తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత
చెన్నై: పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లకు కొత్తగా రాయితీలు ఇవ్వవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. ప్రోత్సాహకాల పేరుతో ఆ రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తే పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ఉందని ఆమె గుర్తు చేశారు. ఆ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఆ చట్టంలో ఉన్నాయని తెలిపారు. ఆ రాయితీలను రద్దు చేయాలని జయలలిత ఆ లేఖలో కోరారు.