ట్రాక్టర్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు | Bus Road Accident At Nalgonda's Miryalaguda | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొన్న పెళ్లి బస్సు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

Published Sun, Feb 23 2025 7:19 AM | Last Updated on Sun, Feb 23 2025 7:50 AM

Bus Road Accident At Nalgonda's Miryalaguda

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు బస్సు..ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ పప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ‍ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. ఇదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది గాయాలయ్యాయి. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరంతా హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరై నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement