
హారికకు తొలి విజయం
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. గూ జియోబింగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో తెల్లపావులతో ఆడిన హారిక 40 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 81 ఎత్తుల్లో మిఖైలో ఒలెక్సియెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు.