
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి(గురువారం) ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో, అనంతరం ఉదయం 11.30 గంటలకు చింతలపూడిలో పర్యటిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కృష్ణ జిల్లాలోని నందిగామలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రచారం చేస్తారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment