పసిడి పతకం నెగ్గిన పల్లవి | Andhra Pradesh wins second gold medal in National Games | Sakshi

పసిడి పతకం నెగ్గిన పల్లవి

Feb 2 2025 3:24 AM | Updated on Feb 2 2025 3:24 AM

Andhra Pradesh wins second gold medal in National Games

డెహ్రాడూన్‌: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement