Gold Medal
-
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణ పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మూడో పసిడి పతకం చేరింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో బుధవారం జరిగిన మహిళల ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది. ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. మంగళవారం జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది. -
జ్యోతి ‘డబుల్’ ధమాకా
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది. నందిని నిలకడగా... ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మహిళల నెట్బాల్ ఫాస్ట్–5 ఈవెంట్లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి. -
జ్యోతి ‘హ్యాట్రిక్’
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన రోహిత్ రోమన్ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.తెలంగాణకు రెండు కాంస్యాలు జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. అథ్లెటిక్స్ మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో నిత్య, మైథిలి ఆకుమడుపుల, మాలోత్ సింధు, అగసార నందినిలతో కూడిన తెలంగాణ జట్టు (47.58 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల నెట్బాల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్లో 43ృ48 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ 9 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
ఆంధ్రప్రదేశ్కు మూడో స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్ స్లాలోమ్ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్లిఫ్టింగ్లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తిరుమూరు గణేశ్ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్ యాదవ్–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు. తెలంగాణకు కాంస్యం మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి. -
తెలంగాణకు తొలి స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్బాల్ 3X3 ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్ను ఓడించాయి. మరో వైపు పురుషుల బాస్కెట్బాల్ 3–3 ఈవెంట్లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు మూడు కాంస్యాలు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి. -
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు తొలి పసిడి పతకం
డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
కొత్త ఏడాదిని భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మొదలుపెట్టింది. ఫ్రాన్స్లో శనివారం జరిగిన నాంటెస్ మెట్రోపోల్ వరల్డ్ అథ్లెటిక్స్ కేటగిరీ ‘సి’ మీట్లో జ్యోతి యర్రాజీ 60 మీటర్ల హర్డిల్స్లో విజేతగా నిలిచింది.ఫైనల్ రేసును జ్యోతి 8.04 సెకన్లలో ముగించి తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసింది. హీట్స్లో 8.07 సమయం నమోదు చేసిన జ్యోతి ఫైనల్కు అర్హత సాధించింది. కాగా జ్యోతీ యార్రాజీని కేంద్రం ఇటీవలే అర్జున అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
జాతీయ స్కూల్ చెస్ విజేత సంహిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. కాకినాడలోని పెద్దాపురంలో జరిగిన ఈ టోర్నీలో సంహిత అండర్–11 బాలికల విభాగంలో చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత సంహిత, రిషిత (ఆంధ్రప్రదేశ్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సంహితకు టైటిల్ దక్కగా... రిషిత రన్నరప్గా నిలిచింది. ఏడు గేముల్లో నెగ్గిన సంహిత... ఒక గేమ్ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయింది. అండర్–11 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన శ్యామల్ నిధిశ్ (7.5 పాయింట్లు) రన్నరప్గా నిలిచాడు. అండర్–7 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన శ్రేయాంశ్ (7.5 పాయింట్లు) రజతం సాధించగా... ఓం ఈశ్ (7 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నాడు. అండర్–9 బాలికల విభాగంలో అరవ విశ్వాణి (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం సాధించింది. అండర్–9 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన తిప్పర్తి శ్రేయాన్ (8.5 పాయింట్లు) చాంపియన్గా నిలువగా...తిమ్మరాజు వెంకట సాత్విక్ (7.5 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. అండర్–13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మోదిపల్లి దీక్షిత (8 పాయింట్లు) స్వర్ణ పతకం నెగ్గగా, వి.త్రిపురాంబిక (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) రజతం సొంతం చేసుకుంది. అండర్–13 బాలుర విభాగంలో సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ (ఆంధ్రప్రదేశ్; 8 పాయింట్లు) చాంపియన్గా నిలిచాడు. అండర్–15 బాలికల విభాగంలో గోర్లి నైనా (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం... అండర్–17 బాలికల విభాగంలో చీదెళ్ల శర్వాణి (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) రజతం... అండర్–17 బాలుర విభాగంలో జ్ఞాన సాయి సంతోష్ (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) స్వర్ణం... మజ్జి రాంచరణ్ తేజ (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) కాంస్యం గెలిచారు. -
షూటింగ్లో ‘స్వర్ణ’ సురుచి
న్యూఢిల్లీ: హరియానా టీనేజ్ షూటర్ సురుచి జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకాల్ని అవలీలగా సాధిస్తోంది. ఈ టోర్నీలో ఆమె నాలుగో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్ర షూటింగ్ జోడీ నేలవల్లి ముకేశ్– ద్వారం ప్రణవి 10 మీటర్ల ఎయిర్పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్ ఈవెంట్లో మూడు స్వర్ణాల్ని క్లీన్స్వీప్ చేసిన సురుచి శనివారం 10 మీటర్ల యూత్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని గెలుచుకుంది. సామ్రాట్ రాణాతో జోడీ కట్టిన ఆమె ఫైనల్లో 16–2తో ఉత్తరాఖండ్కు చెందిన అభినవ్ దేశ్వాల్–యశస్వీ జోషి జోడీపై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి ద్వయం కనీసం ఖాతా తెరువకముందే సురుచి–సామ్రాట్ జంట 14–0తో స్పష్టమైన ఆధిపత్యాన్ని చలాయించింది. కాంస్య పతక పోరులో కర్నాటకకు చెందిన జొనాథన్ గెవిన్ ఆంథోని–అవంతిక మధు 17–13తో జస్వీర్ సింగ్ సాహ్ని–సైనా భర్వాణిలపై గెలిచింది. 10 మీటర్ల ఎయిర్పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ముకేశ్–ప్రణవి జోడీ 12–16తో ఆర్మీ షూటర్లు రవీందర్ సింగ్–సేజల్ కాంబ్లి జంట చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రవీందర్, సేజల్లకు స్వర్ణ పతకం లభించింది. -
జ్యోష్న ‘రికార్డు’ పసిడి
దోహ: భారత యువ వెయిట్ లిఫ్టర్ జ్యోష్న సబర్ ఆసియా యూత్ చాంపియన్సిప్లో పసిడి పతకంతో మెరిసింది. ఖతర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ చాంపియన్షిప్లో జ్యోష్న 40 కేజీల విభాగంలో రికార్డు బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. జ్యోష్న 135 కేజీలు ఎత్తి ఆసియా రికార్డు బద్దలు కొట్టడంతో పాటు... వరల్డ్ రికార్డుకు ఒక కేజీ దూరంలో నిలిచింది. స్నాచ్లో 60 కేజీలు ఎత్తిన జ్యోష్న, క్లీన్ అండ్ జెర్క్లో 75 కిలోలు ఎత్తింది. 45 కేజీల విభాగంలో పాయల్ 155 కేజీల (70 స్నాచ్+85 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్య పతకం కైవసం చేసుకుంది. బాలుర 49 కేజీల విభాగంలో బాబులాల్ 197 కేజీల (88 స్నాచ్+109 క్లీన్ అండ్ జెర్క్) బరువెత్తి కాంస్యం గెలుచుకున్నాడు. 45 కేజీల బాలికల విభాగంలో ఆకాంక్ష వ్యవహారె (151 కేజీలు) ఐదో స్థానంలో నిలిచింది. -
చాంపియన్స్ ధీరజ్, దీపికా కుమారి
జంషెడ్పూర్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్లో మెగురైన ప్రదర్శన కనబర్చినా... పతకం సాధించలేకపోయిన ఈ ఆంధ్ర ఆర్చర్.. జాతీయ టోర్నీలో పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే స్వర్ణం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన రికర్వ్ సింగిల్స్ ఫైనల్లో ధీరజ్ 6–2తో హరియాణాకు చెందిన దివ్యాన్‡్ష చౌధరిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ధీరజ్ ఆ తర్వాత పుంజుకొని అదరగొట్టాడు. ఉత్తరాఖండ్కు చెందిన అతుల్ వర్మ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో నాలుగుసార్లు ఒలింపియన్ దీపికా కుమారి చాంపియన్గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో తన సహచర ఆర్చర్ అకింత భకత్పై విజయంతో దీపికా కుమారి పసిడి పతకం కైవసం చేసుకుంది.శుక్రవారం ఫైనల్లో దీపిక 6–2తో అంకితపై గెలిచింది. సిమ్రన్జీత్ కౌర్కు కాంస్యం దక్కింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ దీపిక స్వర్ణం గెలిచింది. తన భర్త అతాను దాస్తో కలిసి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగింది. ఫైనల్లో పీఎస్పీబీ 6–2తో పంజాబ్ టీమ్పై విజయం సాధించింది. -
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ మ్యాచ్లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్షిప్లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్కు సంబంధించిన పజిల్స్ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్షిప్లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్షిప్లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్ను గ్రాండ్మాస్టర్గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్షిప్ లేదంటే భవిష్యత్లో జరిగే ఒలింపిక్స్లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్వీస్లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
భవ్తేగ్ సింగ్ గిల్కు స్వర్ణం
ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ భవ్తేగ్ సింగ్ గిల్(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్ విభాగంలో 21 ఏళ్ల భవ్తేగ్ సింగ్ గిల్ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్తేగ్ సింగ్... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లోనూ భవ్తేగ్ సింగ్ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్ ఎంగ్లెజోడిస్ (సిప్రస్)కు రజతం, భారత షూటర్ అభయ్ సింగ్కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్తేగ్ ఫైనల్కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్ ఈవెంట్లో అభయ్ సింగ్ షెఖాన్ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్ (34 పాయింట్లు; ఫ్రాన్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు. -
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
క్రిష వర్మ పసిడి పంచ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. -
చిరాగ్ చికారా ‘పసిడి’ పట్టు
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు భారత్కు ఏకైక స్వర్ణ పతకం దక్కింది. అల్బేనియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ చిరాగ్ చికారా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దీమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో జరిగిన ఫైనల్లో చిరాగ్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (2022లో) తర్వాత ప్రపంచ అండర్–23 చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ రెజ్లర్గా చిరాగ్ గుర్తింపు పొందాడు. -
వృత్తి అగర్వాల్కు స్వర్ణం
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది. వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది. -
Paris Paralympics 2024: గతంకంటే ఘనంగా...
పారిస్: కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో ‘పారిస్’ బయలుదేరిన భారత దివ్యాంగ క్రీడాకారులు లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్ ర్యాంక్లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మెరిసిన నవ్దీప్... శనివారం భారత్కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో భారత అథ్లెట్ నవ్దీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెగ్ బీట్ సాయె జావెలిన్ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు.సాదెగ్ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్దీప్కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్ల టి12 (దృష్టిలోపం) కేటగిరీలో సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. -
సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో గోల్డ్ వచ్చి చేరింది. నవదీప్ సింగ్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41 విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే నవదీప్ సింగ్కి ఈ గోల్డ్ మెడల్ అనూహ్యంగా దక్కింది. శనివారం ఆర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 47.32 మీటర్ల త్రో విసిరిన నవదీప్ సింగ్.. తొలుత రెండో స్ధానంలో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇదే విభాగంలో ఇరాన్ కు చెందిన అథ్లెట్ సదేగ్ బీత్ సయా 47.64 మీటర్ల దూరం విసిరి అగ్రస్ధానంలో నిలిచాడు. అయితే అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సదేగ్ బీత్పై అనర్హత వేటు పడింది. ఈవెంట్లో రెండు సార్లు అతడు ఎల్లో కార్డ్ అందుకున్నాడు. ఫలితంగా ఆఖరికి రెండ్ కార్డ్తో పతకానికి అనర్హుడయ్యాడు. అనూహ్యంగా అతనిపై వేటు పడటంతో.. ఆ తరువాత స్థానంలోగా నిలిచిన నవదీప్ సింగ్ రజత పతకం కాస్తా స్వర్ణంగా మారింది.కాగా పారాలింపిక్ కమిటీ 8.1 నియమం ప్రకారం.. క్రీడలో అథ్లెట్ల దురుస ప్రవర్తన, తమ జాతీయ జెండాను తప్పించి మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఈ నిబంధనలను అథ్లెట్లు ఉల్లంఘిస్తే రెండు పసుపు కార్డులు అందుకుంటారు. ఫలితంగా రెడ్ కార్డు(అనర్హత) ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్లో సదేగ్ బీత్ సయా తమ జాతీయ జెండా బదులుగా నల్ల జెండాను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిపై పారాలింపిక్ కమిటీ వేటు వేసినట్లు సమాచారం. ఇక పారాలింపిక్స్ ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. -
ప్రవీణ్ ‘పసిడి’ వెలుగులు
టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు ఐదు స్వర్ణాలు సాధించారు. ఇప్పుడు దానిని మన బృందం అధిగమించింది. 21 ఏళ్ల భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి ఆరో పసిడి పతకాన్ని అందించాడు. హైజంప్లో అతను ఈ మెడల్ను గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్కు స్వర్ణానందం దక్కగా.. ఇతర ఈవెంట్లలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో రజతపతకంతో సత్తా చాటిన భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఈ సారి మరింత బలంగా పైకి లేచాడు. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ – టి64 ఈవెంట్లో ప్రవీణ్కు స్వర్ణపతకం దక్కింది. 2.08 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఆసియా రికార్డుతో అతను పసిడిని గెలుచుకున్నాడు. అమెరికాకు చెందిన డెరెక్ లాసిడెంట్ (2.06 మీ.) రజతం గెలుచుకోగా, తెమూర్బెక్ గియాజోవ్ (ఉజ్బెకిస్తాన్ – 2.03 మీ.)కు కాంస్యం దక్కింది. ముందుగా 1.89 మీటర్ల ఎత్తుతో మొదలు పెట్టిన ప్రవీణ్ తన ఏడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. పారిస్ పారాలింపిక్స్లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు తర్వాత భారత్ తరఫున హైజంప్లో పతకం సాధించిన మూడో అథ్లెట్గా ప్రవీణ్ నిలిచాడు. కస్తూరికి ఎనిమిదో స్థానం... మహిళల పవర్లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో భారత ప్లేయర్ కస్తూరి రాజమణికి నిరాశ ఎదురైంది. మూడు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ కాగా, అత్యుత్తమంగా 106 కిలోల బరువు మాత్రమే ఎత్తిన కస్తూరి ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల కనోయింగ్ ‘వా’ సింగిల్ 200 మీ. హీట్స్లో రాణించిన ప్రాచీ యాదవ్ సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. కనోయింగ్ ‘కయాక్’ సింగిల్ 200 మీ. కూడా భారత ప్లేయర్ పూజ ఓఝా సెమీస్కు చేరింది. పురుషుల ‘కయాక్’ సింగిల్ 200 మీ.లో యష్ కుమార్ కూడా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్ 54 కేటగిరీలో భారత అథ్లెట్ దీపేశ్ కుమార్ అందరికంటే చివరగా ఏడో స్థానంతో ముగించాడు. అతను జావెలిన్ను 26.11 మీటర్ల దూరం విసిరాడు.పురుషుల 400 మీ. – టి47 ఈవెంట్ తొలి రౌండ్ హీట్స్లో మూడో స్థానంలో నిలిచి దిలీప్ గవిట్ ముందంజ వేశాడు. మహిళల 200 మీ.–టి12 పరుగు సెమీ ఫైనల్లో రాణించిన సిమ్రన్ ఫైనల్కు అర్హత సాధించింది. మహిళల జావెలిన్ త్రో –ఎఫ్ 46లో భావనాబెన్ చౌదరి 39.70 మీటర్లు జావెలిన్ను విసిరి ఐదో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగితే పతకం ఖాయమే!ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రవీణ్ కుమార్ పుట్టుకతోనే వికలాంగుడు. అతని ఎడమ కాలు పూర్తిగా ఎదగకుండా చిన్నగా ఉండిపోయింది. చిన్నతనంలో కొందరు హేళన చేయడం అతడిని తీవ్రంగా బాధపెట్టేది. దీనిని మర్చిపోయేందుకు అతను ఆటలపై దృష్టి పెట్టాడు. వైకల్యం ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడేవాడు. అయితే అనూహ్యంగా ఒక సారి సాధారణ అథ్లెట్లు పాల్గొనే హైజంప్లో అతనికీ అవకాశం దక్కింది. దాంతో అథ్లెటిక్స్తో తనకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్కు అర్థమైంది. సత్యపాల్ సింగ్ అనే పారా అథ్లెటిక్స్ కోచ్ అతనిలో ప్రతిభను గుర్తించి హైజంప్పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేశాడు. అన్ని రకాలుగా ప్రవీణ్ను తీర్చిదిద్దాడు.అనంతరం పారా క్రీడల్లో పాల్గొంటూ అతను వరుస విజయాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్లో రజతం, ఇప్పుడు స్వర్ణంలతో పాటు ప్రవీణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో ఒక రజతం, ఒక కాంస్యం కూడా గెలిచాడు. పారిస్ క్రీడలకు ముందు గజ్జల్లో గాయంతో బాధపడిన అతను సరైన సమయానికి కోలుకొని సత్తా చాటాడు. -
సరికొత్త చరిత్ర.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. హై జంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. టోక్యోలో రజతానికి పరిమితమైన ఈ ఉత్తరప్రదేశ్ పారా అథ్లెట్.. ప్యారిస్లో మాత్రం పొరపాట్లకు తావివ్వలేదు. శుక్రవారం నాటి ఈవెంట్లో 21 ఏళ్ల ప్రవీణ్.. అత్యుత్తంగా 2.08 మీటర్ల దూరం దూకి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకున్నాడు.సరికొత్త చరిత్రఅమెరికాకు చెందిన డెరెక్ లాక్సిడెంట్(2.06మీ.- రెండోస్థానం), ఉజ్బెకిస్తాన్ పారా అథ్లెట్ తెముర్బెక్ గియాజోవ్(2.03 మీ- మూడో స్థానం)లను వెనక్కి నెట్టి.. స్వర్ణం గెలిచాడు. పారా విశ్వక్రీడ వేదికపై త్రివర్ణ పతకాన్ని ప్రవీణ్ కుమార్ రెపరెపలాడించాడు. కాగా పారాలింపిక్స్లో భారత్ ఆరు పసిడి పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ప్రవీణ్ కుమార్ గోల్డ్తో ఈ మేర సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. మోకాలి(రెండుకాళ్లకు సమస్య) దిగువ భాగం సరిగా పనిచేయని హై జంపర్లు టీ64 విభాగంలో పోటీపడతారు. అయితే, ప్రవీణ్ ఒక కాలికి మాత్రమే సమస్య ఉంది. ఇక ప్యారిస్లో భారత్కు ఇప్పటి వరకు ఆరు పసిడి, తొమ్మిది రజత, పదకొండు కాంస్యాలు వచ్చాయి. ఓవరాల్గా 26 మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.ప్యారిస్ పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లుఅవనీ లేఖరా- ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1(పారా షూటింగ్)నితేశ్ కుమార్- పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3(పారా బ్యాడ్మింటన్)సుమిత్ ఆంటిల్- పురుషుల జావెలిన్ త్రో-ఎఫ్64హర్వీందర్ సింగ్- పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్(పారా ఆర్చరీ)ధరంబీర్- పురుషుల క్లబ్ త్రో ఎఫ్51(పారా అథ్లెటిక్స్)ప్రవీణ్ కుమార్- పురుషుల హై జంప్ టీ64Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD— JioCinema (@JioCinema) September 6, 2024 -
ధరమ్వీర్ ధమాకా
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు. ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం. పారిస్: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్లో భారత్కు చెందిన ధరమ్వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్వీర్ ప్రకటించాడు. క్లబ్ త్రో ఈవెంట్కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జూడోలో కపిల్కు కాంస్యం... పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు. ఆర్చరీలో చేజారిన కాంస్యం... భారత ఆర్చరీ మిక్స్డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్రింక్–ఫ్యాబ్సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు. హరియాణాలోని సోనేపట్ ధరమ్వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ధరమ్వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు. ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్చెయిర్కే పరిమితమయ్యాడు. కామర్స్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్లో ‘విజన్ ఇంపెయిర్మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు. -
శెభాష్ ధరంబీర్.. భారత్ ఖాతాలో మరో గోల్డ్మెడల్
ప్యారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.తద్వారా పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్లో గోల్డ్మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్.. సిల్వర్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.చదవండి: ‘టోక్యో’ను దాటేసి... -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్లో జరిగిన పారా అథ్లెటిక్స్లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
మిఠాయిలకు దూరం...‘బంగారం’తో సంబరం
పారిస్ పారాలింపిక్స్లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్... బంగారు పతకాన్ని నిలబెట్టుకునేందుకు తనకిష్టమైన మిఠాయిలకు దూరమైనట్లు వెల్లడించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన సుమిత్... తాజా పారిస్ పారాలింపిక్స్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు.సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో సుమిత్ జావెలిన్ను 70.59 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం సుమిత్ మాట్లాడుతూ... ‘పారాలింపిక్స్ కోసం 10 నుంచి 12 కేజీల బరువు తగ్గా. అధిక బరువు వల్ల శరీరంపై ఒత్తిడిపడి మెరుగైన ప్రదర్శన చేయలేనని ఫిజియో సూచించడంతో నాకు ఇష్టమైన స్వీట్లు తినడం మానేశా.ఒత్తిడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. టోక్యో సమయంలో నాపై పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేకపోయింది. వంద శాతం ఫిట్నెస్తో లేకుండానే పారిస్ పోటీల్లో పాల్గొన్నా. గాయం భయంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు మూడేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తున్నా... స్వదేశానికి చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుంటా’ అని అన్నాడు. -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్బాల్ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్షిప్లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్లో ఆడిన ఐదు మ్యాచ్లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
గ్రేట్! ఎత్తు 4.4 అడుగులు.. 7 ఒలింపిక్ స్వర్ణాలు
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో ట్యునీషియాకు చెందిన రౌవా తిలీ అదగొడుతున్నారు. షాట్పుట్ ఎఫ్41 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా ఐదో పారాలింపిక్స్లో ఆమె పసిడి పతకం గెలవడం విశేషం. ఓవరాల్గా ఆమెకు ఇది ఏడో ఒలింపిక్ స్వర్ణం. దీంతో పాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా, 2012లో షాట్పుట్లో బంగారు పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లలో అటు షాట్పుట్లో, ఇటు డిస్కస్లో రెండేసి స్వర్ణాల చొప్పున నెగ్గింది. కాగా 34 ఏళ్ల తిలీ ఎత్తు 4.4 అడుగులే కావడం విశేషం. -
Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..
పారిస్లోని నేషనల్ స్టేడియం.. అథ్లెటిక్స్లో ఆ రోజుకు మిగతా అన్ని ఈవెంట్లూ ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80 వేల మంది ప్రేక్షకులు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్ ఫైబర్ పోల్ సహాయంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన అతను ఆకాశంలోకి దూసుకెళ్లినట్లుగా అనిపించింది. అక్కడినుంచి బార్ మీదుగా అవతలి వైపు ప్యాడింగ్ వైపు పడే లోపే కొత్త ప్రపంచ రికార్డు.. ఒలింపిక్ మెడల్ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆ ఆటగాడే ఆర్మండ్ డుప్లాంటిస్.ఒకటి, రెండు, మూడు.. ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతోందే వరల్డ్ రికార్డులు నెలకొల్పడానికి అన్నట్లుగా ఉంది పరిస్థితి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇలా ఏకంగా అతను 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో రెండు ఒలింపిక్ స్వర్ణాలు అతని ఖాతాలో చేరాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్లో కొత్త వరల్డ్ రికార్డుతో సాధించిన స్వర్ణం ఈ క్రీడలో డుప్లాంటిస్ స్థాయిని శిఖరానికి చేర్చింది. ఒలింపిక్ పతకం గెలిచిన రెండు వారాలకే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ పోటీల్లోనూ అలవోకగా అగ్రస్థానంలో నిలిచాడు.క్రీడాకారుల కుటుంబం నుంచి..తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలూ క్రీడాకారులే! అలా ఇంట్లో అంతా క్రీడా వాతావరణమే. డుప్లాంటిస్ కూడా సహజంగానే క్రీడల వైపు మళ్లాడు. అమెరికా జాతీయుడైన తండ్రి గ్రెగ్ పోల్వాల్టర్ కాగా, స్వీడన్కు చెందిన తల్లి హెలెనా హెప్టాథ్లాన్ ప్లేయర్. పెద్దన్నయ్య కూడా పోల్వాల్ట్లో అంతర్జాతీయ స్థాయికి చేరగా, రెండో అన్న పోల్వాల్ట్తోనే మొదలుపెట్టినా ఆ తర్వాత బేస్బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయి వరకు ఆడాడు. తండ్రి బాటలోనే డుప్లాంటిస్ నాలుగేళ్ల వయసులోనే పోల్వాల్ట్పై ఆసక్తి చూపించాడు.ఏడేళ్ల వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతను పదేళ్ల వయసులో 3.86 మీటర్లు ఎగిరి పోల్వాల్ట్లో తాను ఏ స్థాయికి చేరగలడో చూపించాడు. ఒక దశలో 7 నుంచి 13 ఏళ్ల వయసు వరకు అన్ని వయో విభాగాల్లో ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రదర్శనలన్నీ డుప్లాంటిస్ పేరు మీదే ఉండటం విశేషం. అమెరికాలోనే పుట్టి, అక్కడే ప్రా«థమిక విద్యాభ్యాసం చేసినా, అమ్మ పుట్టిల్లు స్వీడన్పైనే ఆర్మండ్కు అభిమానం ఎక్కువ. అందుకే క్రీడల్లో స్వీడన్కే అతను ప్రాతినిధ్యం వహించాడు.రికార్డుల హోరు..16 ఏళ్ల వయసులో డుప్లాంటిస్ తొలిసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. కొలంబియాలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు కొత్త చాంపియన్షిప్ రికార్డును నెలకొల్పాడు. ఆ వెంటనే అండర్–16 స్థాయిలోనూ కొత్త వరల్డ్ రికార్డు నమోదైంది. ఆపై వరల్డ్ జూనియర్ రికార్డు కూడా దరి చేరింది. 18 ఫీట్ల ఇండోర్ పోల్వాల్ట్ ఈవెంట్లో పోటీ పడిన తొలి స్కూల్ విద్యార్థిగా డుప్లాంటిస్ నిలిచాడు. అండర్–20 విభాగంలో వరల్డ్ చాంపియన్గా నిలిచాక అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సీనియర్ టోర్నీ యూరోపియన్ చాంపియన్షిప్లో అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈ టోర్నీలో తొలిసారి 6 మీటర్ల ఎత్తును అధిగమించిన అతనిపై అందరి దృష్టీ పడింది.ఆపై ఎదురు లేకుండా దూసుకుపోయిన డుప్లాంటిస్ కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలు ఉన్నాయి. యూరోపియన్ జూనియర్లో స్వర్ణం, వరల్డ్ యూత్లో స్వర్ణం, వరల్డ్ జూనియర్లో స్వర్ణ, కాంస్యాలతో అతని జూనియర్ కెరీర్లో కీలక మైలురాళ్లు. సీనియర్ స్థాయికి వచ్చే సరికి యూరోపియన్ చాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు, యూరోపియన్ ఇండోర్లో స్వర్ణంతో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాడు. వరల్డ్ ఇండోర్ చాంపియన్షిప్లో మరో రెండు పసిడి పతకాలు అందుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్లలో గెలుచుకున్న స్వర్ణాలు అతని కెరీర్ను సంపూర్ణం చేశాయి.ఒక్కో సెంటీ మీటర్ దాటుతూ..తొమ్మిది ప్రపంచ రికార్డులను నెలకొల్పడంలో డుప్లాంటిస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రతిసారీ ఒక్కో సెంటీ మీటర్ మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్లో జరిగిన కోపర్నికస్ కప్లో 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి అతను తొలిసారి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్పటి నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు ఇది మెరుగవుతూ వచ్చింది. వరుసగా 6.18, 6.19, 6.20, 6.21, 6.22, 6.23, 6.24, 6.25 మీటర్లతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.ఉక్రెయిన్ దిగ్గజం సెర్గీ బుబ్కా తర్వాత పోల్వాల్ట్ స్థాయిని పెంచి, దానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన ఆటగాడిగా డుప్లాంటిస్ నిలిచాడు. అమెరికాను కాదని తాను ఎంచుకున్న స్వీడన్ కూడా అన్ని రకాలుగా అతనికి అండగా నిలిచింది. అన్నింటికి మించి తన తల్లి స్వస్థలం ఎవెస్టా మునిసిపాలిటీలో డుప్లాంటిస్ గౌరవ సూచకంగా ప్రభుత్వం ఒక పోల్ వాల్ట్ బార్ను ఏర్పాటు చేయడం అతడిని అన్నింటికంటే ఎక్కువగా భావోద్వాగానికి గురి చేసింది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: బడిని గుడి చేసిన గురుదేవుళ్లు.. -
అవని అద్వితీయం
పారాలింపిక్స్లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్లో భారత్కు స్వర్ణం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ 1లో బంగారుపతకం సాధించింది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్ధానంలో నిలిచిన అవని.. గోల్డ్మెడల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా పారా ఒలింపిక్స్లో అవనీకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో 22 ఏళ్ల అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఆమె తన పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్మెడల్స్ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్గా అవని చరిత్ర సృష్టించింది.కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్..ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she's still on top!📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR— The Bharat Army (@thebharatarmy) August 30, 2024 -
Paralympics: తొలి స్వర్ణం నెదర్లాండ్స్ ఖాతాలో...
ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్ ఒలింపిక్ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్ ప్రధాన ఈవెంట్ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. 50 వేల మంది ప్రేక్షకులుసూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్ హైలైట్గా నిలవగా... మయన్మార్ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్పాస్ట్లో పాల్గొన్నారు. వీల్చైర్కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిళా షాట్పుటర్ భాగ్యశ్రీ జాధవ్ వ్యవహరించారు. నెదర్లాండ్స్ ఖాతాలో...ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్ పారాలింపిక్స్ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్ ట్రాక్ సీ4–5 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్లో నెదర్లాండ్స్ సైక్లిస్ట్ కరోలైన్ గ్రూట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. -
అర్షద్ నదీమ్పై కానుకల వర్షం.. ఘన సత్కారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణ పతకం గెలిచిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ను ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. అతడి కోసం ఇస్లామాబాద్లో మంగళవారం విందు ఏర్పాటు చేసిన ఆయన.. నదీమ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కఠిన సవాళ్లతో సావాసం చేయాల్సి వచ్చినా దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నదీమ్ నిరూపించాడని కొనియాడారు.రెండో అత్యున్నత పురస్కారంఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) చెక్కును ప్రధాని షరీఫ్ నదీమ్కు అందించారు. అదే విధంగా.. పాకిస్తాన్లోని రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును నదీమ్కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ పసిడి పతక వీరుడి పేరిట ఇస్లామాబాద్లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై పర్ఫామెన్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.దీనితో పాటు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో పాక్ కరెన్సీలో ఒక బిలియన్ రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కాగా నదీమ్ కుటుంబంతో పాటు అతడి కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్ను కూడా ప్రధాని ప్రశంసించారు. అతడి కూడా పాక్ కరెన్సీలో కోటి రూపాయలు నజరానా ఇస్తున్నట్లు తెలిపారు.నదీమ్కు కారు 92.97 పంజాబ్ (పాక్) ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) నదీమ్ స్వగ్రామానికి వెళ్లి మరీ ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించిన ఆమె ఒలింపిక్ చాంపియన్ను తయారు చేసిన కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్కూ రూ. 50 లక్షల (రూ.15 లక్షలు) చెక్ ఇచ్చారు.ఈ నెల 8న పారిస్లో జరిగిన ఫైనల్ ఈవెంట్లో నదీమ్.. భారత హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా (89.45 మీటర్లు; రజతం)ను వెనక్కినెట్టి 92.97 మీటర్లతో కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ రికార్డు స్కోరుతో కూడిన నేమ్ ప్లేట్ ఉన్న కారును కూడా నదీమ్కు ఈ సందర్భంగా బహూకరించారు. -
తదుపరి లక్ష్యం స్వర్ణ పతకం: అమన్
న్యూఢిల్లీ: వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ‘పారిస్’ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పేర్కొన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలవడం ద్వారా భారత్ తరఫున అతి పిన్న వయసులో ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్గా రికార్డుల్లోకెక్కిన అమన్... భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని అన్నాడు. ‘తదుపరి ఒలింపిక్స్లో పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. దాని కోసం మరింత కఠిన సాధన చేస్తా. పారిస్ క్రీడల్లో కాంస్యం గెలవడం ఆనందంగా ఉంది. పతక పోరుకు ముందు బరువు పెరిగినా... పెద్దగా ఆందోళన చెందలేదు’ అని అమన్ అన్నాడు. మంగళవారం స్వదేశానికి చేరుకున్న అమన్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సన్మానించి రూ. 30 లక్షల చెక్ అందజేశారు. -
Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి.. కష్టే ఫలి!
వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత జావెలిన్ త్రో సూపర్స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ఆటతోనే కాదు.. తన గుణగణాలతో అందరి మనసులు దోచుకున్నాడంటూ ఈ హర్యానా అథ్లెట్ను కొనియాడుతున్నారు అభిమానులు. నీరజ్ పెంపకం కూడా ఎంతో గొప్పగా ఉందంటూ అతడి తల్లిదండ్రులను కూడా ప్రశంసిస్తున్నారు.పాకిస్తాన్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్ కూడా తమ బిడ్డలాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అదే విధంగా.. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా భారత హాకీ స్టార్ శ్రీజేశ్కు ఫ్లాగ్బేరర్గా అవకాశం ఇస్తామన్నపుడు.. నీరజ్ సంతోషంగా ఒప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం నీరజ్ చోప్రా విలాసవంతమైన జీవితం, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువల గురించి చర్చిస్తున్నారు. మరి అతడి నెట్వర్త్ ఎంతో తెలుసా?!ఉమ్మడి కుటుంబంహర్యానాలోని పానిపట్లో గల ఖాంద్రా గ్రామంలో డిసెంబరు 24, 1997లో నీరజ్ చోప్రా ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి సతీశ్ కుమార్, తల్లి సరోజ్ దేవి. పందొమ్మిది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం వారిది. నీరజ్కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. చెల్లెల్లు సంగీత- సరిత.ఇక పదకొండేళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో బాధపడ్డ నీరజ్ను తండ్రి సమీప జిమ్లో చేర్పించాడు. ఊబకాయం వల్ల ఒత్తిడికి లోనైన నీరజ్లో స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపేది అతడి తల్లి. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే కొడుకును జావెలిన్ త్రోయర్గా ఎదిగేలా ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు.ఓవర్నైట్ స్టార్గాఈ క్రమంలో అనూహ్య రీతిలో.. అంచనాలు తలకిందులు చేస్తూ భారత ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన ఈ అథ్లెట్ కోసం వాణిజ్య ప్రచార సంస్థలు క్యూకట్టాయి.ఈ నేపథ్యంలో నీరజ్ పేరుప్రఖ్యాతులతో పాటు సంపద కూడా అమాంతం పెరిగింది. తమ గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది నీరజ్ కుటుంబం. ఖాంద్రాలోని ఈ మూడంతస్తుల భవనం విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.లగ్జరీ కార్లుఇక నీరజ్ గ్యారేజీలో ఆనంద్ మహీంద్రా అందించిన ప్రత్యేకమైన వాహనంతో పాటు.. ఫోర్ట్ ముస్టాంగ్ జీటీ(సుమారు రూ. 93.52 లక్షలు), టయోటా ఫార్చునర్(సుమారు రూ. 33.43 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్(రూ. 2 కోట్లు), హార్లే డేవిడ్సన్ బైకు(రూ. 11 లక్షలు), బజాజ్ పల్సర్(రూ. లక్ష) ఉన్నాయి.నెట్వర్త్ ఎంతంటే?కాగా టోక్యోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి వెండి పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక జావెలిన్ త్రో క్వాలిఫయర్స్ సందర్భంగా నీరజ్ ధరించిన వాచ్పై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఒమేగా బ్రాండ్కు చెందిన ఆక్వా టెరా అల్ట్రా వాచ్ విలువ సుమారుగా రూ.52 లక్షలు ఉంటుందని సమాచారం. అన్నట్లు జాతీయ మీడియా DNA రిపోర్టు ప్రకారం.. నీరజ్ చోప్రా ఆస్తుల నికర విలువ సుమారు 32 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నీరజ్కు అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. కష్టే ఫలిటోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాత క్యాష్ ప్రైజ్ రూపంలో నీరజ్ చోప్రాకు మొత్తంగా రూ. 13 కోట్లు దక్కాయి. నైక్, ఒమేగా వంటి ప్రముఖ బ్రాండ్లకు అతడు ప్రచారకర్త. ఆటగాడిగా తనను నిరూపించుకునే క్రమంలో గాయాలతో సతమతమైనా.. ఎన్నో కఠినసవాళ్లు ఎదురైనా వాటిని దాటుకుని ఉన్నతశిఖరాలకు చేరిన నీరజ్ చోప్రా యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.చదవండి: ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి -
లిన్ యూ టింగ్ పంచ్ అదిరె...
పారిస్ ఒలింపిక్స్లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్తో మెరిసింది. బాక్సింగ్లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. ‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో లిన్తో పాటు ఖలీఫ్పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్గా నిలిచింది. -
ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
Paris olympics: ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
అర్షద్ నదీమ్పై కాసుల వర్షం.. 10 కోట్ల భారీ నజరానా
ప్యారిస్ ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్, బల్లెం వీరుడు అర్షద్ నదీమ్పై కాసుల వర్షం కురుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) ఒలింపిక్ చాంపియన్కు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు. ఇప్పటికే కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా గురువారం(ఆగస్టు 8) ఆర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్.. తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నిరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు. టోక్యోలో రజతం సాధించిన బెడ్నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్లోనూ లైల్స్కు కాంస్యమే లభించింది. కోవిడ్తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించింది.తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి. ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిచాడు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. విభిన్న అంశాలపై ‘ఎక్స్’లో (ట్విటర్) ద్వారా తన స్పందనను పంచుకుంటుంటారు. భిన్న అంశాలలో ప్రతిభావంతులను, క్రీడాకారులను ప్రశంసిస్తుంటారు. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పతక విజేత నీరజ్ చోప్రా పట్ల స్పందించారు.నీరజ్ రెండో బంగారు పతకానికి దూరమైనప్పటికీ, అతని అద్భుతమైన ప్రదర్శన, తిరుగులేని నిలకడను ఆనంద్ ప్రశంసించారు. అలాగే స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డ్-బ్రేకింగ్ విజయాన్నీ అభినందించారు. నీరజ్తో అతని క్రీడాస్ఫూర్తిని, స్నేహాన్ని మెచ్చుకున్నారు."నేను ఒప్పుకుంటున్నాను. నిన్న రాత్రి నీరజ్ చోప్రాకు రెండో ఒలింపిక్ బంగారు పతకం చేజారిన వేళ నిశ్చేష్టుడనయ్యాను. కానీ, ఈ ఉదయం ముందుగా రికార్డ్ బద్దలు కొట్టిన అర్షద్ నదీమ్ని, నీరజ్తో అతని క్రీడాస్ఫూర్తి, స్నేహాన్ని అభినందించాలనుకుంటున్నాను. ఇక అత్యంత నిలకడను ప్రదర్శించిన నీరజ్ కూడా గోల్డ్ గెలిచినట్టేనని నేను చెప్పాలనుకుంటున్నాను. నీరజ్ భారత్కు మొదటి రజత పతకాన్ని అందించారు. నీరజ్ మీరు నిజంగా గొప్ప అథ్లెట్, మంచి మనిషి. మా అందరినీ గర్వపడేలా చేశారు" అని ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్ట్ చేశారు.I confess. I was devastated last night when @Neeraj_chopra1 didn’t win his second Olympic gold medal. But, this morning, I first want to congratulate Arshad Nadeem for his record-breaking throw. AND his sportsmanship & camaraderie with Neeraj. Then I want to tell Neeraj… pic.twitter.com/4KjPPrDh2e— anand mahindra (@anandmahindra) August 9, 2024 -
కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
ఆ దేశ జనాభా సుమారు 25 కోట్లు. కానీ విశ్వక్రీడలైన ఒలింపిక్స్లో పాల్గొనేందుకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్దిమందికి కూడా ఆర్థిక సహాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఒలింపిక్స్లో 40 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని గెలిచి తమ దేశ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తన విజయంతో కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీమ్. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో జావెలిన్ త్రో ఈవెంట్లో పసిడి పతకాన్ని నదీమ్ సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్మెడల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తాచాటిన నదీమ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నదీమ్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.1ఎవరీ అర్షద్ నదీమ్?27 ఏళ్ల నదీమ్ జనవరి 2, 1997న పంజాబ్ ప్రావిన్స్లో ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. నదీమ్కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీమ్ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్కడే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకకానొక సమయంలో తిండికి కూడా నదీమ్ ఇబ్బంది పడిన దుస్థితి.కానీ నదీమ్ లక్ష్యానికి తన పేదరికం అడ్డు రాలేదు. తన చిన్నతనం నుంచే క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. స్కూల్ డేస్లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్,అథ్లెటిక్స్ వంటి క్రీడలలో సత్తాచాటేవాడు. ముఖ్యంగా నదీమ్కు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్పై అతడి అభిరుచి జిల్లా స్ధాయిలో ఆడేలా చేసింది.నదీమ్ క్రికెట్తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్లో జావెద్ ప్రదర్శనకు కోచ్ రషీద్ అహ్మద్ సాకీ ఫిదా అయిపోయాడు. దీంతో అతడిని అథ్లెట్గా తీర్చిదిద్దాలని అహ్మద్ సాకీ నిర్ణయించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు నదీమ్ షాట్ పుట్, డిస్కస్ త్రోను ప్రాక్టీస్ చేసేవాడు.ఆ తర్వాత పూర్తిస్ధాయిలో జావెలిన్ త్రోయర్గా నదీమ్ మారాడు. వరుసగా పంజాబ్ యూత్ ఫెస్టివల్స్లో బంగారు పతకాలు, ఇంటర్-బోర్డ్ మీట్లతో సహా జాతీయ స్ధాయిలో సత్తాచాటాడు. అతడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అథ్లెటిక్స్ జట్ల నుండి ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆర్ధికంగా అర్షద్ నదీమ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో 2016లో అతడికి వరల్డ్ అథ్లెటిక్స్ నుండి స్కాలర్షిప్ వచ్చింది.దీంతో మారిషస్లోని ఐఏఏఎఫ్ (IAAF) హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అవకాశం నదీమ్కు లభించింది. ఇదే అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం పతకం గెలిచి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. అనంతరం అతడికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం నదీమ్ కొనసాగించాడు.2022 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్గా నదీమ్ నిలిచాడు.అదేవిధంగా జావెలిన్ను 92.97 మీటర్ల విసిరిన నదీమ్.. ఒలింపిక్స్లో ఈటెను అత్యధిక దూరం విసిరిన అథ్లెట్గా నిలిచాడు. అయితే నదీమ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేతగా నిలవడంలో అతడి గ్రామ ప్రజల సాయం మరవలేనది. చాలా సందర్భాల్లో అతడికి ఖనేవాల్ ప్రజలు ఆర్ధికంగా సహాయం చేసి పోటీల్లో పాల్గొనేలా తోడ్పడ్డారు. -
ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్.. జొకోవిచ్ సుదీర్ఘ నిరీక్షణకు తెర (ఫోటోలు)
-
10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్కు స్వర్ణం
పారిస్: అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషువా చెప్తెగాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్’ గేమ్స్లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్లో చెప్తెగాయ్ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్ పేరిటే ఉంది. -
భళా బైల్స్...
పారిస్: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గలేకపోయిన అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ ‘పారిస్’లో మాత్రం పసిడి మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పటి వరకు పోటీపడ్డ మూడు ఈవెంట్లలోనూ ఆమె స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 27 ఏళ్ల బైల్స్ మహిళల టీమ్ విభాగంలో, ఆల్ అరౌండ్ విభాగంలో పసిడి పతకాలు నెగ్గగా... తాజాగా శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్లోనూ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది మధ్య జరిగిన ఫైనల్లో బైల్స్ 15.300 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. రెబెకా అండ్రాడె (బ్రెజిల్; 14.966 పాయింట్లు) రజతం, జేడ్ కేరీ (అమెరికా; 14.466 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓవరాల్గా ఒలింపిక్స్ క్రీడల్లో బైల్స్కిది పదో పతకంకాగా, ఇందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్లో బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం నెగ్గింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో బైల్స్కు ఒక రజతం, ఒక కాంస్యం దక్కింది.ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్లో మహిళల వాల్ట్ ఈవెంట్లో రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో జిమ్నాస్ట్గా బైల్స్ గుర్తింపు పొందింది. గతంలో వెరా కసాలావ్స్కా (చెకోస్లొవేకియా; 1964, 1968 ఒలింపిక్స్) రెండు సార్లు వాల్ట్ ఈవెంట్లో పసిడి పతకాలు గెలిచింది. ‘పారిస్’లో బైల్స్ ఖాతాలో నాలుగో స్వర్ణం కూడా చేరే అవకాశం ఉంది. నేడు జరిగే అన్ఈవెన్ బార్స్ ఫైనల్లో బైల్స్ పోటీపడనుంది. -
కేటీ... 13 పతకాలతో మేటి
పారిస్: అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్ వీన్స్టెన్, పెయిజ్ మాడెన్, ఎరిన్ గిమెల్లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది. -
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్, చైనాకు స్వర్ణం : ‘సింక్’ అంటే ఇది! వైరల్ వీడియో
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫాం ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్ విజయాల పరంపరను కొనసాగించారు. చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్ రికార్డు.తొలి రౌండ్లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar— Game of X (@froggyups) August 1, 2024మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్బోర్డ్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. డైవింగ్లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఓ పోస్ట్ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్ను వివరిస్తూ మరో పోస్ట్ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్ఫారమ్లో భాఈగా రీపోస్ట్లు, లైక్లు, కామెంట్లను పొందింది. యూఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
పారిస్ ఒలింపిక్స్లో బోణీ కొట్టిన చైనా.. షూటింగ్లో గోల్డ్ మెడల్
పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటలో చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో చైనా బంగారు పతకం సాధించింది. చైనాకు చెందిన షూటర్లు హువాంగ్ యుటింగ్, షెంగ్ లియావో.. గోల్డ్ మెడల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో రౌండ్లో యుటింగ్, షెంగ్ లియావో జోడీ.. 16-12 స్కోరుతో దక్షిణ కొరియా జంట కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్లను ఓడించించి పతకాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో రెండో స్ధానంలో నిలిచిన కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్, సిల్వర్ మెడల్.. మూడో స్ధానంతో సరిపెట్టుకున్న కజకస్తాన్కు చెందిన అలెగ్జాండ్రా లీ, ఇస్తామ్ సత్పయేవ్లకు కాంస్య పతకం దక్కాయి. మరోవైపు డైవింగ్లో కూడా చైనా స్వర్ణ పతకం సాధించింది. -
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్బాల్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్బాల్లో రాణిస్తున్న తనను పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్బాల్ క్రీడాకారిణి -
వినేశ్ ఫొగాట్కు స్వర్ణం
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్కు ముందు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. మాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో వినేశ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో వినేశ్ 10–5 స్కోరుతో మారియా తియుమెరికొవాపై విజయం సాధించింది. రష్యాకు చెందిన మారియా తటస్థ అథ్లెట్గా బరిలోకి దిగింది. ఫైనల్కు ముందు వినేశ్ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా మూడు బౌట్లలో గెలుపొందింది. యుజ్నీలిస్ గజ్మన్ (క్యూబా)పై 12–4తో, ఆ తర్వాత మాడిసన్ పార్క్స్ (కెనడా)పై ‘విన్ బై ఫాల్’తో, సెమీ ఫైనల్లో కేటీ డచక్ (కెనడా)పై 9–4తో వినేశ్ గెలిచింది. -
భారత మహిళల జట్టు ‘హ్యాట్రిక్’
అంటాల్యా (టర్కీ): వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు (కాంపౌండ్ విభాగం) స్వర్ణ పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 232–229 స్కోరుతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి గోపీచంద్ స్వామి, పర్నిత్ కౌర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. తుది పోరులో 4 ఎండ్లలో భారత్ వరుసగా 58, 57, 59, 58 పాయింట్లు సాధించగా...ఎస్తోనియా టీమ్ సభ్యులు వరుసగా 57, 57, 58, 57 స్కోర్లు చేసి ఓవరాల్గా 3 పాయింట్లతో వెనుకబడ్డారు. మన మహిళల జట్టు ఈ ఏడాది వరుసగా మూడో వరల్డ్ కప్లోనూ పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటడం విశేషం. వరల్డ్ కప్ స్టేజ్ 1 (షాంఘై), వరల్డ్ కప్ స్టేజ్ 2 (యెజియాన్)లలో కూడా టీమ్ అగ్రస్థానంతో ముగించింది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగం ఫైనల్లో ఓడిన భారత ఆర్చర్ ప్రియాన్‡్ష రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ప్రియాన్‡్ష 148–149 స్కోరుతో మైక్ స్కాలెసర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. -
నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం
టుర్కు (ఫిన్లాండ్): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడో పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పావో నుర్మీ గేమ్స్లో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. నీరజ్ జావెలిన్ను 85.97 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. టోనీ కెరనెన్ (ఫిన్లాండ్; 84.19 మీటర్లు) రజతం నెగ్గగా... ఒలివెర్ హెలాండర్ (ఫిన్లాండ్; 83.96 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 82.58 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది నీరజ్ దోహా డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానాన్ని పొందగా... భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ మీట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
ఆర్చరీలో భారత్కు ఒలింపిక్ బెర్త్
అంటాల్యా (టర్కీ): మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఈవెంట్లో భారత ఆర్చర్ భజన్ కౌర్ స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఒలింపిక్ బెర్త్ను అందించింది. ఫైనల్లో భజన్ కౌర్ 6–2 (28–26, 29–29, 29–26, 29–29)తో మొబీనా ఫలా (ఇరాన్)పై విజయం సాధించింది. భారత స్టార్ ఆర్చర్ ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి నిరాశ పరిచింది. నేరుగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక 4–6 (28–26, 27–25, 23–26, 24–25, 27–29) తో యెలాగుల్ రమజనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన అంకిత 4–6 (27–27, 27–28, 29–27, 27–27, 28–29)తో మొబీనా ఫలా (ఇరాన్) చేతిలో పరా జయం పాలైంది. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర భారత్కు ఒలింపిక్ బెర్త్ను అందించాడు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్లో భారత్ మిక్స్డ్ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. -
తెలంగాణ అథ్లెట్ సాయికిరణ్కు స్వర్ణం
దుద్యాల్: జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అల్వాల్ సాయికిరణ్ పురుషుల షాట్పుట్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఈవెంట్లో వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సాయికిరణ్ ఇనుప గుండును 18.36 మీటర్ల దూరం విసిరాడు. గచ్చి»ౌలి స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత, కోచ్ నాగపురి రమేశ్ వద్ద సాయికిరణ్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
ఆంధ్రప్రదేశ్ స్కేటర్ జెస్సీకి పసిడి పతకం
సాక్షి, విజయవాడ: వరల్డ్ స్కేట్ ఓసియానియా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో భాగంగా పసిఫిక్ కప్ ఓపెన్ టోరీ్నలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మాత్రపు జెస్సీ రాజ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్లో జరిగిన ఈ టోరీ్నలో విజయవాడకు చెందిన 13 ఏళ్ల జెస్సీ ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ లేడీస్ క్యాడెట్ విభాగంలో విజేతగా నిలిచింది. తన స్కేటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న జెస్సీ మొత్తం 31.98 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం స్కేటింగ్ లో అడుగు పెట్టిన జెస్సీ జాతీయస్థాయి పోటీల్లో ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలు గెలిచింది. -
సరబ్జోత్ ‘పసిడి’ గురి
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. వరల్డ్ చాంపియన్, నాలుగుసార్లు ఒలింపియన్ తదితర మేటి షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో 22 ఏళ్ల సరబ్జోత్ 242.7 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బు షుహైహాంగ్ (చైనా; 242.5 పాయింట్లు) రజతం నెగ్గగా... రాబిన్ వాల్టర్ (జర్మనీ; 220 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
షణ్ముగ శ్రీనివాస్కు స్వర్ణం... శిరీషకు కాంస్యం
ఇండియన్ గ్రాండ్ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఇదే నెలలో భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్షిప్లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో శ్రీనివాస్ భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్లోనూ కాంస్య పతకం సాధించింది. -
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్లో 76 కేజీలు+స్నాచ్లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్లో జరిగిన పారా ఒలింపిక్లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ
భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో T63 హై జంప్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణ పతకం అందించాడు.జపాన్లోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల తంగవేలు. అంతేకాదు పనిలో పనిగా శరత్ కుమార్ పేరిట ఉన్న(1.83 మీటర్లు) రికార్డు కూడా బద్దలు కొట్టాడు.మనసును కదిలించే కథతమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు.అయితే, తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్ అతడిని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగాతంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.అందుకున్న పురస్కారాలుహై జంప్లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే విధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్నాడు. ధ్యాన్ చంద్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.డబ్బు మొత్తం వాటికే ఖర్చు పెట్టివివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించాడు.చదవండి: MS Dhoni: ఐపీఎల్కు గుడ్బై?.. ధోని కీలక వ్యాఖ్యలు That's Mariyappan Thangavelu. Just few hours back he won India's 🇮🇳 first ever Gold Medal in High Jump at World Para Athletics. Media won't share stories of such incredible athletes. But should know more about him.At the age of 5, he met with an accident where a drunk bus… pic.twitter.com/d4zaKEXJR5— Dilip Kumar (@kmr_dilip) May 22, 2024 -
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది. -
నిఖత్ జరీన్కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్కు చెందిన జజీరా ఉరక్బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. -
Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
భువనేశ్వర్: స్వదేశంలో మూడేళ్ల తర్వాత తొలిసారి బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకంతో మెరిశాడు. గతవారం దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్...బుధవారం జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్లో పసిడి పతకం సాధించాడు. హరియాణాకు చెందిన 26 ఏళ్ల నీరజ్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్ను 82.27 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన డీపీ మనూ 82.06 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన కిశోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. ఒడిశాకు చెందిన కిశోర్ జావెలిన్ను 75.25 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిసారి భారత్లో 2021 మార్చి 17న భువనేశ్వర్లోనే జరిగిన ఫెడరేషన్ కప్లో నీరజ్ పోటీపడి స్వర్ణ పతకం సాధించాడు. మూడేళ్ల తర్వాత ఇదే వేదికపై పోటీపడ్డ నీరజ్ పసిడి ఫలితాన్ని పునరావృతం చేశాడు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
సెర్టోహన్బాష్ (నెదర్లాండ్స్): కొత్త సీజన్ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్ గేమ్స్లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్ గేమ్స్ వరల్డ్ అథ్లెటిక్స్లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్ (నెదర్లాండ్స్; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్ బాస్ట్ (నెదర్లాండ్స్; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్ ప్రకారం జ్యోతికి ఒలింపిక్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధిస్తారు. -
వరల్డ్ ఒలింపిక్స్ చారిత్రక నిర్ణయం
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేతలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగత, రిలే విభాగాల్లో (48 ఈవెంట్స్) స్వర్ణాలు గెలిచే వారికి 50,000 అమెరికన్ డాలర్లు ప్రైజ్మనీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది పారిస్లో జరుగబోయే ఒలింపిక్స్ నుంచి స్వర్ణ పతక విజేతలకుప్రైజ్మనీ పంపిణీ అమల్లోకి వస్తుందని తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి రజత, కాంస్య పతక విజేతలకు కూడా ప్రైజ్మనీ అందిస్తామని పేర్కొంది. నాలుగేళ్లకు ఒకసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి వచ్చే ఆదాయ వాటాతో (2.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒలింపిక్స్లో ప్రైజ్ మనీ అందజేసే తొలి అంతర్జాతీయ సమాఖ్య తమదేనని వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో ప్రకటించారు. -
జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. -
గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి...
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కోల్పోయాడు. టెహ్రాన్లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్ చేయగా.. గుల్వీర్ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్ను కొట్టివేశారు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి భువనేశ్వర్లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ఈ చాంపియన్షిప్లో శనివారం మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్పుట్లో తజీందర్పాల్ సింగ్ తూర్ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్మిలన్ బైన్స్ కనకం మోగించింది. రేస్ను హర్మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది -
స్విమ్మింగ్ 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో కొత్త ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి (రొమేనియా; 46.86 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లె బద్దలు కొట్టాడు. చైనా బృందం రిలే రేసును 3ని:11.08 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటలీ జట్టుకు రజతం, అమెరికా జట్టుకు కాంస్య పతకం లభించాయి. కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం.. ఆమె పరిస్థితి విషమం నైరోబి: కెన్యా స్టార్ అథ్లెట్, పురుషుల మారథాన్లో ప్రపంచ రికార్డు నెలకొలి్పన కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కిప్టమ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొడుతూ బలంగా చెట్టును ఢీకొంది. దుర్ఘటన సమయంలో కోచ్ హకిజిమానా, ఓ మహిళ కారులో ప్రయాణించగా... కిప్టమ్, కోచ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన మహిళను హాస్పిటల్లో చేరి్పంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. 24 ఏళ్ల కిప్టమ్ త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు. అయితు, లక్ష్య చేరుకోకుండానే అతడు మృత్యువాతపడటం విషాదం. గత ఏడాది అక్టోబర్లో జరిగిన షికాగో మారథాన్ రేసులో (42.195 కిలోమీటర్లు; 2గం:00:35 సెకన్లు) కెల్విన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఏప్రిల్లో జరిగిన లండన్ మారథాన్లోనూ కిప్టమ్ స్వర్ణ పతకం సాధించాడు. -
యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన యావజ్జీవ ఖైదీ
-
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్స్టేషన్లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
పారా ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన సచివాలయం ఉద్యోగిని
కోనసీమ: ఇంజరం సచివాలయ కార్యదర్శిగా సేవలందిస్తున్న గాలిదేవర శివ గంగాదుర్గ థాయిలాండ్లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడల్లో సత్తాచాటింది. డిస్కస్ త్రో, జెవెలెన్ త్రోలలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. షార్ట్పుట్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పతకాలు అందుకుని తాళ్లరేవు వచ్చిన శివ గంగాదుర్గకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ఎం.అనుపమ, ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏఓ చింతా మోహనకృష్ణ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హారతులిచ్చి స్వాగతం పలికారు. దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన శివ గంగాదుర్గ 2019లో ఇంజరం సచివాలయం–2లో గ్రేడ్–5 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సేవలందిస్తున్నారు. ఆటలపై మక్కువతోనే పారా ఒలింపిక్స్కు... శివ గంగాదుర్గకు చిన్నతనం నుంచి ఆటలంటే ఎంతో మక్కువ. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న కాన్వెంట్లో చదివి, తరువాత టెన్త్ వరకు హైస్కూల్లో చదివారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో పక్షవాతం వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చదివి ఇంటర్ పూర్తిచేసింది. సుంకరపాలెం రవి కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ స్పేస్ ఫిజిక్స్ చేసేందుకు చేరింది. ఆ సమయంలో పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకుని, ఎలాగైనా పారా ఒలింపిక్స్లో పాల్గొనాలని కంకణం కట్టుకుంది. పీజీ పూర్తికాకుండానే సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది. యానాంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా ప్రాంగణంలో పారా స్పోర్ట్స్ కోసం ప్రత్యేక తర్ఫీదు తీసుకుంది. 2021లో బిహార్లో జరిగిన జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్లో డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించింది. 2022, 23లలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచడంతో ఇటీవల థాయిలాండ్లో జరిగిన పారా ఒలింపిక్స్కు ఎంపికైంది. భారతదేశం నుంచి సుమారు 70 మంది పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో శివ గంగాదుర్గ డిస్కస్ త్రో, జావెలెన్ త్రోలలో ఎఫ్–35 విభాగంలో బంగారు పతకాలు సాధించింది. మరో క్రీడ షాట్పుట్లో నాలుగవ స్థానంలో నిలిచింది. రూ.2 లక్షల బ్యాంకు రుణం తీసుకుని... పారా ఒలింపిక్స్లో పాల్గొనాలంటే రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. శివ గంగాదుర్గ ప్రతిభను గుర్తించిన రిలయన్స్ సంస్థ రూ.50 వేల సహాయం ప్రకటించింది. దీంతో మరో రూ.2 లక్షలు బ్యాంకు రుణం తీసుకుని పోటీ లకు హాజరైనట్లు శివ గంగాదుర్గ విలేకర్లకు తెలిపింది. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, సహచర ఉద్యోగుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగానని తెలి పింది. తన తండ్రి వెంకట్రామయ్య తాను 6వ తరగతి చదివే సమయంలో మృతి చెందారని, అప్పటి నుంచి తల్లి లక్ష్మి టైలరింగ్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించి తనను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పింది. తనకు స్పాన్సర్స్ ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని శివ గంగాదుర్గ తెలిపింది. -
పారా ఆర్చర్ శీతల్కు స్వర్ణం, రజతం
ఆసియా పారా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్ దేవి ఆసియా చాంపియన్షిప్లోనూ రాణించింది. రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్ ఈ టోర్నీలో మిక్స్డ్ టీమ్ విభాగంలో రాకేశ్తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి ‘షూట్ ఆఫ్’లో సింగపూర్ ప్లేయర్ నూర్ సియాదా చేతిలో ఓడిపోయింది. -
జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్ ఆఫ్’లో భారత్కే చెందిన పర్ణీత్ కౌర్ చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ 9 పాయింట్ల షాట్తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత బృందం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 234–233తో చైనీస్ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్షిప్లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి–ప్రియాంశ్ జోడీ 156–151తో కనోక్నాపుస్–నవాయుత్ (థాయ్లాండ్) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్ వర్మ 147–146తో జూ జేహూన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. -
రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్ జౌ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్కే చెందిన పర్ణీత్ కౌర్తో సురేఖ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పర్ణీత్ కౌర్ 147–145తో విక్టోరియా లియాన్ (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి ప్రిక్వార్టర్ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్ (బంగ్లాదేశ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్లాండ్ జట్టును ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. -
చికిత ‘పసిడి’ గురి...
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్ (రాజస్తాన్)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్ ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది. మహిళల టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్)తో జరిగిన టైటిల్ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ 3 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 22వ స్థానంలో ఉంది. -
ప్రతాప్ సింగ్కు పసిడి పతకం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోటీల చివరిరోజు బుధవారం భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో ప్రతాప్ సింగ్ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత బృందం ఇదే విభాగంలో టీమ్ ఈవెంట్లో 1764 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో ప్రదీప్ సింగ్ షెఖావత్ 582 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో భారత బృందం 8 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 22 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. -
దీప్తి ‘పసిడి’ పరుగు
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో రెండో రోజూ భారత క్రీడాకారులు తమ పతకాల వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు... రెండో రోజు మంగళవారం ఏకంగా 18 పతకాలతో అదరగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ల దూరాన్ని 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్తోపాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ ఎల్2 ఈవెంట్లో ప్రాచీ యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకన్లలో అధిగమించి భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్54/55/56) కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. రెండో రోజుల పోటీలు ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తెలుగు తేజం.. మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్మెడల్
ఇంటర్ననేషనల్ మార్షల్ ఆర్ట్స్లో తెలుగు తేజం, విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ సత్తాచాటాడు. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్లో అన్మిష్ వర్మ గోల్డ్మెడల్తో మెరిశాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అన్మిష్కు ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. తద్వారా ఓ అరుదైన ఘనతను అన్మిష్ తన పేరిట లిఖించుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్గా అన్మిష్ రికార్డులకెక్కాడు. అంతకుముందు 2018లో గ్రీస్ వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్లో పసిడి పతకం సొంతం చేసుకున్న అన్మిష్.. 2019లో ఆస్ట్రియా లో జరిగిన ఈవెంట్లోనూ బంగారు పతకంతో మెరిశాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్ సాయిరాజ్
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్ సాయిరాజ్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్ పేర్కొన్నారు. ఇక.. సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్లో భారత్ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్కు తొలిసారి గోల్డ్ మెడల్ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్గా అవతరించింది సాత్విక్- చిరాగ్ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జంట నంబర్వన్ ర్యాంక్ను అందుకోవడం విశేషం. చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం -
CWC 2023 IND VS AUS: విరాట్ కోహ్లికి గోల్డ్ మెడల్
క్రికెట్ వరల్డ్కప్లో గోల్డ్ మెడల్స్ ఇవ్వడం ఎప్పటినుంచి మొదలుపెట్టారని అనుకుంటున్నారా..? ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మీకే అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ఇవ్వాలని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భావించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి పోటాపోటీ పడ్డారు. అయితే అంతిమంగా అవార్డు కోహ్లిని వరించింది. 📽️ BTS from the #TeamIndia 🇮🇳 dressing room 😃👌 - By @28anand A kind of first 🥇 #CWC23 | #INDvAUS And the best fielder of the match award goes to....🥁 WATCH 🎥🔽https://t.co/wto4ehHskB — BCCI (@BCCI) October 9, 2023 మిచెల్ మార్ష్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్తో పాటు ఫీల్డ్లో పాదరసంలా కదులుతూ, సహచరుల్లో స్పూర్తి నింపినందుకు గాను కోహ్లిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఆసీస్పై విక్టరీ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో సెలబ్రేషన్స్ సందర్భంగా దిలీప్.. కోహ్లిని బెస్ట్ ఫీల్డర్గా అనౌన్స్ చేస్తూ గోల్డ్ మెడల్ను అందించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్ అయ్యర్ కూడా పోటీపడ్డాడని దిలీప్ తెలిపాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్ అద్భుతమైన డైవ్ చేసాడని ప్రశంసించాడు. కేవలం ఒక్క క్యాచ్ కారణంగానే కోహ్లికి ఈ అవార్డు ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు. దిలీప్ అవార్డు బహుకరిస్తుండగా.. కోహ్లి మెడలో వేయాలని కోరాడు. దీంతో దిలీప్ గోల్డ్ మెడల్ను కోహ్లి మెడలో వేశాడు. అనంతరం కోహ్లి మెడల్ను నోటితో కొరకుతూ సరదాగా ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. కాగా, ఆసీస్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు)ల చిరస్మరణీయ ఇన్నింగ్స్ల సాయంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. -
క్రికెట్ లో భారత్ కు గోల్డ్.. ఎలా వచ్చిందంటే?
-
Asian Games 2023: కబడ్డీలో భారత్కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ స్వర్ణ పతక జోరు కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 స్వర్ణ పతకాలు చేరాయి. తాజాగా పురుషుల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భారత్.. ఇరాన్పై 33-29 తేడాతో నెగ్గింది. ఏషియన్ గేమ్స్ పురుషుల కబడ్డీలో మొత్తంగా భారత్కు ఇది 8వ స్వర్ణం. ఈ పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 28కి చేరింది. మొత్తంగా ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య ఇప్పటివరకు 103కు (28 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. ప్రస్తుతానికి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. చైనా ఇప్పటివరకు 366 పతకాలు (193 స్వర్ణాలు, 107 రజతాలు, 66 కాంస్యాలు) సాధించింది. పతకాల పట్టికలో జపాన్ రెండో స్థానంలో (177; 48 స్వర్ణాలు, 62 రజతాలు, 67 కాంస్యాలు) ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (183; 39 స్వర్ణాలు, 55 రజతాలు, 89 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది. -
ఆసియాక్రీడల్లో భారత్ రికార్డు.. 100 పతకాలు! ఇదే తొలిసారి
చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడల్లో భారత్ సరి కొత్త రికార్డు సృష్టించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే తొలి సారి 100 పతకాల మార్క్ను భారత్ అందుకుంది. తాజగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్మెడల్ సాధించడంతో.. భారత్ ఈ ఘనత సాధిచింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ తుది పోరులో చైనీస్ తైపీ జట్టును 26-25తో భారత్ ఓడించింది. దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది. కాగా శనివారం ఒక్క రోజే భారత్ మూడు బంగారు పతకాలు సాధించింది. రెండు ఆర్చరీలో రాగా.. మరో స్వర్ణ పతకం కబడ్డీలో వచ్చింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు 100(25 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Asian Games 2023: అదరగొడుతున్న ఆర్చర్లు.. భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ -
గురి తప్పని బాణం.. జ్యోతి సురేఖ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత ఆర్చర్లు అదరగొడతున్నారు. తాజాగా భారత ఖాతాలో రెండు బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఆర్చరీలో భారత్ రెండు పసిడి పతకాలు భారత్ సాధించింది. పురుషల కాంపౌండ్ ఈవెంట్లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్ మెడల్ సాధించగా.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఆసియాక్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు మూడో బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అధితి గోపిచంద్కు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీలో తాజా విజయాలతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 24కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 99(24 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. -
హాకీలో పసిడి వెలుగులు
ఏ లక్ష్యంతోనైతే చైనా గడ్డపై భారత పురుషుల హాకీ జట్టు అడుగుపెట్టిందో దానిని దిగ్విజయంగా అందుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందాలన్న లక్ష్యాన్ని టీమిండియా సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పోటీల 13వ రోజు భారత్ ఖాతాలో మొత్తం తొమ్మిది పతకాలు చేరాయి. ఆర్చరీలో రజతం, కాంస్యం... రెజ్లింగ్లో మూడు కాంస్యాలు... బ్రిడ్జ్, సెపక్తక్రా, బ్యాడ్మింటన్లో ఒక్కో కాంస్య పతకం లభించాయి. ప్రస్తుతం భారత్ 95 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. నేడు క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, మహిళల హాకీ, చెస్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల బరిలో ఉన్నారు. క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, బ్యాడ్మింటన్ ద్వారా భారత్కు కచ్చి తంగా ఏడు పతకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి నేడు అధికారికంగా 100 పతకాల మైలురాయిని దాటనుంది. హాంగ్జౌ: పక్కా ప్రణాళికతో, పూరిస్థాయిలో సన్నద్ధమై ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు తమ లక్ష్యాన్ని సాధించింది. లీగ్ దశ నుంచి ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా తుది పోరులోనూ ఈ దూకుడు కొనసాగించింది. దాంతో ఆసియా క్రీడల్లో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల విజేత హోదాలో టీమిండియా వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత పొందింది. జపాన్తో జరిగిన తుది పోరులో భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ (32వ, 59వ ని.లో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ ని.లో), మన్ప్రీత్ సింగ్ (25వ ని.లో), అభిషేక్ (48వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు సెరెన్ తనాకా (51వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్గా ఆసియా క్రీడల్లో భారత్ నాలుగోసారి స్వర్ణ పతకం సాధించింది. 1966 బ్యాంకాక్, 1998 బ్యాంకాక్, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లోనూ భారత్ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో చైనా జట్టుపై గెలిచింది. హర్మన్ప్రీత్ 13 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. జపాన్ జట్టును ఏమాత్రం తక్కువ చేయకుండా ఆడిన భారత్ అవకాశం వచ్చి నపుడల్లా ప్రత్యర్థి గోల్పోస్ట్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కొన్నిసార్లు గోల్ చేసే అవకాశాలను చేజార్చుకుంది. తొలి 25 నిమిషాల వరకు భారత్ను నిలువరించిన జపాన్ ఆ తర్వాత తడబడింది. అభిషేక్ ‘డి’ ఏరియా వద్ద నుంచి కొట్టిన రివర్స్ షాట్ను జపాన్ గోల్కీపర్ నిలువరించాడు. తిరిగి వచ్చిన బంతిని అక్కడే ఉన్న మన్ప్రీత్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు పెంచగా... జపాన్ డీలా పడింది. ‘క్రికెట్’ ఫైనల్లో భారత్ తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ క్రీడల్లో టీమిండియా ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో అఫ్గానిస్తాన్తో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 97 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అందుకుంది. భారత్ తరఫున హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (26 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సాయికిశోర్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. -
Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ఒలంపిక్స్ బెర్తు ఖరారు
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్ ఒలంపిక్స్-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 22కు చేరింది. సెంచరీ దిశగా భారత్ అదే విధంగా.. ఇప్పటి వరకు 34 వెండి, 39 కాంస్య పతకాలను మన క్రీడాకారులు దేశానికి అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 95 మెడల్స్ సాధించిన భారత్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్లో ఒక పతకం ఖాయం కావడంతో రికార్డు స్థాయిలో కనీసం 101 మెడల్స్ సాధించనుంది. అక్టోబరు 6(శుక్రవారం) నాటి పతకాలు ►మెన్స్ హాకీ: స్వర్ణం ►మెన్స్ బ్రిడ్జ్ టీమ్: రజతం ►మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: అమన్ సెహ్రావత్- కాంస్యం ►వుమెన్ 76కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: కిరణ్ బిష్ణోయి- కాంస్యం ►వుమెన్ 62కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: సోనం మాలిక్- కాంస్యం ►సెపాక్టక్రా వుమెన్స్ టీమ్: కాంస్యం ►బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్: హెస్ ప్రణయ్కు కాంస్యం ►ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీమ్: అతాను, ధీరజ్, తుషార్- రజతం ఖాయమైనవి ►ఫైనల్కు చేరిన కబడ్డీ పురుషుల జట్టు- స్వర్ణం దిశగా అడుగులు ►ఫైనల్కు చేరిన భారత పురుషుల క్రికెట్ జట్టు- స్వర్ణంపై ధీమా తొలిసారి పతకం మహిళల సెపక్తక్రాలో తొలిసారి భారత్కు పతకం ఆసియా క్రీడల సెపక్తక్రా ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది. మహిళల రెగూ టీమ్ ఈవెంట్లో ఐక్పమ్ మైపాక్ దేవి, ఒయినమ్ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్బమ్ ప్రియాదేవి, ఇలాంగ్బమ్ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 10–21, 13–21తో ఓడిపోయింది. బ్రిడ్జ్లో రజతంతో సరి... గత ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్ క్రీడాంశంలో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత బృందం ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 152–238.1 పాయింట్ల తేడాతో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. సందీప్ ఠక్రాల్, జగ్గీ శివ్దసాని, రాజు తొలాని, అజయ్ ప్రభాకర్ రజత పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. రికర్వ్లో తొలిసారి రజతం ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత్ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెర పడింది. చివరిసారి 2010 గ్వాంగ్జౌ ఏషియాడ్లో రికర్వ్ ఈవెంట్ టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాలు లభించాయి. ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్లతో కూడిన జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో భారత్కు తొలిసారి రజత పతకం అందించింది. ఫైనల్లో భారత్ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్పై గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు సిమ్రన్జిత్ కౌర్, అంకిత, భజన్ కౌర్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్యం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో భారత్ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–2తో జపాన్పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. నేడు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం జ్యోతి సురేఖ, కాంస్యం కోసం అదితి... పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్, ఓజస్ ప్రవీణ్ స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడతారు. Indian athletes are on 🔥 Team India beat Japan 5-1 in Asian Games 2022 and won the medal🥇#Asiangames23 #Hockey#PAKvNED #PAKvsNED pic.twitter.com/0kNk3q8EiJ — Saurabh Singh (@100rabhsingh781) October 6, 2023 -
పాకిస్తాన్కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్
Asian Games Mens T20I 2023- Pakistan vs Afghanistan, Semi Final 2: ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్ మెడల్ రేసు నుంచి పాక్ క్రికెట్ బృందం నిష్క్రమించింది. మరోవైపు.. అఫ్గన్ టీమ్ ఈ విజయంతో ఫైనల్కు అర్హత సాధించింది. తద్వారా పటిష్ట టీమిండియాతో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీపడే సువర్ణావకాశం దక్కింది. 115 పరుగులకే ఆలౌట్ చైనాలోని హోంగ్జూలో 19వ ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో సెమీఫైనల్లో పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ పోటీపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లకే చాపచుట్టేసింది. అఫ్గనిస్తాన్ బౌలర్ల ధాటికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఒమైర్ యూసఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ గులాబదిన్, కరీం జనత్ ఒక్కో వికెట్ తీయగా.. ఫరీద్ అహ్మద్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఫైనల్కు చేర్చి కైస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సెదీకుల్హా అటల్ 5, మహ్మద్ షాజాద్ 9 పరుగులకే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో రాణించగా.. ఏడోస్థానంలో వచ్చిన గులాబిదిన్ 19 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది అఫ్గనిస్తాన్ను ఫైనల్కు చేర్చాడు. పసిడి కోసం టీమిండియాతో పోటీ ఇక పాక్తో మ్యాచ్లో 13 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ ఫైనల్లో టీమిండియాను ఢీకొట్టనుంది. రుతురాజ్ గైక్వాడ్ సేనతో శనివారం(అక్టోబరు 7) అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11.30 నిమిషాలకు ఆరంభమవుతుంది. కాంస్యం కోసం బంగ్లాతో పాక్ పోరు కాగా మొదటి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి టీమిండియా గోల్డ్ మెడల్ రేసుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సెమీస్ ఫైనల్స్లో ఓడిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య శనివారం ఉదయం 6.30 గంటలకు కాంస్య పతక పోరు మొదలుకానుంది. చదవండి: ఇంగ్లండ్కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్తో సంబంధం ఏంటి? -
Asian Games 2023: బంగారంలాంటి కూతురు
దివ్యాకృతి సింగ్, అనూష్, హృదయ్, సుదీప్తిలతో కూడిన ఇండియన్ టీమ్ ఈక్వెస్ట్రియన్ డ్రస్సెజ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ బృందంలో ఒకరైన దివ్యాకృతిసింగ్కు తండ్రి విక్రమ్ రాథోడ్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఆమె ట్రైనింగ్ కోసం ఇంటిని కూడా అమ్మాడు. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదువుకునే రోజుల్లో పోటీ పడేందుకు గుర్రం లేకపోవడంతో రెండు సంవత్సరాలు పోటీకి దూరంగా ఉంది దివ్యాకృతి. ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే కూతురు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జర్మనీలో గుర్రాన్ని కొన్నాడు. గుర్రం కొనడం నుంచి స్పాన్సరర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం వరకు విక్రమ్ రాథోడ్ పడని కష్టం లేదు. ఏమైతేనేం, ఆయన శ్రమ ఫలించింది. కుమార్తె బంగారు కల నెరవేరింది. -
ఉత్కంఠ పోరులో పాక్పై విజయం.. భారత్ ఖాతాలో పదో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. స్క్వాష్ క్రీడాంశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరులో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. హోంగ్జూలో శనివారం నాటి ఉత్కంఠ ఫైనల్లో పాక్ టీమ్ను 2-1తో ఓడించి బంగారు పతకం గెలిచింది. సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగావ్కర్, హరీందర్ సంధులతో కూడిన భారత స్క్వాష్ జట్టు ఈ మేరకు పాక్ టీమ్ను ఓడించి చైనాలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 13 రజత, 13 కాంస్య పతకాలు గెలిచింది. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team! Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final ! What a great match guys! Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK — SAI Media (@Media_SAI) September 30, 2023 A game for the Indian history in Squash.....!!!! 🇮🇳 They won the Gold in Asian Games by beating Pakistan in the final. pic.twitter.com/qOuI1Dyjoh — Johns. (@CricCrazyJohns) September 30, 2023 -
భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శనివారం మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో వచ్చి చేరింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో థైపీ జోడీని బోపన్న, రుతుజా ద్వయం ఓడించింది. కాగా ఇది భారత్కు 9వ గోల్డ్మెడల్ కావడం గమానార్హం. ఇక ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్ కప్ జట్టు సెలక్షన్పై యువరాజ్ అసహనం.. అతడిని ఎందుకు ఎంపిక చేశారు? -
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో గోల్డ్మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్తో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే విధంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్లో భారత్కు సిల్వర్ మెడల్ దక్కింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్తో కూడిన భారత త్రయం రజత పతకం సొంతం చేసుకుంది. ఇక భారత్కు ఇది ఏడో గోల్డ్మెడల్. అందులో ఐదు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్గా 27 పతకాలతో భారత్ 4 స్థానంలో ఉంది. 🥇 1️⃣𝙨𝙩 𝙂𝙊𝙇𝘿 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙙𝙖𝙮🔥 🇮🇳's M 50m Rifle 3Ps team, featuring the trio - Aishwary Pratap Singh Tomar, @KusaleSwapnil, and Akhil Sheoran, secured the 𝙂𝙊𝙇𝘿 𝙈𝙀𝘿𝘼𝙇 today, beginning the day on a golden note! 🏆🎯 Let's shower our champions with applause and… pic.twitter.com/YxcsvLXuSG — SAI Media (@Media_SAI) September 29, 2023 -
Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. అదరగొడుతున్న షూటర్లు
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత షూటర్లు సత్తాచాటుతున్నారు. గురువారం మరో బంగారు పతకాన్ని మన షూటర్లు సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమాలో కూడిన భారత బృందం స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్లో సరబ్జోత్ , శివ నర్వాల్, అర్జున్ సింగ్, చీమా 1734 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్ధానంలో నిలిచారు. దీంతో భారత ఖాతాలో ఆరో గోల్డ్మెడల్ వచ్చి చేరింది. ఇక 1733 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఆతిథ్య చైనా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇక ఓవరాల్గా భారత్కు ఇది ఆరో గోల్డ్మెడల్. అందులో నాలుగు పతకాలు షూటింగ్లో వచ్చినవే కావడం విశేషం. ఓవరాల్గా 24 పతకాలతో భారత్ ఐదో స్థానంలో ఉంది. -
బుల్లెట్ దిగింది...
చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్ను వదిలేసి రైఫిల్ ఎత్తిన సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్ షూటర్ ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించింది. పిస్టల్ ఈవెంట్లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ రెండు పతకాలతో భారత బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెయిలింగ్లో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్లో రోషిబినా దేవి ఫైనల్ చేరి... పురుషుల టెన్నిస్ డబుల్స్లో సాకేత్ మైనేని–రామ్కుమార్ జోడీ సెమీఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్గా 22 పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 467 పాయింట్లతో బ్రిటన్ షూటర్ సియోనైడ్ మెకింటోష్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్ కౌర్ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో భారత్కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్ కియోంగ్యు జాంగ్ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది. పంజాబ్లోని ఫరీద్కోట్ ప్రాంతానికి చెందిన సిఫ్ట్ కౌర్ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్ షూటింగ్లో కొనసాగింది. అయితే షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్ కౌర్కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్కు టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్ జీత్ సింగ్, గురుజోత్ సింగ్, అంగద్ వీర్సింగ్ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. -
ప్రపంచ రికార్డుతో సిఫ్ట్కౌర్ సమ్రా.. ఇషా సింగ్కు సిల్వర్ మెడల్
Asian Games 2023 Day 4 Updates: టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో ముందడుగు భారత జోడీ సాహిత్యాన్, మనికా బాత్రా థాయ్లాండ్ ద్వయాన్ని ఓడించి రౌండ్ 16కు చేరుకున్నారు. చరిత్ర సృష్టించిన అనంత్జీత్ స్కీట్ మెన్ వ్యక్తిగత విభాగంలో భారత్కు రజత పతకం లభించింది. షూటర్ అనంత్జీత్ సింగ్ నరూకా ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత్కు ఈ పతకం అందించాడు. అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ సాధించి చరిత్రకెక్కాడు. 🥈SILVER IN SKEET MEN⚡ 🇮🇳 Shooter and #KheloIndiaAthlete Anantjeet adds another SILVER medal in India's medal haul🌟🎯 This is the 1️⃣st time ever in the history of the Asian Games that India has won a silver in this event. Our shooters' combined excellence is making India… pic.twitter.com/5178kedO1u — SAI Media (@Media_SAI) September 27, 2023 ఇషా సింగ్కు రజతం తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 25మీ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. 18 ఏళ్ల ఇషా ఇప్పటికే 25మీ పిస్టల్ టీమ్ విభాగంలో మనూ బాకర్, రిథం సంగ్వాన్తో కలిపి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. 🥈 A Shining Silver for Esha Singh! 🇮🇳🔫 18-year-old @singhesha10 #TOPSchemeAthlete won a spectacular silver 🥈 in the 25m Pistol event at the #AsianGames2022 Let's applaud her unwavering spirit 🎯🫡 Congratulations, Esha! 🌟🎯 P.S: A special shoutout to the Olympian,… pic.twitter.com/D0AkuBPIAY — SAI Media (@Media_SAI) September 27, 2023 ఫెన్సింగ్లో ముందుకు ఫెన్సింగ్ వుమెన్స్ ఎపీ టీమ్ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. తనిక్షా ఖత్రి, జ్యోతికా దత్త, ఇనా అరోరా జెర్డాన్ మహిళా జట్టుపై 45-36తో విజయం సాధించారు. ఇక క్వార్టర్స్లో భారత జట్టు సౌత్ కొరియాను ఎదుర్కోనుంది. హాకీలో.. భారత మహిళా జట్టులో హాకీలో విజయంతో గ్రూప్ దశను ఆరంభించింది. సెయిలింగ్లో మరో పతకం ఆసియా క్రీడల్లో సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. Men's Dnghy ILCA7 ఈవెంట్లో విష్ణు శరవణన్ కాంస్యం గెలిచాడు. కాగా సెయిలింగ్లో భారత్కు ఇది మూడో మెడల్. 3️⃣rd Medal in SAILING⛵🇮🇳@VishnuS28686411 has secured the BRONZE🥉 MEDAL in the ILCA7 sailing event at the #AsianGames2022! 🥉⛵ His outstanding performance on the water has brought honor to India. Well done, Vishnu! 🌟🌊 #Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/Dr9RSqq5ae — SAI Media (@Media_SAI) September 27, 2023 GOLD WITH A WORLD RECORD- భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్) వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా గోల్డ్ మెడల్ సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సమ్రా. తద్వారా భారత పసిడి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చింది. GOLD FOR 🇮🇳 WITH A WORLD RECORD! Huge applause for Sift Samra Kaur, who has secured 🇮🇳's 1st Individual Gold🥇at the #AsianGames2022 👏@SiftSamra's Gold in the Women's 50m Rifle 3 Position event was achieved through unbelievable and surreal shooting, displaying incredible… pic.twitter.com/M1Sg1aB9e6 — Anurag Thakur (@ianuragthakur) September 27, 2023 స్కీట్ మెన్స్ టీమ్ విభాగంలో భారత జట్టుకు కాంస్యం భారత పురుష షూటర్ల జట్టు కాంస్య పతకం సాధించింది. గుర్జోత్, అనంత్జీత్, అంగాడ్విర్ స్కీట్ మెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. Remarkable display of skill and teamwork⚡👍 The Skeet Men's Team secures the BRONZE MEDAL! 🥉🇮🇳 Their precision shooting has earned 🇮🇳 a place on the podium, and we couldn't be prouder! 🌟🎯#Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/FfaqFlRubI — SAI Media (@Media_SAI) September 27, 2023 ఆషీ చోక్సీకి కాంస్యం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్ ఆషీ చోక్సీ కాంస్యం సాధించింది. AND ANOTHER BRONZE🥉🎯 Outstanding performance by the 🇮🇳 Shooter, Ashi Chouksey finished 3️⃣rd in the Women's 50m Rifle 3 Positions Individual, winning India it's 8️⃣th bronze at the #AsianGames2022 ⚡🏅 With this, Ashi has won a total of 3️⃣ medals (2🥈1 🥉) so far. Proud of you,… pic.twitter.com/IQhhdQyA6m — SAI Media (@Media_SAI) September 27, 2023 బంగారు తల్లులు.. వారికేమో వెండి పతకం చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ బుధవారం శుభారంభం చేసింది. షూటింగ్ విభాగంలో తొలుత రజతం, తర్వాత ఈవెంట్లో స్వర్ణం దక్కింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో సిఫ్ట్కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన మహిళా జట్టు భారత్కు సిల్వర్ మెడల్ అందించింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో రజతం బంగారు తల్లులు వీరే తదుపరి.. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, హ్రిదయ్ చద్దా, అనుష్ అగర్వల్లాలతో కూడిన జట్టు 41 ఏళ్ల తర్వాత ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. దీనికి ముందు సెయిలింగ్లో భారత్కు ఇవాళే (సెప్టెంబర్ 26) మూడు పతకాలు అందాయి. #EquestrianExcellence at the 🔝 After 41 long years, Team 🇮🇳 clinches🥇in Dressage Team Event at #AsianGames2022 Many congratulations to all the team members 🥳🥳#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/CpsuBkIEAw — SAI Media (@Media_SAI) September 26, 2023 భారత సెయిలర్లు నేహా ఠాకూర్ రజతం, ఎబాద్ అలీ, విష్ణు శరవనన్ కాంస్య పతకాలు సాధించారు. ఆసియా క్రీడల్లో మూడో రోజు మధ్యాహ్నం సమయానికి భారత పతకాల సంఖ్య 14కు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలు) చేరింది. పతకాల పట్టికలో చైనా 78 పతకాలతో టాప్లో కొనసాగుతుండగా.. భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. -
Asian Games 2023: ‘పసిడి’ బుల్లెట్...
హాంగ్జౌ: తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ షూటర్లు ఆసియా క్రీడల్లో తమ గురికి పదును పెట్టారు. పోటీల రెండో రోజు భారత షూటర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు అందించారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వర్లతో కూడిన భారత జట్టు 1893.7 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త ప్రపంచ రికార్డును నెలకొలి్పంది. ఈ ఏడాది ఆగస్టు 23న చైనా జట్టు 1893.3 పాయిం్లటతో సాధించిన ప్రపంచ రికార్డును భారత త్రయం తిరగరాసింది. క్వాలిఫయింగ్లో ఆయా దేశాల షూటర్లు చేసిన స్కోరును లెక్కించి టాప్–3లో నిలిచిన జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. క్వాలిఫయింగ్లో భారత్ నుంచి రుద్రాంశ్ 632.5 పాయింట్లు, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 631.6 పాయింట్లు, దివ్యాంశ్ 629.6 పాయింట్లు సాధించారు. టాప్–8లో నిలిచిన ఈ ముగ్గురూ ఫైనల్కు అర్హత సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లకు మాత్రమే ఫైనల్లో ఆడేందుకు అనుమతి ఉంది. దాంతో దివ్యాంశ్ కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు చేసిన రుద్రాంశ్ , ఐశ్వరీ ప్రతాప్ భారత్ తరఫున ఫైనల్లో పోటీపడ్డారు. ఎనిమిది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంశ్ 208.7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలువగా... ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 228.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. లిహావో షింగ్ (చైనా; 253.3 పాయింట్లు) కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని ౖకైవసం చేసుకోగా... హాజున్ పార్క్ (దక్షిణ కొరియా; 251.3 పాయింట్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ (582 పాయింట్లు), ఆదర్శ్ సింగ్ (576 పాయింట్లు), అనీశ్ (560 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత త్రయం మొత్తం 1718 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇండోనేసియా కూడా 1718 పాయింట్లు సాధించినా... 10 పాయింట్ల షాట్లు భారత్కంటే (45) ఇండోనేసియా (37) తక్కువగా కొట్టడంతో టీమిండియాకు కాంస్యం ఖరారైంది. క్వాలిఫయింగ్లో విజయ్వీర్ సిద్ధూ ఆరో ర్యాంక్లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్కు అర్హత సాధించాడు. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో విజయ్వీర్ 21 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో కాంస్య పతకానికి దూరమయ్యాడు. కాంస్య పతకాలతో ఆదర్శ్, విజయ్వీర్, అనీశ్ -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సొంతం
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix — CricTracker (@Cricketracker) September 25, 2023 కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q — CricTracker (@Cricketracker) September 25, 2023 -
ఆసియా గేమ్స్ లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్
-
ఇలవేనిల్ ‘పసిడి’ గురి
రియో డి జనీరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేనిల్ వలారివన్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల ఇలవేనిల్ 252.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్లో ఇలవేనిల్ 630.5 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. ఓవరాల్గా ప్రపంచకప్ టోరీ్నలలో ఇలవేనిల్కిది ఐదో స్వర్ణ పతకం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ సందీప్ సింగ్ 628.2 పాయింట్లు సాధించి 14వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయాడు. -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మరో విజయంపై నీరజ్ దృష్టి
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): ఈ ఏడాది బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ అగ్రస్థానంలో నిలిచిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో విజయంపై దృష్టి సారించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్లో భాగంగా నేడు జ్యూరిక్లో జరిగే మీట్లో నీరజ్ పోటీపడనున్నాడు. ఈ సీజన్లో నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్లలో (మే 5 దోహా; జూన్ 30 లుజానె) అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. నేడు అర్ధరాత్రి 12 తర్వాత మొదలయ్యే జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్తోపాటు జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా), వెబెర్ (జర్మనీ) తదితర స్టార్స్ పోటీపడనున్నారు . ప్రపంచ చాంపియన్షిప్ కోసం బిడ్..! 2027 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని బుధవారం ఇక్కడి మీడియాతో నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తే భారత అథ్లెటిక్స్ సమాఖ్య చొరవ తీసుకుంటుంది. 2027 ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణ కోసం అక్టోబర్ 2లోపు బిడ్ దాఖలు చేయాలి. ఇప్పటికే 2027 ప్రపంచ చాంపియన్షిప్ ఆతిథ్యం కోసం బీజింగ్ తమ బిడ్ దాఖలు చేసింది. -
195 దేశాలు.. 2100 మంది అథ్లెట్లు! చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్..
World Athletics Championships 2023 Medal Tally: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పతకాల పట్టికలో భారత్ 18 స్థానంలో నిలిచింది. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్ సాధించింది. ప్రపంచ చాంపియన్షిప్-2022లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో ఐదు దేశాలతో కలసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఈసారి మన బంగారు కొండ నీరజ్ చోప్రా రజతాన్ని స్వర్ణంగా మార్చి దేశానికి గర్వకారణమయ్యాడు. చరిత్రకెక్కిన నీరజ్, అర్షద్ నదీం హంగేరీలోని బుడాపెస్ట్లో ఆదివారం జరిగిన జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్లో అత్యధికంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. ఇక దాయాది పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం 87.82 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి నీరజ్ తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. రజత పతకం గెలిచి తొలిసారి పాక్కు మెడల్ అందించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ విషయాలు తెలుసా! ఇప్పటి వరకు 19 సార్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈసారీ అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. ఈసారి ప్రపంచ చాంపియ న్షిప్లో పాల్గొన్న దేశాలు 195. మొత్తం 2100 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 120 దేశాల నుంచి నాలుగు లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ చాంపియన్షిప్లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46. జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా 88.17 మీటర్ల అద్భుతమైన త్రో మెన్స్ జావెలిన్ త్రోలో బంగార పతకాన్నిసాధించి భారత్కు తొలిస్వర్ణాన్ని అందించి మరోసారి చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్ రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా నీరజ్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు. బుడాపెస్ట్లో జరిగిన ఈవెంట్లో 88.17 మీటర్ల త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో టాప్లో నిలిచి, గోల్డెన్ బోయ్గా మరోసారి తన ప్రత్యకతను నిరూపించుకున్నాడు నీరజ్ చోప్రా. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జెనా , డిపి మను వరుసగా 84.77 మీ 84.14 మీటర్ల త్రోతో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఆదివారం బుడాపెస్ట్లో జరిగిన WAC 2023లో పురుషుల జావెలిన్ ఈవెంట్లో 25 ఏళ్ల స్టార్ నీరజ్ తన సొంత రికార్డును తానే చెరిపేసి రజత పతకాన్ని స్వర్ణంగా మార్చుకున్నాడు. This is Neeraj Chopra, Olympic Gold Medalist. After winning the #WorldAthleticsChamps in Budapest yesterday, A hungarian fan came to him with an Indian flag and asked him to sign it for her. Subedar Neeraj Chopra humbly denied and said “ Sorry Mam, it is a violation of my flag… pic.twitter.com/mc7afI6h4e — Roshan Rai (@RoshanKrRaii) August 28, 2023 1. Pakistanis tweeting 10x about lack of facilities should have tweeted atleast once way before. 2. Arshad Nadeem had world class training in Germany just like Neeraj. 3. Enjoy Neeraj Chopra inviting Arshad under 🇮🇳 as he didn't have 🇵🇰#NeerajChoprapic.twitter.com/wqRxCACMIC — Johns (@JohnyBravo183) August 27, 2023 -
World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో ఏ భారతీయ అథ్లెట్కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. ఈ మెగా ఈవెంట్ చివరిరోజు ఆదివారం నీరజ్ చోప్రా భారత అభిమానుల్లో పసిడి కాంతులు నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నీరజ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా కొత్త చరిత్రను లిఖించాడు. బుడాపెస్ట్ (హంగేరి): భారతీయులు కూడా ఇక సగర్వంగా చెప్పవచ్చు... ప్రపంచ అథ్లెటిక్స్లో మాకు ఉన్నాడు ఒక ప్రపంచ చాంపియన్ అని... గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకం నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి పతకం రంగు మార్చాడు. ‘రజత’«దీరుడి నుంచి ‘పసిడి’వీరుడిగా మారాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్షిప్లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన కిశోర్ కుమార్ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఫౌల్తో మొదలు... క్వాలిఫయింగ్లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా ఫైనల్ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. నీరజ్ తొలి ప్రయత్నమే ఫౌల్ అయింది. దాంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ నీరజ్ వెంటనే తేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ను ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ చివరిదైన 12వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. నిరీ్ణత ఆరు ప్రయత్నాల వరకు నీరజ్ అగ్రస్థానాన్ని కొనసాగించాడు. అన్నీ సాధించాడు... 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచి్చన నీరజ్ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన నీరజ్... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్ 2022 ప్రపంచ చాంపియన్షిప్లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకంతో యావత్ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్గా నిలిచాడు. భారత రిలే జట్టుకు ఐదో స్థానం ఆదివారమే జరిగిన పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. 3: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్జంప్లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్ రజతం, 2023లో నీరజ్ స్వర్ణం గెలిచాడు. 2: ఒలింపిక్స్తోపాటు ప్రపంచ చాంపియన్షిప్లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గతంలో షూటర్ అభినవ్ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్షిప్లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పసిడి పతకాలు గెలిచాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గోల్డ్ మెడలిస్ట్ సాదియాకి ఘన స్వాగతం! వాళ్ల వల్లే ఇది సాధ్యమైంది..
సాక్షి, విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్కి ఘన స్వాగతం లభించింది. షార్జాలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి స్వదేశానికి వచ్చిన సదియాకి ఆమె తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు వెల్కమ్ చెప్పారు. కాగా సాదియా కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గోల్డ్ మెడలిస్ట్ సాదియా ‘‘షార్జాలో ఈనెల 16 నుండి 22 వరకు ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్లో పాల్గొన్నా. నాలుగు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ సహకారంతో స్వర్ణ పతకం సాధించాను’’ అని సాదియా సంతోషం వ్యక్తం చేశారు. -
100 మీటర్ల చాంప్ నోవా లైల్స్
బుడాపెస్ట్ (హంగేరి): ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రిటైరయ్యాక... పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో మళ్లీ అమెరికన్ అథ్లెట్లు ఆధిపత్యం చాటుకుంటున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వరుసగా నాలుగోసారి పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్లో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ పసిడి పతకం సాధించాడు. 26 ఏళ్ల నోవా లైల్స్ అందరికంటే వేగంగా 9.83 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి ఈ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. లెట్సిలె టెబోగో (బోట్స్వానా; 9.88 సెకన్లు) రజతం... జార్నెల్ హ్యూస్ (బ్రిటన్; 9.88 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓబ్లిక్ సెవిల్లె (జమైకా) కూడా 9.88 సెకన్లలో రేసును ముగించాడు. అయితే ఫొటో ఫినిష్ ఆధారంగా రజత, కాంస్య పతకాలను ఖరారు చేశారు. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో జస్టిన్ గాట్లిన్ (అమెరికా) ధాటికి ఉసేన్ బోల్ట్ కాంస్య పతకంతో సరిపెట్టుకొని అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు. అనంతరం 2019 ప్రపంచ చాంపియన్షిప్లో క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా), 2022 ప్రపంచ చాంపియన్షిప్లో ఫ్రెడ్ కెర్లీ (అమెరికా) 100 మీటర్ల విభాగంలో వరల్డ్ చాంపియన్స్గా నిలిచారు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెడ్ కెర్లీ సెమీఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత అథ్లెట్లకు నిరాశ ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండోరోజు భారత అథ్లెట్లు నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పురుషుల హైజంప్లో సర్వేశ్ కుషారే 2.22 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఓవరాల్గా 20వ స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో సంతోష్ కుమార్ తన హీట్స్ను 50.46 సెకన్లలో ముగించి ఓవరాల్గా 36వ ర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్జీత్ కౌర్లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
అంతిమ్ అదరహో... వరుసగా రెండో సారి ఛాంపియన్
అమ్మాన్ సిటీ (జోర్డాన్): భారత యువ మహిళా రెజ్లర్లు శుక్రవారం కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లో టీమ్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. హరియాణా అమ్మాయి అంతిమ్ పంఘాల్ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్ 4–0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఓవరాల్గా ఈ టోర్నీలో అంతిమ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లే కోల్పోయింది. సవితా దలాల్ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఫైనల్లో సవిత 10–0తో చిరినోస్ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం ప్రియా మాలిక్ (76 కేజీలు) స్వర్ణం నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్గా భారత్ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్ -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్లో రాన్జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
భారత్ బాణం బంగారం.. ఈ పతకం ఎంతో ప్రత్యేకం
బెర్లిన్లో భారత మహిళల బృందం అద్భుతం చేసింది. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్ కౌర్లతో కూడిన భారత జట్టు ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో తొలిసారి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు 1931లో మొదలుకాగా భారత ఆటగాళ్లు మాత్రం 1981 నుంచి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. తాజా పసిడి పతక ప్రదర్శనకంటే ముందు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు 11 పతకాలురాగా అందులో తొమ్మిది రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఈ పతకాల సరసన తొలిసారి పసిడి పతకం వచ్చి చేరింది. బెర్లిన్ (జర్మనీ): ఎట్టకేలకు భారత ఆర్చరీ పసిడి కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో ఎంతోకాలంగా ఊరిస్తున్న స్వర్ణ పతకం మన దరి చేరింది. తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి, పంజాబ్ క్రీడాకారిణి పర్ణీత్ కౌర్ బాణాల గురికి భారత్ ఖాతాలో బంగారు పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి, పర్ణిత్లతో కూడిన భారత జట్టు 235–229 పాయింట్ల తేడాతో డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. 2017, 2021 ప్రపంచ చాంపియన్షిప్లలో ఫైనల్ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకోగా... మూడో ప్రయత్నంలో మాత్రం పసిడి స్వప్నాన్ని సాకారం చేసుకుంది. భారత బృందం స్వర్ణం నెగ్గడంలో సీనియర్ జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. తొమ్మిదోసారి ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పాల్గొంటున్న 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తోంది. మెక్సికోతో జరిగిన ఫైనల్లో భారత జట్టు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నాలుగు సిరీస్లలోనూ పైచేయి సాధించింది. ఒక్కో సిరీస్లో జట్టులోని ముగ్గురు సభ్యులు రెండు బాణాల చొప్పున మొత్తం ఆరు బాణాలు సంధిస్తారు. తొలి సిరీస్లో భారత్ 59–57తో, రెండో సిరీస్లో 59–58తో... మూడో సిరీస్లో 59–57తో.. నాలుగో సిరీస్లో 58–57తో ఆధిక్యం సంపాదించి చివరకు 235–229తో విజయం సాధించింది. నేడు జరిగే వ్యక్తిగత విభాగం నాకౌట్ దశ మ్యాచ్ల్లో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి పోటీపడనున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో పర్ణిత్తో జ్యోతి సురేఖ, సాన్ డి లాట్ (నెదర్లాండ్స్)తో అదితి ఆడతారు. గెలిస్తే జ్యోతి, అదితి సెమీఫైనల్లో తలపడతారు. 12 ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. ఇందులో ఒక స్వర్ణం, తొమ్మిది రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. 7 ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ పోటీల్లో జ్యోతి సురేఖ గెలిచిన మొత్తం పతకాలు. 2021లో మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో 3 రజత పతకాలు. 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఒక రజతం. 2019లో మహిళల టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో 2 కాంస్య పతకాలు... 2023లో మహిళల టీమ్ విభాగంలో ఒక స్వర్ణం. ఈ పతకం ఎంతో ప్రత్యేకం ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో వచ్చాం. గతంలో రజత, కాంస్య పతకాలు గెలిచా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్లో మరిన్ని పసిడి పతకాలు సాధిస్తాం. తొలి స్వర్ణం కావడంతో ఈ పతకం నాతోపాటు నా సహచరులకు ఎంతో ప్రత్యేకం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పలు పతకాలు నెగ్గినా స్వర్ణం మాత్రం దక్కలేదు. ఈసారి బంగారు పతకం సాధించడంతో ఎంతో ఆనందంగా ఉన్నాను. నేడు వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను. ఇందులోనూ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం. నేనీస్థాయికి చేరుకోవడానికి ఎల్లవేళలా మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. –జ్యోతి సురేఖ -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్లో గోల్డ్మెడల్ గెలిచింది. స్విమ్మింగ్తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
డాక్టర్ సమరానికి గోల్డ్మెడల్ ప్రదానం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా సమయంలో విశేష సేవలు అందించిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరానికి జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమరాన్ని హరియాణా, ఛత్తీస్గఢ్, తెలంగాణ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై, తదితరులు అభినందనలు తెలియజేశారు. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్షిప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్షిప్లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్షిప్లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్షిప్లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్షిప్లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది. -
ISSF World Cup Baku: సరబ్జోత్–దివ్య జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది. స్వర్ణ–రజత పతక ఫైనల్ పోరులో సరబ్జోత్–దివ్య జోడీ 16–14తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది. సరబ్జోత్ కెరీర్లో ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణంకాగా... బెంగళూరుకు చెందిన దివ్యకు ప్రపంచకప్ టోర్నీలలో తొలి పతకం కావడం విశేషం. మొత్తం 55 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్లో సరబ్జోత్–దివ్య ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్కు అర్హత సాధించింది. భారత్కే చెందిన ఇషా సింగ్–వరుణ్ తోమర్ జంట 578 పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్లో నిలిచి పతక మ్యాచ్లకు అర్హత పొందడంలో విఫలమైంది. టాప్–4లో నిలిచిన జోడీలు పతక మ్యాచ్లకు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో రెండు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్లకు సీఎం జగన్ అభినందనలు
Satwiksairaj- Chirag Shetty: బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్-2023లో పసిడి పతకం గెలిచిన సాత్విక్- చిరాగ్లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965లో పురుషుల సింగిల్స్లో దినేశ్ ఖన్నా చాంపియన్గా నిలవగా.. 58 ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్ తమ అద్భుత ఆటతీరుతో భారత్కు పసిడి పతకం అందించారు. ఈ భారత జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్స్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించారు సాత్విక్- చిరాగ్. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు కాగా.. చిరాగ్ శెట్టి స్వరాష్ట్రం మహారాష్ట్ర. చదవండి: IPL 2023: మిస్టర్ కూల్కు ఆగ్రహం! వైరల్ వీడియో చూశారా? -
Wrestling: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణం.. అమన్ ‘పసిడి పట్టు’
Asian Wrestling Championships 202- అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. ఈ టోర్నీ ఐదో రోజు గురువారం పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఫైనల్లో అమన్ 9–4 పాయింట్ల తేడాతో అల్మాజ్ సమన్బెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందాడు. అప్పుడు రవి దహియా నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్ ఆడిన అమన్ 7–1తో రికుటో అరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 7–4తో వాన్హావో జు (చైనా)పై విజయం సాధించాడు. అమన్ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఏడాది 57 కేజీల విభాగంలో భారత్ ఖాతాలోనే స్వర్ణ పతకం చేరడం విశేషం. 2020, 2021, 2022లలో రవి కుమార్ దహియా ఈ విభాగంలో విజేతగా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి రవి ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అమన్కిది రెండోది ఢిల్లీలోని విఖ్యాత ఛత్రశాల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసే అమన్ గత ఏడాది అండర్–23 ప్రపంచ చాంపియన్షిప్లోనూ స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది అమన్కిది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో అమన్ కాంస్య పతకం గెలిచాడు. మూడింట నిరాశ గురువారం జరిగిన ఇతర నాలుగు వెయిట్ కేటగిరీల్లో మూడింట భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. 79 కేజీల విభాగంలో దీపక్ కుక్నా కాంస్య పతకం నెగ్గగా... 97 కేజీల విభాగంలో దీపక్ నెహ్రా కాంస్య పతక బౌట్లో ఓడిపోయాడు. దీపక్ కుక్నా 12–1తో షురాత్ బొజొరోవ్ (తజికిస్తాన్)పై గెలుపొందగా... దీపక్ నెహ్రా 9–12తో మక్సూద్ వెసలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అనూజ్ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, ములాయం యాదవ్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’ సూపర్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తొలి ‘డ్రా’ నమోదు చేసింది. కేరళలో జరుగుతున్న ఈ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ 33తో ‘డ్రా’గా ముగించింది. సోమవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఒడిశాతో హైదరాబాద్ ఆడుతుంది. భారత్కు తొలి ఓటమి తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. చైనా జట్టుతో గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో టీమిండియా 0–3తో పరాజయం చవిచూసింది. తొలి సింగిల్స్లో రుతుజా భోస్లే 3–6, 5–7తో జియాంగ్ జిన్యు చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్లో భారత నంబర్వన్ అంకిత రైనా 5–7, 1–6తో యువాన్ యు చేతిలో ఓటమి పాలైంది. దాంతో భారత పరాజయం ఖరారైంది. నామమాత్రంగా జరిగిన డబుల్స్ మ్యాచ్లో శ్రీవల్లి రష్మిక–వైదేహి చౌదరీ ద్వయం 0–6, 1–6తో జియాంగ్ జిన్యు–యాంగ్ జావోజువాన్ జోడీ చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో జపాన్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా ఉంది. -
Nikhat Zareen: ఇండియన్ గోల్డెన్ గర్ల్కి మరో అరుదైన గిఫ్ట్!
ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన 'నిఖత్ జరీన్' (Nikhat Zareen)పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్గెయెన్ థి టామ్పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిష్ చరిత్రలో నిఖత్ జరీన్కు ఇది రెండో స్వర్ణ పతకం విశేషం. ఇప్పటికే ఈమె 2022లో 52కేజీల విభాగంలో మొదటిసారి వరల్డ్ చాంపియన్గా మారింది. అయితే ఇప్పుడు పొందిన విజయంతో ఈమె ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది. భారత క్రీడా చరిత్రలో ఎదురులేకుండా నిలిచి కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిఖత్ జరీన్ను ప్రశంసిస్తూ కంపెనీ థార్ SUV గిఫ్ట్గా ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి) మహీంద్రా థార్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ కార్లలో ఇది ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి పర్ఫామెన్స్ విషయంలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్స్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. -
తెలంగాణకు నిఖత్ గర్వకారణం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్లో 50 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయస్థాయి ఖ్యాతిగడించే ప్రదర్శన చేస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ స్వశక్తికి నిదర్శనమని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ను ఢిల్లీలో మంత్రి అభినందించారు. -
ఇదే కఠినమైన బౌట్.. నా దేశం కోసం ఈ పతకం: నిఖత్ జరీన్ ఉద్వేగం
Nikhat Zareen- World Boxing Championship: ‘‘రెండోసారి ప్రపంచ చాంపియన్గా నిలవడం చాలా సంతోషంగాఉంది. అందులోనూ ఒలింపిక్ కేటగిరీలో స్వర్ణం గెలవడం ఇంకా సంతృప్తినిచ్చింది. టోర్నీలో సహజంగానే నా దృష్టిలో ఇదే కఠినమైన బౌట్. ఆమె ఆసియా చాంపియన్. హోరాహోరీగా తలపడ్డాం. కామన్వెల్త్ క్రీడల్లో నేను పెద్దగా పోటీని ఎదుర్కోలేదు. ఈ తర్వాత ఇక్కడే మళ్లీ బరిలోకి దిగాను. కానీ ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో వరుస బౌట్లలో తలపడాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు నేను వేగంగా కదల్లేకపోయాను. ఫైనల్లో మాత్రం చివరి బౌట్ కాబట్టి పూర్తి శక్తిసామర్థ్యాలు వాడాలని నిశ్చయించుకున్నా. వంద శాతంకంటే ఎక్కువ ప్రయత్నించా. గత ఏడాది పతకంతో పోలిస్తే ఇది ఎక్కువ శ్రమతో వచ్చింది. దీని కోసం బరువు తగ్గించుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సన్నాహానికి సమయం తక్కువగా ఉన్నా పూర్తి ఏకాగ్రతతో సాధన చేశా. ఉత్తమ బాక్సర్గా మహీంద్రా థార్ వాహనం బహుమతిగా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నాకు వచ్చిన ప్రైజ్మనీతో అమ్మా, నాన్నను హజ్ యాత్రకు పంపిస్తా’’ అని భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది. బెస్ట్ బాక్సర్గా ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ (50 కేజీలు) మరోసారి చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్ థి టామ్ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి బెస్ట్ బాక్సర్గా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ విజయం అనంతరం ఈ మేరకు స్పందించింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాను ఇక్కడిదాకా చేరుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. 2️⃣x World Champion 🇮🇳 @nikhat_zareen ’s reaction right after scripting history 🥳🔥@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @MahindraRise @NehaAnandBrahma https://t.co/29Wd7lBDfx pic.twitter.com/kLcmJzLdcw — Boxing Federation (@BFI_official) March 26, 2023 -
అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు. ఆసియా చాంపియన్షిప్లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది. ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్షిప్లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు. వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్షిప్లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్బర్టన్ సాధన విషయంలో నిఖత్కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు. ఆమె శ్రమ ఫలితం బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్షిప్లో నిఖత్కు మొదటి స్థానం లాంఛనమే అయింది. ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. సెమీస్ మినహా మిగిలిన బౌట్లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్లో ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు! -సాక్షి క్రీడా విభాగం చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్.. Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD — Narendra Modi (@narendramodi) March 26, 2023 -
చరిత్ర సృష్టించిన నిఖిత్ జరీన్.. భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది. -
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్గా మారి ఆమెను అథ్లెట్ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
శభాష్ సావిటీ.. భారత్ ఖాతాలో మరో బంగారు పతకం
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. 81 కేజీల విభాగం ఫైనల్లో భారత బాక్సర్ సావిటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాను ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. గతంలో సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకున్న సావిటీ .. ఈ సారి మాత్రం పట్టుదలతో ఛాంపియన్గా నిలిచింది. ఇక ఫైనల్లో ప్రత్యర్థిపై తొలి రౌండ్ నుంచే పంచ్లతో సావిటీ విరుచుకుపడింది. రెండో రౌండ్ లో కాస్త పోటీ ఎదుర్కొన్నా.. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో పూర్తి ఆధిపత్యం కనబరిచి 4-3తో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక అంతకుముందు 48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ భారత్కు తొలి బంగారు పతకం అందించింది. ఫైనల్లో మంగోలియాకు చెందిన లుట్సాయ్ఖాన్ అల్టాంట్సెట్సెగ్పై 5-0 తేడాతో నీతూ విజయం సాధించింది. 𝐒𝐄𝐂𝐎𝐍𝐃 𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀 🇮🇳 SAWEETY BOORA beat Lina Wang of China in the FINAL 🥊#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @saweetyboora @BFI_official @Media_SAI @kheloindia pic.twitter.com/TUHqBhfUvf — Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023 చదవండి: World Boxing Championships 2023: పసిడి పంచ్ విసిరిన నీతూ -
Race Walking Championship 2023: అక్ష్దీప్ సింగ్కు స్వర్ణం
నోమి (జపాన్): ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ అక్ష్దీప్ సింగ్ 1 గంట 20 నిమిషాల 57 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఓపెన్ కేటగిరీలో పోటీపడిన భారత అథ్లెట్లు వికాష్ సింగ్, పరమ్జీత్ ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు, పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందారు. ప్రపంచ చాంపియన్షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయం 1 గంట 20 నిమిషాల 10 సెకన్లను వికాష్ (1గం:20ని :05 సెకన్లు), పరమ్జీత్ (1గం: 20:08 సెకన్లు) అందుకున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో పోటీపడిన వారి సమయాన్ని పతకాల కోసం పరిగణనలోకి తీసుకోరు. -
National U23 Athletics Championships: జ్యోతికశ్రీకి స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణంతో మెరిసింది. సీనియర్ మహిళల 400 మీటర్ల పరుగులతో జ్యోతిక శ్రీ మొదటి స్థానంలో నిలిచింది. 53.26 సెకన్ల టైమింగ్తో రేస్ పూర్తి చేసి ఆమె విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్లో ఐశ్వర్య (మహారాష్ట్ర – 53.49 సె.), కిరణ్ పహల్ (హరియాణా – 54.29 సె.) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. అండర్–20 విభాగంలో ప్రియా మోహన్ (కర్నాటక – 53.55 సె.) పసిడి పతకాన్ని గెలుచుకుంది. జాతీయ రికార్డు నమోదు... ఇదే చాంపియన్షిప్ అండర్–16 బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. బెంగాల్కు చెందిన రెజోనా మలిక్ హీనా 53.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో అంజనా థమ్కే (54.57 సె.) పేరిట ఉన్న రికార్డును హీనా బద్దలు కొట్టింది. ఈ ఈవెంట్లో మాన్సి భరేకర్ (మహారాష్ట్ర ), నేత్ర (తమిళనాడు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. -
ప్రతాప్ సింగ్కు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణ పతకం చేరింది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్ సింగ్ 16–6తో అలెగ్జాండర్ షిమిర్ల్ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్లో షిమిర్ల్, ప్రతాప్ సింగ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరారు. భారత్కే చెందిన అఖిల్ షెరాన్ ఏడో ర్యాంక్లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ రెండో ర్యాంకింగ్ మ్యాచ్లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్కే చెందిన మను భాకర్, ఇషా సింగ్ క్వాలిఫయింగ్లో వరుసగా 32వ, 34వ స్థానాల్లో నిలిచారు. -
‘మిక్స్డ్’లో పసిడి కాంతులు
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్లో భారత జోడీలు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో నర్మద నితిన్ రాజు–రుద్రాం, బాలాసాహెబ్ పాటిల్ జోడీ... ఎయిర్ పిస్టల్ విభాగంలో వరుణ్ తోమర్–రిథమ్ సాంగ్వాన్ జోడీ విజేతగా నిలిచాయి. ఎయిర్ రైఫిల్ టీమ్ మిక్స్డ్ ఫైనల్లో తమిళనాడుకు చెందిన నర్మద, మహారాష్ట్రకు చెందిన రుద్రాం„Š జోడీ 16–6తో ఎస్తెర్ డెనిస్–ఇస్త్వాన్ పెని (హంగేరి) ద్వయంపై గెలిచింది. క్వాలిఫయింగ్ రౌండ్లో నర్మద–రుద్రాం, 635.8 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచి ఫైనల్కు చేరారు. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఫైనల్లో వరుణ్–రిథమ్ ద్వయం 16–10తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) జోడీని ఓడించింది. క్వాలిఫయింగ్ రౌండ్లో వరుణ్–రిథమ్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వరుణ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
Asian indoor athletics championships: షాట్పుట్లో తజీందర్ పాల్కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్పుట్లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
Khelo India Youth Games: ‘పసిడి’ నెగ్గిన గురునాయుడు
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. అండర్–18 బాలుర వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్.గురు నాయుడు పసిడి పతకం సాధించాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం 55 కేజీల విభాగంలో గురు నాయుడు మొత్తం 227 కేజీల బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. టామ్చౌ మీటీ (మణిపూర్) రజతం, విజయ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) కాంస్య పతకం గెలుపొందారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్లో 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
Khelo India Youth Games: ప్రణయ్కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్లో ఉంది. -
పేలుడు కేసు నిందితుడికి ఎంఏ గోల్డ్మెడల్
గువాహటి: బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా జైలులో ఉన్న మాజీ విద్యార్థి ఒకరికి అస్సాం గవర్నర్ బంగారు పతకం అందజేశారు. 2019లో గువాహటిలో తీవ్రవాద సంస్థ ఉల్ఫా జరిపిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకరైన సంజీవ్ తాలూక్దార్ (29) ప్రస్తుతం జైలులో ఉన్నాడు. జైల్లోంచే ఓపెన్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. అంతేగాక అత్యధికంగా 71% మార్కులు సాధించాడు! గురువారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జగ్దీశ్ ముఖి చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాడు. -
National Youth Weightlifting Championship: స్వర్ణం నెగ్గిన గురు
చెన్నై: జాతీయ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శనపతి గురు నాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన యూత్ పురుషుల 55 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురు నాయుడు మొత్తం 233 కేజీలు (స్నాచ్లో 104+క్లీన్ అండ్ జెర్క్లో 129) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో గురునాయుడు 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు బరువెత్తి బంగారు పతకం సాధించాడు. తాజాగా జాతీయ టోర్నీలో అతను అదనంగా మరో మూడు కేజీలు ఎక్కువ బరువెత్తడం విశేషం. -
స్వర్ణపతకం సాధించిన కొన్ని క్షణాల్లోనే తండ్రి మృతి.. విలవిల్లాడిన లోకప్రియ
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): న్యూజిలాండ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పట్టుకోట్టైకి చెందిన క్రీడాకారిణి స్వర్ణం సాధించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న క్రీడాకారిణి శోకసంద్రం అయింది. తంజావూరు జిల్లా పట్టుకోట్టై అన్నానగర్కు చెందిన పెయింటర్ సెల్వముత్తు (50) భార్య రీటా మేరీ (42)కి ముగ్గురు కుమార్తెలు లోకప్రియ (22), ప్రియదర్శిని (19), ప్రియాంక (14). ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన లోకప్రియ చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో ఆసియా, రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. న్యూజిలాండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన లోకప్రియ 52 కిలోల జూనియర్ విభాగంలో 350 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్లో నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఈ మ్యాచ్ జరిగింది. చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లి చేసుకొని..) ఈ క్రమంలో లోకప్రియ తండ్రి సెల్వముత్తు నిన్న రాత్రి 8 గంటల సమయంలో పుదుక్కోట జిల్లా కందర్వ కోట తాలూకా రన్పట్టి వద్ద గుండెపోటుతో మరణించారు. లోకప్రియకు పోటీ ముగిసేవరకు చెప్పలేదు. పోటీ ముగిసిన అనంతరం స్వర్ణపతకం సాధించిన లోకప్రియకు తన తండ్రి మరణవార్తను వీడియో కాల్లో తెలిపారు. దీంతో లోకప్రియ వీడియో కాల్లోనే తండ్రి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ గోల్డ్మెడల్ గెలిచిన ఆనందం ఐదు నిమిషాలు కూడా నిలవలేదన్నారు. తాను న్యూజిలాండ్కు వెళ్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని, పతకం సాధించాక వీడియో కాల్లో చూపించి తన ఆశీస్సులు పొందాలనుకున్నానని వాపోయింది. తనకు తండ్రి దూరం కావడం తీరని లోటని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు క్రీడాకోటాలో ఉపాధి కల్పిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పింది. -
అమ్మింది.. పతకాన్నే కానీ దేశాన్ని కాదుగా అంటున్నాడ్సార్!
అమ్మింది.. పతకాన్నే కానీ దేశాన్ని కాదుగా అంటున్నాడ్సార్! -
Boxing World Championships 2023: స్వర్ణ పతకం సాధిస్తే రూ. కోటీ 63 లక్షలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరగనున్న పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ప్రైజ్మనీని ప్రకటించారు. మే 1 నుంచి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ను మొత్తం 52 లక్షల డాలర్ల (రూ. 425 కోట్లు) ప్రైజ్మనీతో నిర్వహిస్తున్నామని సోమవారం ఇక్కడ నిర్వహించి మీడియా సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన బాక్సర్కు 2 లక్షల డాలర్లు (రూ. కోటీ 63 లక్షలు), రజతం నెగ్గిన బాక్సర్కు 1 లక్ష డాలర్లు (రూ. 81 లక్షలు), కాంస్యం సొంతం చేసుకున్న ఇద్దరు బాక్సర్లకు 50 వేల డాలర్ల (రూ. 40 లక్షలు) చొప్పున ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన క్రెమ్లెవ్ ఒకవేళ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్ను తొలగిస్తే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. -
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్షిప్స్లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
పవర్గ్రిడ్ కార్పొరేషన్కు రెడ్క్రాస్ గోల్డ్మెడల్
సాక్షి, హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను రెడ్క్రాస్ గోల్డ్మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్గ్రిడ్కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్గ్రిడ్ ఈ రెడ్క్రాస్ గోల్డ్ మెడల్ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్గ్రిడ్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. -
World Shooting Championship: భారత షూటర్ల జోరు
కైరో: ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో రమిత 16–12తో చైనా షూటర్ యింగ్ షెన్పై గెలుపొందింది. జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు దివ్యాంశి (547 పాయింట్లు) స్వర్ణం, వర్షా సింగ్ (539 పాయింట్లు) రజతం, టియానా (523 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ఇషా జట్టుకు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత షూటర్ల పసిడి వేట కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో తాజాగా భారత్కు మరో మూడు స్వర్ణ పతకాలు లభించాయి. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, వర్షా సింగ్, శిఖా నర్వాల్లతో కూడిన భారత జట్టు పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్ 16–6తో చైనా జట్టును ఓడించింది. జూనియర్ మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో తిలోత్తమా సేన్, నాన్సీ, రమితాలతో కూడిన భారత జట్టు 16–2తో చైనా జట్టుపై గెలిచి స్వర్ణం నెగ్గింది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో శ్రీ కార్తీక్ శబరి రాజ్, దివ్యాంశ్ సింగ్ పన్వర్, విదిత్ జైన్లతో కూడిన భారత జట్టు 17–11తో చైనా జట్టుపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత్ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ISSF World Championship: ఇషా పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు. పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్లో భారత్కే చెందిన ఉదయ్వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. పిస్టల్ విభాగంలో ఉదయ్వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచాడు. మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు. స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో ఉదయ్వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు.