గాయత్రి–సామియా జంట ఓటమి | Gayatri-Samiia's twin defeat | Sakshi
Sakshi News home page

గాయత్రి–సామియా జంట ఓటమి

Sep 2 2017 12:43 AM | Updated on Sep 12 2017 1:34 AM

ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్‌ ఫారుఖీ

పుణే: ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్‌ ఫారుఖీ (భారత్‌) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో గాయత్రి–సామియా ద్వయం 19–21, 26–24, 15–21తో యుయి సుజు–మో యామగుచి (జపాన్‌) జంట చేతిలో పోరాడి ఓడింది.

సింగిల్స్‌ విభాగంలోనూ భారత క్రీడాకారిణులు నిరాశపరిచారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రాషి జోషి 11–21, 21–23తో పత్తారసుద చాయ్‌వాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, జక్కా వైష్ణవి రెడ్డి 18–21, 21–18, 15–21తో మెంగ్‌ జూ (చైనా) చేతిలో, సామియా 9–21, 21–18, 18–21తో రెండో సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ (భారత్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement