
ఇండోర్: మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపి యన్షిప్లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 74 కేజీల విభాగంలో పోటీ పడ్డ సుశీల్కు (రైల్వేస్) ఫైనల్లో ప్రవీణ్ రాణా నుంచి ‘వాకోవర్’ లభించగా... సెమీఫైనల్లో సచిన్ (యూపీ), క్వార్టర్ ఫైనల్లో ప్రవీణ్ (హరియాణా) ‘వాకోవర్’ ఇచ్చారు. తొలి రౌండ్లో లాల్మల్సామా (మిజోరం)పై 48 సెకన్లలో నెగ్గిన సుశీల్, రెండో రౌండ్లో ముకుల్ను నిమిషం 45 సెకన్లలో చిత్తు చేశాడు.
మహిళల 62 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో సాక్షి 10–0తో పూజా (హరియాణా)పై గెలిచింది. భార్యభర్తలైన స్టార్ రెజ్లర్లు గీతా ఫోగట్ (59 కేజీలు), పవన్ కుమార్ (86 కేజీలు) పసిడి పతకాలు నెగ్గడం విశేషం. ఫైనల్స్లో రవితపై గీత; దీపక్పై పవన్ నెగ్గారు.