
ఐదో సెంచరీ చేసిన హైదరాబాదీ అమ్మాయి
విశాఖపట్టణం: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ వన్డేల్లో ఐదో సెంచరీ సాధించింది. శ్రీలంకతో ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఈ ఘనత సాధించింది. 109 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
148వ వన్డే ఆడుతున్న ఈ హైదరాబాదీ అమ్మాయి 49.33 సగటుతో 4791 పరుగులు సాధించింది. ఇందులో 5 సెంచరీలు, 36 అర్థ సెంచరీలున్నాయి. 8 టెస్టులాడిన మిథాలి రాజ్ 52 సగటుతో 572 పరుగులు చేసింది. ఇందులో సెంచరీ, 3 అర్థ సెంచరీలున్నాయి.