Final
-
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని(Saket Myneni) టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్తో జత కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సాకేత్–రామ్కుమార్ (భారత్) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్ సీడ్ రే హో (చైనీస్ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్ రోమియోస్ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ ఐదు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్లను రెండేసి సార్లు కోల్పోయాయి. అయితే టైబ్రేక్లో మాత్రం సాకేత్–రామ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్) జోడీతో సాకేత్–రామ్ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. -
హైదరాబాద్ X బెంగాల్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్లో తమిళనాడు డ్రాగన్స్పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్తో సమంగా నిలిచాయి. బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది. -
సబలెంకా X కీస్
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ ఘనత సాధించేందుకు సబలెంకా... కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సొంతం చేసుకునేందుకు మాడిసన్ కీస్... ఒక్క విజయం దూరంలో నిలిచారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో బెలారస్ స్టార్ సబలెంకా వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లగా... అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ తొలిసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో టాప్ సీడ్ సబలెంకా 6–4, 6–2తో 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్)పై నెగ్గగా... 19వ సీడ్ మాడిసన్ కీస్ 5–7, 6–1, 7–6 (10/8)తో రెండో సీడ్, ఐదు సార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కీస్ అమీతుమీ తేల్చుకుంటారు. 2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన సబలెంకాకు సెమీఫైనల్లో తన ప్రత్యర్థి బదోసా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా 32 వినర్స్ కొట్టి, బదోసా సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు బదోసా నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ స్పెయిన్ ప్లేయర్ కేవలం ఒకసారి మాత్రమే సబలెంకా సర్వీస్ను బ్రేక్ చేసింది. స్వియాటెక్తో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో కీస్ నిర్ణాయక మూడో సెట్లోని 12వ గేమ్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకుంది. 6–5తో ఆధిక్యంలో నిలిచిన స్వియాటెక్ తన సర్వీస్లో 40–30తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే స్వియాటెక్ వరుసగా మూడు తప్పిదాలు చేసి తన సర్వీస్ను కోల్పోయింది. దాంతో స్కోరు 6–6తో సమమైంది. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. తొలుత 10 పాయింట్లు సాధించిన వారికి విజయం ఖరారయ్యే ఆఖరి సెట్ టైబ్రేక్లో రెండుసార్లు స్వియాటెక్ 5–3తో, 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీస్ పట్టుదల కోల్పోకుండా పోరాడి చివరకు 10–8తో టైబ్రేక్లో నెగ్గి సెట్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచిన కీస్ రెండో ‘గ్రాండ్’ అవకాశంలోనైనా విజేతగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ (సెర్బియా); బెన్షెల్టన్ (అమెరికా)తో యానిక్ సినెర్ (ఇటలీ) తలపడతారు. -
నాగార్జునకు, రామ్చరణ్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ముక్కు అవినాష్ (ఫోటోలు)
-
టైటిల్ పోరుకు హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా స్టీలర్స్ 28–25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ను ఓడించింది. తాజా సీజన్లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన హరియాణా స్టీలర్స్ సెమీస్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి హరియాణా 12–11తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి స్టీలర్స్ తుదిపోరుకు చేరింది. హరియాణా తరఫున శివమ్ పతారె 7, వినయ్ 6 రెయిడ్ పాయింట్లు సాధించారు. రాహుల్ సత్పాల్ (5 పాయింట్లు) ట్యాక్లింగ్లో అదరగొట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్టీలర్స్ 15 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 18 రెయిడ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే డిఫెన్స్లో మెరుగైన ప్రదర్శన చేసిన స్టీలర్స్ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు మరో రెండు ఎక్స్ట్రా పాయింట్లు సాధించి ముందంజ వేసింది. యూపీ యోధాస్ తరఫున స్టార్ రెయిడర్ గగన్ గౌడ 10 పాయింట్లతో పోరాడగా... భవానీ రాజ్పుత్, హితేశ్ చెరో 5 పాయింట్లు సాధించారు. రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్ 32–28 పాయింట్ల తేడాతో మరో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖర్లో ఒత్తిడిని అధిగమించిన పైరేట్స్ విజయతీరానికి చేరింది. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 8 పాయింట్లు సాధించగా... శుభమ్ షిండే (5 పాయింట్లు), అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. ఢిల్లీ జట్టు తరఫున అశు మలిక్ (9 పాయింట్లు), మోహిత్ దేశ్వాల్ (7 పాయింట్లు) పోరాడారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో హరియాణా స్టీలర్స్తో పట్నా పైరేట్స్ తలపడనుంది. -
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్లో శ్రీలంకపై విజయంతో ఫైనల్కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
టైటిల్ వేటలో ముంబై, మధ్యప్రదేశ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు. భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్రేట్తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు. ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్తో 347 పరుగులు చేసి మంచి టచ్లో ఉన్నాడు. మిడిలార్డర్లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు. -
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత్
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్చాంపియన్ భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్ను చిత్తు చేసి ముందంజ వేసింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్తో ఖాతా తెరిచింది. అదే ఊపులో తొలి క్వార్టర్లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్ప్రీత్తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
భారత్ X బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది. సెమీఫైనల్లో పాక్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది. -
ఫైనల్లో అశ్విని పొన్నప్ప జోడీ
గువాహటి: భారత సీనియర్ డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప తన భాగస్వామితో కలిసి మహిళల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గువాహటి మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్లో అన్మోల్ ఖర్బ్, పురుషుల సింగిల్స్లో సతీశ్ కుమార్ కరుణాకర్ తుదిపోరుకు అర్హత సంపాదించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అన్సీడెడ్ సతీశ్ 13–31, 21–14, 21–16తో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)ను కంగు తినిపించాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 21–19, 21–17తో మాన్సి సింగ్పై గెలుపొందగా, మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్సీడ్ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 21–14, 21–14తో షు లియంగ్ కెంగ్–వాంగ్ టింగ్ జె జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిలతో జోడీకట్టిన తనిషా క్రాస్టోకు సెమీస్లో నిరాశ ఎదురైంది.సెమీస్లో ఐదో సీడ్ ధ్రువ్–తనిషా ద్వయం 22–24, 11–21తో చైనాకు చెందిన జంగ్ హన్ యూ–లి జింగ్ బావో జంట చేతిలో ఓడింది. నేడు జరిగే ఫైనల్లో సతీశ్ కుమార్... చైనా క్వాలిఫయర్ జువన్ చెన్ జుతో, అన్మోల్ కూడా క్వాలిఫయర్ యన్ యన్ (చైనా)తో తలపడతారు. టాప్సీడ్ అశి్వని–తనిషా జోడీ... లి హు జో– వాంగ్ జి మెంగ్ (జంట)తో పోటీ పడనుంది. -
ఫైనల్లో పీవీ సింధు
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్ల్లో చిత్తు చేసింది. సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది. లక్ష్యసేన్ ముందంజ.. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్)పై వరుస గేమ్ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్ సులువుగా మ్యాచ్ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్ 13–21, 19–21తో జియా హెంగ్ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో జియా హెంగ్తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఫైనల్కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సెమీస్లో ఓడింది. గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్ (థాయిలాండ్)పై గెలుపొందగా...టాప్ సీడ్ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్ – లి ఖియాన్ చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్లో ఐదో సీడ్ తనీషా–ధ్రువ్ జంట 21–16, 21–15తో జీ హాంగ్ జూ–జియా యీ యాంగ్ (చైనా) ద్వయంపై గెలిచింది. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ జంట 7–6 (9/7), 6–4తో జాషువ పారిస్ (ఇంగ్లండ్)–నామ్ జి సంగ్ (జపాన్) ద్వయంపై గెలిచింది. ఒక గంట 36 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ను ‘టై బ్రేక్’లో దక్కించుకున్న సాకేత్–రామ్కుమార్ ద్వయం... రెండో సెట్లో అదే జోరు కొనసాగిస్తూ విజయం సాధించింది. సాకేత్–రామ్కుమార్ జంట 6 ఏస్లు సంధించి ఆధిక్యం ప్రదర్శించగా... ప్రత్యర్థి జోడీ రెండు ఏస్లకు పరిమితమై... రెండు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఒక టై బ్రేక్ నెగ్గిన సాకెత్–రామ్కుమార్ ద్వయం... ఓవరాల్గా 77 పాయింట్లు సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటతో సాకేత్–రామ్కుమార్ జోడీ తపలడనుంది. -
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో మాళవిక
సార్బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. -
ఫైనల్లో హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం బెంగళూరులో జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) ద్వయం 7–6 (7/2), 6–4తో దివ భాటియా–సాయి సంహిత చామర్తి (భారత్) పై విజయం సాధించింది.హోరాహోరీగా సాగిన తొలి పోరులో పోరాడి గెలిచిన హుమేరా బహర్మస్ జంట... రెండో సెట్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ఆకాంక్ష దిలీప్, తనీషా కశ్యప్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఆక్షాంక్ష 7–5, 3–6, 6–2తో వైష్ణవి ఆడ్కర్ (భారత్)పైనే విజయం సాధించగా... తనీషా 6–1, 7–5తో కరోలాన్ డెలానూ (న్యూ కాలెడోనియా) పై గెలిచింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఆకాంక్షతో తనీషా అమీతుమీ తేల్చుకోనుంది. -
నేడే ఫైనల్: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది. ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది. సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి. ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీమ్లో బేట్స్, కాప్లతో పాటు కెపె్టన్ లారా వోల్వార్ట్, తజ్మీన్, ఎమ్లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది. తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు. -
ఫైనల్లో న్యూజిలాండ్
షార్జా: మహిళల టి20 ప్రపంచకప్లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. విండీస్తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్ డాటిన్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది. -
ఓడినా.. ఆ విషయంలో సత్తా చాటిన హర్యానా కాంగ్రెస్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తగిన మెజారిటీ సాధించింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్కు ఈసారి 11 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. దీనిని గమనిస్తే ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ మరింత మెరుగుపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆ పార్టీ ఓట్ల శాతం 36.49 శాతంగా ఉంది. అదే సమయంలో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్కు 28.08 శాతం ఓట్లు వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) రెండు స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండూ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యాయి. రెండు సీట్లు గెలుచుకున్న ఐఎన్ఎల్డీ 2019తో పోలిస్తే ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. ఇది కూడా చదవండి: 32 ఓట్లతో దక్కిన విజయం -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
చెంగ్డూ (చైనా): భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్ ఓపెన్, మ్యూనిక్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్స్ సాధించాడు. -
ఫైనల్లో జెస్సికా, సబలెంకా
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్స్లామ్ కెరీర్లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్తోనే ముగిసింది.రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. తొలి సెట్ కోల్పోయినా... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది. తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్ను వశం చేసుకుంది. రెండో సెట్లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్ను గెలిచి మ్యాచ్లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది. సబలెంక జోరు మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్లో చతికిలబడింది. తొలిసెట్ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్కు దారితీసింది. అయితే టై బ్రేక్లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్లోనూ ఫైనల్కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్కే చెందిన సుకాంత్ కదమ్ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!
మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. నిమిషాలు కరిగిపోతున్నాయంటూ బాధపడుతోంది. అంతేగాదు తనతో గడిపే కొత్త వ్యక్తులు ఉంటే రండి అంటూ తనతో స్పెండ్ చేసే సమయాన్ని వేలం పాట వేస్తుంది. ఏంటిదీ అనుకుంటున్నారా..?. నయం చేయలేని ఈ వ్యాధి తనను మింగేసేలోపే జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా వ్యక్తులతో గడపాలని కోరుకుంటోంది. ఆమె ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..!అసలేం జరిగిందంటే..32 ఏళ్ల ఎమిలీ లాహే అత్యంత అరుదైన నట్ కార్సినోమాతో బాధపడుతోంది. ఈ కేన్సర్ శరీరంలో మెడ, తల, ఊపరితిత్తుల్లో ఎక్కడైన రావొచ్చు. ఇది చికిత్సకు లొంగని కేన్సర్. అందువల్లే దీన్ని టెర్మినల్ కేన్సర్ అంటారు. అంటే తగినంతగా చికిత్స చేయలేని వ్యాధి అని అర్థం. ఆయుర్దాయం లేదని లేదా ఎక్కువ రోజుల మనుగడ సాధించని పరిస్థితి టెర్మినల్ కేన్సర్ అంటారు. దీంతో తనకు ప్రతి క్షణం విలువైనవి అంటోంది లాహే. మనిషి సాధారణంగా వర్తమానం తప్పించి భూత, భవిష్యత్తుల గురించి ఆలోచింస్తుంటాడు. కానీ ఈ వ్యాధి సదా వర్తమానంలో ఉండకపోతే క్షణాలు ఆవిరిపోతాయనే ఒక పాఠాన్నినేర్పిందని చెబుతోంది. అందుకే తన చివరి క్షణాలను కూడా ఆనందంగా జీవించాలని భావిస్తోంది. అందుకే ఆ క్షణాలను కొత్త వ్యక్తులతో గడిపేందుకు ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం తనకు అత్యంత అమూల్యమైనదని చెబుతోంది. కన్నీళ్ల తెప్పిస్తున్న లాహే మాటలన్ని అక్షర సత్యం. జీవితం క్షణభంగురం అని చెప్పకనే చెబుతోంది. అందుకు ఇప్పుడే చనిపోతాం అనుకుని జీవిస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రవర్తిస్తారేమో!. నిజానికి లాహే ఈ వ్యాధి నిర్ధారణ కాకమునుపు వరకు ప్రతి రోజు ఐదు నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తేది. మంచి జీవనశైలిని అనుసరించేది. అసలు తను ఇలాంటి వ్యాధి బారిన పడతానని భావించలేదు కూడా. తాను మొదట్లో దీర్ఘకాలిక సైనసైటిస్, తలనొప్పిని అనుభవించింది. ఆ తర్వాత చూపుని కోల్పోవడం వంటి లక్షణాలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇది కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలకు స్పందించదు. దీంతో జన్యు సంబంధిత ప్రయోగాత్మక చికిత్స చేయాలనుకున్నారు వైద్యులు. అందుకు ప్రభుత్వ మద్దతు లభించడంలో ఎదురైనా అలసత్వం ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేలా చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటోంది. ఇక్కడ కేన్సర్ తమ ప్రియమైన వారిని ఎన్నటికీ దూరం చేయలేదు. ఎందుకంటే..? వారితో గడిపే అమూల్యమైన క్షణాలు గొప్ప జ్ఞాపకాలని అందిస్తాయని భావోద్వేగంగా చెబుతోంది లాహే. . ఇక్కడ లాహే ఉద్వేగభరితమైన అనుభవం కేన్సర్ వ్యాధులపై మరింతగా పరిశోధనలు చేసే ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది. కాగా, ఆస్ట్రేలియా ఆరోగ్య సంస్థ ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50% మాత్రేమ కానీ 2010కి వచ్చేటప్పటికీ 70%గా ఉంది. చెప్పాలంటే రోగ నిర్థారణ తర్వాత బాధితులు ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. అంతేగాదు ఆస్ట్రేలియన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అరుదైన కేన్సర్లని నయం చేసేలా కొంగొత్త పరిశోధనలకు మద్దతు ఇస్తుండటం గమనార్హం. (చదవండి: దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!) -
మనూ చరిత్ర లిఖించేనా!
మూడేళ్ల క్రితం ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసిన భారత యువ షూటర్ మనూ భాకర్ తడబడి నిరాశపరిచింది. అయితే ఈసారి ‘పారిస్’లో మాత్రం మనూ తుపాకీ గర్జించింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిఫయింగ్లో పూర్తి విశ్వాసంతో లక్ష్యంవైపు గురి పెట్టిన మనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో నేడు జరిగే ఫైనల్లో మనూ అదే జోరు కొనసాగిస్తే పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల బోణీ కొడుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి రెండు జోడీలు బరిలోకి దిగినా పతకానికి దూరంగా నిలిచాయి. అయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనూ భాకర్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేకెత్తించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్లో అర్జున్ బబూతా–రమితా జిందాల్ (భారత్) ద్వయం 628.7 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. భారత్కే చెందిన సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ 626.3 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 28 జోడీలు క్వాలిఫయింగ్లో పోటీపడ్డాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్ చేరుకుంటాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్కు దూరమయ్యాడు. 33 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధించారు. సరబ్జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సరబ్జోత్ (16) కంటే 10 పాయింట్ల షాట్లు ఎక్కువ కొట్టిన రాబిన్ వాల్టర్ (17) ఎనిమిదో స్థానంతో ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. నిలకడగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో భారత్ నుంచి మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ బరిలో నిలిచారు. మొత్తం 44 మంది షూటర్లు క్వాలిఫయింగ్లో పోటీపడ్డారు. మనూ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. రిథమ్ మాత్రం 573 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకొని ఫైనల్కు దూరమైంది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్లో ఒక్కో షూటర్కు 10 షాట్లతో ఆరు సిరీస్లు అవకాశం ఇచ్చారు. మనూ వరుసగా ఆరు సిరీస్లలో 97, 97, 98, 96, 96, 96 పాయింట్లు సాధించింది. నేడు జరిగే ఫైనల్లో వెరోనికా (హంగేరి), జిన్ ఓ యె (దక్షిణ కొరియా), విన్ తు ట్రిన్ (వియత్నాం), కిమ్ యెజి (దక్షిణ కొరియా), జుయ్ లీ (చైనా), తర్హాన్ సెవల్ (టరీ్క), రాన్జిన్ జియాంగ్ (చైనా)లతో కలిసి మనూ పోటీపడుతుంది. ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్లు సంధిస్తారు. 10 షాట్ల తర్వాత తక్కువ స్కోరు ఉన్న చివరి షూటర్ ని్రష్కమిస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు షాట్ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు. చివరకు 24 షాట్లు ముగిశాక టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
ప్యారిస్ ఒలింపిక్స్: ఫైనల్ చేరుకున్న మనూ భాకర్ (ఫొటోలు)
-
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్పై 104 పరుగుల టార్గెట్ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్లో ఉంది. -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ తొలి రౌండ్లో 1–6, 4–6తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్రిచికోవా X జాస్మిన్... నేడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్
ఈ ఏడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్ లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)తో ప్రపంచ 32వ ర్యాంకర్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడుతుంది. వీరిద్దరు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్కు చేరుకున్నారు. 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గగా... 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్ సింగిల్స్ చాంపియన్కు 27 లక్షల పౌండ్లు (రూ. 29 కోట్ల 23 లక్షలు)... రన్నరప్కు 14 లక్షల పౌండ్లు (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్మనీగా లభిస్తాయి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
జాస్మిన్ జయహో
లండన్: గత మూడేళ్లు వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిని... ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లేందుకు విజయం దూరంలో ఉంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ వింబుల్డన్ టోర్నీలోనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 28 ఏళ్ల జాస్మిన్ 2 గంటల 51 నిమిషాల్లో 2–6, 6–4, 7–6 (10/8)తో ప్రపంచ 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2 గంటల 7 నిమిషాల్లో 3–6, 6–3, 6–4తో 2022 విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు జరిగే తుది పోరులో జాస్మిన్తో క్రిచికోవా తలపడుతుంది. ఎవరు నెగ్గినా వారికి తొలి వింబుల్డన్ టైటిల్ అవుతుంది. వెకిచ్తో జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్ను కోల్పోయిన జాస్మిన్ రెండో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 4–5 వద్ద... టైబ్రేక్లో 5–6 వద్ద జాస్మిన్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా జాస్మిన్ రికార్డు నెలకొల్పింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మహిళల సెమీఫైనల్గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో సెరెనా విలియమ్స్ (అమెరికా), ఎలీనా దెమెంతియెవా (రష్యా) మధ్య సెమీఫైనల్ 2 గంటల 49 నిమిషాలు సాగింది. కెరీర్లో తొలిసారి సెమీఫైనల్ ఆడిన వెకిచ్ అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. జాస్మిన్ సర్వీస్ను బ్రేక్ చేసేందుకు వెకిచ్కు 14 సార్లు అవకాశం లభించగా ఆమె నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. 42 విన్నర్స్ కొట్టిన వెకిచ్ ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేసింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)తో మెద్వెదెవ్ (రష్యా); ముసెట్టి (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
23 ఏళ్ల తర్వాత...
చార్లోటి (నార్త్ కరోలినా): రెండోసారి కోపా అమెరికా కప్ చాంపి యన్గా నిలిచేందుకు కొలంబియా జట్టు విజయం దూరంలో నిలిచింది. గతంలో 15 సార్లు చాంపియన్గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా సొలిస్ గోల్ చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొలంబియా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి అర్ధభాగం చివర్లో కొలంబియా ప్లేయర్ మునోజ్ రెడ్ కార్డుకు గురై మైదా నం వీడాడు. దాంతో రెండో అర్ధభాగం మొత్తం కొలంబియా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే 62 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా కొలంబియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయడంలో విఫలమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా ఆడుతుంది. 1975లో తొలిసారి ఈ టోరీ్నలో ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్గా నిలువగా ... 2001లో రెండోసారి ఫైనల్ ఆడి తొలి టైటిల్ సొంతం చేసుకుంది. -
ఇంగ్లండ్ ఫినిషింగ్ టచ్
డార్ట్మండ్: అంతర్జాతీయ ఫుట్బాల్లో 58 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెర దించేందుకు ఇంగ్లండ్ జట్టుకు మరో అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ తరఫున కెపె్టన్ హ్యారీ కేన్ (18వ ని.లో), ఓలీ వాట్కిన్స్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు సిమోన్స్ (7వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో స్పెయిన్తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరో టైటిల్ గెలవలేకపోయింది. 2020 యూరో టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్కు చేరినా ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. నెదర్లాండ్స్తో సెమీఫైనల్ మ్యాచ్ అదనపు సమయానికి దారి తీయడం ఖాయమనిపించిన దశలో... స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్లో (90+1వ నిమిషంలో) సబ్స్టిట్యూట్ ఓలీ వాట్కిన్స్ గోల్ సాధించి ఇంగ్లండ్ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు నెదర్లాండ్స్ను నిలువరించిన ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయంలో పలు కారణాలతో రిఫరీ ఆటను నిలిపివేయాల్సి వచ్చినపుడు అలా వృథా అయిన సమయాన్ని 90 నిమిషాల తర్వాత స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్గా జత చేస్తారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మ్యాచ్కు అద నంగా నాలుగు నిమిషాలు జోడించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ హెడ్ కోచ్ గ్యారెత్ సౌత్గేట్ తీసుకున్న సమయోచిత నిర్ణయం విజయవంతమైంది. తొలి గోల్ చేసిన ఇంగ్లండ్ కెపె్టన్ హ్యారీ కేన్ను 81వ నిమిషంలో వెనక్కి రప్పించి అతని స్థానంలో సబ్స్టిట్యూట్గా ఓలీ వాట్కిన్స్ను... మిడ్ఫీల్డర్ ఫిల్ ఫోడెన్ స్థానంలో కోల్ పాల్మెర్ను సబ్స్టిట్యూట్గా మైదానంలోకి పంపించారు. పది నిమిషాల తర్వాత సౌత్గేట్ నిర్ణయం సరైనదేనని తేలింది. సబ్స్టిట్యూట్గా వచ్చిన పాల్మెర్, వాట్కిన్స్ అద్భుత సమన్వయంతో రెండో గోల్ సాధించి పెట్టారు. కుడి వైపు నుంచి పాల్మెర్ అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో వాట్కిన్స్ అందుకొని కళ్లు చెదిరే కిక్తో నెదర్లాండ్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్ శిబిరం సంబరాలు చేసుకుంది. -
‘సీనియర్లు కొనసాగుతారు’
బ్రిడ్జ్టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్కు పూర్తి స్థాయి కెపె్టన్గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు. టీమిండియా మరింత ఆలస్యంగా...బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు. -
ఈసారి వదలొద్దు!
2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేత... ఆ తర్వాత ఐదుసార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచ్లు... అన్నింటా నిరాశే... 2014 టి20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్షిప్, 2023 టెస్టు చాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్ కప్... ఈ ఐదు సందర్భాల్లో బరిలో నిలిచిన భారత జట్టు సభ్యులకే కాదు... గెలుపును ఆశించిన అభిమానులకు కూడా తెలుసు ఆ వేదన ఎలాంటిదో! ముఖ్యంగా గత ఏడాది నవంబర్ 19న లక్ష మంది సొంత అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిన క్షణాలు ఇంకా కళ్ల ముందే నిలిచాయి. వరుసగా 10 మ్యాచ్లలో విజయాల తర్వాత తుది మెట్టుపై రోహిత్ బృందం తడబడింది. ఇప్పుడు ఆ బాధను మరచి కాస్తంత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను అందుకునే అరుదైన సందర్భం మళ్లీ టీమిండియా ముందు నిలిచింది. ఈసారి కూడా టోర్నీలో అజేయంగా భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఆటగాళ్లంతా ఫామ్లో ఉన్నారు. కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్లో చేజారిన ట్రోఫీని టి20ల్లో అందుకొని రోహిత్ శర్మ సగర్వంగా నిలుస్తాడా? తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న టి20 ప్రపంచ కప్తో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది..!మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. సఫారీ బృందం కూడా విజయం కోసం కసిగా, ఆకలిగా ఉంది... ఆ జట్టుకు కూడా వరల్డ్ కప్ టైటిల్ అనేది 32 ఏళ్ల కల... ఎప్పుడో 1998లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినా ఆ లెక్క వేరు... మొత్తంగా ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్లలో, రెండుసార్లు టి20 వరల్డ్ కప్లో సెమీ ఫైనల్ వరకు రాగలిగినా ఆ గండం దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఇప్పుడు మొదటిసారి ఫైనల్ వరకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. కీలక సమయాల్లో తడబడే ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకునే విధంగా సౌతాఫ్రికా టీమ్ చెలరేగింది. టోర్నీలో అక్కడక్కడా కాస్త ఇబ్బంది పడ్డా చివరకు ఫలితాన్ని తమవైపు మార్చుకొని వరుసగా ఎనిమిది విజయాలతో ఓటమి లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శనతో టీమ్ దూసుకుపోతోంది. దశాబ్దం క్రితం అండర్–19 కెప్టెన్గా దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచకప్ ట్రోఫీని అందించిన మార్క్రమ్ గతంలో తమ దేశపు దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను నాయకుడిగా అందుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది...! బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): టి20 క్రికెట్లో ప్రపంచ చాంపియన్ను తేల్చే సమయం ఆసన్నమైంది. 27 రోజులు, 54 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొమ్మిదో టి20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరిగే తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.గతంలో భారత్ ఒకసారి ఈ టోర్నీని గెలుచుకోగా, దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆఖరి సమరానికి ముందు ఇరు జట్లు టోర్నీలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నాయి. భారత్ తాము ఆడిన ఏడు మ్యాచ్లు, దక్షిణాఫ్రికా తాము ఆడిన ఎనిమిది మ్యాచ్లు గెలిచి సమరోత్సాహంతో ఫైనల్కు ‘సై’ అంటున్నాయి. ఎవరు విజయం సాధించినా... ఓటమి లేకుండా టైటిల్ అందుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. గతంలో జరిగిన డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్లకు భిన్నంగా తొలిసారి టైటిల్ పోరు డే మ్యాచ్గా జరగనుండటం విశేషం. మార్పుల్లేకుండా... టీమిండియా ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్లలో 12 మంది బరిలోకి దిగారు. న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్లలో పేసర్ సిరాజ్ ఆడగా, వెస్టిండీస్లో జరిగిన మ్యాచ్లలో అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఇది మినహా మిగతా 10 మంది విషయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. ఇప్పుడు కూడా సెమీఫైనల్ ఆడిన టీమ్తోనే భారత్ తుది పోరుకు వెళ్లే అవకాశముంది. ఒక్క శివమ్ దూబే బ్యాటింగ్ విషయంలోనే కాస్త ఆందోళన కనిపించినా... మిడిలార్డర్లో అతనికి బదులు సంజూ సామ్సన్ను నేరుగా ఫైనల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు. రోహిత్ శర్మ బ్యాటింగ్ పదును ఏమిటో గత రెండు మ్యాచ్లలో కనిపించింది. అతను ఇదే జోరు సాగిస్తే ఆరంభంలోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేస్తుంది. కోహ్లి వరుసగా విఫలమైనా... రోహిత్ ఆశించినట్లుగా ఫైనల్లో అతని స్థాయి ప్రదర్శన కనబరిస్తే చాలు. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్తో పాటు పంత్, పాండ్యాలు ధాటిగా ఆడితే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్లో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోంది. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రత్యర్థి ఆటగాళ్లు విఫలమవుతుండగా... స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెలరేగితే సఫారీలు కుప్పకూలడం ఖాయం. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్లో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడగా, బుమ్రా ముందు అంతా తలవంచారు. సమష్టితత్వంతో... దక్షిణాఫ్రికా ఇద్దరు ప్రధాన పేసర్లు రబాడ, నోర్జే ఆరుకంటే తక్కువ ఎకానమీతో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టారు. వీరు ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటర్లను కట్టడి చేయగల సమర్థులు. జాన్సెన్ రూపంలో లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆ జట్టులో ఉండటం అదనపు ప్రయోజనం. ఇద్దరు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ కూడా అన్ని పిచ్లపై చెలరేగారు.అయితే పిచ్ పేస్కు అనుకూలంగా కనిపిస్తే ఒక స్పిన్నర్ స్థానంలో బార్టన్ను తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ డికాక్ బ్యాటింగ్కు మూల స్థంభంలా ఉండగా, మరో ఓపెనర్ హెన్డ్రిక్స్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. టోరీ్నలో ఆకట్టుకోని కెపె్టన్ మార్క్రమ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఫైనల్లో రావాలని జట్టు ఆశిస్తోంది. మిడిలార్డర్లో క్లాసెన్, మిల్లర్లపైనే జట్టు ఆధారపడుతోంది. ఇప్పటి వరకు అంచనాలకు తగినట్లుగా ఆడకపోయినా స్టబ్స్ దూకుడుగా ఆడగలడు. విడిగా చూస్తే ఒక్కొక్కరి ప్రదర్శన గొప్పగా లేకపోయినా... జట్టుగా తాము ప్రభావం చూపగలమని టీమ్ విశ్వాసంతో ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్ దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, షమ్సీ, రబాడ, నోర్జే. పిచ్, వాతావరణం కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తాజా ప్రపంచకప్లో 8 మ్యాచ్లు జరిగాయి. ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్ స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’ వరకు వెళ్లింది. మిగిలిన వాటిలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్టు గెలిచాయి. కాబట్టి పిచ్ పెద్ద విషయం కాకపోవచ్చు. డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం ఉండదు. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. భారత్ ఇప్పటికే ఈ పిచ్పై అఫ్గానిస్తాన్తో ఆడగా, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడలేదు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సెమీస్ తరహాలోనే అక్కడక్కడా అంతరాయాలు కలగవచ్చు కానీ పూర్తిగా మ్యాచ్కు ఇబ్బంది ఉండదు. మ్యాచ్ను శనివారమే పూర్తి చేసేందుకు నిర్ణీత సమయంకంటే అదనంగా మరో 190 నిమిషాల సమయం కేటాయించారు. ఫైనల్కు రిజర్వ్ డే కూడా ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లు పూర్తయితే శనివారమే ఫలితం తేల్చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే ఎక్కడ ఆట ఆగిందో అక్కడి నుంచి రిజర్వ్ డే రోజు ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 2 వన్డే, టి20 ఫార్మాట్లలో కేవలం రెండుసార్లు మాత్రమే రెండు జట్లు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరాయి. 1979 వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు... 2024 టి20 ప్రపంచకప్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఘనత సాధించాయి.2 కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) తర్వాత మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ చాంపియన్íÙప్లలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన రెండో కెపె్టన్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందనున్నాడు.1 నేటి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు అరుదైన ఘనత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. వన్డే వరల్డ్కప్లో మాత్రం వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (2003, 2007) జట్లు రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. 26 అంతర్జాతీయ టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్లు జరిగాయి. 14 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్లలో ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్ల్లో భారత్, 2 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి.ఫలానావారి కోసం కప్ గెలవాలనే నినాదాలకు నేను వ్యతిరేకం. బాగా ఆడి మ్యాచ్ గెలవడం ముఖ్యం తప్ప ఇతర విషయాలు పట్టించుకోను. 12 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్కు చేరడం అదీ మూడు వేర్వేరు ఫార్మాట్లు కావడం మా జట్టు నిలకడను చూపించింది. ఫైనల్కు ముందు ప్రాక్టీస్ కోసం సమయం లేకపోయినా ఆటగాళ్లంతా సిద్ధమయ్యే ఉన్నారు. మానసికంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా తుది పోరుకు రెడీ అయ్యాం. ఇక్కడ ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడటం మాకు సానుకూలాంశమే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటిదేమీ లేదు. దాని కోసం కూడా బాగా సిద్ధమయ్యాం కానీ ఆ రోజు ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది. అయినా పరాజయాలు మరచి ముందుకు సాగిపోవడం ఆటగాళ్ల లక్షణం. రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగబోతున్న ఈ ఫైనల్ మాకు అనుకూలంగా సాగాలని కోరుకుంటున్నా. –రాహుల్ ద్రవిడ్, భారత హెడ్ కోచ్ వ్యూహాలు... ప్రతివ్యూహాలు... ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో రోహిత్ ఇబ్బంది పడే బలహీనతను సొమ్ము చేసుకునేందుకు జాన్సెన్ను దక్షిణాఫ్రికా ఉపయోగించవచ్చు. ఫామ్లో లేని కోహ్లిపై రబాడ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తాడు. డికాక్ను బుమ్రా నిలువరించగలిగితే భారత్కు ఆధిపత్యం ఖాయం. పంత్ జోరును ఆపేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ను వాడే అవకాశం ఉంది. మిడిలార్డర్లో అక్షర్, కుల్దీప్, జడేజాల స్పిన్ను క్లాసెన్, మిల్లర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. ఇద్దరికీ చివరి మ్యాచా? భారత్ క్రికెట్కు సంబంధించి ఆల్టైమ్ గ్రేట్లుగా రోహిత్, కోహ్లిలది ప్రత్యేక స్థానం. గత 11 ఏళ్లుగా భారత్ ఓడిన ఐసీసీ ఫైనల్స్లో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ చేజారాక టి20 వరల్డ్ కప్ విజయంతోనైనా ముగించాలనే పట్టుదలతోఈ టోర్నీకి సిద్ధమయ్యారు. టెస్టు, వన్డేలను పక్కన పెడితే ఈ ఫార్మాట్లో కొత్త కుర్రాళ్లు దూసుకొచ్చేశారు.సత్తా చాటి తమదైన అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా కొనసాగడం అనేది ఇద్దరికీ మేలు చేయకపోవచ్చు. కాబట్టి గెలిచినా, ఓడినా వీరికి ఇదే చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయ్యే చాన్స్ ఉంది. రోహిత్ 2007 టి20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు కాగా, కోహ్లి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్. -
ఫైనల్లో సుమీత్ నగాల్
పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్లో శనివారం ఆరో సీడ్ నగాల్ 7–6 (7/2), 1–6, 6–2 స్కోరుతో బెర్నెబ్ జపటా మిరాల్స్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 38 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఐదు సార్లు ప్రత్యర్థి సర్విస్ను బ్రేక్ చేసిన నగాల్...తన సర్విస్ను 6 సార్లు నిలబెట్టుకున్నాడు. -
అల్కరాజ్ అదరహో
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించడానికి స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్లో అల్కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. వచ్చే వారం కొత్త ప్రపంచ నంబర్వన్గా అవతరించనున్న ప్రస్తుత రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో అల్కరాజ్ 2–6, 6–3, 3–6, 6–4, 6–3తో గెలుపొందాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), గత ఏడాది రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. 21 ఏళ్ల అల్కరాజ్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ టోర్నీర్నీలో విజేతగా నిలిచాడు. అడ్రియానో పనట్టా (1976లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్గా ఘనత వహించాలనుకున్న సినెర్కు నిరాశ ఎదురైంది. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సినెర్ చివరి రెండు సెట్లలో అల్కరాజ్ ఆటకు ఎదురునిలువలేక ఓడిపోయాడు. 8 ఏస్లు, 7 డబుల్ ఫాల్ట్లు చేసిన అల్కరాజ్ 65 విన్నర్స్తో అదరగొట్టాడు. తన సర్విస్ను ఆరుసార్లు కోల్పోయిన ఈ మాజీ నంబర్వన్ ప్రత్యర్థి సర్విస్ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 15 పాసింగ్, 23 డ్రాప్ షాట్లతో అలరించిన అల్కరాజ్ నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు.స్వియాటెక్ X జాస్మిన్ » నేడు మహిళల సింగిల్స్ ఫైనల్» సాయంత్రం గం. 6:30 నుంచి సోనీ స్పోర్ట్స్లోకెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా స్వియాటెక్... తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో జాస్మిన్ పావ్లిని... నేడు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్నారు. ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ (పోలాండ్) ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను మూడుసార్లు (2020, 2022, 2023) చేజిక్కించుకోగా... 15వ ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) మాత్రం కెరీర్లో 18వ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్కు చేరింది. -
ఐపీఎల్ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్తో లైఫ్టైమ్ సెటిల్మెంట్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు. -
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
టైటిల్ విజయం కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ ఫైనల్లో సింధూ ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి రౌండ్లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు రౌండ్లలో ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో రౌండ్ ముగిసే సరికి ఇరువరు చెరో విజయంతో సమంగా నిలవగా.. ఫలితాన్ని తెల్చే మూడో రౌండ్లో ప్రత్యర్ధి వాంగ్ జీయీ చెలరేగిపోయింది.సింధూకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా టైటిల్ను ఎగరేసుకుపోయింది. దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు సింధుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
ఫైనల్లో తలపడనున్న SRH, KKR జట్లు
-
Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్బమ్రున్పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్ను గెలుచుకుంది. మూడో గేమ్లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది. -
ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
యెచోన్ (దక్షిణ కొరియా): కొత్త సీజన్లో తమ జోరు కొనసాగిస్తూ భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, పర్ణిత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ బృందం 233–229 పాయింట్లతో అమెరికా జట్టును ఓడించింది. టీమ్ క్వాలిఫయింగ్లో రెండో స్థానంలో నిలువడం ద్వారా నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 236–234 పాయింట్లతో ఇటలీ జట్టుపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో టర్కీతో భారత జట్టు పోటీపడుతుంది. షాంఘైలో గతనెలలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ, పర్ణిత్, అదితి బృందం పసిడి పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రియాంశ్, ప్రథమేశ్, అభిõÙక్ వర్మలతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌంట్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 233–233తో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. స్కోరు సమం కావడంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే భారత ఆర్చర్లు సంధించిన బాణాల కంటే ఆసీస్ ఆర్చర్లు కొట్టిన రెండు బాణాలు కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో ఆస్ట్రేలియాకు కాంస్య పతకం ఖరారైంది. -
KKR Vs SRH: కోల్కతాకే ‘ఫైనల్’ సత్తా
ఈ సీజన్లో 7 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగుసార్లు 200 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసింది. ఎనిమిదోసారి మాత్రం ‘సన్’ బృందం రైజింగ్ కాలేదు. కీలకమైన ప్లే ఆఫ్స్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 159 పరుగులకే కుప్పకూలింది. రెండో క్వాలిఫయర్ ఉందన్న ధీమానో లేదంటే ఓడినా పోయేదేం లేదన్న అలసత్వమో గానీ హైదరాబాద్ బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో కోల్కతా నైట్రైడర్స్కు సులువుగా ఫైనల్ దారి చూపారు. ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడిన కోల్కతా ముందుగా బంతితో సన్రైజర్స్ను కట్టడి చేసి... ఆ తర్వాత బ్యాట్తో మెరిపించి 160 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఛేదించేసి దర్జాగా నాలుగోసారి ఐపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అహ్మదాబాద్: ‘ప్లే ఆఫ్స్’ దశ వరకు తగిన ప్రదర్శన చేసిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఇంకో అవకాశం కోసం ఎదురుచూడకుండా ఐపీఎల్ 17వ సీజన్లో నేరుగా ఫైనల్కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించింది. లీగ్ దశలో భీకరమైన ఫామ్ కనబరిచిన సన్రైజర్స్ మాత్రం కీలకమైన దశలో నిర్లక్ష్యంగా ఆడి ఓడింది. ఫైనల్ బెర్త్ కోసం ఆ జట్టు రెండో క్వాలిఫయర్ కోసం నిరీక్షించనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. అనంతరం కోల్కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సన్రైజర్స్ బౌలర్ల భరతం పట్టి మూడో వికెట్కు కేవలం 44 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం జోడించడం విశేషం. గతంలో కోల్కతా జట్టు 2012, 2014లలో టైటిల్ సాధించి, 2021లో రన్నరప్గా నిలిచింది. ఆది నుంచే కష్టాల్లో... అసలైన మ్యాచ్లో స్టార్క్ బంతితో నిప్పులు చెరిగాడు. రెండో బంతికే ట్రవిస్ హెడ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ (3)ను కూడా సింగిల్ డిజిట్కే వైభవ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఫామ్లో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి (9), షహబాజ్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దాంతో సన్రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో జట్టు స్కోరు 50కి చేరింది.మెల్లిగా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్న సమయంలో 8, 9, 10 ఓవర్లు సన్రైజర్స్ ఇన్నింగ్స్కు ఊరటనిచ్చాయి. హర్షిత్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి సిక్సర్తో 12 పరుగులొచ్చాయి. నరైన్ తొమ్మిదో ఓవర్లో త్రిపాఠి బౌండరీ బాదితే... క్లాసెన్ 6, 4 కొట్టడంతో 18 పరుగుల్ని రాబట్టుకుంది. రసెల్ పదో ఓవర్లో ఇద్దరు చెరో ఫోర్ కొట్టడంతో మరో 12 పరుగులు రావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 92/4 స్కోరు చేసింది. వరుణ్ దెబ్బతో.... ఇంకేం ఓవర్కు 9.2 రన్రేట్తో గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. అతను వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో జట్టు స్కోరు 100కు చేరింది. కానీ ఆఖరి బంతికి క్లాసెన్ అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత కాసేపటికే 5 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, సన్విర్ (0), సమద్ (16), భువనేశ్వర్ (0) ఇలా నాలుగు వికెట్లను కోల్పోయిన సన్రైజర్స్ 126/9 స్కోరు వద్ద ఆలౌట్కు సిద్ధమైపోయింది. ఈ దశలో కెపె్టన్ కమిన్స్ (24 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులతో 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. అదరగొట్టిన ‘అయ్యర్’లు బౌలింగ్లోనూ హైదరాబాద్ తేలిపోవడం, ఫీల్డర్లు క్యాచ్లు నేలపాలు చేయడంతో నైట్రైడర్స్కు లక్ష్యఛేదన మరింత సులువైంది. ఓపెనర్లు గుర్బాజ్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క వికెట్టు పడలేదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ వచ్చిన లైఫ్లను సద్వినియోగం చేసుకొని హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.4 ఓవర్లలోనే కోల్కతా స్కోరు వందకు చేరింది. లక్ష్యంవైపు చకచకా పరుగులు తీసింది. వెంకటేశ్ 28 బంతుల్లో, శ్రేయస్ 23 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వెంకటేశ్, శ్రేయస్ ధాటికి కోల్కతా 38 బంతులు మిగిలుండగానే విజయతీరానికి చేరింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) స్టార్క్ 0; అభిõÙక్ శర్మ (సి) రసెల్ (బి) వైభవ్ 3; త్రిపాఠి (రనౌట్) 55; నితీశ్ కుమార్ రెడ్డి (సి) గుర్బాజ్ (బి) స్టార్క్ 9; షహబాజ్ (బి) స్టార్క్ 0; క్లాసెన్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 32; సమద్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; సన్వీర్ (బి) నరైన్ 0; కమిన్స్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 30; భువనేశ్వర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 0; విజయకాంత్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–0, 2–13, 3–39, 4–39, 5–101, 6–121, 7–121, 8–125, 9–126, 10–159. బౌలింగ్: స్టార్క్ 4–0–34–3, వైభవ్ 2–0–17–1, హర్షిత్ 4–0–27–1, నరైన్ 4–0–40–1, రసెల్ 1.3–0–15–1, వరుణ్ చక్రవర్తి 4–0–26–2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) విజయకాంత్ (బి) నటరాజన్ 23; నరైన్ (సి) విజయకాంత్ (బి) కమిన్స్ 21; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 51; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 58; ఎక్స్ట్రాలు 11; మొత్తం (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–44, 2–67. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–28–0, కమిన్స్ 3–0–38–1, నటరాజన్ 3–0–22–1, విజయకాంత్ 2–0–22–0, హెడ్ 1.4–0–32–0, నితీశ్ రెడ్డి 1–0–13–0. -
ఫైనల్లో నిఖత్ జరీన్
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ నిఖత్ జరీన్ (52 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ నిఖత్ 5–0తో తొమిరిస్ మిర్జాకుల్ (కజకిస్తాన్)పై ఘన విజయం సాధించింది. భారత్కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో మీనాక్షి 5–0తో గుల్నాజ్ బురిబయేవా (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో టాంగటార్ అసెమ్ (కజకిస్తాన్)పై గెలిచారు. మరోవైపు సోనూ (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సొయిబమ్ సింగ్ (48 కేజీలు), అభిషేక్ యాదవ్ (67 కేజీలు), విశాల్ (86 కేజీలు), గౌరవ్ చౌహాన్ (ప్లస్ 92 కేజీలు) నేడు సెమీఫైనల్స్లో పోటీపడనున్నారు. -
ఫైనల్లో బోపన్న జోడీ
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–1, 6–4తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ రెండు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 7–6 (7/3), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. భారత్కే చెందిన మహేశ్ భూపతితో కలిసి బోపన్న చివరిసారి 2012లో మయామి ఓపెన్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి ఓడిపోయాడు. -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్ఫామ్లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్ప్రీత్ వికెట్ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్జోత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్
న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఏడాది తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్లలో 6 గెలిచిన ఢిల్లీ 12 పాయింట్లతో టాపర్గా ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పట్టికలో చివరి స్థానంతో గుజరాత్ ఈ సీజన్ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. భారతి ఫుల్మలి (36 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా...కాథరీన్ బ్రైస్ (22 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో జట్టు స్కోరు 48/5 కాగా... భారతి, బ్రైస్ ఆరో వికెట్కు 50 బంతుల్లో 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణి, మరిజాన్ కాప్, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు వేగంలో అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరు ప్రదర్శించింది. షఫాలీ, జెమీమా మూడో వికెట్కు 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేశారు. విజయానికి 2 పరుగుల దూరంలో షఫాలీ వెనుదిరిగినా... జెమీమా ఫోర్ కొట్టడంతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే క్యాపిటల్స్ జట్టుకు గెలుపు దక్కింది. ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థిని నిర్ణయించే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ రేపు జరుగుతుంది. గత ఏడాది చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘ఎలిమినేటర్’ పోరులో తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా... చెరో మ్యాచ్లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్తో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ముగుస్తుంది. -
ముంబై X విదర్భ
ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ఈ తుది సమరంలో 41 సార్లు చాంపియన్ ముంబై, 2 సార్లు విజేత విదర్భతో తలపడనుంది. ఉ.గం.9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం -
టైటిల్ పోరుకు పుణేరి, హరియాణా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో కొత్త చాంపియన్ ఖాయమైంది. నిరుటి రన్నరప్ పుణేరి పల్టన్తో అమీతుమీకి తొలిసారి ఫైనల్కు చేరిన హరియాణా స్టీలర్స్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్లోనే ఫైన ల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్లో ‘హ్యాట్రిక్’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్గా నిలిచిన జైపూర్ పింక్పాంథర్స్ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి. తొలి సెమీస్లో పుణేరి పల్టన్ ధాటికి 37–21తో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్ నిలువలేకపోయింది. పుణేరి తరఫున కెపె్టన్, ఆల్రౌండర్ అస్లామ్ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్ పంకజ్ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్ రెజా చియనె 5, మోహిత్ గోయత్ 4, సంకేత్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు. పట్నా జట్టులో రెయిడర్ సచిన్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్జీత్, సుధాకర్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్ను కంగుతినిపించింది. స్టీలర్స్ రెయిడర్ వినయ్ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్ పతారే (7) కూడా అదరగొట్టాడు. మిగతావారిలో ఆల్రౌండర్ ఆశిష్ 4, డిఫెండర్లు రాహుల్ సేథ్పాల్ 3, మోహిత్ 2 పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేస్వాల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్పుత్ 3 పాయింట్లు చేశారు. -
ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి. ► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్గా కర్నూలు జిల్లా ఫోర్త్క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. ► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్బే కాలనీ, రన్నరప్గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో.. ► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. సాగర తీరంలో డ్రోన్ షో సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. -
కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్దే వరల్డ్కప్
అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది. ఇక్కడా భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్ జట్లు వన్డే ప్రపంచకప్ టైటిల్స్ను హాట్ ఫేవరెట్ అయిన భారత్పైనే గెలవడం పెద్ద విశేషం. బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ కోసం ప్రతీ మ్యాచ్లో చిందించిన చెమటంతా ఫైనల్కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్ జైత్రయాత్ర కప్ అందుకోవాల్సిన మ్యాచ్లో పేలవంగా ముగిసింది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ హ్యూగ్ వీగెన్ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బియర్డ్మన్ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్ మెక్మిలన్ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు. చక్కగా కట్టడి చేసినప్పటికీ... టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ఒలీవర్ (43 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు. రాణించిన ఆదర్శ్, అభిషేక్ కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్లో మన కుర్రాళ్ల ఫామ్ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్ ఇది! కానీ టాపార్డర్లో అర్షిన్ (3), ముషీర్ ఖాన్ (22), మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్ ఉదయ్ సహారణ్ (8), సచిన్ దాస్ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. 1 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది. 4 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్ (2006), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి. 4 అండర్–19 ప్రపంచకప్ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. 2012 భారత అండర్–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్ జట్టుతో ఆడిన 10 మ్యాచ్ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: డిక్సన్ (సి) అభిషేక్ (బి) తివారి 42; కొన్స్టాస్ (బి) లింబాని 0; వీగెన్ (సి) ముషీర్ (బి) తివారి 48; హర్జస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్ (నాటౌట్) 46; మెక్మిలన్ (సి అండ్ బి) ముషీర్ 2; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్: రాజ్ లింబాని 10–0–38–3, నమన్ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్ 9–0–46–1, అభి షేక్ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) హిక్స్ (బి) బియర్డ్మన్ 47; అర్షిన్ (సి) హిక్స్ (బి) విడ్లెర్ 3; ముషీర్ (బి) బియర్డ్మన్ 22; ఉదయ్ (సి) వీగెన్ (బి) బియర్డ్మన్ 8; సచిన్ (సి) హిక్స్ (బి) మెక్మిలన్ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్ (బి) అండర్సన్ 9; అవనీశ్ రావు (సి అండ్ బి) మెక్మిలన్ 0; అభిషేక్ (సి) వీగెన్ (బి) విడ్లెర్ 42; లింబాని (బి) మెక్మిలన్ 0; నమన్ (నాటౌట్) 14; సౌమీ (సి) హిక్స్ (బి) స్ట్రేకర్ 2; ఎక్స్ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్: విడ్లెర్ 10–2–35–2, అండర్సన్ 9–0–42–1, స్ట్రేకర్ 7.5–1–32–1, బియర్డ్ మన్ 7–2–15–3, మెక్మిలన్ 10–0–43–3. -
ఆరో ప్రపంచకప్ వేటలో భారత్.. ఫైనల్లో ఆసీస్తో ఢీ
బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది. పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు. విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్లో విండీస్తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. -
ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది. తొలి రౌండ్లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్తో చివరకు 5–0తో నిఖత్దే పైచేయి అయింది. నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. -
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్కు సెమీస్లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్హెడ్ 2–0–17–0. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్ల్యాండ్లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
తన రికార్డు తానే బ్రేక్ చేసిన బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో..
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్-2024 మెన్స్ డబుల్స్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో థామస్- ఝాంగ్ ఝిషేన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, తొలి సెట్ను 6-3తో గెలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. రెండో సెట్ మాత్రం 3-6తో కోల్పోయింది. ఈ క్రమంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్లో ఇరు జోడీలు అత్యుత్తమ ప్రదర్శనతో పోటాపోటీగా ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో టై బ్రేకర్కు దారితీయగా.. బోపన్న- ఎబ్డెన్ ద్వయం ధామస్- ఝిషేన్ జంటను 7-6తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రోహన్ బోపన్న తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గ్రాండ్స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత ఎక్కువ వయసు గల ప్లేయర్(43 ఏళ్లు)గా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. 2023లో ఎబ్డెన్తో కలిసి బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2013లోనూ ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో తుదిపోరుకు బోపన్న అర్హత సాధించడం విశేషం. కాగా కెరీర్ చరమాంకంలో బోపన్న ఉన్నత శిఖరానికి చేరుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో బోపన్న నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకోవడం ఖరారైంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు బోపన్న. అలా వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ జోడీగా బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. దాంతో ఈనెల 29న విడుదలయ్యే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్లో బోపన్న, ఎబ్డెన్ వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ జోడీగా అవతరిస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోనే నంబర్వన్ ర్యాంక్లో నిలవనున్న అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) రికార్డు నెలకొల్పనున్నాడు. వాళ్ల తర్వాత ఇక... పురుషుల డబుల్స్లో ప్రస్తుతం ఈ రికార్డు అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉంది. మహిళల డబుల్స్లో అమెరికా ప్లేయర్ లీసా రేమండ్ (39 ఏళ్లు; 2012లో)... పురుషుల సింగిల్స్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (36 ఏళ్ల 320 రోజులు; 2018లో)... మహిళల సింగిల్స్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ (35 ఏళ్ల 124 రోజులు; 2017లో) వరల్డ్ నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన అతి పెద్ద వయస్కులుగా రికార్డు సృష్టించారు. గర్వంగా ఉంది ‘నంబర్వన్ ర్యాంక్ అందుకోనుండటంతో గర్వంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదో ప్రత్యేక క్షణం. ఈస్థాయికి చేరుకోవడానికి కోచ్లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల పాత్ర ఎంతో ఉంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. -
ఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతవారం మలేసియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ –చిరాగ్ ద్వయం... తాజాగా ఇండియా ఓపెన్లోనూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జంట 21–18, 21–14తో ఆరోన్ చియా–సో వు యిక్ (మలేసియా) జోడీని ఓడించింది. ఆరోన్–సో వు యిక్లతో ఇప్పటి వరకు 11 సార్లు ఆడిన సాత్విక్ –చిరాగ్ మూడోసారి మాత్రమే గెలిచారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 5–21తో షి యు కీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
‘క్లీన్స్వీప్’పై భారత్ గురి
బెంగళూరు: టి20 ప్రపంచకప్కు ముందు భారత్ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్... ఈ సిరీస్ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్లే ఉండటంతో పొట్టి ఫార్మాట్లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్ను బాగా సది్వనియోగం చేసుకోవాలి. కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్లో ఉండటం, బౌలింగ్ పదునెక్కడంతో భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్ దృష్ట్యా అఫ్గానిస్తాన్ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్రౌండ్ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది. దూబేను ఆపతరమా... ఈ సిరీస్లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్లో భర్తీ చేయదగ్గ బ్యాటర్లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్కు బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్ ఆర్డర్కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్తో అర్‡్షదీప్, ముకేశ్ కుమార్... స్పిన్తో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. -
ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని...
కౌలాలంపూర్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో టైటిల్ సాధించేందుకు భారత ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ –1000 టోర్నీ మలేసియా ఓపెన్లో ఈ జోడి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకోవడంతో పాటు ఆపై మరో రెండు పాయింట్లు గెలుచుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ 21–18, 22–20 స్కోరుతో ఆరో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ – సియో స్యూంగ్ జాను చిత్తు చేశారు. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ సాగింది. తొలి గేమ్ ఆరంభంలో భారత ఆటగాళ్ల ఆధిక్యం సాగింది. చక్కటి ర్యాలీలతో వీరిద్దరు 9–5తో ముందంజ వేయగా వరుసగా నాలుగు పాయింట్లతో కొరియా ద్వయం స్కోరును సమం చేసింది. అయితే 11–9తో, ఆపై 13–12తో మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. వరుస పాయింట్లతో 17–13 వరకు దూసుకెళ్లిన చిరాగ్ – సాత్విక్ దానిని కొనసాగించారు. రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. అనంతరం 9–4తో...11–6తో ఆధిక్యం చూపించిన కొరియా ఆటగాళ్లు ఒక దశలో 17–11తో గేమ్పై పట్టు బిగించారు. ఈ సమయంలో భారత్ కోలుకునే ప్రయత్నం చేసినా 20–14తో గేమ్ గెలిచే స్థితికి కొరియా చేరింది. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు...వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించిన సాత్విక్ – చిరాగ్ సంచలనం సృష్టించారు. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన టాప్ సీడ్ జంట లియాంగ్ వి కెంగ్ – వాంగ్ చాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. గతంలో ఈ రెండు జోడీల మధ్య 4 మ్యాచ్ల జరగ్గా...భారత ద్వయం 1 మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్లలో ఓడింది. -
రజనీకాంత్ బర్త్డే.. రెండు సర్ప్రైజ్లు..
‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని అంటున్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వేట్టయాన్ ’ (వేటగాడు అని అర్థం) టైటిల్ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మంగళవారం రజనీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్ ’ టైటిల్ వీడియోను విడుదల చేశారు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని రజనీకాంత్ చెప్పే డైలాగ్, విజువల్స్తో ఈ వీడియో సాగుతుంది. అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రోడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అలాగే లైకా ప్రోడక్షన్స్ సంస్థలో రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీ బర్త్ డే సందర్భంగా మొయిద్దీన్ భాయ్ పాత్రకు సంబంధించిన యాక్షన్ టీజర్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలే కాకుండా.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
మేలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2024)లో నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షల కన్వినర్ల ఎంపికకు సంబంధించిన అర్హులైన వారి జాబితాలను ఆయా వర్సిటీల వీసీలు ఉన్నత విద్యామండలికి పంపాల్సి ఉంటుంది. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చించి, పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తారు. మండలి పరిధిలో ఎంసెట్, ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పాలిసెట్, పీజీ సెట్ ఉంటాయి. సాధారణంగా వీటిని మే నెల నుంచి మొదలు పెడతారు. వీటిల్లో ఎంసెట్ కీలకమైంది. కేంద్రస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. జనవరి, ఏప్రిల్ నెలల్లో మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. దీని తర్వాత జాతీయ ఇంజనీరింగ్, ఐఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ చేపడుతుంది. దీన్ని పరిగణనలోనికి తీసుకునే ఎంసెట్ తేదీలు ఖరారు చేస్తారు. కోవిడ్ సమయం నుంచి జేఈఈతో పాటు, ఎంసెట్ కూడా ఆలస్యంగా జరిగాయి. గత ఏడాది మాత్రం సకాలంలో నిర్వహించారు. ఇప్పుడా ప్రతిబంధకం లేకపోవడంతో మే నెలలోనే ఎంసెట్ చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎంసెట్ సిలబస్, ఇంటర్ మార్కుల వెయిటేజీపై మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోవిడ్ కాలంలో ఇంటర్ పరీక్షలు లేకపోవడంతో వెయిటేజీని ఎత్తివేశారు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు జరిగిన వెయిటేజీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వెయిటేజీ లేకుండా చేయడమా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త విద్యాశాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లో అన్ని సెట్స్పైన స్పష్టమైన విధానం వెల్లడించే వీలుందని కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
షెన్జెన్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మరో టైటిల్కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ భారత ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–15, 22–20తో హి జి తింగ్– రెన్ జియాంగ్ యు (చైనా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ నుంచే రెండు జోడీలు చెమటోడ్చాయి. ప్రతి పాయింట్కు భారత జంట సమన్వయంతో శ్రమించింది. రెండో సెట్లో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–20 వద్ద సమంకాగా సాత్విక్–చిరాగ్ జోడీ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచింది. -
ఫైనల్లో రష్మిక భమిడిపాటి
ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రష్మిక 6–2, 6–1 స్కోరుతో రెండో సీడ్ లన్లనా తరారుడీ (థాయిలాండ్)పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యంతం రష్మిక ఆధిపత్యం కొనసాగింది. తరారుడీ ఒక ఏస్ కొట్టినా ఐదు డబుల్ ఫాల్ట్లతో ఓటమిని ఆహ్వానించింది. మరో భారత క్రీడాకారిణి జీల్ దేశాయ్ కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్లో జీల్ 3–6, 6–4, 7–5 స్కోరుతో భారత్కే చెందిన మూడో సీడ్ రుతుజ భోసలేను ఓడించింది. 2 గంటల 31 నిమిషాల పాటు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన జీల్ విజేతగా నిలిచింది. రుతుజ 2 ఏస్లు కొట్టగా, జీల్ ఒక ఏస్ సంధించింది. జీల్ 7 డబుల్ ఫాల్ట్లతో పోలిస్తే 10 డబుల్ ఫాల్ట్లు చేసిన రుతుజ ఓటమిపాలైంది. -
మ్యాచ్ అహ్మదాబాద్లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్సిఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్కు అనుష్క శర్మ -
CWC 2023 Final: ఇటు ఫైనల్... అటు జిగేల్! తారలు, తారాజువ్వలు
ఆట మొదలవ్వాలంటే ముందు టాస్ పడాలి. కానీ ఈ టాస్ కంటే ముందు కనువిందు చేసే విన్యాసాలెన్నో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఆద్యంతం రంజింపచేసేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు, అరుదైన ఘట్టాలు ఆవిష్కరించనుంది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరు వికెట్లు, మెరుపులతోనే కాదు... మిరుమిట్లు, వెలుగుజిలుగులతో నెక్ట్స్ లెవెల్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆటకుముందే ఎయిర్షో, ఆట మధ్యలో లేజర్ షో, సంగీత విభావరి ఆఖర్లో కనివినీ ఎరుగని రీతిలో బాణాసంచా మిరుమిట్లు ఆకాశానికి పందిరి పరచనుంది. వైమానిక ‘షో’కులద్దుకొని ఆట ప్రారంభానికి ముందు ఎంతో హంగామా మైదానంలో నడువనుంది. నేలని టాస్ నాణెం ముద్దుపెట్టుకుంటే... నింగిని ఎయిర్ షో సెల్యూట్ చేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్’ టీమ్ ఆకాశంలో విన్యాసాలతో అలరించనుంది. తొమ్మిది ప్రత్యేక ఫ్లైట్లతో పది నిమిషాల పాటు ఈ ఎయిర్ షో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేయనుంది. దీనికి సంబంధించి శుక్ర, శనివారాల్లో రిహార్సల్స్ కూడా పూర్తిచేశారు. చాంపియన్ కెప్టెన్లకు సలామ్ ఇంతకుముందెపుడు జరగని విధంగా... ప్రపంచకప్ చరిత్రలోనే నిలిచిపోయే మధురఘట్టానికి చాంపియన్ కెప్టెన్లు విశిష్ట అతిథులు కానున్నారు. 1975, 1979, 1983, 1987, 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015, 2019... ఈ పన్నెండు ప్రపంచకప్ల విజయసారథులకు విశేషరీతిలో బ్లేజర్లు, జ్ఞాపికలతో సత్కరించే కార్యక్రమం జరుగనుంది. ప్రీతమ్ గానాబజానా ‘ధూమ్’ సిరీస్లకే ధూమ్ మచాలేతో సినీప్రియుల్ని వెర్రెక్కించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో 500 పైచిలుకు కళకారులతో నిర్వహించబోయే ఆటపాట స్టేడియాన్ని హోరెత్తించనుంది. భారతీయ సంప్రదాయ నాట్యం, నృత్యరీతులు, డాన్సులు జేజేలు పలికే విధంగా కళాకారుల బృందం రిహార్సల్స్లో చెమటోడ్చింది. లేజర్ షో...డ్రోన్ వీజువల్ వండర్స్ దేనికదే సాటి అన్నచందంగా ఇన్నింగ్స్ బ్రేక్లో లేజర్ షో లైటింగ్ విన్యాసాలు ఆకాశాన్ని రంగుల మయం చేయనుంది. అలాగే డ్రోన్ వీజువల్ వండర్స్తో నింగిలో ప్రపంచకప్ను ఆవిష్కృతం చేసే షోపై అందరి దృష్టి పడింది. తారలు, తారాజువ్వలు స్టేడియంలో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతీ సినీ పరిశ్రమకు చెందిన తారలు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణ కానుండగా... ఆకాశంలో బాణాసంచా వెలుగులు, తారాజువ్వలతో చేసే హంగామా కృత్రిమ చుక్కల్ని చూపనున్నాయి. 6000 మందితో భద్రత పెద్ద స్టేడియం కావడం... ఫైనల్ పోరు జరగడం... లక్ష పైచిలుకు ప్రేక్షకులండటం... అతిరథమహారథులంతా విచ్చేయనుండటంతో నరేంద్రమోదీ స్టేడియమే కాదు... అహ్మదాబాద్పై కూడా డేగకన్ను వేశారు. గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ‘రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, హోంగార్డ్స్, ఇతర సాయుధ బలగాలు కలుపుకొని 6000 పైచిలుకు సిబ్బందితో మోదీ స్టేడియాన్ని పహారా కాస్తున్నారు. మూడు వేల మంది అయితే స్టేడియం లోపలే అప్రమత్తంగా ఉంటారు. -
ఫైనల్కు 13 భారీ స్క్రీన్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.గోపీనాథ్రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్), స్టేడియాల్లో సదుపాయాలు, క్రీడాకారులకు పౌష్టికాహారం, విశాఖలో నూతన స్టేడియం నిర్మాణం, స్కూల్ విద్యార్థులకు లీగ్ టోర్నమెంట్స్.. ఇలా ఏసీఏ ప్రణాళికలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు. ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్స్, ఫుడ్ కోర్టులూ ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో రూ. 300 కోట్లతో కొత్త స్టేడియం విశాఖలో బీసీసీఐతో కలిసి రూ.300 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తాం. ఈ స్టేడియం సామర్థ్యం 50 వేల పైనే ఉంటుంది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల సంక్షేమం, శిక్షణపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోంది. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయి. అన్నింట్లోనూ మెషినరీ, నెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్లను శిక్షణ కోసం ఎన్సీఏకు పంపిస్తున్నాం. ఏపీఎల్ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే రెండు సీజన్లు విశాఖలో నిర్వహించాం. పదేళ్లుగా ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్ వచ్చింది. త్వరలో స్కూల్ లీగ్స్ ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్రా క్రికెట్లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిలో ముఖ్యమైనది పాఠశాలల స్థాయిలో లీగ్స్. 12 నుంచి 16 ఏళ్లలోపు వారికి ప్రతి నియోజకవర్గం పరిధిలో టోర్నమెంట్స్ నిర్వహిస్తాం. వీటిలో ప్రతిభ చూపిన వారిని సబ్సెంటర్లకు, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి.. ఇలా ఉన్నత స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంచేందుకు జోనల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్రికెటర్కు నెలకు రూ.3 వేలు పౌష్టికాహారం కోసం అందజేస్తున్నాం. ఇందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతోంది. దేశంలో మరే అసోసియేషన్ ఇవ్వని విధంగా రిటైర్డ్ రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలని ఏసీఏ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకస్తుందని ప్రకటించింది. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో శిక్షణ ఇచ్చే వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. సీజన్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లను పంపిస్తాం. -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్ని సాధించేసింది. అటు ఫ్యాన్స్తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
‘షమీ’ఫైనల్ వండర్
భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్లో ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్కు చేర్చాడు. ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాలుగోసారి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, అయ్యర్ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (7/57) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్కతాలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఒకరితో మరొకరు పోటీ పడి... ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్లోనే రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టాడు. గిల్ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్ 70 పరుగులు చేసింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్ పెవిలియన్కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్ మెరుపు బ్యాటింగ్తో కివీస్ పని పట్టాడు. 29వ ఓవర్ తొలి బంతికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. 40వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్ బౌలింగ్లోనే మూడు సిక్సర్లతో అయ్యర్ సత్తా చాటాడు. సౌతీ ఓవర్లో భారీ సిక్స్ బాదిన అయ్యర్ తర్వాతి బంతికి సింగిల్ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 110 పరుగులు సాధించింది. భయపెట్టిన భాగస్వామ్యాలు... దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్లు, బైస్, ఓవర్త్రోలు, ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్కు కలిసొచ్చాయి. ముఖ్యంగా మిచెల్ ప్రతీ బౌలర్పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 181 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్కు వికెట్ దక్కింది. విలియమ్సన్ను అవుట్ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్ (0)ను వెనక్కి పంపడంతో కివీస్ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్లో కివీస్ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరాజయం ఖాయమైంది. 4 వన్డే ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్ 1983 (విజేత), 2003 (రన్నరప్), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది. 1 ఒకే ప్రపంచకప్లో మ్యాచ్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు తీసిన తొలి బౌలర్గా షమీ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్ (ఇంగ్లండ్; 1975లో), అషంత డి మెల్ (శ్రీలంక; 1983లో), వాస్బెర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్; 2003లో), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్; 2011లో), ముస్తఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్; 2019లో), మిచెల్ స్టార్క్ (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 51 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ అవతరించాడు. రోహిత్ ఇప్పటి వరకు 51 సిక్స్లు కొట్టాడు. 49 సిక్స్లతో క్రిస్ గేల్ (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గానూ రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్లో రోహిత్ 28 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ (2015లో 26 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. 397 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై న్యూజిలాండ్ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. ‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ ఎదురుగా... సచిన్ సొంత మైదానంలో... సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన తేదీన... సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఖరి సారిగా బ్యాటింగ్ చేసిన తేదీన... ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో సచిన్ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్ చూస్తే మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్ (2011, 2015, 2019) సెమీఫైనల్స్లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్లో చూడచక్కటి సిక్సర్ కొట్టాక ఫిలిప్స్ ఓవర్లో తీసిన సింగిల్తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది. 49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు పంపిన కింగ్... సచిన్ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది. 711 ఈ ప్రపంచకప్లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించాడు. 24 భారత్లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్ 20 సెంచరీలు (భారత్లో), పాంటింగ్ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా. –విరాట్ కోహ్లి విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం. -షమీ ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాప్–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 47; గిల్ (నాటౌట్) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 105; రాహుల్ (నాటౌట్) 39; సూర్యకుమార్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్: బౌల్ట్ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్ట్నర్ 10–1–51–0, ఫెర్గూసన్ 8–0–65–0, రచిన్ 7–0–60–0, ఫిలిప్స్ 5–0–33–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రాహుల్ (బి) షమీ 13; రచిన్ (సి) రాహుల్ (బి) షమీ 13; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 69; మిచెల్ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్మన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 2; సాన్ట్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 9; సౌతీ (సి) రాహుల్ (బి) షమీ 9; బౌల్ట్ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) రాహుల్ (బి) షమీ 6; ఎక్స్ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్: బుమ్రా 10–1–64–1, సిరాజ్ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్ 10–0–56–1. -
కొత్తగూడెం సీటు.. రెండు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వడంతోపాటు, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నాయకత్వాలను సంప్రదించిన తర్వాత ఈ మేరకు ఒప్పందానికి వచ్చామని చెప్పారు. రేవంత్ సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్కు వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షీ, కార్యదర్శి విష్ణుదాస్ ఆయన వెంట ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులతో పొత్తుపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్లతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తమపై ఉన్న రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామా లు, పరిస్థితులను సీపీఐ నేతలకు వివరించామని రేవంత్ తెలిపారు. పేదల తరఫున నిలబడేందుకు, పెద్ద మనసుతో ముందుకు రావాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తికి సీపీఐ అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, సీపీఐల మధ్య స్పష్టమైన పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని కోరారు. సెక్యులర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేందుకు, పేద, సామాన్యుల సమస్యలు చట్ట సభలలో ప్రస్తావనకు వచ్చేలా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శాసనమండలిలో సీపీఐకి చెందిన ఇద్దరు సభ్యులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మునుగోడు సీటుపైనా చర్చ జరిగిందని, అక్కడ స్నేహ పూర్వక పోటీ వద్దని సీపీఐని కోరామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. సీపీఎంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దగా పడిన ప్రజల విముక్తే లక్ష్యం: నారాయణ బీఆర్ఎస్ చేతిలో దగాపడిన ప్రజానీకానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఇందుకోసమే సీపీఐ, కాంగ్రెస్ ఐక్యంగా నిలబడ్డాయని తెలిపారు. రాజకీయ, భౌతిక, అనివార్య పరిస్థితుల్లో ఒక్క కొత్తగూడెం స్థానం నుంచే పోటీకి అంగీకరించామని కూనంనేని చెప్పారు. తమ స్నేహ బంధంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలావుండగా తాను ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూనంనేని ఖమ్మంలో చెప్పారు. ప్రజలు అన్ని విషయాలను గమనించి ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించాలని, ప్రజలను మరిచి పాలన చేస్తున్న పాలకులను ఓడించాలని పిలుపునిచ్చారు. కూనంనేని కార్యదర్శిగా కొనసాగేనా? కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ చేయనుండటంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కొనసాగుతారా లేదా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఆయన పూర్తి బిజీగా ఉంటే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఎవరెవరికి దక్కవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సీపీఐ ఎన్నికల కన్వీనర్గా చాడ వెంకట్రెడ్డిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
ఫైనల్లో భారత మహిళలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రాంచీ: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో భారత్ 2–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున సలీమా టెటె 11వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...19వ నిమిషంలో పెనాల్టీ ద్వారా వైష్ణవి విఠల్ ఫాల్కే గోల్ నమోదు చేసింది. ఆసియా క్రీడల రజతపతక విజేత కొరియా తీవ్రంగా పోరాడినా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మరో సెమీస్లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది. -
కాంగ్రెస్ అభ్యర్థులు 70 మంది ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగే 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో 119 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో సగానికి పైగా స్థానాలకు టికెట్లు ఫైనల్ చేసినట్టయ్యింది. పార్టీలో పనిచేసిన అనుభవం, కుల సమీకరణలు, సర్వేలు, ఆర్థిక బలాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా 70 మంది అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు తొలి జాబితాను 15న విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేల ఆధారంగానే.. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ జరిగింది. సోనియాగాందీ, రాహుల్గాందీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్లను సైతం సమావేశానికి ఆహ్వనించారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివేదికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిశీలించారు. మొదట ఒకే ఒక్క పేరున్న 70 నియోజకవర్గాలు, ఆయా స్థానాలకు సంబంధించిన నేతల పేర్లు పరిశీలించారు. ఏయే ప్రాతిపదికల ఆధారంగా ఇక్కడ ఒకే నేత ఎంపిక జరిగిందో మురళీధరన్ కమిటీకి వివరించారు. ఈ స్థానాలపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆ 70 నియోజకవర్గాల్లో ప్రతిపాదిత అభ్యర్థులకు సీఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత జాబితాను ఫైనల్ చేసేందుకు వచ్చేవారం మరోమారు సీఈసీ భేటీ కానుంది. దసరాకు ముందే 18న రెండో విడత జాబితా విడుదల చేయాలని సీఈసీలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేటి భేటీలో 70 సీట్లపై చర్చించాం. మరోమారు సీఈసీ భేటీ ఉంటుంది’ అని తెలిపారు. తొలి జాబితాలో ముఖ్య నేతలు తొలి జాబితాలో రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్అలీ, సంపత్కుమార్, గడ్డం ప్రసాద్కుమార్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్ఖాన్, ప్రేమ్సాగర్రావు, అంజన్కుమార్ యాదవ్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ, రామ్మోహన్రెడ్డి, బీర్ల ఐలయ్య, అనిరుద్రెడ్డి, వీర్లపలి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రోహిత్రావు, గడ్డం వినోద్, ఎర్ర శేఖర్, కుంభం అనిల్కుమార్రెడ్డి, కేకే మహేందర్రెడ్డి, కాట శ్రీనివాస్గౌడ్, వంశీకృష్ణ తదితరుల పేర్లు ఉన్నట్టు చెబుతున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు, స్థానాలపై చర్చ సీఈసీ భేటీకి ముందు స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ మురళీధరన్తో పాటు మాణిక్రావ్ ఠాక్రే, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాష్కీగౌడ్ తదితరులు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో సింగిల్ పేర్లతో, రెండు, మూడేసి పేర్లతో ఉన్న అభ్యర్థుల జాబితాలు రూపొందించారు. వాటిని సీఈసీ ముందుంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు, వారికి ఇవ్వాల్సి సీట్ల కేటాయింపుపైనా చర్చించారు. మిర్యాలగూడ, మునుగోడు, ఖమ్మం, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీ తర్వాత జరిగిన సీఈసీ సమావేశంలోనూ పొత్తు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో పొత్తు తేల్చాలని కేసీ వేణుగోపాల్, రేవంత్కు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ఇక టికెట్ దక్కని నేతలతో వారికున్న ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలు మాట్లాడాలన్న రాష్ట్ర నేతల సూచనకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ కొత్త చరిత్ర
ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా రికార్డు నెలకొల్పింది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–17, 21–12తో మాజీ ప్రపంచ చాంపియన్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)పై గెలిచింది. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ కళ్లు చెదిరే స్మాష్లతో, చక్కటి డిఫెన్స్తో ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. నేడు జరిగే ఫైనల్లో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (దక్షిణ కొరియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. తాజా ప్రదర్శనతో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ వచ్చే మంగళవారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంక్కు చేరుకునే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో లేకుండానే సెమీఫైనల్ ఆడిన ప్రణయ్ 16–21, 9–21తో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
అదరగొట్టిన తిలక్ వర్మ..సెమీఫైనల్లో బంగ్లా చిత్తు! ఫైనల్కు భారత్
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో రుత్రాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. పింగ్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బారత్.. ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. దీంతో భారత్కు పతకం ఖాయమైంది. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(55 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రుత్రాజ్ గైక్వాడ్(40 నాటౌట్) అదరగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! #TeamIndia's skipper wants this done in a jiffy - takes the attack to 🇧🇩 with 2️⃣0️⃣ runs off the 3rd over! Which of these Ruturaj Gaikwad shots was your favourite? 💬⤵️#Cheer4India #INDvBAN #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/z0qHDw4aF1 — Sony LIV (@SonyLIV) October 6, 2023 A stroke-filled half-century for Tilak Varma & a heart-warming celebration for his mom follows ♥️#TeamIndia beat Bangladesh by 9 wickets in the Semi FINALS#Cheer4India #HangzhouAsianGames #AsianGames2023 #ShubmanGill #Ahmedabad #INDvsBAN #Archery #AssassinsCreedMirage… pic.twitter.com/jiX4v6wGLy — Abdul (@RolexbhaisirSir) October 6, 2023 -
‘పసిడి’కి విజయం దూరంలో...
పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు... ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచేందుకు భారత పురుషుల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై కష్టపడి గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున హార్దిక్ సింగ్ (5వ ని.లో), మన్దీప్ సింగ్ (11వ ని.లో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (15వ ని.లో), అమిత్ రోహిదాస్ (24వ ని.లో), అభిషెక్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా తరఫున మన్జె జుంగ్ (17వ, 20వ, 42వ ని.లో) ‘హ్యాట్రిక్’తో మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. శుక్రవారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో జపాన్ 3–2తో చైనాను ఓడించింది. భారత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా... 2018 జకార్తా ఏషియాడ్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
కిడాంబి శ్రీకాంత్ గెలిపించగా...
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియానుంచి భారత్కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ వరకు వెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 21–16, 21–19తో జీన్ హ్యోక్ జీన్పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్లో టాప్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్ మిన్ హ్యూక్ – స్యూంగ్ జే సంచలన విజయం సాధించారు. రెండో సింగిల్స్లో లక్ష్య సేన్ 21–7, 2–19తో లీ యూన్ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్లో ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల 16–21, 11–21తో కిమ్ వోన్ హో – సంగ్ సియూంగ్ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్ను గెలిపించాల్సిన బాధ్యత కిడాంబి శ్రీకాంత్పై పడింది. తొలి గేమ్ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్పై శ్రీకాంత్ గెలుపొందాడు. -
స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (12) టాప్ స్కోరర్ కాగా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు ‘డకౌట్’ కావడం విశేషం. పేస్ బౌలర్ పూజ వస్త్రకర్ (4/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేసి బంగ్లాను దెబ్బ కొట్టింది. భారత్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్మృతి మంధాన (7) తొందరగానే అవుటైనా... జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షఫాలీ వర్మ (17) కలిసి గెలిపించారు. స్వర్ణపతకం కోసం నేడు జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. రెండో సెమీస్లో శ్రీలంక 6 వికెట్లతో పాకిస్తాన్పై గెలిచింది. -
Asian Games 2023: సెమీస్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్కు చేరిన భారత్
ఆసియాక్రీడల మహిళల క్రికెట్లో భారత్కు పతకం ఖాయమైంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్ను 8వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం 52 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(20 నాటౌట్),షెఫాలీ వర్మ(17) పరుగులతో రాణించారు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) జరగనున్న ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. చదవండి: Asian Games 2023: పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్ -
Asia Cup 2023: ఫైర్ సిరాజ్... ఆసియా కప్ విజేత భారత్
భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్... గత రెండు మ్యాచ్లలో లంక జట్టు ప్రదర్శన కారణంగా స్థానిక అభిమానులతో స్టేడియం దాదాపుగా నిండిపోయింది... పాక్పై గెలుపు, భారత్తో పోరాడిన తీరు తుది పోరుపై కూడా అంచనాలు పెంచాయి... మ్యాచ్ హోరాహోరీగా సాగవచ్చని అనిపించింది... వర్షంతో ఆట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది... స్టేడియంలో కాస్త ఆలస్యంగా వచ్చినవారు సీట్లలో కుదురుకునే ప్రయత్నంలో ఉండగా... ఆదివారం వినోదం కోసం మరికొందరు ఇళ్లలో సిద్ధపడుతున్నారు... కానీ మరో గంట ముగిసేసరికి ఖేల్ ఖతం... లంక ఇన్నింగ్స్ ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి... ఆపై భారత్ మరో 6.1 ఓవర్లలో ఫటాఫట్ ఛేదన... ఆసియా కప్ ఎనిమిదోసారి భారత్ సొంతం! ముందుగా మ్యాచ్ మూడో బంతికి వికెట్తో బుమ్రా మొదలు పెట్టాడు... ఆ తర్వాత వచ్చిన సిరాజ్ తన మొదటి ఓవర్ను మెయిడిన్గా వేసి ప్రమాద సూచిక ప్రదర్శించాడు... ఆ తర్వాత అతని రెండో ఓవర్లో అసలు విధ్వంసం జరిగింది. ఒకటి, రెండు కాదు... ఏకంగా నాలుగు వికెట్లు అతని ఖాతాలో... తన మరుసటి ఓవర్లోనూ ఇదే కొనసాగిస్తూ మరో వికెట్... శ్రీలంక స్కోరు 12/6. అయితే అందులో ఐదు వికెట్లు సిరాజ్వే... కొంత విరామం తర్వాత మరో వికెట్ కూడా అతని ఖాతాలోనే ... 7 ఓవర్లు వేశాక అదే జోరుతో మళ్లీ బంతిని అందుకునేందుకు సిద్ధమైనా కెపె్టన్ ఇక చాలని వారించాడు... తర్వాతి మూడు వికెట్లతో హార్దిక్ (3/3) ప్రత్యర్థి ఆట ముగించాడు. 50 ఓవర్ల లంక ఇన్నింగ్స్ కాస్తా 50 పరుగుల ఇన్నింగ్స్గా మారిపోయింది! కొలంబో: హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన వన్డే కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగాడు. టెస్టు క్రికెట్ను గుర్తుకు తెచ్చేలా పదునైన స్వింగ్ బౌలింగ్తో సత్తా చాటిన అతని ధాటిని తట్టుకోలేక శ్రీలంక బ్యాటింగ్ కుప్పకూలింది. సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అలవోకగా టీమిండియా ఆసియా చాంపియన్గా నిలిచింది. సొంతగడ్డపై కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన లంక పలు చెత్త రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (34 బంతుల్లో 17; 3 ఫోర్లు), దుషాన్ హేమంత (15 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (6/21) ఆరు వికెట్లతో లంకను దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (19 బంతుల్లో 27 నాటౌట్; 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) మ్యాచ్ ముగించారు. ఒకదశలో 12/6తో లంక వన్డేల్లో అత్యల్ప స్కోరు (35; జింబాబ్వే) నమోదు చేస్తుందేమో అనిపించినా చివరకు ఆ గండం దాటింది. టోచ్చిలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) జడేజా (బి) సిరాజ్ 2; కుశాల్ పెరీరా (సి) రాహుల్ (బి) బుమ్రా 0; కుశాల్ మెండిస్ (బి) సిరాజ్ 17; సమరవిక్రమ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) సిరాజ్ 0; ధనంజయ డిసిల్వా (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; షనక (బి) సిరాజ్ 0; వెలలాగె (సి) రాహుల్ (బి) హార్దిక్ పాండ్యా 8; దుషాన్ హేమంత (నాటౌట్) 13; మదుషన్ (సి) కోహ్లి (బి) హార్దిక్ పాండ్యా 1; పతిరణ (సి) ఇషాన్ కిషన్ (బి) హార్దిక్ పాండ్యా 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో ఆలౌట్) 50. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–8, 4–8, 5–12, 6–12, 7–33, 8–40, 9–50, 10–50. బౌలింగ్: బుమ్రా 5–1–23–1, సిరాజ్ 7–1–21–6, హార్దిక్ పాండ్యా 2.2–0–3–3, కుల్దీప్ యాదవ్ 1–0–1–0. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 23; గిల్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు 1; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 51. బౌలింగ్: మదుషన్ 2–0–21–0, పతిరణ 2–0–21–0, వెలలాగె 2–0–7–0, అసలంక 0.1–0–1–0. Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023