విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మల్లునాయుడు ప్రసంగిస్తుండగా బకాయిలు చెల్లించాలని రైతులు నిలదీశారు. రైతులు కుర్చీలను పడేసి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు సభ జరగనివ్వకుండా వేదికపై రాళ్లు, కుర్చీలు విసిరేశారు. వేదిక వద్ద ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు.
బకాయిల కోసం చెరుకు రైతుల నిరసన
Published Wed, Sep 30 2015 4:24 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement