Nalgonda District
-
నల్లగొండ టీ హబ్కు తాళం వేయించిందే కేటీఆర్: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్ను ప్రశ్నించారాయన. బుధవారం(జనవరి29) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ పనికిరానోడు.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. నల్లగొండలో కేటీఆర్ మీటింగ్కు మా మీటింగ్ కు వచ్చే పల్లీలు,ఐస్ క్రీం లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదు. నల్లగొండలో టీ హాబ్కు తాళం వేసిందే కేటీఆర్. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కంపెనీలు ఎందుకు తేలేకపోయారు. హరీష్రావు, కేటీఆర్ మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు. లక్షల కోట్లు సంపాదించుకోలేదు. కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు. నేను మాట్లాడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి..ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సెషన్కు కేసీఆర్ వస్తడో రాడో చెప్పాలి.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నరా? బండి సంజయ్ ఉన్నరా? గద్దర్కు అవార్డ్ ఇస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది... కేసీఆర్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో నయం అని కోమటిరెడ్డి అన్నారు. లాలూ జైల్లో ఉన్నప్పుడు.. బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లు గెలిపించారు. కానీ, కేటీఆర్ ఒక్క సీటు అయినా గెలిచారా? కేటీఆర్ ప్లేస్లో నేను ఉంటే.. ఈపాటికి బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ చేసేవాడ్ని అని కోమటిరెడ్డి అన్నారు. -
ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
-
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. -
‘పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం’
సూర్యాపేట జిల్లా: నల్లగొండలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే జగదీష్రెడ్డి(Jagadish Reddy)విమర్శించారు. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ(Nalgonda) నుండే ఉద్యమం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు.ఈరోజు(మంగళవారం) సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.‘ ఇక్కడ పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది. మంత్రి వెంకట్రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫోటో, గులాలీ రంగు చూసినా వెంకట్రెడ్డికి భయమైపోతుంది. కాంగ్రెస్ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. మంత్రి వెంకట్రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు. వెంకట్రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు. భూపాల్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతుంది. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారు’ అని జగదీష్రెడ్డి స్పష్టం చేశారు.నల్లగొండ మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తతనల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు., -
నల్లగొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు
-
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ
సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారుహామీలను అమలు చేయాలని అడగడం తప్పా?రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు? -
బీఆర్ఎస్ రైతు మహాధర్నా మళ్లీ వాయిదా
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే. రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
కరువు నేలకు జల సవ్వడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరునల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..ఏఎంఆర్పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్లోని ఉదయ సముద్రం రిజర్వాయర్లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది. -
తాగునీటి సమస్యకు ఫోన్కాల్ పరిష్కారం
నల్లగొండ: మీ గ్రామంలో తాగునీటి సరఫరాలో సమస్య వచ్చిందా? నీళ్లు రావటం లేదా? అయితే ఎందుకు ఆలస్యం..! ఫోన్ తీయండి.. ఒక్క కాల్ చేయండి... మీ సమ స్య పరిష్కారమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 18005 94007ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి ఫోన్ చేసినా సరే.. మీ ఫిర్యాదును నమోదుచేసుకొని.. సంబంధిత జిల్లా అధికారులకు సమస్యను తెలిపి పరిష్కారానికి కృషిచేస్తారు. గత నెల 23న హైదరాబాద్లో పది మంది అధికారులతో రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. సమస్య పరిష్కారం ఇలా.. రాష్ట్రంలో ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడితే స్థానిక అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయవచ్చు. మీ ఫోన్కాల్ రాష్ట్ర కార్యాలయంలో రికార్డవుతుంది. తర్వాత అక్కడి అధికారులు ఆ సమస్యను సంబంధిత జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారికి తెలుపుతారు. ఆ అధికారి సంబంధిత అధికారిని క్షేత్రస్థాయికి పంపి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆ విషయాన్ని జిల్లా అధికారి తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తెలుపుతారు. టోల్ఫ్రీ నంబర్ కార్యాలయం అధికారులు ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా? అని ధ్రువీకరించుకుంటారు. ఇది మున్సిపాలిటీల ప్రజలకు వర్తించదు. -
కానిస్టేబుల్తో ఎస్ఐ వివాహేతర సంబంధం.. భార్య ఫిర్యాదు
సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
నల్లగొండ వాసికి సీశాబ్ బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణ వాసి కరణం ఉమామహేశ్వర్ రావుకి కేంద్ర విద్యా శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐ, ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీశాబ్) చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం వరుసగా మూడోసారి కావడం విశేషం.నల్లగొండ పట్టణంలోని రామగిరికి చెందిన ఉమామహేశ్వర్రావు పదో తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. ఇంటర్ హైదరాబాద్లోని నృపతుంగ జూనియర్ కళాశాలలో, బీటెక్ కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (ఐఐటీ బెనారస్)లో ఎంటెక్ పూర్తి చేశారు. 1989లో ఖరగ్పూర్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తిచేశారు. సీశాబ్ ఆధ్వర్యంలోనే సీట్ల భర్తీకేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ (జీఎఫ్టీఐ) తదితర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే ఇతర విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 6, 7 విడతల్లో సీశాబ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
సప్తగిరుల దేవరాద్రి
దేవరకొండ ఖిలాకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న కోటలన్నింటిలో దేవరకొండ కోట తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13వ శతాబ్దంలో నిర్మితమైన దేవరకొండ ఖిలాకు సురగిరి అనే పేరుంది. అంటే దేవతల కొండ అని దీని అర్థం. కోట చుట్టూ ఎనిమిది చోట్ల ఆంజనేయస్వామి రూపాన్ని చెక్కి కోటను అష్ట దిగ్బంధనం చేశారని ప్రతీతి. ఎంతో ప్రాచుర్యం పొందిన దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. అయినా పాలకులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో నిరాదరణకు గురవుతోంది. – దేవరకొండకోట చుట్టూ 360 బురుజులు.. కాలక్రమేణా కోట గోడలు బీటలు వారినా.. నిర్మాణ శైలి నేటికీ అబ్బురపరుస్తోంది. పది కిలోమీటర్ల పొడవు, 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య నిర్మితమైన దేవరకొండ కోట శత్రుదుర్బేధ్యంగా ఉండేది. మట్టి, రాళ్లతో కట్టిన గోడలు నేటికీ నాటి నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి.7 గుట్టలను చుట్టుకొని ఉన్న శిలా ప్రాకారంలో 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కోనేర్లు, కొలనులు, సైనిక నివాసాలు, ధాన్యాగారాలు, సభావేదికలు, ఆలయాలు ఇలా.. ఎన్నో.. ఎన్నెన్నో. ప్రతీ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ పలకరిస్తుంటుంది.రాజదర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణకుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు, గుర్రాలు వంటి ఆకృతులు ఇక్కడ రాతిపై చెక్కబడి ఉన్నాయి. కోట సమీపంలో నరసింహ, ఓంకారేశ్వర, రామాలయం వంటి పురాతన దేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి శిల్పకళా సంపద చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. పద్మనాయకుల రాజధానిగా.. 15వ శతాబ్దంనాటి ఈ కోటకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 700 ఏళ్ల కిందట 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులుగా ఉండి.. ఆ తర్వాత స్వతంత్రులైన పద్మనాయకుల రాజధానిగా దేవరకొండ కీర్తి గడించింది. అనపోతనాయుడు, రెండవ మాదానాయుడి కాలంలో కోట నిర్మాణం జరిగింది.మాదానాయుడి వారసులు దేవరకొండని, అనపోతనాయుడి వారసులు రాచకొండను రాజధానిగా చేసుకొని క్రీ.శ 1236 నుంచి 1486 వరకు పాలన కొనసాగించారు. తర్వాత ఈ కోటను బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు వశం చేసుకున్నారు. సందర్శకుల తాకిడి.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ఖిలా (Devarakonda Fort) సందర్శనకు హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, విదేశీయులు సైతం కోటను సందర్శించి ఇక్కడి శిల్పకళా సంపదను చూసి ముగ్దులవుతున్నారు. చదవండి: చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలేఇక తొలి ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినాల్లో దేవరకొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున కోటకు చేరుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కోట సింహద్వారంపై చెక్కబడిన పూర్ణకుంభం చిహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ చిహ్నంగా తీసుకోవడం గమనార్హం.పర్యాటక ప్రాంతంగా మార్చితే.. ఖిలాను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరిక. దేవరకొండ ఖిలా గతమెంతో ఘనచరిత్ర కలిగి నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే దేవరకొండతోపాటు చుట్టుపక్కల పట్టణాలు సైతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ఖిలా విశిష్టత సైతం నలుమూలల వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజల కోరిక. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖిలా ఆవరణలో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.దేవరకొండ ఖిలాకు చేరుకునేదిలా.. దేవరకొండ ఖిలా హైదరాబాద్కు 110 కిలోమీటర్లు, నాగార్జునసాగర్కు 45 కి.మీ, నల్లగొండ నుంచి సాగర్కు వెళ్లే దారిలో కొండమల్లేపల్లి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సాగర్ నుంచి దేవరకొండకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. -
నల్లగొండ టూటౌన్ సీఐ డానియల్ పై వివాహేతర సంబంధం ఆరోపణలు
-
పీఎస్కు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. ప్లాట్ కొనిస్తా అంటూ..
నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్ సీఐ డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్చంద్ర పవార్కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్ఫోన్ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం– ఎస్పీ శరత్చంద్ర పవార్సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్ చాటింగ్ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
రైతుభరోసాపై మరోసారి ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్హౌస్లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్మోడల్గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
నల్గొండ ప్రజలకు అనుమానం వస్తే బండకేసి కొడతారు..
-
ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
-
ఐదుగురి ప్రాణాలు తీసిన.. నైట్ అవుట్ సరదా
-
పోలీసు వాహనాలను ఢీకొట్టి.. అంబులెన్స్ తో పరార్
-
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన