ఎదురులేని యువ భారత్ | Under-19 youth team is already in the final of the triangular tournament in India | Sakshi
Sakshi News home page

ఎదురులేని యువ భారత్

Nov 28 2015 12:21 AM | Updated on Sep 3 2017 1:07 PM

ఎదురులేని యువ భారత్

ఎదురులేని యువ భారత్

ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారత యువ జట్టు అండర్-19 ముక్కోణపు టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై 104 పరుగులతో ఘన విజయం సాధించింది.

అఫ్ఘానిస్తాన్‌పై భారీ విజయం
  అండర్-19 ముక్కోణపు టోర్నీ
 కోల్‌కతా:
ఇప్పటికే ఫైనల్‌కు చేరిన భారత యువ జట్టు అండర్-19 ముక్కోణపు టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై 104 పరుగులతో ఘన విజయం సాధించింది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అప్ఘాన్‌లతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిచింది. ఆదివారం జరిగే ఈ టోర్నీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

 శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (98 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా.... విరాట్ సింగ్ (71) రాణించాడు. కెప్టెన్ రికీ భుయ్ (50) కూడా అర్ధసెంచరీ చేశాడు. అఫ్ఘానిస్తాన్ అండర్-19 జట్టు 28 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. నవీద్ ఒబిద్ (63) మినహా అందరూ విఫలమయ్యారు. జీషన్ అన్సారీ ఐదు వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement