ప్రధాన వార్తలు

ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్ఆర్(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందాం. వైఎస్సార్ సీపీ నేతలు టీడీపీలో చేరితే సరి లేదంటే కక్ష సాధింపు చర్యలు తప్పవు. నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను మాత్రం ఊరుకోను.. అందరి సంగతి తేలుస్తా. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తా... ప్రతిపక్ష పార్టీ నేతల తోకలు కత్తిరిస్తా’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్ ప్రధాని
థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్ సంభాషణ బయటకు..థాయ్లాండ్ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్(Hun Sen)కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్లాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.

ఐపీఎల్లో ఆడితే చాలా? అతడికి మరోసారి అన్యాయం! నెటిజన్లు ఫైర్
అభిమాన్యు ఈశ్వరన్.. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి.. ఈ బెంగాల్ క్రికెటర్ ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు. అతడి కంటే ఎన్నో ఏళ్లు వెనుక కెరీర్ మొదలు పెట్టిన ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతనిథ్యం వహిస్తుంటే.. ఈశ్వరన్ కేవలం రిజర్వ్ ప్లేయర్గానే మిగిలుపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఈశ్వరన్.. తొలి టెస్టులో అరంగేట్రం చేస్తాడని భావించారు.కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం మరోసారి అతడికి మొండి చేయి చూపించింది. అతడి స్ధానంలో తమిళనాడుకు చెందిన సాయిసుదర్శన్కు గంభీర్ అండ్ కెప్టెన్ గిల్ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికి ఈశ్వరన్ మూడు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. అదే సాయి సుదర్శన్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సుదర్శన్ భారత టెస్టు జట్టుకు ఎంపికైన తొలిసారే డెబ్యూ చేసే అవకాశం వచ్చింది.రంజీల్లో ఆడితే సరిపోదు..!తుది జట్టులో ఈశ్వరన్కు చోటుదక్కపోవడంతో భారత జట్టు మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కాదు, ఐపీఎల్లో బాగా రాణిస్తేనే టీమిండియా తరపున ఆడే అవకాశం లభిస్తుందని సెటైర్లు వేస్తున్నారు.అది మరోసారి రుజువైందని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. సాయిసుదర్శన్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ సపోర్ట్ ఉందని, ఈశ్వరన్కు ఎవరి మద్దతు లేకపోవడంతో ఛాన్స్ లభించడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు గిల్, సాయిసుదర్శన్ కలసి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 53.63 సగటుతో 7841 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అరంగేట్రంలో ఫెయిల్..ఇక అభిమాన్యు స్ధానంలో చోటు దక్కించుకున్న సాయిసుదర్శన్ తన అరంగేట్రంలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4 బంతులు ఆడి డకౌట్గా పెవిలియన్కు చేరాడు. స్టోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్ పక్కన పెడితే.. అయితే సాయిసుదర్శన్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025లో అత్యధిక పరుగులు వీరుడిగా సుదర్శరన్ నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సుదర్శన్ మెరుగ్గా రాణిస్తున్నాడు.29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అనుభవం దృష్ట్యా ఈశ్వరన్కు ఛాన్స్ ఇవ్వాల్సందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు!

‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు.

Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!

‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
శ్రీసత్యసాయి జిల్లా: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబోమని చెబుతున్న పవన్కు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎంందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన పవన్కు తెలియదా? అని శ్యామల నిలదీశారు. రాష్ట్రంలో రోజుకో దారుణం జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారని ప్రశ్నించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడంపై ‘డీసీఎం మిస్సింగ్’ అనే ఫ్లకార్డును ప్రదర్శించారు శ్యామల.టీడీపీ కూటమిది ప్రజా విజయం కాదు.. ఈవీఎంల గెలుపని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని, పేదల సన్నిధి వైఎస్ జగన్ అని శ్యామల కొనియాడారు.

Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కుబేరా’ కథేంటంటే..?దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్లో మరో 50 వేల కోట్లను బ్లాక్లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review). దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్లోని టాలెంట్ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్

అమెరికాతో మాకేంటి.. ఇరాన్ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు
టెలీ అవీవ్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్లో ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి
రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.
మరీ ఇంత చీప్గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్
'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
‘కూటమి పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
పాకిస్తాన్ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఐపీఎల్లో ఆడితే చాలా? అతడికి మరోసారి అన్యాయం! నెటిజన్లు ఫైర్
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
మరీ ఇంత చీప్గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్
'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
‘కూటమి పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
పాకిస్తాన్ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఐపీఎల్లో ఆడితే చాలా? అతడికి మరోసారి అన్యాయం! నెటిజన్లు ఫైర్
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
సినిమా

అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారు.. తప్పించుకోడానికి ఏం చేశానంటే: నటి
ఆమె మన హైదరాబాద్కు చెందిన అమ్మాయే. ప్రస్తుతం బాలీవుడ్లో స్థిరపడింది. అందాల కిరీటాన్ని గెలుచుకున్న దియామీర్జా(Dia Mirza) ఇప్పుడు మంచి పేరున్న బాలీవుడ్ నటిగా కొనసాగుతోంది. తమిళ సినిమాల్లో ఓ చిన్న పాత్రలో, బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కెరీర్ను ప్రారంభించిన దియా, 2000లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలిచిన తరువాత, హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమె ఆర్. మాధవన్ సరసన తొలి చిత్రం రెహ్నా హై తెరే దిల్ మేన్లో నటించింది. ఈ నేపధ్యంలో ఇటీవల దియా మీర్జా తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. ఒక అవుట్సైడర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఎంత కష్టం అనేది చెప్పిన దియా, ‘ఆ ప్రయాణాన్ని వివరించాలంటే ఓ పుస్తకమే రాయాల్సి వస్తుంది. అది చాలా భయంకరం, కఠినం.‘ అని చెప్పింది.ఇండస్ట్రీలో పుష్కలంగా అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ, అవి బలమైన బ్యాగ్రౌండ్ ఉన్న వారికే ఇచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె చెప్పారు. ‘‘పలు సినిమాలు నాకు ఇవ్వకుండా ఇండస్ట్రీ బ్యాకింగ్ ఉన్న నటీమణులకు ఇచ్చారు. అదీ నిజం’’ అన్నారామె. ఇప్పటి సినిమాల్లో మహిళా పాత్రల రాస్తున్న రచయితలు, కథనాలు మెరుగయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘గతంలో కొన్ని పాత్రలు ఎలా రాసేవారో , అవి ఎంత రెగ్రెసివ్గా ఉండేవో, నాకు ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో సీన్ చేయడం మీదే దృష్టి ఉండేది. అప్పటి జీర్ణించుకుపోయిన మనస్తత్వం, పురుషాధిపత్యం ఎలా ఉండేదో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ అవగాహన వల్లే ఇప్పుడు సరైనవి ఎంచుకోగలుగుతున్నాను‘ అని ఆమె పేర్కొంది.అంతేకాదు..ఒకప్పుడు మగవాళ్లు అర్ధరాత్రుళ్లు తారల రూమ్ తలుపులు కొట్టేవారంటూ ఆమె చెప్పకనే చెప్పడం విశేషం. అలా అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారి నుంచి తప్పించుకోవడం కోసం తన హెయిర్డ్రెస్సర్తో గదిని పంచుకున్నానని ఆమె గుర్తు చేశారు. ‘చాలా మంది నటీమణులకు అలాంటి సమయంలో తల్లిదండ్రుల మద్దతు ఉండేది. నా వెంట మాత్రం ఎప్పుడూ నా టీమ్ హెయిర్డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్ట్, స్పాట్బాయ్ లు మాత్రమే ఉండేవారు. వాళ్లే నా రక్షక వలయం,‘ అని చెప్పింది.‘‘ప్రసాద్ అన్నా నా స్పాట్బాయ్గా ఎన్నో సంవత్సరాలు నా వెంట ఉన్నాడు. కోవిడ్ సమయంలో ఆయనను కోల్పోయాను. నా హెయిర్డ్రెస్సర్ 16–17 సంవత్సరాలు నా కోసం పని చేసింది. అలా వారితో కలిసి నేను నా చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను,’’ అని చెప్పిన దియా వివరించింది. ప్రస్తుతం దియా మీర్జా, నెట్ఫ్లిక్స్ చిత్రం నాదానియాన్లో నటించింది. ఈ సినిమాలో ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్ తదితరులు ఉన్నారు.

కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే
ఈ వారం ఓటీటీల్లో దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. మరోవైపు థియేటర్లలోనూ మూడు కొత్త మూవీస్ వచ్చేశాయి. వీటిలో 'కుబేర'కి పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. నాగార్జున, రష్మిక కూడా ఆకట్టుకున్నారని రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ మూవీని థియేటర్కి వెళ్లి చూసేవాళ్లు చూస్తారు. అలానే ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు.'కుబేర' ఓటీటీ డీల్ విషయానికొస్తే.. రిలీజ్కి ముందు డిజిటల్ హక్కులు అమ్మేశారు. లెక్క ప్రకారం నిర్మాతలు.. జూలైలో వద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ చేయాలని చెప్పాడు. దీంతో నిర్మాతలు తలొగ్గారు. అయితే ఓటీటీ ఒప్పందం మాత్రం నాలుగు వారాలకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూలై 3వ వారంలో అలా స్ట్రీమింగ్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ)'8 వసంతాలు' విషయానికొస్తే.. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం. బాగుందనే టాక్ వస్తుంది. అదే టైంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగేలా ఉందని అంటున్నారు. హీరోయిన్గా అనంతిక యాక్టింగ్ ఇచ్చిపడేసిందని రివ్యూలు వచ్చాయి. కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో సినిమాలన్నీ నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ రెండింటితో పాటు హిందీ సినిమా ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా థియేటర్లలో రిలీజైంది. దీని బుకింగ్స్ చాలా డల్గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఎంతమేర నిలబడుతుందో చూడాలి? ఎందుకంటే ఆమిర్ గత చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అలానే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)అమెజాన్ ప్రైమ్యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్లీ - మలయాళ మూవీఘటికాచలం - తెలుగు మూవీఆహాఅలప్పుజా జింఖానా - తెలుగు మూవీజిన్ ద పెట్ - తమిళ సినిమాసేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్యుగీ - తమిళ సినిమా నెట్ఫ్లిక్స్కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమాఒలింపో - స్పానిష్ సిరీస్సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమాఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీగ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమాబేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)హాట్స్టార్ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేకబోల్ - ఫ్రెంచ్ సిరీస్ఎలెవన్ - తమిళ మూవీబుక్ మై షోహద్దులేదురా - తెలుగు సినిమా(ఇదీ చదవండి: హిట్3 మేకర్స్పై కేసు వేసిన అభిమాని)

Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కుబేరా’ కథేంటంటే..?దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్లో మరో 50 వేల కోట్లను బ్లాక్లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review). దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్లోని టాలెంట్ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. బోటు ప్రమాదం నుంచి బయటపడి.. రపా రపా రఫ్పాడించి!
భారత్లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవ లేదు. ఐపీఎల్ మొదలైన తర్వాత ఎంతో మంది యువ తారలు వెలుగులోకి వస్తున్నారు. పొట్టి క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులో చోటుకు బాటలు వేసుకుంటున్నారు. దీంతో టీమిండియాలో స్థానం కోసం పోటీ మరింత పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ వెటరన్ ఆటగాడు పునరాగమనం చేయడమంటే విశేషమే.అదీ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియా తరఫున తుదిజట్టులో ఆడే అవకాశం దక్కించుకోవడం మరీ విశేషం. కరుణ్ నాయర్ (Karun Nair) తాజాగా ఈ ఘనత సాధించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ ‘ట్రిపుల్ సెంచూరియన్’ ఇంగ్లండ్ (Ind vs Eng 1st Test)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టు సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.ఎనిమిదేళ్ల 83 రోజుల విరామం తర్వాత తిరిగి భారత్ తరఫున టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగాడు. తద్వారా టీమిండియా తరఫున సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. కాగా కరుణ్ నాయర్ చివరగా 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఆడాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు వీరే..👉లాలా అమర్నాథ్- 12 ఏళ్ల 129 రోజుల తర్వాత..👉ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ- 12 ఏళ్ల 10 రోజుల తర్వాత..👉జయదేవ్ ఉనాద్కట్- 12 ఏళ్ల రెండు రోజుల తర్వాత..👉దత్తారామ్ ధర్మాజీ హిండ్లేకర్- 9 ఏళ్ల 357 రోజులు తర్వాత..👉సయ్యద్ ముస్తాక్ అలీ- 9 ఏళ్ల 336 రోజులు తర్వాత..👉కొటారి సుబ్బన్న నాయుడు- 9 ఏళ్ల 329 రోజుల తర్వాత..👉విజయ్ మర్చంట్- 9 ఏళ్ల 308 రోజుల తర్వాత..👉దినేశ్ కార్తిక్- 8 ఏళ్ల 144 రోజులు తర్వాత..👉పార్థివ్ పటేల్- 8 ఏళ్ల 107 రోజుల తర్వాత..👉కరుణ్ నాయర్- 8 ఏళ్ల 83 రోజుల తర్వాత..బోటు ప్రమాదం నుంచి బయటపడి...కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో వన్డే మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది.. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీని డబుల్ సెంచరీగా.. త్రిశతకం(381 బంతుల్లో 303)గా మార్చిన మూడో క్రికెటర్గా నిలిచాడు.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడిన కరుణ్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి. రెండు వన్డేలు ఆడిన అతడు 46 రన్స్ చేయగలిగాడు. అయితే, 2017లో అజింక్య రహానే పునరాగమనం తర్వాత కరుణ్ నాయర్పై వేటు పడింది.ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన కరుణ్ నాయర్.. 2023లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. నార్తాంప్టన్షైర్ తరఫున మూడు మ్యాచ్లలో కలిపి 249 పరుగులు చేశాడు. సర్రే జట్టుపై సెంచరీ బాదాడు.బ్యాట్తో బంతిని రపా రపా.. రఫ్పాడించి! ఇక అదే ఏడాది రంజీల్లో విదర్భ జట్టును ఫైనల్కు చేర్చడంలో కరుణ్ కీలక పాత్ర పోషించాడు. మరుసటి సీజన్లో విదర్భ తరఫున విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఏకంగా 779 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలో అదే ఏడాది 863 పరుగులు చేశాడు. విదర్భకు టైటిల్కు అందించడంలో అతడిది ముఖ్య భూమిక.అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా-ఎ తరఫున బరిలోకి దిగి.. డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఎంపికైన కరుణ్ నాయర్ తాజాగా తొలి టెస్టుతో రీ ఎంట్రీని ఖరారు చేసుకున్నాడు.కాగా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఏడాదే కరుణ్ నాయర్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలో ఆలయాన్ని దర్శించుకునే నిమిత్తం వెళ్లిన అతడు.. పంపా నదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.చదవండి: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం

IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశమున్నందన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్తో యువ ఆటగాడు సాయిసుదర్శన్ భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మళ్లీ టీమిండియా తరపున ఆడుతున్నాడు.నితీశ్పై వేటు.. శార్ధూల్కు చోటుఅయితే ఈ మ్యాచ్ ఆడేందుకు భారత తుది జట్టులో స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్దానంలో వెటరన్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్కు టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేసిన నితీశ్ను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న అందరిలోనూ మెదలుతోంది.కాగా నితీశ్ రెడ్డి బదులుగా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. శార్ధూల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా శార్ధూల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రవీంద్ర జడేజాకు ఏడో స్ధానంలో టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. ఒకవేళ జట్టులో నితీశ్ ఉన్నా, అతడి బ్యాటింగ్ పొజిషన్ సెట్ చేయడం కాస్త కష్టమయ్యేది. అందుకే నితీష్కు బదులుగా శార్ధూల్ వైపు టీమిండియా మొగ్గు చూపింది. గతంలో ఇంగ్లండ్పై గడ్డపై ఆడిన అనుభవం కూడా ఈ ముంబై క్రికెటర్కు ఉంది. ఈ మ్యాచ్లో శార్ధూల్ రాణించకపోతే రెండో టెస్టుకు నితీష్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. సాయి సుదర్శన్ అరంగేట్రం.. కరుణ్ ఉన్నాడా?
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్- టీమిండియా (Eng vs Ind) మధ్య టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తొలుత బౌలింగ్ ఎంచుకుని.. గిల్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.ఇక ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ప్రస్థానం మొదలు కాగా.. చెన్నై చిన్నోడు సాయి సుదుర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా నయా వాల్, వెటరన్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ క్యాప్ అందుకున్నాడు.ఈ సందర్భంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. బెకింగ్హామ్లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం అద్బుతంగా అనిపించిందని.. సిరీస్లో శుభారంభం అందుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.అదే విధంగా సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని.. కరుణ్ నాయర్కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా దశాబ్ద కాలం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్తో సిరీస్కు ముందే ఈ ఇద్దరూ సంప్రదాయ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.విమాన ప్రమాద మృతులకు నివాళిగాకాగా తొలి టెస్టు సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు ఇరుజట్ల ఆటగాళుల సంతాపం ప్రకటించారు. నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్బ్యాండ్లతో బరిలోకి దిగారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 181 మంది భారత ప్రయాణికులతో పాటు 53 మంది బ్రిటిష్ పౌరులు మృతి చెందారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టువేదిక: హెడింగ్లీ మైదానం, లీడ్స్టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్తుదిజట్లుభారత్🏏యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్🏏జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్లతో కలిసి రోహిత్ ఎయిర్పోర్టులో ప్రవేశించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపాడు హిట్మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official)
బిజినెస్

గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు.

వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..దురోవ్ను ఇటీవల ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు.

బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర(Today Gold Rate) శుక్రవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది.
ఫ్యామిలీ

International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా
వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్ స్వప్న యోగాన్వేష్.‘లండన్లో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్ వంటి యోగిక్ ప్లేస్లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్గా, మెంటల్గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ హీలింగ్ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్ఫుల్నెస్ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్ మీడియా డీటాక్స్: రోజంతా మొబైల్, స్క్రీన్ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డీటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

సాహిత్యమే పిల్లలకు మంచి చెప్పాలి
‘మేము చదువుకునే సమయంలో రోజూ మోరల్ ఇన్స్ట్రక్షన్ (ఎం.ఐ.) అనే క్లాస్ ఉండేది. పిల్లల్ని కూచోబెట్టి సార్లు ఒక కథ వినిపించి అందులోని నీతి వివరించేవారు. అసలు నేడు పిల్లలకు ఇంటా బయటా మౌలిక భావాలు ఎవరు చెబుతున్నారు? పెద్దవాళ్లకా టైమ్ లేదు. మరి పిల్లలకు పరోపకారం చేయాలని, దేశభక్తి కలిగి ఉండాలని, మూఢ భావాలు ఉండకూడదని, అందరి పట్లా సమ భావన కలిగి ఉండాలని, ఆధునిక భావాలు కలిగి ఉండాలని... ఎవరు చె ప్పాలి? బాల సాహిత్యమే చె ప్పాలి. పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే తప్ప ఇవాళ వారిలో కనిపిస్తున్న దుర్లక్షణాలు పోవు’ అన్నారు గంగిశెట్టి శివ. 71 ఏళ్ల శివకుమార్ దాదాపు యాభై ఏళ్లకు పైగానే బాల సాహిత్యం రాస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయన పుస్తకం ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్యం కేటగిరిలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ‘సాక్షి ఫీచర్స్ ప్రతినిధి’తో శివకుమార్ సంభాషణ...→ బాల సాహిత్యంలోకి ఎలా వచ్చారు?శివకుమార్: మాది నెల్లూరు జిల్లా రాపూరు. మా నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు. తరుచూ బాలమిత్ర, చందమామ ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో వాటిని చేత్తో తాకడమే పెద్ద సంబరం. 13 ఏళ్ల వయసులో అవి చదివి అలా నేను కూడా కథలు రాయాలనుకునేవాణ్ణి. 14వ ఏట మొదటి కథ పోస్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లల కథలు రాసి పత్రికలకు పంపించడం మొదలుపెట్టాను.→ కథల్లో పిల్లలకు ఏం చెబుతుంటారు?జ: నేను కొడవటిగంటి కుటుంబరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనలాగే పిల్లల్లో ఆలోచన, విచక్షణ పెరిగే సాహిత్యం ఉండాలని కోరుకుంటాను. మంత్రాలు, తంత్రాలు కాకుండా హేతువుకు ప్రాధాన్యం పెరిగేలా రాశాను. బాలసాహిత్యం చదివిన పిల్లలు తమకు తాము మేలు చేసుకోవాలి, సమాజానికి మేలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కల్పించని సాహిత్యం మంచి బాల సాహిత్యం కాదు. ఇవాళ్టి పిల్లలు రేపటి ΄ పౌరులు మాత్రమే కాదు మహా పురుషులు కావాలి. కాని ఏ మహాపురుషుడి గురించి వీరు తెలుసుకుంటున్నారు... చదువుతున్నారు? మనందరం గాంధీ, నెహ్రూ గాథల నుంచి కదా ఇన్స్పయిర్ అయ్యింది?→ ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు రాశారు?జ: పది పుస్తకాలు రాశాను. కథలు వందల కొద్దీ రాశాను. నేను బి.ఎస్సీ చదివి తెలుగు ఎం.ఏలోకి వచ్చాను భాష మీద ప్రేమతో. ఇవాళ ఎంతమంది అలా వస్తున్నారు? భాష, సాహిత్యాలకు బడులలో ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు ప్రధానమయ్యాయి తల్లిదండ్రులకు. వ్యక్తిత్వం మార్కులతో, ర్యాంకులతో రాగలదా? వ్యక్తిత్వ నిర్మాణమే దేశ నిర్మాణం అని తెలుసుకోవాలి. ఇవాళ టీచర్ల మీద దాడి చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులను ఆదరించని పిల్లలు ఏ సంస్కృతికి ప్రతిఫలం? ఇలాంటి పిల్లలు గొప్ప సాహిత్యం, నైతిక విలువలు పాదుకొలిపే పుస్తకం ఒక్కటి కూడా చదివి ఉండరు. వీరి చేత చదివించని పెద్దలు వీరి నుంచి మంచి నడవడికను మాత్రం ఆశిస్తారు. అదే విచిత్రం.→ ‘కబుర్ల దేవత’ పుస్తకానికి మీకు పురస్కారం వచ్చింది. ‘కబుర్ల దేవత’ కథ పేరు. అందులో ఏముంది?జ: కొంతమంది మాటలు చెప్పి బతగ్గలరు. అదొక స్కిల్. అది అందరికీ రావాలని లేదు. అంతమాత్రాన పనిమంతుడికి విలువ తగ్గదు. పని తెలిసినవాడు తన పని తాను చేసుకెళ్లాలి. దానికీ ఫలితం ఉంటుంది. మాట్లాడేవాళ్లను చూసి బెదరిపోవద్దు అనే వ్యక్తిత్వ వికాస కోణంలో ఆ కథ పిల్లలకు చె ప్పాను.→ మీకు నచ్చిన బాల సాహిత్యకారులు?జ: కలువకొలను సదానంద గారు మంచి సాహిత్యం రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే శైలి వారిది. కె.సభా కూడా మంచి బాల సాహిత్యం రాశారు. → మీ ఇతర వివరాలుజ: నేను నెల్లూరు జిల్లాలోనే వివిధ చోట్ల ఉ పాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యాను. మ అబ్బాయి చెన్నైలో, అమ్మాయి నెల్లూరులో స్థిరపడ్డారు. రిటైరయ్యాక కూడా ఒక స్కూల్ బాధ్యతలు చూస్తున్నాను. పిల్లలను కంట్రోల్ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. పిల్లలు ఇలా ఎందుకు ఉన్నారో అందరూ కలిసి ఆలోచించాలి. పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అనుకోనంత వరకూ బాలల వికాసం పరిపూర్ణంగా జరగదు.

మిసెస్ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!
ఇటీవల మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనం వారు సాధిస్తున్న విజయాలే. పెళ్లిచేసుకుని, పిల్లలను కని..అక్కడితో తమ జీవితాన్ని పరిమితం చేయడం లేదు. కొన్నేళ్లు విరామం ఇచ్చి మళ్లీ తమ కెరీర్లో పుంజుకోవడమో లేదా తమకు నచ్చిన వ్యాపకంతోనో ముందుకు సాగుతున్నారు. పైగా అందులో అనూహ్యమైన విజయాలు అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఐశ్వర్య రాజ్ఇటీవల బిహార్లో మిసెస్ బిహార్ 2025 పోటీలు ముగిశాయి. ఆ పోటీల్లో భోజ్పూర్ జిల్లా, తరారి బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య ఐశ్వర్య రాజ్ మిసెస్ బిహార్గా కిరీటాన్ని దక్కించుకోవం విశేషం. ఆమె ఆధునిక ఆశయాలు, సంప్రదాయ విలువలు కలిగిన శక్తిమంతమైన మహిళ. బిహార్లోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్న మహిళ ఐశ్శర్య రాజ్. ఈ పోటీలో 14 మంది మహిళలు కిరీటం కోసం పోటీపడగా..ఐశ్వర్య తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో విజయం సొంతం చేసుకుని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేగాదు తన గెలుపుతో మహిళలు కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా తమదైన రంగంలో ఎలా గెలవాలో ప్రేరణగా నిలిచారామె. ఇక పాట్నాలో పెరిగిన ఐశ్వర్య చదువంతా ఢిల్లీలోనే సాగింది. అక్కడే ఫైనాన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే కార్పొరేట్ ప్రపంచంలో కూడా తనదైన ముద్రవేసింది. కాగా, పలువురు నెటిజన్లు ఆమె గెలుపుని బిహార్కే గర్వకారణం. పైగా ప్రతిభ, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అంటూ ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తు పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by 👑 AISHWARYA RAJ 👑 (@aishwarya.raj95) (చదవండి: ఐదు పదుల వయసులోనూ యువకుడిలా రాహుల్ గాంధీ..! రీజన్ అదే..)

Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణం. కానీ నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే , ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదీ చదవండి: Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది.ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్ను మొక్కలకు పోయవచ్చు.లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని అరటిపండు తొక్కలను చిన్న చిన్నముక్కలుగా కట్ చేసి, నీళ్లలో వేసి మరిగించి, చల్లారిన తరవాత మొక్కల మొదట్లో మొక్కకు ఒక చిన్న కప్పు చొప్పున పోసుకోవాలి. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది.
ఫొటోలు
అంతర్జాతీయం

ఆస్పత్రిపై క్షిపణుల దాడి
బీర్షెబా/టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/వాషింగ్టన్: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్ అవీవ్, రమాత్ గాన్, రెహోవోత్ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. సిటీలోని గవ్యమ్ నెగెవ్ ఇజ్రాయెల్ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ప్లుటోనియం చిక్కకుండా దాడులు ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్లోని ఖోŠన్దాబ్ పట్టణ సమీపంలోని అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్ హెవీవాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్లోని దోహాలో ఉన్న అల్ ఉదేయిద్ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి.

ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు.

నో బ్రా.. నో ఎగ్జామ్!!
ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్ రూల్ను కఠినంగా అమలు చేయించింది. 📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. ⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. “No bra. No entry” is not a new policy in Olabisi Onabanjo University.OOU promotes a dress code policy aimed at maintaining a respectful and distraction-free environment, encouraging students to dress modestly and in line with the institution's values. https://t.co/xO70cBiabG pic.twitter.com/pTWjpABFmT— ART&SCIENCE (@MAO_of_Africa) June 17, 2025👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు

ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!..రెండేళ్ల వయసులో ఎలా ఉండాలి?.. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ.. తల్లిదండ్రుల ఒడిలో సేదతీరుతూ ఉండాలి . కానీ, ఈ చిన్నారి మాత్రం తోటి పిల్లలతో కలిసి ఎక్కడ నీరు దొరక్కుండా పోతుందా? అనే భయంతో పరుగులు ఇలా పెడుతోంది. తమ బిడ్డలకు అందమైన బాల్యం చెక్కాలని ఆ దేవుడ్ని మొక్కుకోని తల్లిదండ్రులు ఉంటారా?. కానీ, తమ బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలని వేడుకుంటున్నారు గాజా ప్రజలు.గాజా.. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ దాడులతో.. తీవ్ర మానవ సంక్షోభంతో అల్లలాడుతున్న నేల. మానవతా సాయం ఆగిపోవడంతో సంక్షోభం తలెత్తి చివరకు తిండి, మంచి నీటిని కూడా పరిమితులు విధించడంతో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by عبد الرحمن ناصر | Abdulrahman Nasir (@abdulrahman_nasir7)యూనిసెఫ్ గణాంకాల ప్రకారం..ప్రస్తుతం కల్లోల గాజాలో చిన్నారులకు రోజుకి ఒకటిన్నర నుంచి 2 లీటర్ల నీరు అందిస్తున్నారు. సాధారణంగా.. అన్ని అవసరాలకు కలిపి 15 లీటర్ల నీరు ఒకరోజుకి అవసరం పడుతాయి. ఇందులో తాగు నీటికే 3 లీటర్ల అవసరం. అలాంటిది ఇక్కడి చిన్నారులకు ఒకరోజులో 2 లీటర్ల లోపే నీరు అందుతుండడం.. సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది.గణాంకాలు.. కఠోర వాస్తవాలుగాజాలో 2023 అక్టోబర్ నుండి ప్రారంభమైన యుద్ధంలో వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, మరియు ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.2023లోనే గాజాలో జరిగిన దాడుల్లో పిల్లలే అత్యధికంగా మరణించారు అని జెనీవాలో యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్టర్ ప్రకటించారు.మొత్తం గాజా మరణాల్లో.. 70% మరణాలు మహిళలు మరియు పిల్లలే అని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. యుద్ధం, ఆకలి, నీటికొరత, వైద్య సౌకర్యాల లేమి కారణంగా 14,000 మంది పిల్లలు మరణించే ప్రమాదం ఉంది అని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.ఇంకా..19 లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వారిలో సగానికి పైగా పిల్లలే.370 స్కూళ్లు నేలమట్టమయ్యాయి, పిల్లలు విద్యా అవకాశాలు కోల్పోయారు.నీటి లభ్యత 5%కి పడిపోయింది, దీని వల్ల డీహైడ్రేషన్తో పసికందులు మరణిస్తున్నారు.బాల్యం అనే భావన అక్కడ పూర్తిగా విచ్ఛిన్నమైందని యునిసెఫ్ పేర్కొంది. ఈ గణాంకాలు గాజాలోని పిల్లల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. *పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూఏమీ ఎరుగని పూవుల్లారా,అయిదారేడుల పాపల్లారా!మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించేకూనల్లారా!అచ్చటికిచ్చటి కనుకోకుండాఎచ్చటెచటికో ఎగురుతుపోయేఈలలు వేస్తూ ఎగురుతుపోయేపిట్టల్లారా!పిల్లల్లారా!గరికిపచ్చ మైదానాల్లోనూ,తామరపూవుల కోనేరులలోపంటచేలలో, బొమ్మరిళ్లలో,తండ్రి సందిటా, తల్లి కౌగిటా,దేహధూళితో, కచభారంతో,నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలుఓ చిరుతల్లారా!మీదే, మీదే సమస్తవిశ్వం!మీరే లోకపు భాగ్యవిధాతలు!మీ హాసంలో మెరుగులు తీరునువచ్చేనాళ్ల విభాప్రభాతములు!ఋతువుల రాణి వసంతకాలంమంత్రకవాటం తెరచుకునీ,కంచు వృషభముల అగ్నిశ్వాసంక్రక్కే గ్రీష్మం కదలాడీ,ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూఏకంచేసే వర్షాకాలం,స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలంవస్తూ పోతూ దాగుడుమూతలక్రీడలాడుతవి మీ నిమత్తమే!ఇవాళలాగే ఎప్పుడు కూడాఇనబింబం పయనించు నింగిపై!ఎప్పుడు కూడా ఇవాళలాగేగాలులు వీచును, పూవులు పూచును!నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులుదిక్కు దిక్కులా దివ్యగీతములుమీరూ వాటికి వారసులే! ఇవిమీలో కూడా మిలమిలలాడును!నా గత శైశవ రాగమాలికలప్రతిధ్వనులకై,పోయిన బాల్యపు చెరిగిన పదములచిహ్నాల కోసం,ఒంటరిగా కూర్చిండి వూరువులుకదిలే గాలికి కబళమునిస్తూ,ప్రమాద వీణలు కమాచి పాడగసెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,పాతాళానికి పల్టీకొట్టీవైతరణీనది లోతులు చూస్తూ,శాంతములే, కేకాంతముగా, దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూమెటిక విరుస్తూ ఇట కూర్చిండిననను చూస్తుంటే నవ్వొస్తోందా?ఉడుతల్లారా!బుడతల్లారా!ఇది నా గీతం, వింటారా?*సేకరణ: శ్రీశ్రీ మహాప్రస్థానం/శైశవగీతి
జాతీయం

నేడు విశాఖకు ప్రధాని రాక
సాక్షి, న్యూఢిల్లీ/మహారాణిపేట: ప్రధాని మోదీ శుక్రవారం విశాఖ రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 6.25కు రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్కు చేరుకుంటారు. 6.30 నుంచి 7.50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. 7.50కు బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రధాని ప్రొగ్రామ్ రిజర్వ్లో ఉంది. మళ్లీ 11.25కు ఐఎన్ఎస్ సర్కార్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరతారు.

తోడబుట్టిన బలగం
‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్. ఇంట్లో టీవీ రిమోట్ కోసం ఫైటింగ్జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే, కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. బ్రిటన్కు చెందిన ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్ పేరెంట్ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్ సపోర్ట్ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.తోబుట్టువులు ఉంటే చాలు..» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ (బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ)» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్)» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ (సైకలాజికల్ సైన్స్) తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.– సాక్షి, స్పెషల్ డెస్క్

టీవీలకు కనెక్ట్ అవుతున్నారు!
‘ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయో?’.. ‘ఆ హీరో, హీరోయిన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’.. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే మాటలు. ఇంటర్నెట్తో పనిచేసే కనెక్టెడ్ టీవీ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని నచ్చిన సినిమాను, సిరీస్ను తమకు అనుకూలమైన సమయంలో ఆస్వాదిస్తున్నారు. ఈ కనెక్టెడ్ టీవీలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. 2025 జనవరి–మార్చిలో కొత్తగా 3.5 కోట్ల కనెక్టెడ్ టీవీ వ్యూయర్లు పెరిగారని కాంటార్ మీడియా కంపాస్ నివేదిక వెల్లడించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఇప్పుడు కంటెంట్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్నారట.ఇంటర్నెట్ విస్తృతి మనదేశంలో కేవలం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగేందుకే పరిమితం కాలేదు. కనెక్టెడ్ టీవీల జోరుకూ దోహద పడుతోంది. దాంతో సంప్రదాయ టీవీ వీక్షణ నుంచి డిజిటల్ వైపు జనం మళ్లుతున్నారు. దేశవ్యాప్తంగా మూడు నెలల్లోనే కనెక్టెడ్ టీవీ వీక్షకులు కొత్తగా 3.5 కోట్ల మంది తోడవడమే దీనికున్న క్రేజుకు నిదర్శనం. యువ వీక్షకులు సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం, ఓవర్ ద టాప్ (ఓటీటీ) జోరు, టెలికం కంపెనీల చవక బ్రాడ్బ్యాండ్ ప్యాక్స్, స్మార్ట్ టీవీలు అందుబాటు ధరలో లభించడం.. వెరసి కనెక్టెడ్ టీవీల సంఖ్య దేశంలో దూసుకుపోతోంది. తీరిక సమయంలో చూసేస్తున్నారుఅమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ద్వారా ఆన్–డిమాండ్ కంటెంట్ను ఆస్వాదించేందుకు కనెక్టెడ్ టీవీ వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత కనెక్టెడ్ టీవీల్లో వీక్షకులు తమకు వీలున్న సమయంలో నచ్చిన కంటెంట్ను వీక్షించే సౌలభ్యం ఉంటుంది. భారత్లో పూర్తి డిజిటల్ టీవీ వీక్షకులు 23 శాతం ఉన్నారు. సంప్రదాయ టీవీకి వీరు దూరం. కేబుల్, ఉపగ్రహం, ఓవర్ ద ఎయిర్ సిగ్నల్స్ ద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం ప్రసారమయ్యే కార్యక్రమాల వీక్షణకే సంప్రదాయ టీవీ పరిమితం అవుతుంది. 58% మంది భారతీయులు ఇప్పటికీ ప్రతి నెలా సంప్రదాయ టీవీ వీక్షణపై ఆధారపడుతున్నారు. పాత తరం జనాభాలో సంప్రదాయ టీవీకి ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది. యువతరం డిజిటల్కు..మీడియా ప్రాధాన్యతలలో తరాలనుబట్టి అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. 15–34 సంవత్సరాల వయస్సు గలవారిలో.. అంటే జనరేషన్ జెడ్ (13–28 ఏళ్ల మధ్య ఉన్నవారు), యంగ్ మిలీనియల్స్ (29–34 ఏళ్ల మధ్య ఉన్నవారు) డిజిటల్, ఓటీటీని 55%, సోషల్ మీడియాను 57% మంది ఇష్టపడుతున్నారు.45 ఏళ్లకుపైగా వయసున్న వారిలో 44% మంది ఇంటర్నెట్ ఆధారిత ఇతర కార్యక్రమాల కంటే సంప్రదాయ టీవీ వీక్షణకే మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి చూడగలిగే ఆరోగ్యకర షోలను లక్ష్యంగా చేసుకునే వీడియో స్ట్రీమింగ్ కంపెనీల కంటెంట్, మార్కెటింగ్ వ్యూహాలను పట్టణ ప్రాంతాల్లో కనెక్టెడ్ టీవీ సెట్ల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. గ్రామీణ భారతం హవాగ్రామీణ వాసులు సంప్రదాయ టీవీనే చూస్తున్నారనుకుంటే పొరపాటే. గ్రామీణ భారతం ఒక మీడియా పవర్హౌస్గా అవతరించింది. పాత అంచనాలను బద్దలు కొడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వీక్షకులు 74%, సంప్రదాయ వీక్షకులు 75% ఉన్నారు. కనెక్టెడ్ టీవీ మెట్రోలకే పరిమితం కాలేదని.. పట్టణ, గ్రామీణ ప్రేక్షకులను సమానంగా చేరుకుంటోందని కాంటార్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రకటనల విషయానికొస్తే విభిన్న ప్రేక్షకులను వేర్వేరు సందేశాలతో చేరుకోవడానికి కనెక్టెడ్ టీవీ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని వినోద పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఈ కనెక్టెడ్ టీవీలో సినిమాలూ, వెబ్ సిరీస్లూ చూడటం కూడా పెరిగింది. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో కనెక్టెడ్ టీవీ గ్రామీణ ప్రాంతాల్లోనూ వినోద కేంద్రంగా మారిందని వారు అంటున్నారు.

54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్ గుర్తింపు
సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు ఇది. లండన్కు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ క్వాక్క్వరెల్లీ సిమండ్స్ (క్యూఎస్) గురువారం విడుదల చేసిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకడెమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్.. అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్ కాలేజ్ లండన్ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. భారత్లో ఐఐటీ–ఢిల్లీ టాప్.. ఇక ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్ రెప్యుటేషన్లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. ఐఐటీ హైదరాబాద్కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ (విట్)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్ రెప్యుటేషన్ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీలో టాప్–100లో స్థానం సంపాదించాయి. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్పూర్ (215), ఐఐఎస్సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (851–900), బిట్స్ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. ప్రపంచంలో భారత్కు 4వ స్థానం.. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్బైజాన్ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్లో భారత్ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.