paris olympics 2024 | | Sakshi
Sakshi News home page

paris olympics 2024

ప్రధాన వార్తలు

Lionel Messi Fans thank Mumbai Police at Wankhede Stadium1
కోల్‌క‌తాలో అలా.. ముంబైలో ఇలా..

ఎవ‌రైనా బాగా ప‌నిచేస్తే ప్ర‌శంస‌లు ద‌క్క‌డం స‌హ‌జం. మీరిక్క‌డ చూస్తున్న‌ ఫొటో అలాంటి సంద‌ర్భంలోదే. ముంబై పోలీసుల‌ను ఫుట్‌బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖ‌డే స్టేడియం వ‌ద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు క‌నిపించాయి. వంద‌లాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చ‌ప్ప‌ట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నిన‌దించారు. అంత‌మంది త‌మ‌ను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరున‌వ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లయోన‌ల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో సంద‌డి చేశాడు. ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. స్టేడియంలోని అభిమానుల‌కు అభివాదం చేస్తూ మెస్సీ ప‌ల‌క‌రించ‌డంతో వారంతా ఆనందాశ్చ‌ర్యాలు వ్య‌క్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, భార‌త ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజ‌య్ దేవ్‌గ‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.చ‌ప్ప‌ట్లు కొడుతూ.. థ్యాంక్స్కార్య‌క్ర‌మాలన్నీ స‌జావుగా సాగ‌డంతో వాంఖ‌డే స్టేడియానికి వ‌చ్చిన అభిమానులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసుల‌కు థ్యాంక్స్ చెప్పారు. త‌మ‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశార‌ని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ పోలీసుల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసుల‌పై సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా ప‌నిచేస్తార‌ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.అర్థ‌మ‌వుతోందా?''శాంతిభ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ ప‌రంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్య‌వ‌స్థ ఉత్త‌మ‌మైన‌ది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజ‌న్ ప్ర‌శంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మ‌రొక‌రు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్‌క‌తా పోలీసుల‌ను ఉద్దేశించి మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pratik Pawaskar (@pawaskarpratik)కోల్‌క‌తాలో ఏం జ‌రిగింది?శ‌నివారం కోల్‌క‌తాలోని సాల్ట్‌లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశ‌కు గురిచేయ‌డంతో వారంతా తీవ్రంగా స్పందించారు. త‌మ ఆరాధ్య ఫుట్‌బాల‌ర్ ప‌ట్టుమ‌ని 10 నిమిషాలు కూడా లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆగ్ర‌శావేశాల‌కు లోన‌య్యారు. వాట‌ర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్‌లేక్ సేడియం ర‌ణ‌రంగంగా మారిపోయింది. అభిమానుల‌ను నియంత్రించ‌లేక కోల్‌క‌తా పోలీసులు చేతులెత్తేశారు. మ‌రోవైపు ఈవెంట్ నిర్వాహ‌కుడు శ‌ర‌త్రు ద‌త్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. త‌మ పౌరుల ప్ర‌వ‌ర్త‌న, ఈవెంట్ నిర్వ‌హ‌ణ వైఫ‌ల్యంపై మెస్సీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డ‌బ్బులు వెన‌క్కు ఇచ్చేస్తామ‌ని నిర్వ‌హ‌కుడు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.చ‌ద‌వండి: మెస్సీ అందుకే ఇండియాలో మ్యాచ్‌లు ఆడ‌లేదు!

Paris Olympics Medal Winners At Ambanis Residence Photos Viral
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్‌(ఫొటోలు)

Rohit Scored 35 Centuries After Crossing 30, So Keep Calm Babar Azam: Maqsood3
'బాబర్‌ కూల్‌గా ఉండు.. రోహిత్‌ 30 ఏళ్లు దాటాక 35 సెంచరీలు చేశాడు'

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ బాబర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల సిరీస్‌లో కనీసం​ హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు. ఈ క్రమంలో బాబర్ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడిని జట్టు నుంచి తప్పించాలని పాక్ మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరొక పాకిస్తాన్ క్రికెటర్ సోహైబ్ మక్సూద్ మాత్రం బాబర్‌కు మద్దతుగా నిలిచాడు. బాబర్ వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అని, అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని మక్సూద్ థీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా భారత కెప్టెన్ రోహిత్ శర్మతో ఆజంను అతడు పోల్చాడు."రోహిత్ శర్మ తన వయస్సు 30 ఏళ్లు దాటిన తర్వాత 35 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బాబ‌ర్‌కు ఇంకా కేవ‌లం 29 ఏళ్లు మాత్ర‌మే. అత‌డికి ఇంకా చాలా క్రికెట్ ఆడే స‌త్తా ఉంది.కాబ‌ట్టి బాబ‌ర్ దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇటువంటి స‌మ‌యంలోనే ప్ర‌శాంతంగా ఉండాలి. క‌చ్చితంగా అత‌డు తిరిగి త‌న రిథ‌మ్‌ను పొందుతాడ‌ని" మక్సూద్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌ స్వదేశంలో తమ తదుపరి సవాల్‌కు సిద్దమవుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.

Shreyas Iyers Poor Run In Red-Ball Cricket Continues4
శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇక అంతే సంగతి మరి?

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో తీవ్ర నిరాశపరిచిన అయ్యర్‌.. ఇప్పుడు దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ టోర్నీలో ఇండియా-సి జట్టుకు సారథ్యం వహిస్తున్న శ్రేయస్‌.. ఇండియా-డితో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అయ్యర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో మెరుగ్గా రాణించి భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన అయ్యర్‌.. ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతుండడంతో బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అతడి ఎంపికపై సందిగ్ధం నెలకొంది.

Paris Paralympics 2024: Nitesh and Antil Lead India to Historic Golds at Paralympics5
Paris Paralympics 2024: భారత్‌ పతకాల మోత

పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్‌ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్‌ లో ఆడుతున్న షట్లర్‌ నితేశ్‌ కుమార్‌ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ అదే ప్రదర్శనను ‘పారిస్‌’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్‌ అంటిల్‌ గుర్తింపు పొందాడు. పారిస్‌: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 కేటగిరీలో నితేశ్‌ కుమార్‌ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్‌ బెథెల్‌ (బ్రిటన్‌) తో జరిగిన ఫైనల్లో నితేశ్‌ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్‌ రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కేటగిరీలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ సుహాస్‌ యతిరాజ్‌ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్‌ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్‌ 9–21, 13–21తో డిఫెండింగ్‌ చాంపియన్‌ లుకాస్‌ మజుర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్‌ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్‌ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్‌ రొసెన్‌గ్రెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ సుకాంత్‌ కదమ్‌ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్‌’ సుమిత్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌64 కేటగిరీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ సుమిత్‌ అంటిల్‌ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్‌ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్‌ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56 కేటగిరీలో భారత అథ్లెట్‌ యోగేశ్‌ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్‌ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్‌–రాకేశ్‌ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో శీతల్‌ దేవి–రాకేశ్‌ కుమార్‌ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్‌–రాకేశ్‌ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్‌–రాకేశ్‌ ద్వయం ‘షూట్‌ ఆఫ్‌’లో ఇరాన్‌ చేతిలో ఓడిపోయి ఫైనల్‌ చేరలేకపోయింది. షూటింగ్‌లో నిహాల్‌ సింగ్, అమీర్‌ అహ్మద్‌ భట్‌ మిక్స్‌డ్‌ 25 మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది.

Advertisement