యూపీలో ఎన్‌కౌంటర్‌.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం | Murder Case Of 2 Constables By Pushing Them From Barmer Guwahati Express Mohammad Zahid Arrested, See Details Inside | Sakshi
Sakshi News home page

యూపీలో ఎన్‌కౌంటర్‌.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం

Published Tue, Sep 24 2024 9:47 AM | Last Updated on Tue, Sep 24 2024 10:50 AM

2 Constables by Pushing them from Barmer Guwahati Express Mohammad Zahid Arrested

లక్నో: యూపీలోని లక్నోలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్‌ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్‌ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్‌ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు నిందితుడు జాహిద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు.  

ఘాజీపూర్‌లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్‌కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.

 


ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement