
ప్రమాదాల సంవత్సరం
2014లో పలు ప్రమాదాలు
మొత్తం 130 మంది మృతి
హొసూరు: రోడ్డు ప్రమాదాలలో 2014వ సం వత్సరంలో మాత్రమే హొసూరు ప్రాంతంలో 130 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. క్రిష్ణగిరి జిల్లా హొసూరు పట్టణ, హ డ్కో, సిఫ్కాట్, మత్తిగిరి పోలీస్స్టేషన్ పరిధు ల్లో మాత్రమే 2014వ సంవత్సరంలో రోడ్డు మ్రాదాల్లో 130 మంది మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు.
గత 2013వ సవత్సరం ఈ పోలీస్స్టేషన్ పరిధుల్లో 100 మంది మాత్రమే ప్రమాదాలకు గురై మృతి చెందారని, ఈ సంవత్సరం 30 శాతం పెరిగిందని, నెలకు సరాసరి 10 నుంచి 11 మంది మృతిచెందారని తెలిపా రు. లారీల వల్లే ఈ ప్రమాదాలన్నీ జరిగాయన్నారు. ప్రతి సంవత్సరం ప్రమాదాలలో మృతి చెందేవారి సంఖ్య పెరిగిపోతుందని, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమన్నారు.