విజయవాడ స్పోర్ట్స్ : చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు సెమీస్కు చేరాయి. క్వార్టర్స్లో తెలంగాణ 29-23, 29-22తో బెంగాల్పై, ఏపీ 29-24, 29-11తో మహారాష్ట్రపై గెలిచాయి. మహిళల విభాగంలో ఏపీ జట్టు క్వార్టర్స్లో 29-22, 29-21తో ముంబైపై గెలిచి సెమీస్కు చేరింది. తెలంగాణ మహిళల జట్టు క్వార్టర్స్లో 9-29, 6-29తో కర్ణాటక చేతిలో ఓడింది.