో జరుగుతున్న ఒక తరహా నేరాలు-ఘోరాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రేమ.. సహజీవనం.. పెళ్లిమాటొచ్చేసరికి చంపేయడం లాంటి వరుస ఘటనలు చూస్తున్నాం. ఈ నేరాలను స్ఫూర్తిగా తీసుకుందేమో.. అసోంలో ఒకావిడ భర్త, అత్తలను ఆ కేసుల తరహాలోనే హతమార్చింది. అసోం గువాహతి సమీపంలో నూన్మతికి చెందిన ఓ వివాహిత.. భర్త, అత్తలను కడతేర్చి ముక్కలు చేసింది. ఆ ముక్కలను ఫ్రిడ్జ్లో భద్రపరిచింది. ఆపై ప్రియుడి సాయంతో వాటిని దూరంగా పడేసి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత.. ఇది వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్తలు అడ్డువస్తున్నారనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందట. నిందితురాలి పేరు వందనా కలిటా. భర్త పేరు అమర్జ్యోతి దే. అత్త పేరు శంకరీ దే. కిందటి ఏడాది ఆగష్టు నెలలో వాళ్లను ప్రియుడు, మరొక వ్యక్తి సాయంతో చంపేసి ముక్కలు చేసింది వందన. ఆపై ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి.. ఫ్రిడ్జ్లో భద్రపరిచింది. మూడు రోజుల తర్వాత ప్రియుడి సాయంతో ఆ శరీర విడి భాగాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి(మేఘాలయా)కు తీసుకెళ్లి.. అక్కడ సోహ్రా ప్రాంతంలో వాటిని పడేసింది. తిరిగొచ్చి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఏడు నెలలపాటు వాళ్ల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడింది. తన కన్నతండ్రికి సైతం ఏం చెప్పకుండా ఉండిపోయింది. చివరికి.. దగ్గరి బంధువు ఒకరు అమర్, శంకరీల గురించి ఆరా తీయడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమ శైలిలో విచారణ చేపట్టారు. చివరాఖరికి.. ఫిబ్రవరి 19వ తేదీన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్ డేక, అరుప్ స్నేహితుడు ధాంజిత్ డేకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాభర్తల అదృశ్యం గురించి ఆమె(వందన) నాటకాలాడిందని, ఒకవేళ ఆమె నేరం చేసిందని రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని వందన తండ్రి పోలీసులను కోరుతున్నాడు. వివాహేతర సంబంధం తనకు భర్త, అత్తకు తెలిసిందని, వాళ్లు హెచ్చరించడంతోనే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసు, తాజాగా నిక్కీ యాదవ్ కేసులోనూ ఫ్రిడ్జ్లో బాడీ విడిభాగాలు, బాడీని భద్రపర్చడం తెలిసిందే. -
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
India vs Sri Lanka: వన్డేలకు మోగిన విజిల్! లంకకు కష్టమే.. అందరూ అంతంతే!
వన్డే వరల్డ్కప్నామ సంవత్సరమిది... అదీ భారత గడ్డపై... ఈ నేపథ్యంలో అక్టోబరుకు ముందు ఇకపై జరిగే వన్డేలన్నీ భారత్కు సన్నాహకాలే... మధ్యలో ఐపీఎల్ రూపంలో టి20లు ఉన్నా, వన్డే జట్టు ఎంపికకు, తుది జట్టు కూర్పు కొరకు ఈ మ్యాచ్ల ప్రదర్శనే కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. ఆసియాకప్ కాకుండా టీమిండియా కనీసం 15 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేటినుంచి జరిగే మూడు వన్డేల సిరీస్లో శ్రీలంకను భారత్ ఎదుర్కొంటుంది. గువహటి: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్పై దృష్టి పెట్టింది. నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో భారత బృందం మరింత పటిష్టంగా మారగా... లంక దాదాపు అదే జట్టుతో మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి రెండు టి20లు హోరాహోరీగా సాగినా... చివరి మ్యాచ్లో ఏకపక్ష విజయంతో భారత్ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది. అయితే ఆ సిరీస్లో చూపిన ప్రదర్శన లంక జట్టులో ఆత్మ విశ్వాసం పెంచింది. 2017 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఓపెనర్గా గిల్... బంగ్లాదేశ్తో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్తో ‘డబుల్ సెంచరీ’ సాధించినా... ఇషాన్ కిషన్కు ఈ మ్యాచ్లో మాత్రం చాన్స్ లేదు. కెప్టెన్ రోహిత్ రాకతో అతనిపై వేటు ఖాయమైంది. ఇషాన్కు అవకాశం ఇవ్వలేమని రోహిత్ స్పష్టం చేసేశాడు కూడా. వన్డేల్లో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. టి20ల్లో ఆడని కోహ్లి తనకు బాగా అచ్చి వచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. లంకపై ఏకంగా 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేసిన ఘనమైన రికార్డు కోహ్లికి ఉంది. గత ఏడాది 55.69 సగటుతో 724 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్కు మిడిలార్డర్లో చోటు ఖాయం కాగా... వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగుతాడు. దాంతో టి20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్కు చోటు కష్టమే. పైగా వన్డేల్లో ఇప్పటి వరకు సూర్య ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్, శ్రేయస్లలో ఒకరిని తప్పించి సూర్యను ఆడించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆరో స్థానంలో ఆల్రౌండర్గా కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కూర్పు ఉండవచ్చు. అక్షర్ పటేల్ ఖాయం కాగా... రెండో స్పిన్నర్గా చహల్, కుల్దీప్ యాదవ్ల మధ్య పోటీ ఉంది. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్లతో పాటు మూడో పేసర్గా అర్ష్దీప్, ఉమ్రాన్లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. బంగ్లా చేతిలో సిరీస్ ఓడినా... ఓవరాల్పై లంకపై భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. అందరూ అంతంతే... శ్రీలంక జట్టు గత కొంత కాలంగా వన్డేల్లో కాస్త మెరుగైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన. అయితే సమస్యంతా ఒక్కొక్క ఆటగాడి వన్డే రికార్డుతోనే. ప్రస్తుతం ఉన్న జట్టులో అంతా టి20ల్లో ఆకట్టుకున్నవారే అయినా... వన్డేల్లో రెగ్యులర్గా తమను తాను నిరూపించుకున్నవారు ఎవరూ లేరు. టి20లతో పోలిస్తే వన్డేల్లో సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో నిలిచి ఇన్నింగ్స్ను నిర్మించే సమర్థుడైన బ్యాటర్ గానీ... 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్ గానీ జట్టులో కనిపించడం లేదు. టి20ల్లో సత్తా చాటిన షనక వన్డే రికార్డు పేలవం. పైగా అతను ఇప్పటి వరకు భారత గడ్డపై వన్డే ఆడనే లేదు. అదే తరహాలో జట్టు ప్రధాన అస్త్రం హసరంగ కూడా వన్డేల్లో అంతంతే. ఇద్దరు పేసర్లు రజిత, కుమారలు ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోగా, మదుషంక వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇలాంటి స్థితిలో భారత్కు లంక ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. ముఖాముఖి పోరులో 162: ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 162 వన్డేలు జరిగాయి. 93 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 57 మ్యాచ్ల్లో శ్రీలంక నెగ్గింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... 11 మ్యాచ్లు రద్దయ్యాయి. ఇక భారత గడ్డపై ఈ రెండు జట్లు 51 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 36 మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందగా... 12 మ్యాచ్ల్లో శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. -
భారత్-శ్రీలంక తొలి వన్డే.. ఏకంగా సెలవిచ్చిన ప్రభుత్వం!
స్వదేశంలో శ్రీలంకతో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్లో లంకతో తలపడనుంది. ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు హాఫ్-డే సెలవు ప్రకటించింది. "బర్సపరా స్టేడియం వేదికగా శ్రీలంక-భారత్ తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించాం. ఈ నిర్ణయం పట్ల అస్సాం గవర్నర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు" అని హిమంత బిస్వా శర్మ సర్కార్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గతేడాది జూలై తర్వాత తొలి సారి వన్డే సిరీస్లో భారత- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సిరీస్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కూడా వన్డే సిరీస్లో భాగం కానున్నారు. చదవండి: IND VS SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. బుమ్రా ఔట్ -
Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. మొత్తంగా 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమై సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా గ్రహణ సమయం ముగియడంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. మళ్లీ మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఇదిలా ఉంటే, ఒడిశాలో మాత్రం గ్రహణం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు, భజరంగ్దళ్ కార్యకర్తల మధ్య రగడ జరిగింది. చంద్రగ్రహణం రోజున చికెన్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో అమిత్ పాల్గొని ప్రసంగించారు. అవసరమైన చోట నిధుల సద్వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే అభివృద్ధి ఫలాలు త్వరగా చేతికొస్తాయన్నారు. కేంద్రనిధులతో పాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమన్నారు. ‘ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈశాన్య రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్ఈసీ చైర్మన్ హోదాలో అమిత్ సూచించారు. అమిత్, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 8 రాష్ట్రాల సీఎంలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్యకర పోటీ అవసరం : కిషన్రెడ్డి కేంద్రం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీతోపాటు ప్రత్యేక దృష్టిసారిస్తే çపురోగతి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం 500 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. -
రెండ్రోజులపాటు 70వ ఎన్ఈసీ సమావేశాలు
గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాల మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) 70 వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలో జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ ఎక్స్–అఫిషియో చైర్మన్ అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన తర్వాత మారుతున్న పరిస్థితులు, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత (రైలు, రోడ్డు, విమాన, జలమార్గాల్లో), ఉడాన్ పథకంలో భాగంగా జరుగుతున్న విమానాశ్రయాల నిర్మాణం, టెలికామ్ అనుసంధానత, విద్యుత్, ఎనర్జీ రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతవరకు చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించనున్నారు. దీంతోపాటుగా యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమలు, పర్యాటకం, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ–20 సదస్సుకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న సందర్భంలో.. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని బంగ్లాదేశ్లో పర్యటించాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్లీనరీలో చర్చించే అవకాశం ఉంది. కాగా గతేడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 69వ ఎన్ఈసీ సమావేశాలు జరిగాయి. చదవండి: నేనేం సోనియా రిమోట్ను కాను -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గ్రౌండ్లోకి వచ్చిన పాము! వీడియో వైరల్
గౌహతి వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టీ20లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చింది. టీమిండియా ఇన్నింగ్స్ జరుగుతుండగా పాము గ్రౌండ్లోకి వచ్చింది. అయితే కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాముని గమనించి అంపైర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్టేడియం భద్రతా సిబ్బిందికి సమాచారం ఇవ్వగా.. పామును పట్టుకుని వెళ్లారు. దీంతో 10 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. కాగా భారత్ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇటువంటి సంఘట జరగడం ఇదే తొలి సారి కావడం గమానార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 237 పరుగులు భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(28 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(43), విరాట్ కోహ్లి(49), కార్తీక్( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్కే రెండు వికెట్లు దక్కాయి. #INDvsSA pic.twitter.com/E0kvbafucc — Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 2, 2022 చదవండి: Irani Cup 2022: సర్ఫరాజ్ ఇన్నింగ్స్కు ఫిదా అయిన సూర్యకుమార్.. -
IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. గౌహతి వేదికగా ప్రోటీస్ జట్టుతో ఆదివారం రోహిత్ సేన తలపడనుంది. తొలి టీ20లో ఫలితాన్నే ఈ మ్యాచ్లో కూడా పునరావృతం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది అని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం రావడానికి 40 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని పేర్కొంది. కాగా కరోనా పరిస్థితుల తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో భారీ సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉండగా.. వర్షం పడితే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికా నుంచి రెండు "అత్యంత తేలికైన" పిచ్ కవర్లను కొనుగోలు చేశాం. ఇప్పటికే అస్సాం క్రికెట్ ఆసోసియేషన్ దాదాపు 20 పైగా కవర్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన కొత్త కవర్లు నీరును పిచ్లోకి ప్రవేశించకుండా చేస్తాయి అని ఏసీఎ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కాగా 2020 ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరగాల్సిన టీ20 మ్యాచ్ కూడా అస్సాం క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం వల్ల రద్దైంది. చదవండి: RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గౌహతికి చేరుకున్న టీమిండియా
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20లో ఆడేందుకు సిద్దమైంది. భారత్, ప్రోటీస్ జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆదివారం(ఆక్టోబర్ 2)న జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు గురువారం గౌహతిలో అడుగుపెట్టారు. తొలి టీ20 జరిగిన తిరువనంతపురం నుంచి నేరుగా గౌహతికి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. గౌహతి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న భారత ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు క్రికెట్ సౌతాఫ్రికా కూడా గౌహతికి చేరిన తమ జట్టు ఆటగాళ్ల ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. Welcome🎉 pic.twitter.com/z0cTZz0h7a — AnuRAG's_foxbideee 🇮🇳 (@AnuragGoon) September 29, 2022 ఇక భారత జట్టు శుక్రవారం బర్సపరా స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. మరోవైపు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడిమీలో ఉన్నాడు. దీంతో బుమ్రా స్దానంలో మహ్మద్ సిరాజ్ భారత జట్టుతో చేరనున్నాడు. Team India reaches Guwahati for the second T20. An international match will be playing after two years at Barsapara Cricket Stadium in Guwahati. Earlier, last match here was playing by the Indian team against Sri Lanka. pic.twitter.com/OvECxuEWy4 — Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) September 29, 2022 చదవండి: 'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి' -
గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి
సాక్షి, ఢిల్లీ: గో ఫస్ట్ విమానానికి పెను ముప్పు తప్పింది. బుధవారం.. ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తుండగా విమానం విండ్ షీల్డ్ పగిలింది. దీంతో విమానాన్ని జైపూర్కు మళ్లించినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో గో ఫస్ట్ విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడోసారి. చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా తలెత్తుతున్నాయి. మంగళవారం కూడా విమానయాన సంస్థ గోఫస్ట్కు చెందిన రెండు విమానాల్లో ఒకేసారి ఇంజన్ సమస్యలు కలకలం రేపింది. శ్రీనగర్-ఢిల్లీ, ముంబై-లేహ్ గోఫస్ట్ విమానాల్లో ఇంజన్లలో సమస్య ఏర్పడ్డాయి దీంతో రెండు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణ చేపట్టింది. -
ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్
ముంబై: మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. మరోవైపు రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం ఉద్దవ్ థాక్రే.. అసెంబ్లీలోనే బలనిరూపణకు పట్టుబడతుంది. ఈ క్రమంలో.. సుప్రీం కోర్టుకు మహా పంచాయితీ చేరుకుంది. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్పై వెకేషన్ బెంచ్ ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రెబల్స్ ఇళ్లు, కార్యాలయాలపై శివ సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం భద్రత కల్పించింది. పదిహేను మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్లో ఏక్నాథ్ షిండే పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్, సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఆత్మలు చనిపోయాయని, వారి ఉత్త దేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని ఆదివారం అన్నారు. ఆ నలభై మంది రెబల్ ఎమ్మెల్యేలు.. బతికి లేరు. తమ చేష్టలతో వాళ్లు వాళ్ల వాళ్ల ఆత్మలను చంపేసుకున్నారు. కేవలం వాళ్ల ఉత్తదేహాలు మాత్రమే మహారాష్ట్రకు తిరిగి వస్తాయి. గువాహతి నుంచి బయటకు అడుగుపెట్టగా.. మనస్ఫూర్తిగా వాళ్లను వాల్లు చంపేసుకున్నట్లే లెక్క. ఆత్మలు లేని వాళ్ల దేహాలు.. పోస్ట్మార్టం కోసం వాళ్లను నేరుగా అసెంబ్లీకి పంపడమే మిగిలింది అని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలు, అధికార దాహంతోనే ఈ వేరుకుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజుకున్న నిప్పుతో ఏం జరుగుతుందో వాళ్లకు తిరిగొచ్చాక తెలుస్తుందని. అని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ‘వాళ్లు ఇక్కడికి వస్తే.. అసలు తిరుగుబాటు ఎక్కడి మొదలైందో స్పష్టత వస్తుంది. వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకు అర్థం అవుతుంది. నిజమైన సైనికుల తీరు ఇది కాదు. అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు.. శివ సేన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ రౌత్. చదవండి: రంగంలోకి గవర్నర్.. మహాలో రాష్ట్రపతి పాలన తప్పదా? -
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
Maharashtra political crisis: అదే సస్పెన్స్
ముంబై: శివసేనలో చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బలం మరింత పెరుగుతోంది. పాలక మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి నేతృత్వం వహిస్తున్న సేనపై ఆయన తిరుగుబాటు చేయడం, తన తన వర్గం ఎమ్మెల్యేలతో మూడు రోజులుగా గౌహతిలోని హోటల్లో మకాం వేయడం తెలిసిందే. ఆయన శిబిరంలో ఇప్పటికే 37 మంది సేన ఎమ్మెల్యేలుండగా శుక్రవారం మరో ఎమ్మెల్యే దిలీప్ లాండే వెళ్లి చేరారు. వీరికి తోడు మరో 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా షిండే శిబిరంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకా సాగదీయడం కూటమికి నగుబాటే తప్ప ఒరిగేదేమీ ఉండదని ఎంవీఏ భాగస్వామి ఎన్సీపీ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం రాత్రి శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరోవైపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హుత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ నరహరిని ఉద్ధవ్ కోరారు. షిండేతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా దీనిపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ఉద్ధవ్కు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను తప్పించాలని షిండే డిమాండ్ చేశారు. అదను చూసి తిరుగుబాటు: ఉద్ధవ్ షిండేపై తొలిసారిగా ఉద్ధవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా తనను అనారోగ్యం వేధిస్తున్న నేపథ్యంలో ఇదే అదనని భావించి ఆయన తిరుగుబాటుకు దిగారంటూ దుయ్యబట్టారు. పార్టీ నీకేం తక్కువ చేసింది అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేల రూపంలో ఎన్నికల ఫలాలను షిండే లాగేసుకున్నా కార్యకర్తల రూపంలో కీలకమైన పార్టీ మూలాలు మాత్రం తమ వద్దే ఉన్నాయన్నారు. తాజా సంక్షోభం వెనక బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు.‘‘శివసేన నుంచి ఠాక్రేలను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. మనవెంట ఎవరూ లేరనే భావిద్దాం. శివసేనను కొత్తగా నిర్మించుకుందాం’’ అని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తాను వీడింది సీఎం బంగ్లా మాత్రమే తప్ప పట్టుదలను, పోరాట పటిమను కాదన్నారు. గతంలోనూ ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పార్టీ మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. నాతోనే 40 మంది: షిండే మరోవైపు షిండే గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ తమదే అసలైన శివసేన అని పునరుద్ఘాటించారు. ‘‘55 మంది సేన ఎమ్మెల్యేల్లో 40 మంది నాతోనే గౌహతిలో ఉన్నారు. 12 మంది స్వతంత్రులూ మా వైపున్నారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే ముఖ్యం. అది మాకుంది గనుక మాపై చర్య తీసుకునే అధికారం ఎవరికీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. మహా శక్తి అయిన జాతీయ పార్టీ ఒకటి తనకు మద్దతుగా ఉందని గురువారం చెప్పిన షిండే శుక్రవారం మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమతో టచ్లో లేదన్నారు. తానన్న మహా శక్తి శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే, పార్టీలో తన గురువు ఆనంద్ డిఘే అని చెప్పుకొచ్చారు. రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందని చెప్పారు. ఆయన గౌహతి నుంచి ముంబై బయల్దేరుతున్నట్టు సమాచారం. మరోవైపు షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యకర్తల నివాసాలపై శివసేన కార్యకర్తలు దాడులు చేయొచ్చన్న వార్తల నేపథ్యంలో ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
వాళ్లంతా హోటల్లో ఉన్నారని తెలియదు!: అస్సాం సీఎం
Maharashtra Political Crisis: ముంబై/గువాహతి: శివ సేన రెబల్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. గువాహతి(అసోం) రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి.. వాళ్లతో గంట గంటకు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో.. అస్సాం (అసోం) ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ఎన్నో మంచి హోటల్స్ ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు.. ఉండొచ్చు. అందులో ఎలాంటి సమస్యా లేదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అస్సాంలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు. అయ్యి ఉండొచ్చు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇక్కడి హోటల్స్లో ఉండొచ్చు. అందులో అభ్యంతరాలు ఏం లేవు.. అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ‘‘మన బాధలు.. సంతోషం ఒక్కటే. అంతా ఒక్కటిగా ఉంటే విజయం మనదే. ఓ జాతీయ పార్టీ.. పాకిస్థాన్ను దెబ్బ కొట్టే సత్తా ఉన్న ‘మహాశక్తి’ మనకు అండగా ఉంటామని మాట ఇచ్చింది. అవసరమైన సాయం చెప్పింది’’ అంటూ ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యల తాలుకా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అస్సాం మంత్రి అశోఖ్ సింఘాల్ గురువారం ఉదయం స్వయంగా రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లి.. ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. దీంతో ఆ పార్టీ బీజేపీనేనా? అని అస్సాం సీఎం హిమంతకు ప్రశ్న మీడియా నుంచి ఎదురుకాగా.. ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. షిండే వర్గంలో మొత్తం 37 మంది శివ సేన ఎమ్మెల్యేలు(అనర్హత నుంచి గట్టెక్కే మ్యాజిక్ ఫిగర్)తో పాటు మరో 9 మంది ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకోవైపు ‘అనర్హత వేటు’ మంత్రం ద్వారా రెబల్ గ్రూప్ను వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్న శివ సేన.. వాళ్లంతా ముంబైకి చేరితేగనుక పరిస్థితి సర్దుమణగవచ్చన్న ఆశాభావంలో ఉంది. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన -
Maharashtra Crisis: గౌహతి హోటల్లో రెబల్ ఎమ్మెల్యేల ఖర్చెంతో తెలుసా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగాలని, బీజేపీతో జట్టు కట్టాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా 24 గంటల్లో ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎమ్వీఏ కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. 70 గదులు బుకింగ్ దాదాపు 42 ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్నారు. హోటల్ పేరు రాడిసన్ బ్లూ. ఆ హోటల్లో మొత్తం 196 గదులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఏడు రోజులకుగానూ 70 గదులు బుక్ చేసుకున్నట్లు హోటల్ వర్గాలు, స్థానిక రాజకీయ నాయకుల ద్వారా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తొలుత బీజేపీ పాలిత గుజరాత్లోని సూరత్లోని ఓ హోటల్లో బస చేశారు. అనంతరం మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలోని గౌహతికి బుధవారం మకాం మార్చారు. చదవండి: Maharashtra Political Crisis: హాట్ టాపిక్గా మారిన నెంబర్ గేమ్! రోజుకు రూ. 8 లక్షలు రాడిసన్ బ్లూ హోటల్లోని 70 గదులకు ఏడు రోజులకు రూ. 56 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్క రోజు గది, ఆహారం ఇతర అవసరలకయ్యే ఖర్చు రూ.8 లక్షలు అన్నమాట. అయితే హోటల్లోని మొత్తం 196 గదుల్లో ఇప్పటికే 70 బుక్ చేసుకోవడంతో ఇక ఎమ్మెల్యేలకు కొత్తగా రూమ్లు కేటాయించేది లేదంటూ హోటల్ యాజమాన్యం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. హోటల్లోని బాంక్వేట్ హాల్ను కూడా మూసేసింది. హోటల్లో బస చేసే వారికి మినహా రెస్టారెంట్ కూడా మూసివేశారు. మరి ఆ ఖర్చుల సంగతేంటి? ఇవే కాక మొత్తం ‘ఆపరేషన్’ ఖర్చులో చార్టర్డ్ ఫ్లైట్లు, ఇతర రవాణా ఖర్చుల సంగతేంటి అనేది కూడా తెలీదు. అంతేగాక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేల ఖర్చు తడిచి మోపడవుతోంది. మరి వీటన్నింటిని ఎవరూ చెల్లిస్తున్నారనేది కూడా ప్రశ్నర్థకమే. అయితే అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అండ్ రాడిసన్ దగ్గర అసోం బీజేపీ మంత్రులే పహారా కాస్తున్నారు. దీంతో క్యాంపు ఖర్చంతా కమలం ఖాతాలోనే పడే అవకాశాలూ లేకపోలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో.. ఇదిలా ఉండగా గౌహతి హోటల్ నుంచి తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. దీంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. -
దేశం ప్రమాదంలో ఉంది.. పోరాడాల్సిందే
గువాహటి: బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారని కొందరు అంటున్నారు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని మరికొందరు అంటున్నారు. మీ మతం కళ్లద్దాలు తీసి చూడండి భారతదేశం ప్రమాదంలో ఉంద’ని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిచే వరకు విశ్రమించబోం అసోం నుంచి అవినీతి బీజేపీని తరిమి కొట్టడానికి టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘టీఎంసీ ఎక్కడ అడుగుపెట్టినా చివరి వరకు గట్టిగా పోరాడింది. రెండేళ్లలో బీజేపీని తరిమికొట్టేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో గెలిచే వరకు విశ్రమించబోం. పోరాటం ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడబోం. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. లోక్సభ ఎన్నికలు రెండేళ్లలో జరగనున్నాయి. ఇక్కడ 14 సీట్లకు గాను 10 స్థానాల్లో పోరాడి గెలుస్తామ’ని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయా రెండింటిలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (క్లిక్: జేపీ మీటింగ్కు రాహుల్ ద్రవిడ్..?) భారీగా చేరికలు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంపై టీఎంసీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిపున్ బోరాను అసోం టీఎంసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఇలీవలే కాంగ్రెస్ పార్టీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. కాగా, కొద్ది రోజుల్లోనే జిల్లా, బ్లాక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని అభిషేక్ బెనర్జీ తెలిపారు. 2022 చివరి నాటికి అన్ని బూత్లలో కమిటీలు ఉండేలా చూస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. (క్లిక్: అవార్డ్ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
వయసు: 102 ఆరోగ్యరహస్యం: సమాజసేవ
మంగళవారం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాబితాలో102 ఏళ్ల శకుంతల చౌధురి పేరు కూడా ఉంది. ‘అస్సాంలో వందేళ్లు దాటిన ఏకైక మహిళ శకుంతల’ అనే మాటపై భేదాభిప్రాయాలు ఉండొచ్చుగానీ ‘ఆమె అలుపెరగని సమాజ సేవిక’ అనే వాస్తవాన్ని ఎవరూ విభేదించరు. అస్సాంలో ఏడుదశాబ్దాలకు పైగా ఆమె పేరు ‘సామాజిక సేవ’కు ప్రత్యామ్నాయంగా మారింది. గౌహతిలోని ‘కస్తూర్బా ఆశ్రమం’ కేంద్రంగా శకుంతలమ్మ ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ సేవాకేంద్రాలను స్థాపించడం ద్వారా ఎన్నో గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది. ‘స్త్రీ శక్తి జాగారణ్’ ఉద్యమంతో స్త్రీల అక్షరాస్యతకు కృషి చేసింది. స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయించింది. శకుంతలమ్మ సుదీర్ఘ ఉపన్యాసాలేవి ఇవ్వదు. చాలా నిశ్శబ్దంగా సేవాకార్యక్రమాలు చేస్తూ పోతుంది. ఈ విధానం ఎంతోమందికి ఆదర్శం అయింది. ‘మనం మాట్లాడడం కంటే మనం చేసే పని మాట్లాడితేనే మంచిది’ అంటారు ఆమె. గాంధీజి, వినోభావే సిద్ధాంతాలతో ప్రభావితం అయిన శకుంతల చిన్న వయసులోనే సమాజసేవను ఊపిరిగా మలుచుకుంది. ‘శకుంతలమ్మను వ్యక్తి అనడం కంటే మహావిశ్వవిద్యాలయం అనడం సరిౖయెనది. ఆమె సైద్ధాంతిక జ్ఞానం, సేవాదృక్పథం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటారు ఆమె అభిమానులు. ‘సహాయం కోసం శకుంతలమ్మ దగ్గరికి వెళ్లినప్పుడు, పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్లినట్లుగా అనిపించదు. మన ఇంటి పెద్ద దగ్గరికి ఆత్మీయంగా వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటారు సామాన్యులు. శకుంతలమ్మకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న... ‘ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?’ ఆమె చెప్పే సమాధానం: ‘సమాజసేవ’ శకుంతలమ్మ ఇచ్చిన చిన్న సమాధానంలో ఎంత పెద్ద తత్వం దాగి ఉందో కదా! -
వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ..
గువాహటి: రోజురోజుకీ దొంగతనం కేసులు ఎక్కువైపోతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లు కంట పడితే చాలు ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనానికి వచ్చిన వారు చప్పుడు చేయకుండా సైలెంట్గా పని కానిచేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం కన్నం వేసిన ఇంట్లో వంట వండుకుంటూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విచిత్ర ఘటన అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంటికి తాళం వేసి ఉండటంతో విలువైన వస్తువులు దొంగిలించేందుకు దొంగ లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ మూటగట్టాడు. అయితే ఇంతలోనే దొంగకు ఆకలి వేయడంతో కిచెన్లోకి వెళ్లి కిచిడీ వండుకోవటం మొదలుపెట్టాడు. కానీ వంట చేసే సమయంలో సౌండ్స్ రావడం అతని కొంప ముంచింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటింటి నుంచి శబ్దాలు రావడం పక్కింటి వారికి అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తాపీగా కిచిడీ వండుకుంటున్న దొంగను పట్టుకున్నారు. చదవండి: వైరల్ వీడియో: ప్యాంట్పై బురద, ఊగిపోతూ ఏం చేసిందంటే.. కాగా ఈ దొంగతనం ఘటన సోమవారం చోటుచేసుకోగా ఈ విషయాన్ని అస్సాం పోలీసులు చమత్కారంగా ట్వీట్ చేశారు. ‘కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి హానికరం. దొంగను అరెస్ట్ చేశాం. గువాహటి పోలీసులు అతనికి వేడి వేడి భోజనం అందిస్తున్నారు" అంటూ ట్వీట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చదవండి: RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం The curious case of a cereal burglar! Despite its many health benefits, turns out, cooking Khichdi during a burglary attempt can be injurious to your well being. The burglar has been arrested and @GuwahatiPol is serving him some hot meals. pic.twitter.com/ehLKIgqcZr — Assam Police (@assampolice) January 11, 2022 -
మమత నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి!
గువాహటి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024) బీజేపీని గద్దెదించడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి రూపుదిద్దుకుంటోందని రాజోర్ దళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ అన్నారు. ప్రాంతీయ శక్తుల సమాఖ్యగా ఏర్పడి.. మమతా బెనర్జీ తమ కూటమి నేతగా ప్రజల ముగింటకు వెళతామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థపై తమకున్న విశ్వాసం, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజోర్ దళ్ను విలీనం చేయాలని మమత కోరారని, దీనిపై తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ఆదివారం వెల్లడించారు. రాజోర్ దళ్ను విలీనం చేస్తే టీఎంసీ అస్సాం శాఖ అధ్యక్షుడిని చేస్తానని తనకు మమత హామీ ఇచ్చారని అఖిల్ చెప్పారు. విలీనంపై ఇప్పటికే మూడుదఫాలుగా చర్చలు జరిగాయన్నారు. ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్ గొగోయ్ శివసాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. జైల్లో ఉండి అసెంబ్లీకి ఎన్నికైన తొలి అస్సామీగా గుర్తింపు పొందారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలపై అఖిల్ గొగోయ్ను 2019 డిసెంబరులో అరెస్టు చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనపై మోపిన అభియోగాలను కొట్టివేయడంతో ఈ ఏడాది జూలై ఒకటో తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. -
నన్ను జైల్లోనే ఉంచేందుకు కుట్ర
గువాహటి: తనను జైల్లోనే ఉంచేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుట్రలు సాగిస్తున్నారని, ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)పై ఒత్తిడి పెంచుతున్నారని అస్సాం స్వతంత్ర ఎమ్మెల్యే, రాయ్జోర్ దళ్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారుడిని పరామర్శించేందుకు అఖిల్కు ఎన్ఐఏ కోర్టు రెండు రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. ఆయన శనివారం జోర్హాట్ జిల్లాలోని సలేన్ఘాట్ గ్రామంలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నీ తెలుసని అన్నారు. ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు అస్సాంలో చేయొద్దని ముఖ్యమంత్రికి హితవు పలికారు. ప్రజాస్వామ్య నిబంధనలు పాటించాలని సూచించారు. సీఎం శర్మ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మే నాయకుడే అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాగానే తన విడుదల కోసం కేబినెట్ నిర్ణయం తీసుకునేదన్నారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన అఖిల్ గొగోయ్ను 2019 డిసెంబర్ 12న జోర్హాట్లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉంటున్నారు. అఖిల్ జైల్లో నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. చదవండి: వైరల్: టూర్ బోటుతో 400 డాల్ఫిన్ల పోటీ.. 95 మిలియన్ల వ్యూస్! మిషన్ 2022పై కమలదళం కసరత్తు -
3 నెలలు కాల్పుల విరమణ: ఉల్ఫా (ఐ)
గువాహటి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో మూడు నెలల పాటు కాల్పుల విరమణను పాటించనున్నట్లు నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఇండిపెండెంట్) శనివారం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా మీడియా సంస్థలకు ఒక ఈ–మెయిల్ పంపించారు. వచ్చే మూడు నెలలపాటు అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఉల్ఫా(ఐ) నిర్ణయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతించారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. (చదవండి: పంజాబ్లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి) -
హిమంత బిశ్వ శర్మ రాజకీయ ప్రస్థానం
-
స్ఫైస్ జెట్ క్రాష్ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి,న్యూఢిల్లీ: ఫైలట్ల తప్పిదం వల్ల బెంగళూరులో రెండు విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యాయి. మెఘాల అడ్డుపడటంతో ఫైలట్ ల్యాండింగ్ ఎత్తును సరిగా అంచనా వేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బెంగళూరు, గువహాటి మధ్య నడిచే స్పైస్ జెట్ బోయింగ్ 737-800, జెట్ లైనర్ -ఎస్జీ-960 విమానం అత్యవసరంగా సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే సుమారు 1,000 ఫీట్లు తక్కువగా ల్యాండ్ అయింది. 4క్యాబిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం ఇద్దరు ఫైలట్లతో సహా 155 మంది ప్రయాణిస్తున్నారు. డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిగేషన్ (డీజీసీఏ) తెల్పిన వివరాల ప్రకారం.. విమానం రన్వే 2 లో సరిగ్గానే ల్యాండింగ్ అయింది. మేఘాల కారణంగా ఎత్తును ఫైలట్లు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ అవగాహన లోపంతో ఫ్లైట్ అధిక ఒత్తిడితో ల్యాండింగ్ అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదని, అంతా సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిజీసీఏ తెలిపింది. -
అక్కడ సరి, బేసి విధానంలో పాఠశాలలు
గువహటి: కరోనా మహమ్మారి కారణంగా ఏడు నెలలుగా మూత పడిని స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా అసోంలో ఈరోజు నుంచి విద్యా సంస్థలను తెరిచారు. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు సరి, బేసి విధానంలో పాఠాలు మొదలపెట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే తరగతులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సరి, బేసి విధానంలో తరగతులు పెట్టడం వల్ల కొవిడ్-19 వ్యాపించకుండా చేయొచ్చన్నారు. 6, 8, 12 తరగతులు సోమ, బుధ, శుక్ర వారాల్లో నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో 7, 9,11 తరగతులు జరుగుతాయి. తరగతులు జరిగే రోజుల్లో విద్యార్థులంతా ఒకేసారి రాకుండా గ్రూపులుగా విభజించనున్నారు. కొన్ని గ్రూపులకు ఉదయం మరికొన్ని గ్రూపులకు మధ్యాహ్నం పాఠాలు చెప్పనున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారనేది ఆయా పాఠశాలలు, కాలేజీల యాజమాన్యం నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. ఉదయం తరగతులు 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. మధ్యాహ్న తరగతులు 12.30 నుంచి సాయంత్రం 3.30 వరకు జరుగుతాయి. -
బాలీవుడ్ సింగర్ తల్లి మృతి
గువహటి: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాపోన్ తల్లి, అలనాటి అస్సాం గాయని అర్చన మహంత(72) మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె గువహటిలోని హెల్త్ సిటీ ఆస్పత్రిలో గురువారం తుది శ్వాస విడిచారు. కాగా జూలై 14న ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్(పక్షవాతం) రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అప్పటికే ఆమె మధుమేహం, అధిక రక్తపోటు, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శరీరం ఎడమ వైపు అంతా చచ్చుబడిపోయింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రాణాలు విడిచారు. ((చదవండి: అంతరిక్షం కూడా ఆయన పేరు దాచుకుంది) ఆమె మరణం పట్ల అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అస్సామీ ఫోక్ సింగర్ అర్చన మహంత ఇక లేరన్న వార్త నన్ను కలిచివేస్తోంది. నేడు ఓ ప్రతిభావంతురాలిని రాష్ట్రం కోల్పోయింది. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా అర్చన మహంత సాంప్రదాయ గాయని. ఆమె భర్త కూడా సింగరే. అనేక కార్యక్రమాల్లో వీరిద్దరూ కలిసి పాటలు పాడేవారు. వీరికి జన్మించిన కుమారుడు పాపోన్ కూడా సింగర్గానే రాణిస్తున్నారు. (చదవండి: నకిలీ ఫాలోవర్ల స్కామ్లో ర్యాపర్) Anguished at the demise of renowned Assamese folk singer Archana Mahanta baidew. Today, we have lost a shining star among the cultural stalwarts of the state. I offer my deepest condolences and join all her well-wishers and fans in prayers for the departed soul.@paponmusic pic.twitter.com/iMLl0CCe7e — Sarbananda Sonowal (@sarbanandsonwal) August 27, 2020 -
చదువు ఓకే.. పస్తులతో ఎలాగ?
గువాహటి: కరోనా వైరస్ వల్ల ప్రపంచమే కుదుపుకు లోనైంది. అందులో పేదవారి జీవితాలు మరింత అస్తవ్యస్తమయ్యాయి. సాధారణ సమయాల్లో ఏ పూటకి ఆ పూట అన్న విధంగా ఉండే కొన్ని జీవితాల్లో కరోనా శోకాన్నే తీసుకొచ్చింది. ఒక్కసారిగా పడ్డ కోవిడ్-19 పిడుగుతో పిడికెడు మెతుకులు దొరకని పరిస్థితి. ఈ సమయంలో తల్లిదండ్రుల కోసం పిల్లలు ముందుకొచ్చారు. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పనుల్లోకి దిగుతున్నారు. వీపుపై బ్యాగు మోయాల్సిన పసికూనలు సామాన్లు మోస్తూ శ్రమకు మించిన పని చేస్తున్నారు. విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసులంటారా.. అవి ఫోన్లు, అందులో ఇంటర్నెట్ ఉన్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే చదువులు. (పలకాబలపం వదిలి.. పలుగూపారా..) ఈ విషయం గురించి అస్సాంలోని గువాహటిలో హఫీజ్నగర్ బస్తీలో నివసించే పదహారేళ్ల జంషేర్ అలీ మాట్లాడుతూ "లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పాఠశాలలు ప్రారంభమవుతాయి. అప్పుడు తప్పకుండా తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా. నాకు చదువును వదులుకోవాలని లేదు, కానీ రోజూ వారీ కూలీగా మారిన నేను పనిని కూడా వదిలిపెట్టలేను. ఎందుకంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. పని కూడా చేయట్లేదు. నేను రోజూ కూలీకి వెళ్లడం వల్ల కనీసం రూ.200-300 సంపాదించగలుగుతున్నాను. ఈ డబ్బుతోనే సర్దుకుపోతున్నా. విద్య ఎంత అవసరమో నా కుటుంబానికి తిండి పెట్టడం అంతే అవసరం" అని చెప్పుకొచ్చాడు. "నేను కొన్ని ఇళ్లల్లో పనిమనిషిగా చేసేదాన్ని. కానీ కోవిడ్ వ్యాప్తి ప్రారంభం అవగానే నన్ను పనిలో నుంచి తీసేశారు. అసలే అనారోగ్యంతో ఉన్న నేను, నా కొడుక్కి ఒక్కపూట అయినా తిండి ఎలా పెట్టగలను?" అని అలీ తల్లి మొమినా ఖతున్ తెలిపారు. (బాల్యం బుగ్గిపాలు!) "ఆన్లైన్ క్లాసులు మాకు అందని ద్రాక్ష. అసలు ఫోన్లే లేని మేము వాటిని ఎలా వినియోగించుకుంటాం?", "మా తల్లి మాకోసం పని చేసేది. ఇప్పుడు ఆమె కోసం మేము పని చేస్తున్నాం" అంటున్నారు అలీ స్నేహితులు సమద్, సైఫుల్. వీళ్లే కాదు, ప్రస్తుతం ఎంతోమందిది ఇదే పరిస్థితి. హఫీజ్నగర్లోని ఏ బస్తీని కదిలించినా ఇలాంటి గాథలే కనిపిస్తాయి. ఇక్కడ నివసించే పిల్లల్లో మూడో వంతు ఆదాయం కోసం పనిబాట పడుతున్నారు. 14-17 ఏళ్లు ఉన్న పిల్లలు పరిశుభ్రత కార్మికులుగా, కూరగాయలు అమ్మేవారిగా, వారి సహాయకులుగా పని చేస్తూ నెలకు రూ.1000 నుంచి 3 వేలు సంపాదిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలోని ప్రతి 100 మంది పిల్లల్లో 14 మంది బాల కార్మికులుగా ఉన్నారు. కరోనా కాటు వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. (పెళ్లి చేసుకో, పిల్లల్ని కను.. అప్పుడే) -
అస్సాం: గౌహతి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం
-
5 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 17,296 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా 10 నగరాలు, జిల్లాల నుంచే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ, చెన్నై, థానే, ముంబై, పాల్గఢ్, పుణె, హైదరాబాద్, రంగారెడ్డి, అహ్మదాబాద్, ఫరీదాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 54.47 శాతం జూన్ 19 నుంచి 25 మధ్య నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది. రికవరీ రేటు 58 శాతానికి పెరగడం ఊరటనిస్తోందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనాకూ రాజధానే కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ విలవిల్లాడుతోంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయి 73,780కి చేరుకున్నాయి. ముంబైలో ఏప్రిల్ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఢిల్లీలో 12 రోజుల్లోనే రెట్టింపైతే, ముంబైలో 40 రోజులకి, చెన్నైలో 19 రోజులకి డబుల్ అయ్యాయి. జూన్ 24 నాటికి ముంబైలో మరణాల రేటు 5.7%గా ఉంటే ఢిల్లీలో 3.36%, చెన్నైలో 1.46%గా ఉంది. కాంగ్రెస్ నేత అభిషేక్కు కరోనా కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీకి కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టుగా ఆయన సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలకు వెళ్లారు. సింఘ్వీ భార్యకు కూడా కోవిడ్–19 సోకింది. గువాహటిలో 14 రోజుల లాక్డౌన్ కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో గువాహటి జిల్లాలోని కామ్రూప్ (మెట్రో)లో జూన్ 28 అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ అమల్లోకి రానుందని అస్సాం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట 12 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కరోనా ఆస్పత్రిగా మసీదు దేశంపై కరోనా పంజా విసిరిన వేళ ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలోని శాంతి నగర్ ప్రాంతంలో మసీదుని కోవిడ్ రోగులకు చికిత్సనందించడానికి వీలుగా మార్చారు. ఆక్సిజన్ సిలండర్లు, ఇతర వైద్య పరికరాలతో 5 పడకలను ఏర్పాటు చేయడమే కాదు, స్వల్ప లక్షణాలున్న వారికి 70 మంది వరకు చికిత్స చేసేలా సదుపాయాలు కల్పించారు. మతంతో ప్రసక్తి లేకుండా ఎవరు వచ్చినా చికిత్స అందిస్తామని మసీదుని నిర్వహిస్తున్న జమాత్–ఏ–ఇస్లామీ హింద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. భివాండీ మున్సిపాల్టీలో 1,332 కేసులు నమోదైతే మృతుల రేటు 5.26 శాతంగా ఉంది. -
లాక్డౌన్ ప్రకటించిన అస్సాం ప్రభుత్వం
గువాహటి : గత వారం రోజులుగా అస్సాం రాష్ర్టంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా కరోనా తీవ్రత ఉన్న గువాహటిలోని కమ్రప్ మెట్రోపాలిటన్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రకటించారు. జూన్ 28 నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలతో సహా వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఆసుపత్రులు తెరవడానికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా వారాంతాల్లో (శని, ఆదివారం) అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. దీని ప్రకారం రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 12 గంటల కర్ఫ్యూ ఉండనుంది. అయితే పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన గువాహటిలో పరిమిత సంఖ్యలో బ్యాంకులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతేకాకుండా అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని ఉత్తర్వులో పేర్కొంది. (సేనల సన్నద్ధతపై నివేదిక) రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల్లోనే 700కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో 276 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా వీటిలో 133 కేసులు గువాహటిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,300కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. (ప్లాస్మా థెరఫీకి గ్రీన్సిగ్నల్) -
చిరుతను కొట్టి చంపి ఊరేగించారు
-
వైరల్: చిరుతను చంపి ఊరేగించారు
గువాహటి: జనవాసాల్లోకి ప్రవేశించిన ఓ చిరుతను దారుణంగా కొట్టి చంపిన ఘటన అసోం రాజధాని గువాహటి శివారు ప్రాంతంలో ఆదివారం జరిగింది. కాలనీల్లోకి చొరబడ్డ చిరుతను స్థానికులు దాన్ని వెంబడించి మూకుమ్మడిగా దాడిచేశారు. తీవ్ర గాయాలతో అది ప్రాణాలు విడిచింది. అనంతరం గ్రామస్తులంతా చిరుత మృతదేహాన్ని ఊరేగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక చిరుతపై దాడి విషయం తెలుసుకున్నఅటవీశాఖ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మిగతావారిని పట్టుకుంటామని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం తమ గ్రామంలోకి చిరుత ప్రవేశించిందని.. ఆ విషయం అటవీశాఖ అధికారులు తెలిపామని స్థానికులు చెప్తున్నారు. బోను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశామని వెల్లడించారు. అయితే అది తప్పించుకుందని, దాంతో ఎక్కడ తమపై దాడి చేస్తుందోననే భయంతో ఎదురుదాడికి దిగామని వారు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా స్పందించి చిరుతను బంధించి ఉంటే.. దాని ప్రాణాలు దక్కేవని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) -
14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి..
గౌహతి : చనిపోయిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ జుగుప్సాకర ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. దేమాజీ ఎస్పీ ధనంజయ్ గానావత్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన 14 ఏళ్ల బాలిక మే17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు వారు ఉంటున్న ఊరికి దగ్గరలోని సైమన్ నదీ తీరంలో బాలికను ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్తులు కూడా హాజరయ్యారు.(రాంపూర్ జిల్లాలో శివసేన కార్యకర్త దారుణ హత్య) అయితే మరునాడు(మే 18వ తేది) 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలికను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి యత్నించడం అటుగా వెళ్తున్న ఒక జాలరి చూశాడు. ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురైన ఆ జాలరి తమకు సమాచారమందించినట్లు ఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అకాన్ చేతులను వెనక్కి కట్టేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలిక శవాన్ని పరిక్షించేందుకు వారి కుటుంబసభ్యుల అనుమతితో మరోసారి పోస్టుమార్టంకు తరలించామని, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని ధనంజయ్ తెలిపారు. అకాన్ సైకియాపై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ('అవమానం భరించలేకపోయాం.. అందుకే రాజీనామాలు') కాగా కేసులో నిందితుడిగా ఉన్న అకాన్ సైకియాపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అకాన్కు ఇప్పటికే రెండు సార్లు పెళ్లిళ్లయ్యాయి. 2018లో మొదటి భార్య గృహహింస కింద అకాన్పై కేసు పెట్టడంతో దేమాజీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో జైళ్లో ఉంటే ఖైదీలకు కరోనా సోకే అవకాశం ఉండడంతో కేసులు తగ్గే వరకు పలువురు ఖైదీలకు పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులో అఖాన్కు పెరోల్ రావడంతో జైలు నుంచి రిలీజయ్యాడు. అయితే బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి దురాఘతానికి పాల్పడడం వెనుక వైద్యులు అకాన్ మానసిక స్థితిని పరిక్షించారు. అకాన్ మహిళల పట్ల సైకోగా వ్యవహరించేవాడని తెలిసింది. కాగా బాలికను అకాన్ లైంగిక వేదింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పలువురు గ్రామస్తులు ఆరోపించారంటూ ఎస్పీ ధనంజయ్ గానావత్ పేర్కొన్నారు. -
111 మందిని కలిసిన కరోనా పేషెంట్
గువాహటి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్లోనూ విస్తరిస్తోంది. అస్సాంలో 25 కరోనా కేసులు నమోదవగా అందులో 24.. ఢిల్లీలోని నిజాముద్దీన్లో తగ్లిబీ జమాత్ సభ్యులవే కావడం గమనార్హం. అయితే మిగిలిన ఒక్కరికి మాత్రం స్థానికంగా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో అతనికి ఎవరి ద్వారా కరోనా సోకిందన్న విషయంపై అధికారులు దృష్టి సారించారు. గువాహటికి చెందిన ఓ వ్యాపారవేత్త ఫిబ్రవరి 29న ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రికి వెళ్లగా అక్కడ అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అతను నివసించే స్వానిష్ గార్డెన్ ప్రాంతాన్నిశుభ్రం చేయడమే కాక ఆ ప్రాంతంలోని కుటుంబాలు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గురించి అస్సాం ఆరోగ్య మంత్రి హింతమ బిశ్వశర్మ మాట్లాడుతూ.. "అతను ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ అక్కడ కరోనా సోకలేదని భావిస్తున్నాం. సుమారు నెల పూర్తయిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. కాబట్టి గువాహటిలోనే అతను వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే సైలెంట్ క్యారియర్(కరోనా సోకిందని తెలియక అందరినీ కలిసి వైరస్ అంటిస్తారు) ద్వారా అతనికి వైరస్ సోకింది" అని అభిప్రాయపడ్డారు. ఇక ఆ వ్యాపారవేత్తను కలిసిన 111 మంది నుంచి సాంపుల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపినట్లు పేర్కొన్నారు. కాగా అతను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక స్వస్థలమైన షిల్లాంగ్, నాగౌన్కు కూడా వెళ్లినట్లు సమాచారం. (వైరస్ అనుమానితుల వివరాలు ఇవ్వండి) -
‘గువాహటి’కి గ్రీన్ సిగ్నల్
గువాహటి: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించి మరో స్టేడియం అరంగేట్రం షురూ అయ్యింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలోనే బరస్పరా స్టేడియంలో ఈసారి ఐపీఎల్ మ్యాచ్ను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బరస్పరా స్టేడియంలో రెండు మ్యాచ్లో జరగనున్నాయి. రాజస్తాన్ రాయల్స్ రెండో హోమ్ గ్రౌండ్గా బరస్పరా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 5వ తేదీ, 8వ తేదీల్లో బరస్పరాలు మ్యాచ్లు జరుగుతాయని తెలిపింది. ఈ రెండు మ్యాచ్లు రాత్రి గం.8..00ని.లకు జరపనున్నట్లు తెలిపింది. (ఇక్కడ చదవండి: సన్రైజర్స్ కెప్టెన్గా మరోసారి వార్నర్) ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు జరిగే ఐపీఎల్ టోర్నీలో ఎప్పటిలాగే రాత్రి మ్యాచ్లు 8 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. అయితే ఈసారి మొత్తం షెడ్యూల్లో రెండు మ్యాచ్లు జరిగే (సాయంత్రం 4 గం.; రాత్రి 8 గం.) రోజులను తగ్గించారు. వీటిని ఐదుకు మాత్రమే పరిమితం చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లంతా కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ‘ఆల్ స్టార్స్ మ్యాచ్’ ఆడనున్నారు.(ఇక్కడ చదవండి: మార్చి 2న మైదానంలోకి ధోని) -
బస్సు లోయలో పడి ఆరుగురు మృతి
గువాహటి : అసోంలో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గోల్పారా జిల్లాలోని రాంగ్జూలీ సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దుబ్రి నుంచి గువాహటి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. -
మరికొద్ది గంటల్లో బర్త్డే వేడుకలు.. అంతలోనే
గుహవాటి : మరికొద్ది గంటల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న ఘటన గుహవాటిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుహావటికి చెందిన తుషార్ శివసాగర్లో జియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. కాగా తన భార్య శిల్సి గోస్వామి, పిల్లలు ఇషాన్(7), ఇవాన్(4)లతో కలిసి బైస్తాపూర్లో ఒక డూప్లెక్స్లో నివసిస్తున్నారు. కాగా గురువారం ఇవాన్ గోస్వామి పుట్టిన రోజు కావడంతో అతని బర్త్డే పార్టీని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. శిల్పి గోస్వామి, తుషార్ తల్లి ఇంటి గ్రౌండ్ ప్లోర్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవగా, ఇవాన్,ఇషాన్లు ఇంటి మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. ఇంతలో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకోవడంతో శిల్పి గోస్వామి పైకి వెళ్లి చూశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోవడం చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వారందరిని గుహవాటి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇవాన్, ఇషాన్లు చనిపోయారని వెల్లడించారు. కాగా శిల్సి గోస్వామి, తుషార్ తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై గుహవాటి పోలీస్ కమిషనర్ ఎంపి గుప్తా మాట్లాడుతూ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మొదటి అంతస్తు మంటల్లో చిక్కుకుందని తెలిపారు. కాగా తమ ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకోవడంతో ఇళ్లు మొత్తం అంటుకుందని పేర్కొన్నారు. కాగా తుషార్కు ప్రమాదంపై సమాచారం ఇచ్చామని, అతను బయలుదేరినట్లు గుప్తా వెల్లడించారు. ఈ ఘటనపై అస్సాం సీఎం శరబనంద సోనోవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. -
బ్యాడ్మింటన్ డబుల్స్లో విష్ణు–నవనీత్ జంటకు స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మంగళవారం తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్ గౌడ్–బొక్కా నవనీత్ ద్వయం విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో విష్ణువర్ధన్–నవనీత్ (తెలంగాణ) జంట 18–21, 21–13, 21–15తో మంజిత్–డింకూ సింగ్ (మణిపూర్) జోడీపై గెలిచింది. టెన్నిస్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం రజతం నెగ్గింది. ఫైనల్లో శశాంక్–సాయికార్తీక్ జోడీ 3–6, 1–6తో పరీక్షిత్ సోమాని–షేక్ ఇఫ్తెకార్ (అస్సాం) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. టెన్నిస్ అండర్–21 బాలికల సింగిల్స్ విభాగంలో సామ సాత్విక (తెలంగాణ) రజతం దక్కించుకుంది. దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్ చాంపియన్ అయిన సాత్విక ఫైనల్లో 3–6, 1–6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి చవిచూసింది. టెన్నిస్ అండర్–17 బాలికల సింగిల్స్లో సంజన సిరిమల్ల (తెలంగాణ) కాంస్యం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సంజన 6–0, 7–5తో కుందన (తమిళనాడు)పై గెలిచింది. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
స్విమ్మింగ్లో లోహిత్కు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు ఒక రజత పతకం లభించింది. అండర్–21 బాలుర బ్రెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో ఎం.లోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. లోహిత్ 1ని:05.31 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతాన్ని దక్కించుకున్నాడు. ధనుష్ (తమిళనాడు–1ని:03.71 సెకన్లు) స్వర్ణం, వరుణ్ పటేల్ (మధ్యప్రదేశ్–1ని:08.51 సెకన్లు) కాంస్యం సాధించారు. మరోవైపు అండర్–17 బాలుర ఖో–ఖో ఈవెంట్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ 20–16తో ఛత్తీస్గఢ్పై గెలిచింది. టెన్నిస్లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అండర్–17 బాలికల తొలి రౌండ్లో సంజన సిరిమల్ల 6–3, 6–1తో పరీ సింగ్ (హరియాణా)పై నెగ్గింది. అండర్–21 బాలికల తొలి రౌండ్లో సామ సాత్విక 6–0, 6–0తో శ్రుతి (డామన్ డయ్యూ)పై గెలుపొందగా... శ్రావ్య శివాని 0–6, 2–6తో సందీప్తి రావు (హరియాణా) చేతిలో ఓడింది. అండర్–21 బాలుర డబుల్స్ మ్యాచ్లో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం 6–1, 6–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో దివేశ్–నితిన్ (హరియాణా) జంటపై గెలిచింది. -
తెలంగాణ ‘పసిడి’ పంట
గువాహటి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మంగళవారం తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో సూరావజ్జుల స్నేహిత్ చాంపియన్గా అవతరించగా... అండర్–21 బాలుర సైక్లింగ్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తని‹Ù్క గౌడ్... అథ్లెటిక్స్లో అండర్–17 బాలికల 200 మీటర్లలో జీవంజి దీప్తి... అండర్–17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్లో అగసార నందిని పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. టీటీ ఫైనల్స్లో స్నేహిత్ 9–11, 12–10, 12–10, 5–11, 11–8, 11–6తో రీగన్ అల్బుక్యూర్క్యూ (మహారాష్ట్ర)ను ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. సైక్లింగ్ ఒక కిలోమీటర్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తనిష్క్ ఒక నిమిషం 08.352 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. కెంగలగుట్టి వెంకప్ప (కర్ణాటక) రజతం, గుర్ప్రీత్ సింగ్ (పంజాబ్) కాంస్యం గెలిచారు. ఇంతకుముందు లాంగ్జంప్లో స్వర్ణం నెగ్గిన నందిని 100 మీటర్ల హర్డిల్స్లో 14.07 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్గా నిలిచింది. ప్రాంజలి పాటిల్ (మహారాష్ట్ర–14.57 సెకన్లు) రజతం, ప్రియా గుప్తా (మహారాష్ట్ర–14.57 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ప్రాంజలి, ప్రియా ఒకే సమయంలో రేసు ముగించగా... ఫొటో ఫినిష్ ద్వారా రజత, కాంస్య పతకాలను నిర్ణయించారు. ఈ క్రీడల్లోనే 100 మీటర్లలో పసిడి సొంతం చేసుకున్న దీప్తి మంగళవారం 200 మీటర్లలోనూ చిరుతలా దూసుకుపోయింది. 24.84 సెకన్లలో రేసును పూర్తి చేసి దీప్తి చాంపియన్గా నిలిచింది. పాయల్ (ఢిల్లీ–24.87 సెకన్లు) రజతం, సుదేష్ణ (మహారాష్ట్ర–25.24 సెకన్లు) కాంస్యం సాధించారు. తెలంగాణ 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో 11వ స్థానంలో ఉంది. యశ్వంత్కు స్వర్ణం... ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పసిడి బోణీ చేసింది. అండర్–21 బాలుర 110 మీటర్ల హర్డిల్స్లో లావేటి యశ్వంత్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. యశ్వంత్ 14.10 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. అండర్–21 బాలికల హైజంప్లో జీజీ జార్జి స్టీఫెన్ (ఆంధ్రప్రదేశ్–1.60 మీటర్లు) కాంస్యం... అండర్–21 బాలుర ట్రిపుల్ జంప్ గెయిలీ వెనిస్టర్ (ఆంధ్రప్రదేశ్–15.51 మీటర్లు) కాంస్యం సాధిం చారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 24వ స్థానంలో ఉంది. -
100 మీటర్ల రేసులో దీప్తికి స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణకు మరో స్వర్ణం లభించింది. గువాహటిలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల 100 మీటర్ల విభాగం ఫైనల్లో జీవంజి దీప్తి విజేతగా నిలిచింది. దీప్తి 12.26 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్ రికార్డు నెలకొల్పింది. రుతిక శరవణన్ (తమిళనాడు), షెరోన్ మారియా (తమిళనాడు)లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. -
నందిని ‘పసిడి జంప్’
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్ అండర్–17 బాలికల లాంగ్జంప్ విభాగంలో తెలంగాణ అమ్మాయి అగసార నందిని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నందిని 5.65 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించు కుంది. నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థిని. నిర్మా అసారి (గుజరాత్–5.62 మీటర్లు) రజతం... అభిరామి (కేరళ–5.47 మీటర్లు) కాంస్యం సాధించారు. అండర్–17 బాలికల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత రజత పతకం సాధించింది. రజిత 57.61 సెకన్లలో గమ్యానికి చేరింది. -
తెలంగాణ జిమ్నాస్ట్ సురభికి మూడు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది. -
రద్దు చేయకుండానే క్రికెటర్లు వెళ్లిపోయారు!
గవాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. సాయంత్రం టాస్ పడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మైదానం పూర్తిగా తడిసిపోగా, కవర్లు కప్పి ఉంచినా వర్షపు నీరు గ్రౌండ్లోకి వచ్చింది. దీనిపై విమర్శలు వచ్చాయి. పిచ్ను కవర్లతో కప్పి ఉంచినా వికెట్పైకి వర్షం నీరు రావడానికి నాసిరకం కవర్లు వాడటమే కారణమంటూ పలువురు విమర్శించారు. ఇదిలా ఉంచితే, పిచ్ను నిర్ణీత సమయానికి సిద్ధం చేయకపోవడతో రాత్రి గం.9.54 ని.లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరగా అంపైర్లు, మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ వికెట్ను పరిశీలించి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకముందే క్రికెటర్లలో చాలా మంది స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి దేవజీత్ స్పష్టం చేయడమే కాకుండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!) ‘భారత్-శ్రీలంక మధ్య ఆదివారం గువాహటిలో జరగాల్సిన మ్యాచ్కు సాయం త్రం 6.45 నుంచి గంటపాటు కురిసిన భారీ వర్షంతో మైదానం మొత్తం తడిసిపోగా..కవర్లు కప్పిఉంచినా పిచ్కూడా చిత్తడిగా మారింది. దాంతో 7.45 తర్వాత ఒకసారి, 9.30కు మరోసారి అంపైర్లు, మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ వికెట్ను పరిశీలించారు. అర్ధగంట సస్పెన్స్ తర్వాత అంటే రాత్రి 9.54కి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మ్యాచ్ను రద్దు చేయడానికి అరగంట ముందే క్రికెటర్లలో చాలామంది స్టేడియం నుంచి వెళ్లిపోయారు.రాత్రి గం. 9.30 ని.లకు పిచ్ పరిశీలిస్తే, చాలామంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియాన్ని వీడారు. మ్యాచ్ రద్దు కాకముందే ఆటగాళ్లు మైదానాన్ని వీడటం కొత్తగా అనిపించడమే కాకుండా మిస్టరీగా కూడా ఉంది. అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించారేమో. కానీ క్రికెటర్లు ముందుగానే వెళ్లిపోవడం మాత్రం నిజం’ అని సైకియా చెప్పాడు. రాత్రి గం,. 8.45 నిమిషాలకల్లా గ్రౌండ్ను సిద్ధం చేయకుంటే మ్యాచ్ను రద్దు చేయక తప్పదని గ్రౌండ్స్మెన్కు మ్యాచ్ అధికారులు స్పష్టంజేసినట్టు కూడా ఆయన వెల్లడించాడు. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్స్మెన్కు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చుంటే మైదానాన్ని రెడీ చేసేవాళ్లం. రివర్స్ ఆస్మోసిస్ విధానం వల్ల పిచ్ చిత్తడిగా మారింది’ అని దేవ్జీత్ అన్నాడు. (ఇక్కడ చదవండి: టీ20 మ్యాచ్: గువాహటి.. యూ బ్యూటీ!) -
దాని గురించి పూర్తిగా తెలియదు: కోహ్లి
న్యూఢిల్లీ: అసోంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదని, గువాహటిని సురక్షితం నగరంగా భావిస్తున్నట్లు తెలిపాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్కు టీమిండియా సమాయత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గువాహటిలో ఆదివారం జరుగనున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరనసల్లో హింసకు పాల్పడ్డారంటూ 190 మందిని అరెస్టు చేశారు. దీంతో అసోం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. (రోహిత్ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!) ఈ నేపథ్యంలో అసోం క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రేక్షకులు కేవలం మొబైల్ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో అసోంలో నెలకొన్న పరిస్థితి గురించి విరాట్ కోహ్లి మాట్లాడుతూ... ‘ ఈ విషయంలో(సీఏఏ) నేను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాలనుకోవడం లేదు. ఇరు వర్గాల అభిప్రాయాలను పరిగణించాల్సి ఉంటుంది. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు. గువాహటి సురక్షితమైన నగరమని తెలుసు. మాకు అక్కడ ఎటువంటి ఇబ్బందలు తలెత్తవు’అని పేర్కొన్నాడు. ఇక టెస్టు మ్యాచ్లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనపై కోహ్లి విముఖత వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో చాలా ఏళ్లుగా టెస్టుల్లో ఐదు రోజుల విధానం అమల్లో ఉందని, దాన్ని అలాగే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.(ఐసీసీ ప్రతిపాదనకు కోహ్లి నో) -
టీ20 సిరీస్: ‘4’,‘6’లను కూడా అనుమతించం
గుహవాటి: అంతర్జాతీయ స్థాయిలో ఏ మ్యాచ్ జరుగుతున్నా ప్లకార్డులతో అభిమానులు స్టేడియాలకి వెళ్లడం సర్వసాధారణం. అది క్రికెట్ మ్యాచ్ కావొచ్చు.. ఫుట్బాల్ మ్యాచ్ కావొచ్చు. ఇక్కడ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటను ఆస్వాదిస్తూ ఉంటారు. కాగా, టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం బార్సపారా క్రికెట్ స్టేడియంలో ప్లకార్డులపై నిషేధం విధిస్తూ అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ సమయంలో ఏ విధమైన ప్లకార్డులు ప్రదర్శించకూడదనే ఆదేశాలు జారీ చేసింది. చివరకు ఫోర్, సిక్స్ ప్లకార్డులను సైతం బ్యాన్ చేసినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ టీమిండియా-శ్రీలంకల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్లో భాగంగా స్టేడియం లోపలికి ఏ విధమైన ప్లకార్డులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.(ఇక్కడ చదవండి: రోహిత్ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!) ఫోర్, సిక్స్ ప్లకార్డులను కూడా తీసుకు రావొద్దు. ఇలా ప్లకార్డుల ప్రదర్శంచడం గందరగోళానికి దారి తీస్తోంది. ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ ప్రకటనలకు కోసం ప్లకార్డులను తయారు చేసి వారి ప్రచారానికి వాడుకుంటున్నాయి. సదరు కంపెనీలు తయారు చేసిన ప్లకార్డులను అభిమానులు స్టేడియాల్లోకి తీసుకొచ్చి వాటిని ప్రదర్శిస్తున్నారు. దాంతోనే ప్లకార్డులతో పాటు బ్యానర్లను కూడా నిషేధిస్తున్నాం. మార్కర్ పెన్స్కు కూడా అనుమతి లేదు. కేవలం పురుషుల వాలెట్లు, మహిళల హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్, అభిమానుల వాహనాల తాళాలు మాత్రమే స్టేడియం లోపలకి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అభిమానులు స్టేడియానికి రావాలి’ అని అసోం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. -
అందరి చూపు బుమ్రా పైనే
గుహవాటి: టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నాలుగు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతూ బరిలోకి దిగని బుమ్రా తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. దీనికి సంబంధించి బార్సపరా స్టేడియంలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో బుమ్రా తన పదునైన పుల్ డెలివరితో స్టంప్స్ను గిరాటేయడం కనిపించింది. నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఎంత కఠోర శ్రమ పడ్డాడనేది వీడియోలో తెలుస్తుంది. 'బుమ్రా వేసిన డెలివరీని ఎవరైనా చూశారా.. ఎలా ఉంది అతని బౌలింగ్' అంటూ ట్వీట్ చేసింది. మరొక ట్వీట్లో 'బుమ్రా తన అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రదర్శన చూసేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి' అంటూ బీసీసీఐ పేర్కొంది. రానున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు జోడీగా కాంబినేషన్లను ప్రయత్నించేందుకు ఈ సిరీస్ కీలకంగా మరనుంది. కాగా శ్రీలంక సిరీస్లో నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్లు బుమ్రాతో బౌలింగ్ పంచుకునే అవకాశం ఉంది. కాగా భువనేశ్వర్, దీపక్ చాహర్లు గాయాలతో జట్టుకు దూరమవగా, మంచి ఫాంలో ఉన్న మహ్మద్ షమీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. 'బుమ్రాతో కలిసి మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్లో ఆడనున్నాను. అతనితో బౌలింగ్ పంచుకునేందుకు ఎదురు చూస్తున్నాను. బుమ్రా బౌలింగ్ను పరిశీలించడం ద్వారా బౌలింగ్లో మరిన్ని మెలుకువలు నేర్చుకుంటాను. నాలోని బలహీనతలను అధిగమించేందుకు అతని సూచనలు వినేందుకు నాకు ఇదే మంచి అవకాశమని ' నవదీప్ సైనీ తెలిపాడు. ఇప్పటికే శ్రీలంక, భారత జట్లు గుహవాటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ 20 ల సిరీస్లో మొదటి మ్యాచ్ జనవరి 5 ఆదివారం బారామతి స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు బుమ్రా తన కెరీర్లో 58 వన్డేల్లో 103 వికెట్లు, 12 టెస్టుల్లో 62 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లను పడగొట్టాడు. Missed this sight anyone? 🔥🔥🔝 How's that from @Jaspritbumrah93 #TeamIndia #INDvSL pic.twitter.com/hoZAmnvE2k — BCCI (@BCCI) January 3, 2020 -
ఆర్ఎస్ఎస్ చెడ్డీగ్యాంగ్ అవమానకరం: రాహుల్
-
ఆర్ఎస్ఎస్ చెడ్డీగ్యాంగ్ అవమానకరం: రాహుల్
గువాహటి : దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత, ప్రజల సమస్యలు పట్టని మోదీ.. మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మరోసారి విభజించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం అస్సాంలో పర్యటించిన రాహుల్.. అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలో ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు ఉండేదని.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కొంతమంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఈశాన్య ప్రాంతమైన అస్సాంపై ఆర్ఎస్ఎస్ పెత్తనం కొనసాగించాలని ప్రత్నిస్తోందని, నాగపూర్ పాలన ఇక్కడ సాగదని రాహుల్ హెచ్చరించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న చెడ్డీగ్యాంగ్ ఆగడాలు ఇక్కడి ప్రజలు తిప్పికొడతారని రాహుల్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ధరించే చెడ్డీలు ఖాకీ రంగుకు అవమానకరమని వ్యాఖ్యానించారు. -
సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు
గువాహటి: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి 2014లోనే కటాఫ్ నిర్ణయించబడిందని అసోం మంత్రి హిమాంత బిస్వా శర్మ అన్నారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పులను సరిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. సీఏఏను సమర్థిస్తూ బీజేపీ గువాహటిలో శుక్రవారం ర్యాలీ నిర్వహించింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సహా పలువురు ముఖ్యనేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హేమంత మాట్లాడుతూ... ‘ 1972 నుంచి ఎంతో మంది వలసదారులు అక్రమంగా రాష్ట్రంలో చొరబడ్డారు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కనీసం ఒక్క చీమైనా సరే రాష్ట్రంలో అడుగుపెట్టలేకపోయింది. అదే విధంగా బంగ్లాదేశ్లో ఒక్క హిందువు కూడా ప్రవేశించలేదని... ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆయన చెప్పారు. ఇప్పుడు సీఏఏ ద్వారా దాదాపు నాలుగు లక్షల మంది శరణార్థులు పౌరసత్వం కోసం అర్హత సాధించారు. ఇక్కడే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినపుడు ఎవరూ ఆందోళనలు చేయలేదు. ఇప్పుడు సీఏఏ వల్ల లాభం కలుగుతుందన్నా నిరసనలు ఎందుకు చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా ఈశాన్య రాష్ట్రం అసోంలో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలస వచ్చిన విదేశీయులకు వెళ్తున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అసోం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలస వచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ బీజేపీ ప్రభుత్వం 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు తీసువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ చట్టం ముస్లిం వర్గ ప్రయోజనాలను కాలరాస్తోందని, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
చచ్చినా సరే.. ‘పౌరసత్వం’ అనుమతించను
గువాహటి : ప్రాణాలు పోయినా సరే పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అనుమతించేది లేదని అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ద్వారా అస్సాం ప్రజలకు కలుగుతున్న బాధ కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్మరిలో అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆదివారం తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జుబీన్.. ‘చచ్చినా సరే అస్సాంలో సీఏఏని అనుమతించను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధను అర్థం చేసుకోవాలి. కానీ, నిరసన గళం వినిపించిన అమాయక పిల్లల్ని చంపుతున్నారు’అని పేర్కొన్నాడు. (చదవండి : 5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు) సీఏఏపై అస్సాం ఆర్టిస్ట్ అసోషియేషన్ సుప్రీంకు వెళ్లనుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాష్ట్రంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. కాగా, ఈ నిరసన కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన వేల మంది కళాకారులు పాల్గొన్నారు. శాంతి సమ్మేళనం పాటల కచేరిని నిర్వహించారు. ఆల్ ఆస్సాం విద్యార్థి యూనియన్ (ఏఏఎస్యూ) ఈ నిరసనకు మద్దతు పలికింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ యూటర్న్ తీసుకున్నారని ఏఏఎస్యూ నాయకులు మండిపడ్డారు. ఏఏఎస్యూలో ఉన్నప్పుడు అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కాగా, జుబీన్ బాలీవుడ్లో కూడా పలు విజయవంతమైన పాటలు పాడారు. (చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!) -
పౌరసత్వ బిల్లుపై నిరసన.. ముగ్గురు మృతి
గువాహటి : పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గువాహటిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం సాయంత్రం రోడ్లపైకి చేరుకున్న నిరసనకారులపై భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఘర్షణల్లో గాయపడ్డ మరికొందరికి గువాహటి మెడికల్ కాలేజ్లో చికిత్స అందిస్తున్నారు. అస్సాం వ్యాప్తంగా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నివాసాలపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి అస్సాంలోని 10 జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గువాహటిలో కర్ఫ్యూ విధించారు. అస్సాంలో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆందోళనలను అదుపు చేయడానికి ఈశాన్య రాష్ట్రాలలో ఆర్మీని మోహరించారు. మేఘాలయాలో కూడా 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు హోంశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పర్యటనలు రద్దు చేసుకున్న బంగ్లా మంత్రులు పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జాన్ ఖాన్ తన షిల్లాంగ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకుముందు బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ కూడా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడంపై మోమెన్ విమర్శలు గుప్పించారు. -
పౌర బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు కొనసాగతున్నాయి. పోలీసు కాల్పులు, లాఠీచార్జ్, రైళ్ల నిలిపివేతతో ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేగింది. అసోం, త్రిపురల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో సైన్యం, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో అసోం, త్రిపురలో విమాన, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. కర్ఫ్యూ ఉత్తర్వులను ధిక్కరించి గువహటిలో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి చేరడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని లాలుంగ్ గావ్ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని స్ధానికులు పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో లోకల్ ట్రైన్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. రైలు, విమాన సర్వీసులకు విఘాతం కలగడంతో ఇరు రాష్ట్రాల్లో ప్రయాణీకులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించింది. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. -
మంటల్లో బస్సు; తప్పిన పెనుప్రమాదం
గువాహటి: అసోం రాజధాని గౌహతి శివార్లలో గురువారం రాత్రి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. అసోంలోని జోర్హాత్కు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు బయటకు పరుగులు తీశారు. ప్రయాణికులు దిగిన వెంటనే డ్రైవర్ కూడా వాహనం నుంచి కిందకు దూకడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై స్ధానికులు సమాచారం అందించగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకున్నారు. షార్ట్సర్య్కూట్ వల్లే బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.