
క్వార్టర్స్లో సింధు, ప్రణయ్
మకావు: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు.. మకావు ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సింధు 21-16, 16-21, 21-19తో ఫెనిత్రి (ఇండోనేసియా)పై గెలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్లో సాయి ప్రణీత్ 16-21, 21-19, 17-21తో ద్వికుంకురో (ఇండోనేసియా) చేతిలో ఓడగా... ప్రణయ్ 17-21, 21-19, 21-14తో లిన్ (చైనీస్తైపీ)పై గెలిచాడు.